కమలం గూటికి పోతుల సునీత

మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత కమలం గూటికి చేరారు. ఆమెకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.  దాదాపు ఏడాది కిందట ఆమె వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో పోతుల సునీత తెలుగుదేశంలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో జనసేన గూటికైనా చేరుదామని ప్రయత్నించారు. అయితే ఆ పార్టీ కూడా ఆమెకు తలుపులు మూసేసింది. దీంతో గత ఏడాది కాలంలో పోతులసునీత ఏ పార్టీలోనూ లేరు.  వాస్తవానికి పోతుల సునీత తన రాజకీయ ప్రస్తానాన్ని తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభించారు. 2017లో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో ఆమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరారు. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడమే కాకుండా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలయ్యాయి.  ఆ తరువాత ఆమె వైసీపీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆమె బీజేపీలో చేరారు. తన భర్త పోతుల సురేష్ తో కలిసి కమలం కండువా కప్పుకున్నారు.   అయితే బీజేపీ వారిని పార్టీలో చేర్చుకోవడం పట్ల పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం, బీజేపీలు రాష్ట్రస్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ కూడా పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమె తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే వైసీపీలో ఉన్న సమయంలో పోతుల సునీత చంద్రబా బునాయుడు, లోకేష్, ఇతర తెలుగుదేశం నాయకులపై చేసిన విమర్శల కారణంగా ఆమెకు తెలుగుదేశం తలుపులు మూసేసింది. దీంతో ఆమె జనసేనలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే తెలుగుదేశంతో ఉన్న పొత్తు ధర్మాన్ని పాటించిన జనసేన ఆమె చేరికకు అంగీకరించలేదు. దీంతో ఇంత కాలం ఏ పార్టీలోనూ లేకుండా రాజకీయాలకు ఒకింత దూరంగా మెలిగిన పోతుల సునీత ఇప్పుడు కమలం కండువా కప్పుకుంది. రాష్ట్రంలో పొత్తులో ఉన్న రెండు పార్టీలూ కాదన్న వ్యక్తిని బీజేపీ ఎలా చేర్చుకుంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   

ఆక్వారైతుల రుణాలపై మారటోరియం.. కేంద్రానికి చంద్రబాబు లేఖ

  అమెరికా టారిఫ్ ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆక్వారైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సహా వాణ్యజ్య, మత్స్య శాఖ మంత్రులకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. అమెరికా టారిఫ్ ల కారణంగా ఆక్వారంగానికి పాతిక వేల కోట్ల రూపాయమల నష్టం వాటిల్లిందన్నారు. దాదాపు 50 శాతం ఎగుమతుల ఆర్డర్లు నిలిచిపోయాయన్నారు.  కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆక్వా రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని చంద్రబాబు  ఆ లేఖలలో కోరారు. ఆక్వారైతులు నష్టపోకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో కేంద్రం స్పష్టమైన విధానాన్ని అవలంబించాలన్నారు. ఆక్వా ఉత్పత్తుల రవాణాకు డెడికేటెడ్ రైళ్లు నడపాలని కోరారు. అలాగే ఆక్వారైతుల రుణాలపై మారటోరియం విధించాలని చంద్రబాబు కేంద్ర మంత్రులను కోరారు.  

షర్మిలతో బొత్స మాటా మంతీ.. మతలబేంటి?

విశాఖ స్టీల్ ప్లాంట్ పై విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణల భేటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందుకు ప్రధాన కారణంగా ఈ ఇరువురూ ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పక్కపక్కనే కూర్చోవడమే కాకుండా.. స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది.   అన్నిటి కంటే అందరి దృష్టినీ ఆకర్షించిన విషయమేంటంటే.. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు ముందుగా బొత్స సత్యనారాయణ వచ్చి తన స్థానంలో కూర్చున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికి షర్మిల వచ్చారు. సమావేశం హాల్ లోకి షర్మిల ప్రవేశించడం గమనించగానే బొత్స సత్యనారాయణ తన స్థానం నుంచి లేచి నిలబడి ఆమెను పలకరించి.. తన పక్కన ఉన్న స్థానంలో కూర్చోమని కోరారు.  దీంతో షర్మిల బొత్స పక్కనే ఉన్న స్థానంలో   కూర్చున్నారు. బొత్సతో మాట్లాడిన తరువాత.. ఆ పక్కనే ఉన్న సీపీఐ నేత రామకృష్ణను పలకరించారు.  సమావేశం ముగిసిన తర్వాత, షర్మిల బొత్సకు అన్నా వెళ్లొస్తా అని చెప్పి మరీ వెళ్లారు. ఇరువురి మధ్యా  సంభాషణ కొద్ది సేపే జరిగి ఉండొచ్చు కానీ.. ఆ కొద్ది సేపు జరిగిన భేటీయే వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో పలు ఊహాగాన సభలు జరగడానికి కారణమైంది. అందుకు కారణం లేకపోలేదు. వైసీపీ ఎకో సిస్టమ్ లో ప్రత్యర్థి పార్టీలు ఉండవు. శత్రు పార్టీలు మాత్రమే ఉంటాయి. అందులోనూ షర్మిల వైసీపీ అధినేత, స్వయానా తన సోదరుడు అయిన జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తుండటమే కాకుండా..  వైఎస్ జగన్  వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడు ఎంత మాత్రం కాదని విస్ఫష్టంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ షర్మిలతో మాటా మంతీ కలపడం కచ్చితంగా జగన్ కు నచ్చదు. ఆ సంగతి తెలిసీ బొత్స సత్యనారాయణ షర్మిలను లేచి నిలబడి మరీ పలకరించడమే కాకుండా.. స్వయంగా తన పక్కన ఉన్న స్థానంలో కూర్చోమని ఆహ్వానించి మరీ మంతనాలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరిం చుకోవడమే కాకుండా, పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.    

