BRS

బీఆర్‌ఎస్‌ ఏ పార్టీతోనూ కలవదు : కేటీఆర్

  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం ఎవరితో కలిసి ప్రసేక్తే లేదు. తెలంగాణ ఉన్నంతకాలం మా పార్టీ ఉంటుందన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్‌ మాట్లాడారు. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక మన కష్టాలు తీరుతాయి. పలు పార్టీలకు చెందిన నేతలు బీఆర్‌ఎస్‌.. బీజేపీలో కలుస్తుందని ఏదోదో మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్‌ ఎక్కడికి పోదు.. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్‌ఎస్‌ ఉంటది.  ఎవ్వరితో కలిసే కర్మ మనకు లేదు. ప్రభుత్వాన్ని నడపడానికి లంకెబిందేలు, గళ్ల పెట్టెలో పైసలు కాదు..దమ్ముండాలి. ప్రభుత్వాన్ని నడిపెటోడు మొగోడైతే.. నడిపేటోనికి దమ్ముంటే పనైతది.కరోనా సమయంలో ఆర్ధిక సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు నడిపిన మొగోడు కేసీఆర్’ అని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నట్లు అయ్యింది అంటూ ఆయన తెలిపారు. ఆ కష్టకాలంలో కూడా రైతుబంధు ఆగలేదు. 24 గంటల ఉచిత విద్యుత్ ఆగలేదు.. కళ్యాణ లక్ష్మి , కెసిఆర్ కిట్ వంటి పథకాలను ఆపలేదు ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆయన తెలిపారు

Tirumala

తిరుమలలో అన్నప్రసాదం స్వీకరించిన వెంకయ్య నాయుడు

  తిరుమల శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మాజీ ఉప రాష్ట్రపతి  వెంకయ్య నాయుడు  టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు తో కలిసి  తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులతో ముచ్చటించారు. అన్నప్రసాదాలు రుచికరంగా, శుభ్రంగా ఉన్నాయని భక్తులు ఆయన వద్ద ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలను కూడా ప్రశంసించారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదం ఎంతో శుచిగా, రుచిగా ఉందని తెలిపారు. శ్రీవారి సేవకులుగా భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలందించడం ఆనందదాయకమైన విషయమని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు కూరగాయలు, ఇతర వస్తువులను డొనేషన్ ఇవ్వడం ఆనందదాయకమని మాజీ భారత ఉపరాష్ట్రపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

