English | Telugu

షాట్ వేయమన్న శేఖర్ మాస్టర్... ముద్దు పెట్టిన రీతు

సినిమా ట్రైలర్ చూసి సినిమా మీద ఒక అంచనాకి వస్తాం.ఆ తర్వాత రిలీజ్ కోసం రీగర్ గా ఎదురుచూస్తుంటాం. అదే విధంగా ఇప్పుడు బుల్లి తెర షో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్(kiraak boys khiladi girls)కోసం అందరు ఎదురుచూసే పరిస్థితి. తాజాగా ఆ షో కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఒక రేంజ్ లో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో కి ప్రముఖ స్టార్ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్(sekhar master)అండ్ సినీనటి మాజీ జబర్దస్త్ ఫేమ్ అనసూయ(anasuya)లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరకీ తెలుగు నాట ఉన్న క్రేజ్ గురించి అందరకి తెలిసిందే. ఒకరు కొరియోగ్రఫీ లో నెంబర్ వన్. ఇంకొకరు యాక్టింగ్ లో నెంబర్ వన్. అలాగే ప్రస్తుతం ఇద్దరి సినీ కెరీర్ మంచి ఊపు మీద ఉంది. ఇక ప్రముఖ సినీ అండ్ టివి రంగానికి చెందిన నటులు నటీమణులు ఈ షో లో పాల్గొనబోతున్నారు. కాకపోతే అందరు జోడీలుగా పాల్గొని రకరకాల గేమ్స్ ఆడతారు.ప్రోమో చూస్తుంటే ఆ విషయం అర్ధమవుతుంది. అలాగే ఎన్నో వెరైటీ గేమ్స్ తో పాటు వెరైటీ పంచులు కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది.

ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే శేఖర్ మాస్టర్ తో షో లో పాల్గొన్న ఒక కంటెస్ట్ మీ మనసులో ఎవరు లేరా అని అన్నాడు.దాంతో శేఖర్ మాస్టర్ తన మదిలో ఉంది రీతూ అని చెప్పాడు. రీతూ వెంటనే శేఖర్ మాస్టర్ దగ్గరకొచ్చి మాస్టర్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. పైగా చాలా సిన్సియర్ గానే ముద్దు పెట్టింది. దీంతో ప్రోమోనే ఒక రేంజ్ లో ఉంటే ప్రోగ్రాం మొత్తం ఇంకెంత రేంజ్ లో ఉంటుందో అని బుల్లి తెర అభిమానులు మాట్లాడుకుంటున్నారు. రీతూ కొన్ని సినిమాలతో పాటు షోస్ చేసి మంచి పేరే సంపాదించింది. ఇప్పుడు ఈ షో లో కూడా కంటెస్ట్ చేస్తుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.