వైసీపీ ఐదేళ్ల అవినీతి పాలనకు చరమగీతం : జేపీ నడ్డా

  గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో అవినీతి రాజ్యమేలిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. వైసీపీ అవినీతి పాలనకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చరమగీతం పాడారని జేపీ నడ్డా అన్నారు. విశాఖపట్నంలో ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేపట్టిన 'సారథ్యం' యాత్ర ముగింపు సభకు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2014కు ముందు దేశంలో వారసత్వ, అవినీతి రాజకీయాలు రాజ్యమేలాయి. అదే తరహాలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమైంది. రాష్ట్ర ప్రజలను గత పాలకులు దారుణంగా మోసం చేశారని విమర్శించారు.  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు" అని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఏపీ మళ్లీ పునరుజ్జీవనం పొందుతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' అనే నినాదంతో దేశం ముందుకు సాగుతోందని నడ్డా గుర్తుచేశారు. దశాబ్దాల నాటి అయోధ్య రామమందిర కలను సాకారం చేయడం, ట్రిపుల్ తలాక్ రద్దు, జీఎస్టీ వంటి చారిత్రక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదేనని ఆయన కొనియాడారు.  ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన నడ్డా, రాష్ట్రానికి కేటాయించిన పలు కీలక ప్రాజెక్టులను ప్రస్తావించారు. సాగర్ మాల పథకం కింద 14 పోర్టుల నిర్మాణం, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడం, జాతీయ రహదారుల విస్తరణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం పెద్దపీట వేస్తోందన్నారు. భోగాపురం విమానాశ్రయానికి రూ.625 కోట్ల నిధులు విడుదల చేశామని, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు, అమృత్ భారత్, వందే భారత్ వంటి ఆధునిక రైల్వే సేవలతో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు.ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు, మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనలతో కలిసికట్టుగా పనిచేస్తామని నడ్డ తెలిపారు.

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ

  మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏడాది కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు బీజేపీతో తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు. ఏడాది క్రితం వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సునీత ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో పోతుల సునీత తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2017లో టీడీపీ తరఫున ఆమె తొలిసారిగా శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ టికెట్  ప్రయత్నించినా  దక్కలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2020 నవంబరులో ఆమె టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై సేవలందించారు.పోతుల సునీత రాజకీయ ప్రస్థానంలో ఇది మూడో మలుపు. 

ఏదో లక్కీగా ఎమ్మెల్యే అయ్యారు...మంత్రి కీలక వ్యాఖ్యలు

  వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పైన  మంత్రి కొండ సురేఖ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా ఓ సిటీలో గ్యాస్  ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి కొండ సురేఖ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అదృష్ట కలిసి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచాడు అని అన్నారు. ఆయన నాకంటే చిన్నవాడు నాకంటే ముందు నుంచి ఎమ్మెల్యే కావాలనుకున్నాడు కానీ కాలేకపోయాడు అని వాఖ్యనించాడు.  ఇప్పుడు అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యే అయ్యాడని మాట్లాడారూ. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నేను భద్రకాళి గుడిలో ధర్మకర్తలను నియమించుకునే అధికారం లేదా అని అన్నారు. అధిష్టానం చెప్పిన వారికి భద్రకాళి దేవాలయం ధర్మకర్తగా నియమించామని అన్నారు. నాపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మాట్లాడారు. భద్రకాళి ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది అని మంత్రి కొండ సురేఖ మాట్లాడారు.  మంత్రి కొండ సురేఖ వాక్యాల పైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. పుటోకో పార్టీ మారితే ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యే వాడిని అని ఘాటుగా విమర్శించారు. కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాను కాబట్టి ప్రజలు గెలిపించాలని అన్నారు. పుటకో పార్టీ తిరిగే ఉంటే ఎమ్మెల్యే అయ్యేవాడిని కాదని అన్నారు..మంత్రి కొండ సురేఖకు ఇస్తున్న గౌరవంని కాపాడుకోవాలని అన్నారు. ఆమె మహిళా కాబట్టి ఎక్కువ మాట్లాడకపోతున్నాను అని విమర్శించారు.  నా నియోజకవర్గంలో మంత్రి  పెత్తనం ఏంటని తీవ్రంగా మండి పడ్డారు. 15 ఏళ్లుగా వరంగల్ ఈస్ట్ కు రెండు డైరెక్టర్లు పదవులు ఇచ్చి మిగతావి వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ఇచ్చారు. అలాగే నేను కూడా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి రెండు వెస్ట్ నియోజకవర్గానికి 5 పరకాల,వర్ధన్నపేట, హుస్నాబాద్ కు ఒక్కొక్క డైరెక్టర్ల చొప్పున ఇవ్వాలని సూచించాను తప్ప అని అన్నారు. నా నియోజకవర్గంలో మంత్రి కొండ సురేఖ జోక్యంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.  

మహిళా శక్తి కారణంగానే భారత్‌కు గుర్తింపు : స్పీకర్‌ ఓంబిర్లా

  భరత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్ధాలకు ముందే ప్రారంభమైందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో జరుగుతున్న మహిళ సాధికరత సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న భారత సంప్రదాయమని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ మహిళలు కీలకపాత్ర పోషించారు. సామాజిక బంధనాలు తెంచుకొని అనేక ఉద్యమాలు చేశారు. మహిళా శక్తి కారణంగానే ప్రపంచంలోనే ముఖ్య దేశంగా భారత్ అవతరించిందని చెప్పారు.  మహిళా శక్తి కారణంగానే ఇవాళ ప్రపంచంలోనే భారత్‌ ముఖ్యదేశంగా అవతరించింది. రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, సైన్యంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆదివాసీ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్నారు. మహిళా సాధికారత ఒక్కరోజులో సాధ్యం కాదు. అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటే సాధ్యమవుతుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశామని సభాపతి వెల్లడించారు.  

అసెంబ్లీకి రాకపోయిన జీతం తీసుకుంటున్నారు : అయ్యన్నపాత్రుడు

  తిరుపతిలో తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు ప్రారంభమైంది. లోక్‌సభ సభాపతి ఓం బిర్లా నేతృత్వంలో వికసిత్‌ భారత్‌కు మహిళల నాయకత్వం అనే నినాదంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ముఖ్యఅతిథిగా ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పాల్గొన్నారు. ఈ సదస్సుకు హాజరైన ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతు  కొందరు ఎమ్మెల్యేలు శాసన సభకు రాకపోయినా జీతం తీసుకుంటున్నారని స్పీకర్ అన్నారు.  ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యలు పరిష్కరించడానికే ఉద్యోగాలకు రాకపోతే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం. చిరుద్యోగులు సైతం ‘నో వర్క్‌ - నో పే’ విధానం అనుసరిస్తున్నారు. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభ స్పీకర్‌ మార్గదర్శకాలు ఇవ్వాలి. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేదే 45 రోజులు.. వాటికి కూడా రాకపోతే ఎలా?’’ అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

చెవిరెడ్డి లీల...చెబితే చాంతాడంత!