Bandi Sanjay

బండి సంజయ్ ఎంట్రీతో మరింత ముదిరిన బీఆర్ఎస్ విలీన వివాదం

  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీలో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ల మధ్య మాటల యుద్దం రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. వారి డైలాగ్ వార్‌లోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీతో అగ్గికి మరింత ఆజ్యం పోసినట్లైంది. తెలంగాణ‌లో సీఎం రమేష్ అక్ర‌మంగా కాంట్రాక్టులు ద‌క్కించుకున్నార‌ని.. సీఎం రేవంత్ రెడ్డికి రూ.10 వేల కోట్ల అప్పు ఇప్పించార‌ని.. ఆ సందర్భంగా కుంభ‌కోణం చోటు చేసుకుంద‌ని కేటీఆర్ ఆరోపించారు.  దానిపై సీఎం ర‌మేష్‌.. నిప్పులు చెరిగారు. కేటీఆర్‌కు మ‌తి భ్రమించింద‌న్నారు. ఆయ‌న వాస్త‌వాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నార‌ని మండిపడ్డారు. బీఆర్ ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాన‌ని కేటీఆర్ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చార‌ని ఈ సంద‌ర్భంగా సీఎం ర‌మేష్ బాంబు పేల్చారు. క‌విత‌ను జైలు నుంచి విడుద‌ల చేయించి.. ఈడీ, సీబీఐ దాడులు జ‌ర‌గ‌కుండా చూస్తే.. బీఆర్ఎస్‌ని బీజేపీలో విలీనం చేస్తామ‌ని కేటీఆర్ త‌న‌కు చెప్పార‌న్నారు. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్‌లను కూడా బయటపెడతానని .. దమ్ముంటే దానిపి చ‌ర్చ‌కు రావాల‌ని సవాల్ విసిరారు.  సీఎం రమేష్ సవాలుపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. చ‌ర్చ‌కు తాను కూడా రెడీనేన‌ని, అయితే..ఈ చ‌ర్చ‌కు సీఎం రేవంత్ రెడ్డి, ర‌మేష్‌లు ఇద్ద‌రూ క‌లిసి రావాల‌ని అన్నారు. ఇలా ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య మాటల యుద్ధం కొన‌సాగుతున్న స‌మ‌యంలో కేంద్ర మంత్రి, బీజేపీ కీల‌క నా య‌కుడు బండి సంజ‌య్ ఎంట్రీ ఇచ్చారు. ర‌మేష్ చెప్పింది.. నూటికి రెండు వంద‌ల పాళ్లు వాస్త‌వ‌మేనన్నారు. బీఆర్ ఎస్ ద‌గుల్బాజీ రాజ‌కీయాలు చేస్తోంద‌ని విరుచుకుపడ్డారు. బీజేపీలో విలీనం చేస్తామ‌ని ఎప్ప‌టి నుంచో చెబుతున్నార‌ని.. ఈ విష‌యాన్ని క‌విత కూడా చెప్పిన విష‌యం గుర్తులేదా? అని కేటీఆర్ ను ప్ర‌శ్నించారు.  ఈ క్ర‌మంలో సీఎం ర‌మేష్‌-కేటీఆర్ చ‌ర్చ‌కు రావాల‌ని.. స‌మ‌యం చెబితే.. వేదిక‌ను తానే ఏర్పాటు చేస్తాన‌ని బండి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ర‌మేష్ చేసిన వ్యాఖ్య‌ల‌కు కేటీఆర్ స‌మాధానం చెప్పాల‌న్నారు. కాళేశ్వ‌రంలో ఎవ‌రెవ‌రికి కాంట్రాక్టులు ఇచ్చారో.. ఎలా ఇచ్చారో.. కూడా చెప్పాల‌ని నిల‌దీశారు. బీఆర్ ఎస్ కుటుంబ పార్టీ అని.. దానిని బీజేపీలో విలీనం చేసుకునే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. అయితే.. దానిపై కూడా కేటీఆర్ చ‌ర్చ‌కు రావాల్సి ఉంటుంద‌న్నారు. లేక‌పోతే.. ర‌మేష్ చెప్పింది నిజ‌మ‌ని ఒప్పుకొన్న‌ట్టేన‌ని బండి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అంటే బిడ్డా, అల్లుడు, కొడుకు, అయ్య పార్టీ అని బండి సంజయ్ అభివర్ణించారు.  అంతేకాదు, కేటీఆర్‎కు సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ సీఎం రమేష్ సాయంతోనే వచ్చిందన్నారు. కేసీఆర్ మొదట కొడుకుకు టికెట్ ఇవ్వలేదని, సీఎం రమేష్ ఆయన్ని ఒప్పించి టికెట్ దక్కేలా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తమ్మీద కాంట్రాక్టులకు సంబంధించి కేటీఆర్ చేసిన ఆరోపణలతో మొదలైన వివాదం ... చిలికి చిలికి గాలివానలా మారి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.  గతంలోనూ బీఆర్ఎస్ విలీనంపై ఎమ్మెల్సీ కవిత మాట్లాడి కలకలం రేపారు. బీజేపీలో విలీనం కోసం ప్రయత్నాలు జరిగినట్లు వెల్లడించారు. సీఎం రమేష్ సైతం అదే విషయాన్ని ప్రస్తావించడం, కేంద్రమంత్రి బండి సంజయ్ దాన్ని ధృవీకరిస్తున్నట్లు మాట్లాడంతో విలీనం వివాదం మరింత ముదిరినట్లైంది. మరి ఈ ఇష్యూలో బహిరంగ చర్చకు సిద్దమంటున్న బీజేపీ నేతల సవాళ్లపై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Shrishti Fertility Center

