English | Telugu

ఆర్య‌వ‌ర్థ‌న్ చాంబ‌ర్‌ లోకి రాగ‌సుధ‌.. ఏం చేయ‌బోతోంది?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. మ‌రాఠీ సీరియ‌ల్ ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్న ఈ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతూ క్ష‌ణ క్ష‌ణం ఉత్కంఠ‌త‌ని రేకెత్తిస్తోంది. గ‌త జ‌న్మ జ్ఞాప‌కాల‌తో ఆర్య ని వ‌దిలి వెళ్లలేక.. ఆర్య‌పై మ‌న‌సు చావ‌క మ‌రో రూపంలో వ‌చ్చిన ఓ అమ్మాయి క‌థ అంటూ ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. త‌న అక్క హ‌త్య వెన‌కున్న ర‌హ‌స్యాన్ని చేధించే క్ర‌మంలో రాగ‌సుధ అను స‌హాయంతో ఆర్య వ‌ర్థ‌న్ సామ్రాజ్యం లోకి అడుగుపెడుతుంది. ఈ రోజు ఏం జ‌రిగ‌నుంద‌న్న‌ది ఓ సారి చూద్దాం.

అఖిల్ ఈసారి కూడా ఆట‌లో అర‌టిపండేనా?

బిగ్‌బాస్ హ్యూజ్ హిట్ కావ‌డంతో అదే ఊపుతో ఉత్త‌రాదిలో ఓటీటీ వెర్ష‌న్ ని ప్రారంభించారు. అదే ఫార్మాట్ ని ద‌క్షిణాదిలోనూ ఫాలో అయిపోదామ‌ని బిగ్ బాస్ నిర్వాహ‌కులు చేసిన ప్ర‌య‌త్నం పెద్ద‌గా స‌క్సెస్ అయిన‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. తిట్లు, బూతులు, వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌తో బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగులో మ‌రింత దారుణ స్థాయికి ప‌డిపోయింది. హిందీ, త‌మిళంలో స‌క్సెస్ అయినంత‌గా మ‌న ద‌గ్గ‌ర‌ స‌క్సెస్ కాలేద‌నే చెప్పాలి. మొత్తం 17 మందిని ఏర్చి కూర్చి త‌మిళ‌, హిందీ ఓటీటీ వెర్ష‌న్ ల‌కు మించి ర‌చ్చ చేయాల‌ని ప్లాన్ చేశారు కానీ పెద్ద‌గా ఫ‌లితం లేకుండా పోయింది.