  మానాన్న 15 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించిన పేరు. ఉన్నది ఉన్నట్టురాయండి. ఆయనకు చెడ్డపేరు తేవద్దంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మొన్న సిట్ తన ఇంటి విచారణ సందర్భంగా అన్నమాట. నిజంగానే ఉన్నది ఉన్నట్టు రాయడం మొదలు పెట్టినా.. ఆ పదిహేను ఏళ్ల పేరెలాగూ రిపేరయ్యేలాగే ఉంది చూస్తుంటే.. ఎందుకంటే సిట్ విచారణలో బయటపడ్డ, చెవిరెడ్డి చుట్టూ అల్లిన ఓ నకిలీ వ్యాపార ప్రపంచం దాని పూర్వాపరాలేంటని చూస్తే.. డ్రైవర్లే డైరెక్టర్లుగా, బంధువులే బినామీలుగా.. 8 డొల్ల కంపెనీలు, అందులో 16 మంది బినామీలతో.. మద్యం ముడుపుల బ్లాక్ మనీ, వైట్ లోకి మార్చడానికి చెవిరెడ్డి మరో లోకాన్ని సృష్టించినట్టు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ ఒకరన్నవి కావు సిట్ స్వయానా అన్న మాటలు.  తిరుచానూరులో 35 కోట్ల విలువైన భూమిని సుమారు 3 కోట్లకే సొంతం చేసుకున్న వైనం, అమ్మిన వ్యక్తికి 24 లక్షలు మాత్రమే ఇచ్చి.. మిగిలిన సొమ్ము ఆమెను బినామీగా తమ డొల్ల కంపెనీలోకి చేర్చుకుని.. ఆపై అప్పు తీస్కున్నట్టు సృష్టించడం.. ఇలాంటి ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. నేను వేద పాఠశాల నడుపుతున్నా అంటోన్న చెవిరెడ్డి ఏకంగా పూజారికే పంగనామాలు పెట్టడం మరో గుడిలో.. గూడుపుఠాణీ లాంటి కథనం. తిరుచానూరు ఆలయ ప్రధాన అర్చకుడి భార్య రేణుక పేరిట తిరుచానూరులో ఒక చోట 2. 98 ఎకరాల భూమి ఉంది. ఇది మార్కెట్ వాల్యూ కన్నా తక్కువకు తన పరం చేసుకున్న ఘనాపాటి ఈ చెవిరెడ్డిగా గుర్తించారు సిట్ అధికారులు. ఇది కూడా మద్యం సొమ్ములోంచి కాజేసిన దాన్లోంచి ఇచ్చినట్టు సమాచారం. అసలు చెవిరెడ్డి ఆయన బంధుమిత్ర సపరివారం మొత్తం ఇదే పనిగా ఉంటారట. తిరుపతి పాస్ పోర్ట్ ఆఫీసు దగ్గర ఒక ఛానెల్ కి సరిపడా ఆఫీసు నడుపుతూ.. సర్వే నిర్వహిస్తామన్న కలరింగ్ ఇచ్చే చెవిరెడ్డి. తన చుట్టూ ఏర్పరిచిన అతి పెద్ద అక్రమ అవినీతి సామ్రాజ్యం గుట్టు తెలుసుకునే కొద్దీ విస్తు పోతున్నారట సిట్ అధికారులు.  పైకి ఒకటి చూపిస్తూ లోలోన.. మాత్రం భూములను చౌకగా కొనడం, అమ్మడం. ఎవరైనా కాదంటే వారిని మభ్య పెట్టడం లేదా బెదిరించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతుంటారట. పెద్ద కొడుకును తన తరఫున చెవిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయించిన చెవిరెడ్డి. చిన్నకొడుకు హర్షిత్ రెడ్డి ద్వారా ఈ భూలావాదేవీలను ఎక్కువగా చేస్తుంటారట.  ఇలా చెప్పుకుంటూ పోతే సిట్ వెలుగులోకి తీస్కొస్తున్న చెవిరెడ్డి లీలలు చాంతాడంత అంటున్నారు అధికారులు. ఇంతోటిదానికి చెవిరెడ్డి నాకు మద్యం అంటే పడదు. నేను శుద్ధపూసను. పులుగడిగిన ముత్యాన్ని, మేలిమి బంగారాన్ని అని చెప్పుకు తిరడం చూస్తుంటే.. ఏమనాలో అర్ధం కావడం లేదంటున్నారు స్థానికులు.  ఇక కొడుకు అంతకన్నా మించి.. మానాన్న మంచి పేరు చెడగొట్టకండీ.. అదీ ఇదని పెద్ద పెద్ద మాటలంటుంటే పుసుక్కుమని నవ్వుతున్నారట ఆయన బైట్ తీస్కుంటున్న మీడియా వర్గాల వారు. మరి చూడాలి ఈ చెవిరెడ్డి లీలలు ఇంకెన్ని మన చెవిన పడతాయో తేలాల్సి ఉంది.

ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దు : పవన్

  తనపై దుప్ప్రచారం చేసేవారిని ప్రజాస్వామ్యయుతంగా చట్టప్రకారమే తిప్పికొట్టాలని జనసైనికులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. గొడవలు పడటం ద్వారా సమస్య మరింత జటిలమవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి అశాంతిని కలిగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని పవన్ తెలిపారు. రెచ్చగొట్టే ప్రకటనలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వారి ఉచ్చులో పడకుండా, చట్టపరమైన మార్గాల్లోనే ముందుకు వెళ్లాలని ఆయన స్పష్టమైన పిలుపునిచ్చారు.  సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ చానెళ్ల ముసుగులో కొందరు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఇలాంటి కుయుక్తులతో సమాజంలో అభద్రతను సృష్టించే వారి నైజాన్ని గత పదేళ్లుగా చూస్తూనే ఉన్నామని గుర్తుచేశారు. ఆవేశాలకు లోనై ఘర్షణలకు దిగితే కుట్రదారుల లక్ష్యం నెరవేరుతుందని, కాబట్టి సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని పవన్ పేర్కొన్నారు.  ఓ యూట్యూబ్ చానెల్ లో ఒక వ్యక్తితో ఉద్దేశపూర్వకంగా అభ్యంతరకర భాషలో మాట్లాడించి, దానిని ప్రచారం చేయడం వెనుక ఉన్న దుష్ట ఆలోచనను గ్రహించాలన్నారు. దీనిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి ముందుకెళ్లాలే తప్ప, తొందరపడి ఘర్షణలకు దిగితే సమస్య మరింత జటిలమవుతుందని ఆయన విశ్లేషించారు. ఇలాంటి పరిస్థితులను ఆసరాగా చేసుకుని నాయకులు బయటకు వచ్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  ఈ నేపథ్యంలో మచిలీపట్నం వివాదంపై అంతర్గత విచారణ జరపాలని పార్టీ నాయకులను ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని స్పష్టం చేశామన్నారు. విశ్లేషకులు, సోషల్ మీడియా ముసుగులో రెచ్చగొట్టే వారితో పాటు, వారి వెనుక ఉండి వ్యవస్థీకృతంగా కుట్రలు చేసే వారిపై కూడా భారత న్యాయ సంహిత ప్రకారం ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేయించాలని జనసేన, కూటమి నాయకులకు, కార్యకర్తలకు పవన్  కల్యాణ్ కోరారు.

మేము అధికారంలోకి వ‌స్తే... అమ‌రావ‌తి నుంచే : స‌జ్జల

  సకల విభాగాల మాజీ మంత్రి, తాజా వైసీపీ స్టేట్ కో ఆర్డినేట‌ర్ లేడూ.. స‌జ్జ‌ల‌నీ.. అంటార్లెండి. ఇపుడీ స‌జ్జాల దేవ‌ ఏమంటాడంటే.. మేము మళ్లీ అధికారంలోకి వ‌స్తే అమ‌రావ‌తి నుంచే పాల‌నంటాడు. మ‌రీ మాట న‌మ్మొచ్చా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌ కాగా.. మ‌న‌మిపుడు అర్జంటుగా ఫ్లాష్ రీల్ ఒక‌టి తిప్పాల్సి ఉంటుంది మ‌రి.. అదెలాంటిదంటే.. గ‌తంలో ఇదే అమ‌రావ‌తి విష‌యంలో.. జ‌గ‌న్ అన్న మాట‌ల‌ను బ‌ట్టీ చూస్తే.. ఇక్క‌డే రాజ‌ధాని ఏర్పాటు చేయ‌డం అనే అంశం మీద త‌న‌కెలాంటి వ్య‌తిరేక‌త లేదంటూనే మూడు రాజ‌ధానుల ముచ్చ‌ట స‌డెన్ గా వెలుగులోకి తెచ్చాడు.. ఆపై ప్రాంతీయ విబేధాల‌కు ఆజ్యం పోశాడు.. అమ‌రావ‌తిని కావాలంటూనే దాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించాడు. ఇక క‌ర్నూలు, విశాఖ‌ను కూడా ఎగ‌దోశాడు. ద‌క్షిణాఫ్రికా మోడ‌ల్ అంటూ మూడు రాజధానుల మంట పెట్టాడు. క‌ట్ చేస్తే విశాఖ నుంచే త‌న పాల‌న అంటూ రుషి కొండ ప్యాలెస్ నిర్మించి మ‌రీ చాటింపు వేయించాడు. అన్ని వేదిక‌ల నుంచి అంద‌రికీ అదే చెప్పాడు. విశాఖ‌లో త‌న రెండో ప్ర‌మాణ స్వీకారోత్స‌వం అంటూ ఫ‌లితాల ముందే నానా హంగామా న‌డిపించాడు. ఆంధ్రుల అదృష్టం బాగుండి.. ఎలాగో ఆ ప్రమాదం త‌ప్పింది.  ఇక త‌న జ‌మానాలో.. రాజ‌ధాని రైతుల‌ను అట్టుడికించిన సంగ‌తి స‌రే స‌రి. ఆ మాట‌కొస్తే.. ఇదే రాజ‌ధాని రైతుల‌కు ఆశ్ర‌యం ఇచ్చినందుకు కోటంరెడ్డి వంటి వారు ఏకంగా పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌ల్సి వ‌చ్చింది. అది వేరే సంగ‌తి. ఇప్పుడేదో ప‌ర‌దా అనే సినిమా వ‌చ్చింది కానీ ఈ సినిమాను జ‌గ‌న్ ఎప్పుడో తీసేశాడు. ఒక స‌మ‌యంలో అమ‌రావ‌తిలో ఆయ‌న తిర‌గ‌డానికి అధికారులు అన్నేసి ప‌ర‌దాలు క‌ట్టాల్సి వ‌చ్చింది మ‌రి.  స‌రే ఇప్పుడేమైనా మ‌న‌సు మారిందా? అంటే ఏకంగా అధికారిక మీడియా వేదిక పైనుంచి అమ‌రావ‌తి దేవ‌త‌ల రాజ‌ధాని కాదు వేశ్య‌ల రాజ‌ధాని అన్న కామెంట్లు గుప్పించారు. స‌రే అదేదో ఒక ఔట్ సోర్సింగ్ జ‌ర్న‌లిస్టు అన్నాడు లెమ్మ‌ని లైట్ తీస్కుందామ‌నుకుంటే ఆయ‌న పార్టీకి చెందిన కేతిరెడ్డి వంటి ఎమ్మెల్యేలు చేప‌ల రాజ‌ధానిగా అభివ‌ర్ణించారు. కొన్నాళ్లు పోతే గోదాట్లో దొరికే పుల‌స ఇక్క‌డే దొర‌కొచ్చ‌న్న వ్యంగ్యాస్త్రాలు ఇందుకు అద‌నం. ఇదస‌లు క్వాంటం వాలీ కావ‌డం క‌న్నా ఆక్వా వాలీ కావ‌చ్చొనిపిస్తిరి. మొన్న‌టి వర్షాలకు వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఈ ప్రాంతం మీద క‌క్ష క‌ట్టిన‌ట్టు దాన్ని ఒక‌టే ట్రోలింగ్ చేస్తిరి. అదేమ‌న్నా చంద్ర‌బాబు అబ్బ సొత్తా??? ఒక రాజ‌ధాని లేని రాష్ట్రానికి రాజ‌ధాని కావ‌ల్సిన ప్రాంతం. వీళ్ల పుణ్య‌మాని.. ఇప్ప‌టికీ అది పురిటి నొప్పులు అనుభ‌విస్తూనే ఉంది.  2024 ఎన్నిక‌ల్లో అమ‌రావ‌తే రాజ‌ధానిగా ముందుకెళ్తాం అన్న కూట‌మి గెలుపుతో ఒక విష‌యం  అయితే ప‌బ్లిక్ నుంచి రెఫ‌రండం గా వెలుగులోకి వ‌చ్చింది. అలాగ‌ని దాన్ని గుర్తించ‌కుండా.. త‌న మీడియా చేత‌, మ‌నుషుల చేత‌, సోష‌ల్ మీడియా ద్వారా చేయించాల్సిన కామెంట్ల‌న్నీ చేయించి.. ఇప్పుడు త‌న నీడ‌లాంటి స‌జ్జ‌ల చేత‌.. ఈ సారి మేం గెలిస్తే అమ‌రావ‌తి నుంచే పాల‌న అంటే న‌మ్మ‌డానికి ఎవ‌రి చెవుల్లో పూలు పెడుతున్న‌ట్టు??? గ‌తంలో ఏకంగా అధినేత అన్న మాట‌ల‌కే దిక్కు లేదు.. అలాంటిది ఆయ‌న నీడ ద్వారా చెప్పిస్తే మాత్రం అబ‌ద్ధం నిజ‌మై  పోతుందా? మారిన మూడు రాజధానుల మూడ్ అన్న‌ది ఎస్టాబ్లిష్మెంటు అవుద్దా!!! అంటారు స‌గ‌టు అమ‌రావ‌తి వాసులు. ఏతా వాతా దీనంత‌టినీ బ‌ట్టి  చూస్తుంటే.. ఏదో ఒక‌టి చెప్పి అధికారంలోకి వ‌చ్చేద్దామ‌ని ఫీల‌వుతున్న‌ట్టుందీ మ‌డ‌మ తిప్ప‌ని బ్యాచీ. తిప్పాల్సిన‌వ‌న్నీ తిప్పేసి ఎట్ట‌కేల‌కు తిరిగి అధికారంలోకి వ‌చ్చాక ఎడం కాలితో త‌న్న‌డం ఎలాగూ అల‌వాటైందిగా అన్న గ‌ట్టి న‌మ్మ‌కంతోనే ఇలా మాట్లాడుతున్న‌ట్టు కొడుతోంది..   ఒక‌సారి జ‌రిగిన శాస్తి చాల‌ద‌ని.. రెండో సారి కూడా తిరిగి దొంగ చేతికే తాళాలివ్వ‌డ‌మా!? ఎంత మాట.. ఎంత మాట.. అన్న కామెంట్లు అమ‌రావ‌తి మాత్ర‌మే కాదు హోల్ ఆంధ్రా అంత‌టా  వినిపిస్తూనే ఉన్నాయ్. అందుకే అనేది నీళ్ల‌లో ఉన్న ముస‌లితో, అధికారంలో లేని జ‌గ‌నుతో అస్స‌లు పెట్టుకోవ‌ద్ద‌నేద‌ని డైరెక్టుగానే అనేస్తున్నారు చాలా మంది.  