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌‌ కేసులో షాకింగ్ విషయాలు

  సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌‌ కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. తన వద్దకు వచ్చిన దంపతులకు ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టలేరని, సరోగసితో పిల్లలు పుడతారని నమ్మించారు. సరోగసితో కోసం వేరే దంపతులకు రూ. 5లక్షలు ఇవ్వాలని చెప్పారు. ఈ కేసులో అసలు సరోగసి జరగలేదు. ఎవరికో పుట్టిన బిడ్డను దంపతులకు అప్పగించారు. బిడ్డకు డీఎన్‌ఏ టెస్ట్ చేయడంతో అసలు విషయం తెలిసిందని  నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.  ఒక జంట 2024 ఆగస్టులో సంతాన సాఫల్యం కోసం యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను సంప్రదించారని వెల్లడించారు. డా. నమ్రత వారికి సరోగసీ చేయించుకోవాలని సూచించారని తెలిపారు. ఆ క్లినిక్ ద్వారా సరోగసీ తల్లిని ఏర్పాటు చేస్తామని నమ్మించారని అన్నారు. తొమ్మిది నెలల పాటు ఆ జంట క్లినిక్‌కు డబ్బులు చెల్లించారని గుర్తుచేశారు. 2025 జూన్‌లో సరోగసీ తల్లికి విశాఖపట్నంలో అబ్బాయి పుట్టాడని, డెలివరీ ఛార్జీలు చెల్లించి బిడ్డను తీసుకెళ్లాలని వారికి సమాచారం అందించారని చెప్పుకొచ్చారు. బిడ్డను అప్పగించి, తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, తప్పుడు డీఎన్ఏ సృష్టించారని అన్నారు.  ఆ తర్వాత భార్యభర్తల వీర్యం, అండంతో బిడ్డ వారికి పుట్టినట్లుగా నమ్మించారని తెలిపారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌‌ ఆ జంట నుంచి మొత్తం రూ. 35 లక్షలకు పైగా వసూలు చేసిందని తెలిపారు. తర్వాత, ఆ జంట డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోగా, బిడ్డ డీఎన్‌ఏ వారికి అసలు సరిపోలేదని తేలిందని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. మరోవైపు  సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.

Kanyakumari

జయంతి ఎక్స్‌ప్రెస్ రైల్లో అకస్మాత్తుగా పొగలు

  అన్నమయ్య జిల్లా నందలూరులో జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు కింద భాగం లో పొగలు వచ్చాయి.  కన్యాకుమారి నుండి పూణే మధ్య ఈ జయంతి ఎక్స్ప్రెస్ నడుస్తుంది. ఆదివారం రైలు లోని ఏసీ భోగి లోని కింద భాగంలో పొగలు రావడంతో గమనించిన ప్రయాణికులు గార్డుకు సమాచారం ఇచ్చారు. మొదట హస్తవరం సమీపంలో పొగలు రావడం తర్వాత నందలూరు లో పొగలు రావడం జరిగింది. ప్రయాణికులు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన గార్డు  రైలును నందలూరు రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు.  అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలు నందలూరులో ఆపి తనిఖీలు నిర్వహించారు. అగ్నిమాపాక సిబ్బందికి సమాచారం అందించారు.  రైల్లోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు  రైల్లో  క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన సిబ్బంది రైలు చక్రాల సమీపంలో ఉన్న బ్రేకుల వద్ద నుంచి పొగలు వస్తున్నాయని గమనించి మరమ్మతులు నిర్వహించారు. రైలుకు  ప్రమాదం లేదని చెప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరమ్మతుల అనంతరం తిరిగి రైలు ప్రయాణం కొనసాగింది.

Harish Rao

బీసీ హాస్టల్లో అస్వస్థతకు గురైన విద్యార్థులకు హరీష్ రావు పరామర్శ

  బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థులను  బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని బాలిక వసతి గృహంలో  ఫుడ్ పాయిజన్ 150 మంది విద్యార్థులు  ఆస్పపత్రిలో చేరారు. హరీశ్ రావు వస్తున్నారని తెలిసి చికిత్స పూర్తవ్వకుండానే విద్యార్థులను డిశ్చార్జి చేశారని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  సీఎం రేవంత్ రెడ్డి నుంచి మాటలు కాదు... చేతలు కావాలని స్పష్టం చేశారు."గతంలోనూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగితే, మరోసారి ఇలాంటివి చోటుచేసుకుంటే చర్యలు తీసుకుంటానని సీఎం అన్నారు... మరి ఉయ్యాలవాడ ఘటన ఎలా జరిగింది? ముఖ్యమంత్రి ఆదేశాలు అధికారులు పాటించడం లేదా? ఢిల్లీకి వెళ్లడానికి దొరికిన సమయం, విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు దొరకదా? ఫుడ్ పాయిజనింగ్ అంశాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టాలి.. మానవ హక్కుల కమిషన్, హైకోర్టు వీటిని సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలి... రేవంత్ రెడ్డీ... మాపై కోపం ఉంటే మమ్మల్ని జైల్లో పెట్టండి... అంతేగానీ విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోకండి" అంటూ హరీశ్ రావు అన్నారు.కొల్లాపూర్ మండలం బండాయిగుట్టకు చెందిన ఒక తల్లి నాగర్‌కర్నూల్ గురుకుల కాలేజీలో చదివే తన బిడ్డ అస్వస్థతకు గురైందని, ఇంటికి తీసుకపోదామని వస్తే..ఈరోజు ఉదయం అన్నంతో పెట్టిన సాంబారులో కూడా పురుగులు వచ్చాయని తెలిపింది నీళ్లు సరిగ్గా లేవు, బాత్రూములు అసహ్యంగా ఉన్నాయని విద్యార్థులు చెప్తున్నారు

