ఎంట్రీలోనే రాగసుధని జెండే పట్టేశాడా?
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొన్ని నెలలుగా జీ తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తూ విజయవంతంగా సాగుతోంది. మరాఠీ సీరియల్ `తుల ఫఠేరే` ఆధారంగా మర్డర్ మిస్టరీ ఫ్యామిలీ థ్రిల్లర్ గా సాగుతున్న ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా ఆసక్తికరమైన మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతోంది. వెంకట్ శ్రీరామ్ , వర్ష హెచ్ కె ప్రధాన పాత్రల్లో నటించారు. జయలలిత, బెంగళూరు పద్మ, విశ్వమోహన్ , రామ్ జగన్, అనూషా సంతోష్, జ్యోతిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు.