ఇన్ఫోసిస్ నీలిమ మృతి కేసులో కీలక మలుపులు
posted on Aug 3, 2012 @ 12:26PM
ఇన్ఫోసిస్ ఉద్యోగిని నీలిమ అనుమానాస్పద మృతి కేసు పలు కీలక మలుపులు తిరుగుతుంది. నీలిమ చనిపోడానికి ఐదు నిమిషాల ముందు వచ్చిన ఫోన్ నెంబరు ఎవరిదనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నీలిమ భవనంపై నుంచి కిందకు పడగానే తొలుత గమనించిన సెక్యూరిటీ గార్డు రమేష్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నీలిమ మృతిపై గాంధీ డాక్టర్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నీలిమ పది అంతస్థుల మెడ నుంచి కిందపడినట్టు అనిపించటం లేదని డాక్టర్లు అంటున్నారు. అయితే పది అంతస్తుల మేడి నుంచి దూకితే శరీర బాగాలు డామేజ్ అవ్వలి, కాని డాక్టర్లు ఆమెకు తీవ్ర రక్త స్రావం, శరీర బాగాలు డామేజ్ కాలేదని అంటున్నారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు మాట్లాడారు. కాల్ లిస్టును సేకరించామని చెప్పారు. నీలిమ మృతికి ముందు ఎవరెవరితో మాట్లాడిందనే విషయాలపై ఆరా తీశామని చెప్పారు. నీలిమ కేసులో తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. పూర్తిస్థాయిలో పోస్టుమార్టం వివరాలు బయటకు వచ్చాకే అన్నీ వెల్లడిస్తామన్నారు.