English | Telugu
Guppedantha Manasu : శైలేంద్రకి కొత్త ప్లాన్ చెప్పిన దేవయాని.. అతను ఏం చేయనున్నాడు!
Updated : Aug 8, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1147 లో....మహేంద్ర వాళ్ళని అక్కడే ఉండమని దేవయాని అంటుంది. దానికి మహేంద్ర ఒప్పుకోడు.. ఏంటి మహేంద్ర అందరం కలిసి ఉంటే బాగుంటుంది ..ఎందుకు ఇలా చేస్తున్నావని దేవయాని అంటుంది. రిషి వచ్చాక మన జీవితాల్లో వెలుగులు వచ్చాయి.. అందరం కలిసి ఇక్కడే హ్యాపీగా ఉందామని మహేంద్రని ఫణీంద్ర రిక్వెస్ట్ చేస్తాడు. ధరణి కూడా ఇక్కడే ఉండండి మావయ్య అని అంటుంది. అప్పుడే వసుధార, రిషిలు కాలేజీకి రెడీ అయి వస్తారు. అమ్మ వసుధార ఇక్కడే ఉండమంటున్నారని వసుధారతో మహేంద్ర అంటాడు.
లేదు మావయ్య నాకు ఇక్కడ ఉండాలని లేదు.. వెళ్ళిపోదాం సాయంత్రం కాలేజీ నుండి వచ్చాక వెళదామని వసుధార చెప్తుంది. అన్నయ్య ఏం అనుకోకుండి వసుధారకి నేను ఎదురు చెప్పలేనని మహేంద్ర అంటాడు. మరొకవైపు మను దగ్గరికి ఏంజిల్ , అనుపమ వచ్చి.. రిషి, వసుధారలు తిరిగి వచ్చారంటా కదా.. వసు అనుకున్నది చేసిందని ఏంజిల్ అంటుంది. అత్తయ్య మీరు హ్యాపీగా లేరా అని ఏంజిల్ అనగానే.. నీ కంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నానని అనుపమ అంటుంది. అయితే మరి వాళ్ళని చూడాలని లేదా అని అంటుంది. ఉంది కానీ కొన్నింటికి సమాధానం లేదని చెప్పి వెళ్ళిపోతుంది. ఏంటి బావ అత్తయ్య అలా అంటుంది. రిషి నాకు మంచి ఫ్రెండ్. మనం వెళ్లి. చూసి వద్దామని ఏంజిల్ అంటుంది నేను రాను.. నువ్వు వెళ్ళమని మను అనగానే.. నువ్వు వచ్చేవరకు ఇక్కడే ఉంటానని ఏంజిల్ అంటుంది. దాంతో మను చేసేదేమీ లేక పదా వెళదామని అంటాడు.
మరొకవైపు వసుధారతో రంగా వెళ్ళిపోతే ఎక్కడ దొరికిపోతాడోనని శైలేంద్ర టెన్షన్ పడుతుంటాడు. వాళ్ళు ఇక్కడే ఉండాలి. ఆ రంగా గానికి ఆశతో ఇదంతా వదులుకోవడం ఇష్టంలేక నేనే రిషిను అని సెటిల్ అయితే పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం చెయ్యలేం అందుకని నేను చెప్పినట్లు చేయమంటూ శైలేంద్రకి దేవయాని ఒక ప్లాన్ చెప్తుంది. మరొకవైపు రిషి వసుధారలు కాలేజీకి వెళ్తారు. రిషి ఎండీ చైర్ ని ప్రేమగా చూస్తుంటాడు. వాళ్ళ ప్రేమ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. కాలేజీని చూసి వస్తానంటూ రిషి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.