Singapore Tour

సింగపూర్‌లో సీబీఎన్ టీమ్ బిజీ బీజీ.. పెట్టుబడుల ఆకర్షణే టార్గెట్

  ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం సింగపూర్‌లో దౌత్య కార్యక్రమాల్లో బిజీగా మారింది. ఈ క్రమంలో తాజాగా భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు పి. నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్‌తో పాటు ఏపీ ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం సింగపూర్‌తో ఆంధ్రప్రదేశ్‌ సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన అడుగుగా భావించవచ్చు. హైకమిషనర్ శిల్పక్ అంబులే సింగపూర్‌‎లో ఆరోగ్యం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. సింగపూర్‌ ప్రభుత్వ విధానాలు, గ్రోత్ రేట్, అక్కడి భారతీయుల కార్యకలాపాల గురించి సమగ్రంగా చర్చించారు. సింగపూర్‌లో 83 శాతం పబ్లిక్ హౌసింగ్ ఉండటం ద్వారా వారి సమాజంలో సమతుల్యతను ఎలా సాధిస్తున్నారో కూడా వివరించారు. ఇండియాతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో సింగపూర్‌ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నట్లు శిల్పక్ తెలిపారు. సీఎం చంద్రబాబు గతంలో అమరావతి రాజధాని ప్రాజెక్టులో సింగపూర్‌తో భాగస్వామ్యం గురించి గుర్తు చేస్తూ, కొన్ని కారణాల వల్ల ఆ భాగస్వామ్యం కొనసాగలేదని, ఇప్పుడు ఆ లోటును సరిచేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సింగపూర్ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని హైకమిషనర్ వెల్లడించారు. ముఖ్యంగా, సీఎం చంద్రబాబు బ్రాండ్‌కు సింగపూర్‌లో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పాలసీలు, పెట్టుబడులకు గల అవకాశాలను సీఎం వివరించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో ఏపీ ముందుకు సాగుతోంది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఇప్పటికే పట్టాలెక్కాయని, విశాఖలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటవుతోందని సీఎం తెలిపారు.  అమరావతిలో ఇండియా క్వాంటం మిషన్‌లో భాగంగా క్వాంటం వ్యాలీ కూడా ఏర్పాటు కానుందని వెల్లడించారు.రాయలసీమ ప్రాంతం డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలకు అనువైన ప్రాంతంగా మారుతుందని సీఎం చెప్పారు. సింగపూర్ నుంచి ఇండియాకు ముఖ్యంగా ఏపీకి పెట్టుబడులు రావాలని, ఈ పెట్టుబడులకు ఏపీ గేట్‌వేగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి వివరించారు.  పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం హైకమిషనర్‌కు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఏపీలో ప్రముఖ విద్యా సంస్థలు ఇప్పటికే ఏర్పాటవుతున్నాయని, మరిన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సింగపూర్‌ సహకారంతో విద్య, పరిశ్రమలు, సాంకేతికతలో ఏపీ కొత్త శిఖరాలను అధిరోహించేందుకు సన్నద్ధమవుతోంది.