ఓలీ.. నీ దుంప‌తెగ‌...ఎంత ప‌ని చేశావు

  నేపాల్ ఇంత‌గా ఎందుకు త‌గ‌ల‌బ‌డుతోంది? ఇక్క‌డి యువ‌త మోడీలాంటి ప్ర‌ధాన మంత్రి కావాల‌ని ఎందుకు కోరుకుంటున్నారు? అని చూస్తే ఓలీ నుంచి వ‌చ్చిన డైరెక్ట్ కామెంట్.. నేను మీ భార‌త దేశ ఆరాధ్య దైవం, అయోధ్య‌లో జ‌న్మించిన శ్రీరామ‌చంద్రుడి ఉనికి ప్ర‌శ్నార్ధ‌కం చేసేలా కామెంట్లు చేశాను. అదే నా  కొంప ముంచింద‌ని అన్నారు ఓలి. నిజానికి ఓలీ ఇప్ప‌టి వ‌ర‌కూ రెండు మార్లు జాన‌కీ మాత మాత్ర‌మే కాదు రాముడు సైతం మా దేశంలోనే పుట్టాడ‌ని అన్నారు. దీంతో అక్క‌డి పురావ‌స్తు శాఖ ఇది  నిరూపించ‌డానికి నానా అగ‌చాట్లు ప‌డాల్సి వ‌చ్చింది. మాములుగా అయితే అది జాన‌కీ మాత జ‌న్మించిన నేల‌. త‌న భ‌ర్త అంటే ఆమెకు అంత ప్రేమ‌. అలాంటి త‌న ప‌తిదేవుడి ఉనికి ప్ర‌శ్నార్ధ‌కం చేస్తే ఊరుకుంటుందా? ఆగ్ర‌హిస్తుంది. స‌త్యం బ‌య‌ట‌కు రావ‌డానికి తానెలా అగ్ని పునీత అయ్యిందో.. స‌రిగ్గా అలాగే తాను జ‌న్మించిన దేశాన్ని కూడా అగ్ని పునీతం చేసింది. అప్పుడుగానీ ఓలీ తాను ఆనాడు అన్న మాట‌లు నిజం కావ‌ని ఓప్పుకోలేదు. రాముడికి నిజంగానే అంత ప‌వ‌రుందా? ఆయ‌న్ను అన్న వారు ఇలా నామ‌రూపాల్లేకుండా నాశ‌న‌మై పోతారా? అంటే ప్ర‌స్తుతానికైతే అదే నిజ‌మ‌ని నిరూపిత‌మ‌వుతోంది. రామ జ‌న్మ భూమి అయోధ్య‌లో బాబ్రీ మ‌సీదు క‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ సుమారు 5 ల‌క్ష‌ల మంది వ‌ర‌కూ మ‌ర‌ణించి ఉండ‌వ‌చ్చ‌ని ఒక అంచ‌నా.  మొత్తానికి రామ‌జ‌న్మ‌భూమి అన్యాక్రాంత‌మైన 500 ఏళ్ల‌కు ఇప్పుడు ఇక్క‌డ బాల‌రామ ఆల‌యం వెల‌సింది. ఎవ‌రైతే రామ‌జ‌న్మ భూమి అనే ఒకానొక ఉద్య‌మం మొద‌లు పెట్టారో.. వారు ప్ర‌స్తుతం దేశాన్ని అప్ర‌తిహ‌తంగా ఏలుతున్నారు.  అంటే రాముడు లేడ‌ని అన్న వారు ఎలా నాశ‌న‌మై పోతారో.. స‌రిగ్గా రాముడున్నాడు, ఆయ‌న పుట్టుక నిజం.. ఆయ‌న ప‌య‌నం నిజం.. అంత‌క‌న్నా మించి ఆయ‌న అయోధ్య‌లో జ‌న్మించింది నిజం.. అన్న వారిని అంద‌లం ఎక్కిస్తారు. అదే ఆయ‌న ఉనికినే ప్ర‌శ్నార్ధ‌కం చేసిన వారి అంతు చూస్తాడా శ్రీరామ‌చంద్రుడు. ఈ విష‌యం మ‌రోమారు నేపాల్ ఉదంతంతో రుజువైందని అంటున్నారు చాలా మంది.  ఈ మాట  స్వ‌యంగా కేపీశ‌ర్మ ఓలీ అన‌డంతో మ‌ళ్లీ రాముడు కేవ‌లం పౌరాణిక పాత్ర కాదు. అదొక చారిత్ర‌క పాత్ర‌. ఆయ‌న చ‌రిత్ర నిజం. ఆయ‌న అయోధ్య కేంద్రంగా  పాలించింది నిజం. ఆయ‌న పితృవాక్ పాల‌న నిజం ఆయ‌న ఏక‌ప‌త్నీ వ్ర‌తం నిజం ఆయ‌న మాట‌కోసం నిల‌బ‌డ్డం నిజం. మొత్తంగా శ్రీరాముడు ఒక ధ‌ర్మానికి ప్రతీక అన్న మాట నిజం అని మ‌రోమారు రుజువైంద‌ని అంటున్నారు శ్రీరామ భ‌క్తులు.

వైసీపీకి భయమా...బెదురా? షర్మిల సంచలన ట్వీట్

  నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదు. పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే..? ఇది భయమా ? బెదురా ? వాళ్ళకే తెలియాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు రాజారెడ్డి అని నా కొడుకుకి స్వయంగా వైఎస్‌ఆర్ నామకరణం చేశారు.  నాకొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడు.  సీఎం చంద్రబాబు చెప్తే నా కొడుకు వస్తున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  నా కొడుకుని చంద్రబాబు చెప్పాడని  తీసుకువస్తే..మరి ఎవరు చెప్పారని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్‌ఎస్ఎస్ వాదికి మద్దతు ఇచ్చారు? వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నిస్సిగ్గుగా బీజేపీ అభ్యర్థికి జగన్  మద్దతు ఇవ్వడం అవమానకరమని షర్మిల ట్వీట్ చేశారు. అదానీ, రిలయన్స్ వ్యవహారాలను ప్రస్తావిస్తూ షర్మిల విమర్శలు గుప్పించారు. “వైఎస్సార్ మరణం వెనుక రిలయన్స్ కుట్ర ఉందని జగన్ చెప్పాడు. కానీ అదే రిలయన్స్ వారికి రాజ్యసభ సీటు ఇచ్చాడు. అదానీ కోసం గంగవరం పోర్ట్‌ను త్యాగం చేశాడు.  ఐదు ఏళ్ల అధికారంలో బీజేపీ ప్రతీ బిల్లుకు జగన్ మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు ఏ ముఖంతో ఈ మద్దతు ఇస్తున్నారో జగన్ సమాధానం చెప్పాలి,” అని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నిశ్శబ్దంగా ఉండగా, వైసీపీ మాత్రం బీజేపీకి ఓటు వేసిందని ఆమె మండిపడ్డారు. టీడీపీ-జనసేన పొత్తు బహిరంగమని, కానీ జగన్ బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకున్నాడని షర్మిల ఆరోపించారు.

హైదరాబాద్ తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తాం : సీఎం చంద్రబాబు

