పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి పట్టింపులేదు: చంద్రబాబు
posted on Aug 20, 2012 @ 3:40PM
మెరుగైన చికిత్స అందకనే చిన్నారులు మృతి చెందుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఉదయం తిరుపతి రుయా ఆస్పత్రిని సందర్శించిన బాబు చిన్న పిల్లల వార్డులను పరిశీలించారు. ఆస్పత్రి తీరుపై అధికారులపై ఆగ్రహం వ్యక్తపరిచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యంపట్ల ప్రభుత్వానికి పట్టింపులేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలకు విశ్వాసం కల్పించలేకపోతుందన్నారు. పారామెడికల్ సిబ్బందికి జీతాల ఇవ్వలేని పరిస్థితి ఉందని విమర్శించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు, మంచినీళ్లు లేవని చంద్రబాబునాయుడు మండిపడ్డారు.