ఇన్ఫోసిస్ నీలిమ మృతి కేసులో కీలక మలుపులు

ఇన్ఫోసిస్ ఉద్యోగిని నీలిమ అనుమానాస్పద మృతి కేసు పలు కీలక మలుపులు తిరుగుతుంది. నీలిమ చనిపోడానికి ఐదు నిమిషాల ముందు వచ్చిన ఫోన్ నెంబరు ఎవరిదనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నీలిమ భవనంపై నుంచి కిందకు పడగానే తొలుత గమనించిన సెక్యూరిటీ గార్డు రమేష్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నీలిమ మృతిపై గాంధీ డాక్టర్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నీలిమ పది అంతస్థుల మెడ నుంచి కిందపడినట్టు అనిపించటం లేదని డాక్టర్లు అంటున్నారు. అయితే పది అంతస్తుల మేడి నుంచి దూకితే శరీర బాగాలు డామేజ్ అవ్వలి, కాని డాక్టర్లు ఆమెకు తీవ్ర రక్త స్రావం, శరీర బాగాలు డామేజ్ కాలేదని అంటున్నారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు మాట్లాడారు. కాల్ లిస్టును సేకరించామని చెప్పారు. నీలిమ మృతికి ముందు ఎవరెవరితో మాట్లాడిందనే విషయాలపై ఆరా తీశామని చెప్పారు. నీలిమ కేసులో తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. పూర్తిస్థాయిలో పోస్టుమార్టం వివరాలు బయటకు వచ్చాకే అన్నీ వెల్లడిస్తామన్నారు.  

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.