Bandi Sanjay

కేటీఆర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది సీఎం రమేశ్ : బండి సంజయ్

  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు 2009 ఎన్నికల్లో సిరిసిల్ల ఎమ్మెల్యే  టికెట్ ఇప్పించింది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మొదట  సిరిసిల్ల టికెట్ ఇవ్వలేదు. అప్పుడు కేటీఆర్ వెళ్లి సీఎం రమేశ్‌కు చెప్తే ఆయన కేసీఆర్ ఒప్పించి టికెట్ ఇప్పించారు. తర్వాత సీఎం రమేశ్ ఆర్ధిక సాయం చేసి కేటీఆర్‌ని ఎమ్మెల్యేగా గెలిపించారు అని తెలిపారు.  కేటీఆర్‌పై సీఎం రమేశ్‌ చేసిన ఆరోపణలు వాస్తవమే అని బండి సంజయ్‌ అన్నారు. సీఎం రమేశ్‌ సవాల్‌కు కేటీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. వారిద్దరి మధ్య బహిరంగ చర్చ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ‘‘కేటీఆర్‌తో చర్చకు సీఎం రమేశ్‌ను నేను తీసుకొస్తా. బహిరంగ చర్చకు తేదీ, సమయం కేటీఆర్‌ చెప్పాలి. బీఆర్‌ఎస్ పార్టీ  అవినీతి పార్టీ అని ఎన్నో సార్లు చెప్పాం. ఆ పార్టీని భారతీయ జనాత పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదు.  ప్రధాని మోదీ నిజామాబాద్‌ సభలో ఇదే చెప్పారు’’ అని బండి సంజయ్‌ అన్నారు. బీఆర్ఎస్ అంటే బిడ్డా, అల్లుడు, కొడుకు, అయ్య పార్టీ అని బండి సంజయ్ అభివర్ణించారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, దాన్ని నడపడం ఆ పార్టీకి సాధ్యం కావడం లేదని కేంద్ర మంత్రి విమర్శించారు. అవినీతికి కొమ్ముకాయడమే కాకుండా, ప్రజాస్వామ్య విలువల్ని పక్కనపెట్టి కుటుంబ ఆస్తిగా పార్టీని నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Singapore Tour

భారత హైకమిషనర్‌తో చంద్రబాబు బృందం భేటీ

  సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు బృందం  భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ అయ్యింది. హైకమిషనర్ శిల్పక్ అంబులే సింగపూర్‌‎లో ఆరోగ్యం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. సింగపూర్‌ ప్రభుత్వ విధానాలు, గ్రోత్ రేట్, అక్కడి భారతీయుల కార్యకలాపాల గురించి సమగ్రంగా చర్చించారు.  సింగపూర్‌లో 83 శాతం పబ్లిక్ హౌసింగ్ ఉండటం ద్వారా వారి సమాజంలో సమతుల్యతను ఎలా సాధిస్తున్నారో కూడా వివరించారు. హైకమిషనర్ శిల్పక్ అంబులే సింగపూర్‌‎లో ఆరోగ్యం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. సింగపూర్‌ ప్రభుత్వ విధానాలు, గ్రోత్ రేట్, అక్కడి భారతీయుల కార్యకలాపాల గురించి సమగ్రంగా చర్చించారు. సింగపూర్‌లో 83 శాతం పబ్లిక్ హౌసింగ్ ఉండటం ద్వారా వారి సమాజంలో సమతుల్యతను ఎలా సాధిస్తున్నారో కూడా వివరించారు. ఇండియాతో ముఖ్యంగా ఏపీతో సింగపూర్‌ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నట్లు శిల్పక్ తెలిపారు.  సీఎం చంద్రబాబు గతంలో అమరావతి రాజధాని ప్రాజెక్టులో సింగపూర్‌తో భాగస్వామ్యం గురించి గుర్తు చేస్తూ, కొన్ని కారణాల వల్ల ఆ భాగస్వామ్యం కొనసాగలేదని, ఇప్పుడు ఆ లోటును సరిచేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమై సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి కోరారు. విద్యారంగంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, ఆలోచనలను వివరించిన మంత్రి లోకేశ్ వారికి వివరించారు.

Kondapur

కొండాపూర్‌లో రేవ్‌ పార్టీ భగ్నం..11 మంది అరెస్ట్

  హైదరాబాద్ కొండాపూర్‌లో రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. శనివారం రాత్రి ఎస్వీ నిలయం అపార్ట్ మెంట్ లో కొంతమంది రేవ్ పార్టీకి ఏర్పాట్లు చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పార్టీని భగ్నం చేశారు. పార్టీ నిర్వాహుకులు సహా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఏపీకి చెందిన వారేనని సమాచారం.  విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి సంపన్న యువకులను పిలిపించి వీకెండ్ లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు.  అపార్ట్ మెంట్ లో సోదాలు నిర్వహించగా.. 2.080 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్‌, 1.91 గ్రాముల డ్రగ్స్ లభించినట్లు తెలిపారు.  వారి నుంచి 6 కార్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా మారుపేర్లతో బ్యాంక్ అకౌంట్‌, మారు ఆధార్ కార్డులతో డబ్బున్న సరాబులను తీసుకువచ్చి రెండు రోజులపాటు ఎంజాయ్ చేయించి తీసుకు వెళ్తుంటారు. ఈ ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరితోపాటు మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

