English | Telugu

నాకు మొగుడు వద్దు... దేవుడే ముద్దు


సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోకి సీరియల్ ఆర్టిస్టులను పిలిచింది సుమ. శశిధర్, మేఘనా ఖుషి, భార్గవ్, యాష్మి గౌడా, అమర్, మాధవీ లతా అంతా వచ్చారు. రాగానే అందరికీ అరిసెలు ఇచ్చిన సుమ. ఇక అందరినీ ఒక ప్రశ్న అడిగింది. "ఒక వేళా దేవుడు ప్రత్యక్షమైతే ఎం కోరుకుంటారు " అని. దానికి మేఘవ ఖుషి వెరైటీ ఆన్సర్ ఇచ్చింది.

"దేవుడిని అడిగేస్తాను. ఆయనని నా దగ్గరే ఉండిపొమ్మని..ఎందుకంటే దేవుడు నా దగ్గర ఉంటే అన్నీ నా దగ్గర ఉన్నట్టే కదా" అని చెప్పింది. దాంతో సుమ "తధాస్తు...నీకు పతి దేవుడు దొరుకుతాడు" అని మొగుడు దొరుకుతాడు అని ఆశీర్వదించేసరికి మేఘనా భయపడిపోయింది. "అమ్మో వొద్దు" అనేసింది..మొగుడు వొద్దు అంటుంది ఏమిటా అన్న లెక్కలో చూసారు మిగతావాళ్లంతా. తర్వాత మీరేమని అడుగుతారు దేవుడిని అని సుమ అమర్ ని అడిగింది. "సుమ గారి లాంటి అమ్మాయి వైఫ్ గా వస్తే బాగుండు" అని ఆన్సర్ ఇచ్చేసరికి సుమ నోరెళ్లబెట్టింది. "అదేంటి నేను అరిసెలు ఇస్తే ఆయన బిస్కెట్ ఇచ్చాడు" అంటూ కౌంటర్ వేసింది సుమ. "భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పని ఏమిటి" అని సుమ అడిగేసరికి ఒక స్టూడెంట్ లేచి "నడుము గిల్లొద్దు" అని చెప్పేసరికి సుమ ఒక లుక్కిచ్చింది. "పని మనిషితో క్లోజ్ గా మాట్లాడ్డం" అని మరో లేడీ స్టూడెంట్ ఆన్సర్ ఇచ్చింది. దానికి సుమ "పనిమనిషితోనే కాదు ఏ మనిషితో కూడా మాట్లాడకూడదు" అని సీరియస్ గా ఆన్సర్ ఇచ్చింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.