  ఏపీ అభివృద్ధి కోసం విజన్ కల్పన చేయటంతో పాటు దాన్ని సుసాధ్యం చేసే దిశగా పనిచేయాల్సి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్ తరాల కోసమే విజన్‌ను రూపొందించి అమలు చేస్తున్నామని.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది తన బాధ్యత అని స్పష్టం చేశారు.  జాతీయ స్థాయిలో వికసిత్ భారత్-2047 అమలు చేస్తుంటే రాష్ట్రంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ సిద్దం చేసి అమలు చేస్తున్నామని వెల్లడించారు. శరీరానికి పోషకాలు ఎంత అవసరమో సమాజానికి మంచి పాలసీల అవసరం అంతే ఉందని సీఎం అన్నారు.  వచ్చే 22 ఏళ్లలో మన రాష్ట్రం ఎక్కడ ఉండాలన్న అంశాన్ని నిర్దేశించేందుకే విజన్ రూపొందించి అమలు చేస్తున్నట్టు వివరించారు. అమరావతిలో శుక్రవారం ఓ మీడియా సంస్ధ కాంక్లేవ్‌కు హాజరైన ముఖ్యమంత్రి వేర్వేరు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తీకరించారు. వచ్చే దశాబ్ద కాలంలో ఏపీ ఎలా ఉండబోతోందన్న అంశాన్ని ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..."రాష్ట్రంలోని స్టేక్ హోల్డర్లను భాగస్వాములను చేస్తూ ఈ తరహా కాంక్లేవ్ నిర్వహించడం మంచి పరిణామన్నారు. 25 ఏళ్ల క్రితం భారతీయులకు సరైన గుర్తింపు లేని సమయంలో తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి అన్‌స్టాపబుల్‌గా మారిందని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం చేస్తున్నాం... అభివృద్ధికి అదే తరహాలో నిధులిస్తున్నాం. రాజకీయాలు అవసరమే కానీ...సమాజం గురించే ఆలోచించాలి. రాజకీయాలే ఆలోచించి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగేది కాదు.. విద్యుత్ సంస్కరణలు వచ్చేవి కావు. సీఎంగా భావితరాల కోసం ఆలోచన చేయాలి. 1994లో చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. ఇప్పుడు సంపద సృష్టిస్తున్నాం..పేదలకు అందిస్తున్నాం. ప్రజలందరికీ ప్రయోజనం కలిగేలా మంచి పబ్లిక్ పాలసీలు తీసుకువచ్చాం" అని ముఖ్యమంత్రి అన్నారు.   మూడేళ్లలో అమరావతి ఇన్‌ఫ్రా పనులు-2027 డిసెంబర్‌కు పోలవరం పూర్తి ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశ అభివృద్ధి అన్ స్టాపబుల్ అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో సంక్షోభాలు వస్తున్నాయని.. నేపాల్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్ ఇలా చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. సుస్థిరతకు, నాయకత్వానికి మారుపేరు భారతదేశమేనని అన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా సంస్కరణలు ప్రారంభించి అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించామని అన్నారు. దీనిపై మాట్లాడుతూ.. "విశాఖ, అమరావతి, విజయవాడ, తిరుపతి వంటి నగరాల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాం. సేవల రంగం ద్వారా ఎక్కువ గ్రోత్ సాధించేలా చర్యలు చేపడుతున్నాం. అమరావతిలో ప్రారంభించిన ప్రతి పని రాబోయే మూడేళ్లల్లో పూర్తి అవుతుంది. రూ.50 వేల కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు పూర్తి అవుతాయి.  ప్రధాని చేతుల మీదుగా ఇవి ప్రారంభం అవుతాయి. 2019లో గెలిచి ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తి అయ్యేది. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల  డయాఫ్రం వాల్ దెబ్బతింది. అధికారంలోకి వచ్చాక పోలవరంపై దృష్టి పెట్టాం.  2027 డిసెంబరు నాటికి పోలవరం పూర్తి చేస్తాం. కియా ఫ్యాక్టరీ కోసం గొల్లపల్లి రిజర్వాయరును ఒక్క ఏడాదిలో పూర్తి చేసి నీరిచ్చాం. హంద్రీ-నీవా ప్రాజెక్టు కాల్వల విస్తరణ పనులు కేవలం 100 రోజుల్లో పూర్తి చేసి నీరు ఇచ్చాం." అని సీఎం అన్నారు.  అమరావతి అభివృద్ధి అక్కడితో ఆగదు "అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములే. హైటెక్ సిటి రాక ముందు హైదరాబాద్ లో ఎకరం రూ. 1 లక్ష ఉండేది...ఇప్పుడు రూ.100 కోట్లకు చేరింది. పరిశ్రమలు, రహదారుల లాంటి అభివృద్ధి జరిగితే భూమి విలువ పెరుగుతుంది. అమరావతి రైతుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు. అమరావతి అభివృద్ధి నిరంతరం. అభివృద్ధిని కొంత మేరకే పరిమితం చేస్తే... అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుంది. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా గుంటూరు-విజయవాడ-తెనాలి తదితర ప్రాంతాలు కలిసి మహానగరంగా రూపొందుతుంది.   భూములిచ్చిన వారిని ఆదుకుంటాం. విస్తరణ విషయంలోనూ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుంది. భవిష్యత్ అవసరాల మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తాం. అమరావతిలో 2026 జనవరికి క్వాంటం వ్యాలీ అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్‌కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి. మరికొన్ని రాబోతున్నాయి." అని ముఖ్యమంత్రి తెలిపారు. 

ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా? :కేటీఆర్

  తాము కాంగ్రెస్‌ పార్టీలో చేరలేదని బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్పడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఉద్దేశించి కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.  కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరినప్పటి ఫొటోలను షేర్ చేసి ప్రశ్నించారు. ప్రియమైన రాహుల్‌గాంధీ, ఫొటోల్లోని కాంగ్రెస్ కండువాలను గుర్తు పట్టగలరా? ఢిల్లీలో మీతో కలిసిన ఈ ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మీరు గుర్తించగలరా? ఇప్పుడు కారు గుర్తుపై  గెలిచిన తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఈ ఎమ్మెల్యేలు అందరూ తాము పార్టీ మారలేదని, ఇది కాంగ్రెస్ కండువా కాదని చెబుతున్నారు.  ఇది మీరు అంగీకరిస్తున్నారా? ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా? ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేంటి..? అంటూ కేటీఆర్ రాహుల్ గాంధీని నిలదీశారు. కాగా, ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు కంటే.. ఎమ్మెల్యేల చోరీ కూడా చిన్న నేరం కాదని ట్విట్టర్‌లో రాహుల్‌కు కేటీఆర్ ట్యాగ్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కండువా పార్టీ కప్పుతున్నప్పుడు.. తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతో కండువా కప్పుతున్నారని పేర్కొన్నారు. మేము పార్టీ మారలేదని. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని ఎమ్మెల్యేలు తెలిపారు. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని పేర్కొన్నారు.  3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో వీరి నుంచి వివరణ కోరుతూ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో.. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరెకపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు లిఖితపూర్వకంగా సమాధానాలివ్వగా.. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానాలివ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్‌ను కోరినట్లు సమాచారం  

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందో... లేదో : మంత్రి జూపల్లి

  మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తాను చెప్పలేనని మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అందుకే తాను ప్రజలకు హామీలు ఇవ్వనని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో జూపల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే, మంత్రి  చేసిన ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని చూడాలి మరి. అధికార పార్టీలో మంత్రి మాటల విన్న అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మంత్రి జూపల్లి రెండు రోజులపాటు నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పర్యటించారు. నిర్మల్‌ జిల్లా ఆర్జీయూకేటీలో, గురువారం ఆదిలాబాద్‌ జిల్లాలోని గురుకుల పాఠశాల కళాశాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. విద్యతో పాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలని.. ఆటలు బాగా ఆడాలని ప్రోత్సహించారు.  శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమాలోని ‘‘ఒకటే జననం.. ఒకటే మరణం.. ఒకటే గమనం.. ఒకటే గమ్యం.. గెలుపు పొందే వరకు అలుపులేదు మనకు’’ పాటను తన సెల్‌ఫోన్‌ నుంచి ప్రత్యక్షంగా మంత్రి విద్యార్ధులకు  వినిపించారు.  ఆత్మహత్య చేసుకునేకంటే.. ఎదురుతిరిగి జీవితంలో గెలవాలని ప్రేరణ నింపారు. విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది.

కాంగ్రెస్‌ కామారెడ్డి సభ వాయిదా

  ఈనెల 15న జరగాల్సిన కాంగ్రెస్‌ కామారెడ్డి సభ వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా సభ వాయిదా వేస్తున్నట్లు టీపీసీసీ తెలిపింది. సభ తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో తెలియస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్ గౌడ్‌ ప్రకటించారు.  తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని హస్తం పార్టీ  కామారెడ్డి వేదికగా  బీసీ మహా గర్జన పేరిట బహిరంగ సభకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. సభకు హారజరయ్యే కార్యకర్తలు, నాయకులకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు కూడగట్టుకోవాలని పక్కగా వ్యూహ రచన చేసింది. 

సెభాష్ లోకేష్!.. చంద్రబాబు నోట అరుదైన ప్రశంస

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రోజు రోజుకూ ప్రజానాయకుడిగా, పరిణితి చెందిన రాజకీయ నేతగా ఎదుగుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తున్న పరిస్థితి. అయితే పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నుంచి ప్రశంసలు అందుకోవాలంటే ఇది సరిపోదు.. ఇంతకు మించి ఉండాలి అంటారు పరిశీలకులు.  మామూలుగా చంద్రబాబు ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే.. అది పూర్తయ్యే వరకూ ఆయన నిద్రపోరు.. ఆ పనితో సంబంధం ఉన్నవారిని నిద్రపోనివ్వరు అంటారు. ఎవరిదాకానో ఎందుకు పలు సందర్భాలలో స్వయంగా చంద్రబాబే ఆ విషయం చెప్పారు.   ఇప్పటికే పరిశీలకులు నారా లోకేష్ ను తండ్రికి తగ్గ తనయుడు అనడమే కాకుండా అంతకు మించి.. తండ్రిని మించిన తనయుడు అని కూడా శ్లాఘిస్తున్నారు. ఇదంతా పక్కన పెట్టి విషయానికి వస్తే.. ప్రతిభను చంద్రబాబు గుర్తిస్తారు. ఆ ప్రతిభకు పరీక్ష పెడతారు. ఆ విషయంలో ఆయనకు తన, పర బేధాలుండవు. ఇప్పుడు జరిగిందదే.  అల్లర్లతో అట్టుడికి పోతున్న నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా, సురక్షితంగా స్వరాష్ట్రానికి చేర్చే గురుతర బాధ్యతను చంద్రబాబు లోకేష్ కు అప్పగించారు. చంద్రబాబు అప్పగించిన బాధ్యతను లోకేష్ ఆయనే అచ్చెరువోందేంత సమర్థతతో నిర్వహించారు. నిద్రపోను.. నిద్రపోనివ్వను లాంటి మాటలు లేవు. హడావుడి లేదు, ఆర్భాటం లేదు. పరుగులు పెట్టడం లేదు.. పరుగులు పెట్టించడం లేదు. అమరావతి సెక్రటేరియెట్ లోని ఆర్టీజీఎస్ లో కూర్చుని ఆ పనంతా కనుసైగలతో జరిగగిపోయేలా చేశారు.. చుశారు లోకేష్. అవును ఆర్టీజీఎస్ సెంటర్ నుంచే నేపాల్ లో చిక్కుకుని బిక్కు బిక్కుమం టున్న తెలుగువారిలో భరోసా నింపడంతో పాటు.. సురక్షితంగా స్వరాష్ట్రానికి చేరుతామన్న నమ్మకాన్నీ కలిగించారు. అదే సమయంలో కేంద్రంలోని పెద్దలతో టచ్ లో ఉంటూ.. నేపాల్ నుంచి తెలుగువారిని స్వరాష్ట్రానికి తరలించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. ఆయన కోరిన మీదటే.. కేంద్ర రెండు విమానాలను ఏర్పాటు చేసింది. ఈ లోగా ప్రతి   రెండుగంటలకు ఓ సారి నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారితో మాట్లాడారు. వారి యోగక్షేమాలు కనుక్కున్నారు.వీడియో కాల్స్ కూడా చేశారు. కేంద్రం రెండు విమానాలను ఏర్పాటు చేస్తే అవి నేపాల్ లోని తెలుగువారిని తీసుకుని ఢిల్లీ చేరుకునే సరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక ఛార్టర్డ్ విమానాన్ని సిద్ధంగా ఉంచింది. ఆ విమానంలోనే వారిని ఢిల్లీ నుంచి విశాఖకు, తిరుపతి, కడప జిల్లాలకు చేర్చింది. అక్కడ నుంచి ప్రత్యేక కార్లు, బస్సులు ఏర్పాటు చేసి వారి వారి నివాసాలకు చేరేలా అన్ని ఏర్పాట్లూ లోకేష్ ఒంటి చేత్తో పూర్తి చేశారు.   మొత్తం మీద నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకువచ్చే విషయంలో లోకేష్ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరు అందరినీ మెప్పించింది. అలాగే చంద్రబాబునూ మెప్పించింది. అందుకే సెభాష్ లోకేష్ అంటూ ప్రశంసించడమే కాకుండా చూడమంటే ఏకంగా తీసుకువచ్చేశారు అంటూ ఆనందంతో ప్రశంసించారు.