TTD

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

  తిరుమల శ్రీవారి సేవలో నేడు ప్రముఖులు పాల్గోన్నారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ,  మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీ ఛీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, కింగ్‌డమ్ మూవీ టీమ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత నాగ వంశీ ఉదయం శ్రీవారిని దర్శంచుకున్నారు. రంగానాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.  ఈ సందర్బంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక, టీటీడీ పవిత్రతను కాపాడేలా, పూర్వ వైభవం వచ్చిందని ప్రజలు చెబుతున్నారని అన్నారు.ఈ క్రమంలో దైవ దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు, అన్నదానం తో పాటు ఇతర అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ తరుణంలో ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుని యువతకు లక్షలాది ఉద్యోగాలు రావాలని, అమరావతి పోలవరం ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు.  శ్రీవారి ఆశీస్సులతో గతేడాది రాయలసీమలో రిజర్వాయర్లన్ని నిండి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. హంద్రీనీవా ద్వారా 3850 క్యూసెక్కుల కృష్ణా జలాలను అడివిపల్లి రిజర్వాయర్ నింపి, హంద్రీనీవా కాలువ ద్వారా భవిష్యత్తులో తిరుపతికి తాగు పారిశ్రామిక అవసరాలకు నీటిని అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

CM Chandrababu

సింగపూర్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు సీఎం సింగపూర్ లో పర్యటించనున్నారు. సింగపూర్ కు చేరుకున్న సీఎంకు స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి తాను బసచేసే హోటల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి, మంత్రుల బృందానికి స్థానిక తెలుగు కుటుంబాలకు చెందిన వారు స్వాగతం పలికారు.  సీఎంకు స్వాగతం పలికేందుకు సంప్రదాయ వస్త్రధారణలో తెలుగు కుటుంబాలకు చెందిన మహిళలు తరలి వచ్చారు.. హారతులు పట్టారు. చిన్నారులు కూచిపూడి నృత్యాలతో స్వాగతించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన బస చేస్తున్న హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సందడి నెలకొంది. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశానికి ముఖ్యమంత్రి, మంత్రులు  నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్ లు హాజరు కానున్నారు.  

Haridwar

హరిద్వార్‌లో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి

  యూపీలోని హరిద్వార్ మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట  చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనల్లో  ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యానట్లు తెలుస్తోంది. శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలు భక్తులు రావడంతో క్యూలైన్ లో తోపులాట చోటుచేసుకుందని తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందడంతో ఎమర్జెన్సీ బృందాలు హుటాహుటిన ఆలయానికి చేరుకున్నాయి.  గాయపడిన భక్తులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించాయి.ఈ ఘటనలో గాయపడిన భక్తులలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయిన విషయాన్ని గర్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ధ్రువీకరించారు. విషయం తెలిసిన వెంటనే ఆలయం వద్దకు బయలుదేరానని, ఘటనా స్థలాన్ని పరిశీలించాక ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని కమిషనర్ పేర్కొన్నారు  

andhrapradesh liquor scam sit petition to arrest avinashreddy

మద్యం కుంభకోణం కేసు.. ఇప్పుడిక అవినాష్ రెడ్డి వంతు?

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్.. దూకుడు పెంచింది. వరుస అరెస్టుతో ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారిని హడలెత్తిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే సిట్ 13 మందిని అరెస్టు చేసింది.  అరెస్టైన వారిలో మిథున్ రెడ్డి మినహా మిగిలిన అందరూ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండగా, మిథున్ రెడ్డి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.   అక్కడితో ఆగని సిట్ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసుతో సంబంధం ఉన్న మరో 12 మందిని అరెస్టు చేయడానికి అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  ఆ జాబితాలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా ఉండటంతో మిథున్ రెడ్డి తరువాత ఈ కేసులో అరెస్టు కానున్న ప్రముఖ వ్యక్తి అవినాష్ రెడ్డే అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకూ అవినాష్ రెడ్డి పేరు ఎక్కడా వినిపించలేదు. కనినపించలేదు. అలాగే ఇప్పటి వరకూ ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచింది కూడా లేదు. అలాంటిది హఠాత్తుగా అవినాష్ రెడ్డి అరెస్టునకు అనుమతి కోరుతూ సిట్ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన జాబితాలో అవినాష్ రెడ్డిని నిందితుడిగా పేర్కొనడంతో ఇహనో, ఇప్పుడో అవినాష్ రెడ్డిని సిట్ అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అవినాష్ రెడ్డితో పాటు సిట్ పేర్కొన్న జాబితాలో  పురుషోత్తం, అనిరుధ్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్, బొల్లారం శివ, సైమన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రెన్ ఉన్నారు.వీరంతా ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించారని, వారిని కూడా అరెస్టు చేసి విచారించాల్సి ఉందని సిట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. వీరిలో కొందరు విదేశాలలో ఉన్నారనీ,   వారిని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు సిట్ చర్యలు చేపట్టింది. . ఇప్పటివరకు  ఈ కేసుకు సంబంధించి 13 మందిని సిట్ అరెస్టు చేసింది.  మరో 12 మంది అరెస్టు కోసం   పిటిషన్లు దాఖలు చేసింది. ఈ 12 మందిలో అవినాష్ రెడ్డి పేరు ఉండటంతో ఆయన అరెస్టుకు దాదాపు రంగం సిద్ధమైపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఆ కేసులో బెయిలుపై ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో అవినాష్ రెడ్డి అరెస్టునకు సిట్ రంగం సిద్ధం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

fire in express rail

కన్యాకుమారి ముంబై ఎక్స్ ప్రెస్ లో మంటలు

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. కన్యాకుమారి నుంచి ముంబై వెళుతున్న రైలు అన్నమయ్య జిల్లా చేరుకున్న సమయంలో ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. కన్యాకుమారి- ముంబై ఎక్స్ ప్రెస్ లోని ఓ ఏసీ బోగీలు మంటలు చెలరేగడాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే రైలును నందలూరు స్టేషన్ సమీపంలో నిలిపివేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను అదుపు చేసిన తరువాత రైలు యథా ప్రకారం ప్రయాణాన్ని సాగించింది. సాంకేతిక లోపంతోనే ఈ ఘటన జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలొ శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో తిరుమల కొండ భక్త జన సంద్రంగా మారింది. ఆదివారం (జులై 27) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల  క్యూలైన్ ఎన్ జీ షెడ్స్ వరకూ సాగింది.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది.  అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.  ఇక శనివారం శ్రీవారిని మొత్తం 68 వేల  229 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో  30,559 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 2 లక్షల రూపాయలు వచ్చింది. 

ఏపీ బ్రాండ్ ప్రోత్సహించడానికి.. సింగపూర్ వెళుతున్నాం : సీఎం చంద్రబాబు

  సింగపూర్ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీకి పెట్టుబడుల రాబట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ రాత్రికి సింగపూర్ వెళుతున్నామని ఎక్స్ వేదికగా సీఎం తెలిపారు. అభివృద్ధిలో తమకు అత్యంత విలువైన భాగస్వామి, శక్తిమంతమైన తెలుగు సమాజానికి నెలవుగా ఉన్న దేశం సింగపూర్ అని కొనియాడారు. "రేపు సింగపూర్ మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, తెలుగు డయాస్పొరా సభ్యులను కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో సింగపూర్ ఒక కీలక భాగస్వామిగా ఉంది.  ఆసియాలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా, దార్శనిక దేశంగా సింగపూర్ వర్థిల్లుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. లోతైన సహకారం దిశగా విలువైన అవకాశాలను అందిస్తుంది. మా విశ్వసనీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, అంతర్జాతీయ వేదికపై బ్రాండ్ ఏపీని ప్రోత్సహించడానికి, నూతన ప్రగతిశీల విధానాలను చాటిచెప్పడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. అంతేకాదు, సమ్మిళిత వృద్ధి దిశగా శాశ్వత సహకారాలను నెలకొల్పేందుకు ఇదొక అవకాశం" అంటూ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.  చంద్రబాబు బృందం సింగపూర్ లో 5 రోజుల పాటు పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, ఇండస్ట్రియలిస్టులతో భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి  సింగపూర్‌కు ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, పి.నారాయణ, ఉన్నతాధికారులు  వెళుతున్నారు. 

వేరొక వ్యక్తి వీర్యంతో ఐవీఎఫ్‌.. బయటపెట్టిన డీఎన్‌ఏ టెస్టు

  సికింద్రాబాద్ లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘరానా మోసం జరిగింది. పిల్లల కోసం ఆస్పత్రికి వచ్చిన  మహిళకు భర్త కాకుండా మరో వ్యక్తి నుంచి వీర్యకణాలు సేకరించి, ఐవీఎఫ్‌ పద్ధతిలో ఆస్పత్రి సిబ్బంది పిండాన్ని అభివృద్ధి చేసినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పెళ్లి అయి సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో కఫుల్స్ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు.  ఐవీఎఫ్ విధానంలో మహిళ గర్భం దాల్చింది.  ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలుడు తరుచుగా అనారోగ్యానికి గురవుతుండగా దంపతులు టెస్ట్‌లు చేయించడంతో కాన్యర్స్ ఉన్నట్లు తేలింది. కుటుంబంలో ఎవరికీ కాన్యర్స్ లేకపోవడంతో అసలు విషయం బయటపడింది.  పోలీసుల సూచన మేరకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా.. అవి కూడా సరిపోలలేదు. దీంతో సంబంధిత సెంటర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు  విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.  టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌ డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో సరోగసి కోసం పెద్ద ఎత్తున్న వీర్యం నిల్వ చేసినట్టు గుర్తించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్‌తో పాటు సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌లో పనిచేస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

మావోయిస్టు అగ్ర దంపతులు అరెస్ట్

  ఏపీలో మావోయిస్టు అగ్ర దంపతులు  సరెండర్ అయ్యారు. మావోయిస్ట్ పార్టీలో సుమారు 34 సంవత్సరాలు పైగా పని చేసిన సీనియర్ మావోయిస్టు జోరిగె నాగరాజు అలియాస్ కమలేశ్ ఆయన భార్య మేడక జ్యోతీశ్వరి అలియాస్ అరుణ ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. కమలేశ్, ప్రస్తుతం తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్చార్జ్ పనిచేస్తూ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో SZCM హోదాలో ఉన్నారు.  మావోయిస్టు పార్టీ వైఫల్యాలు మరియు కేంద్ర కమిటీ విధానాలపై విసుగు చెంది, ఈ సిద్ధాంతం ఇక చలామణిలో అవ్వదని గ్రహించి లొంగిపోయినట్లు చెప్పారు. చత్తీస్‌గఢ్ లో వీరు మావోయిస్టు లుగా కీలకంగా వ్యవహరించారు. కమలేష్ పై ఆంధ్రా ప్రదేశ్ లో 20 లక్షల రూపాయల రివార్డు మరియు అరుణ పై 5 లక్షల రూపాయల రివార్డు ఉంది. లొంగిపోయిన దంపతులకు తక్షణ ఉపశమనంగా ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున చెక్కులను అందచేశాంఅల్లురి సీతారామరాజు జిల్లాలో ఆపరేషన్ బృందాలు ఆయుధాలు డంప్ స్వాధీనం చేసుకుంది.  వీటిలో మొత్తం 18 ఆయుధాలు ఉన్నాయి - 1 AK-47, 2 BGLలు, 5 SLRలు, 2 INSAS రైఫిళ్లు, 606 లైవ్ రౌండ్లు, 37 కిలోల కార్డెక్స్ వైర్లు,  ఇతర పరికరాలు ఉన్నాయి. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచార ఆధారంగా స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. ఇటీవల కాలంలో ప్రజల్లో బాగా చైతన్యం వచ్చిందని పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు జాయింట్ ఆపరేషన్‌లు చేస్తున్నారని డీజీపీ  తెలిపారు. మావోయిస్టు లుగా ఉన్న వారు పునరాలోచన చేయండి హింసాత్మక ఘటనలు తో సాధించేదేమీ లేదు. మన రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. మీ కుటుంబ సభ్యులు  గురించి అయినా ఆలోచనలు చేయండి. మీరు జన జీవన స్రవంతి లోకి వస్తే... ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డీజీపీ తెలిపారు.