English | Telugu

రష్మీతో మడతపెట్టిన శేఖర్ మాస్టర్

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమోలో ఇంద్రజని ఆది జానకి గారితో పోల్చాడు. "సెట్ లో ఎవరైనా కొత్తగా వచ్చి ఒక సాంగ్ పాడితే ఎంకరేజ్మెంట్ కోసం ఇంద్రజ గారు ఒక సాంగ్ పాడతారు" అని ఆది చెప్పాడు. "ఆది గారు ఉన్నప్పుడు అసలు పాడదల్చుకోలేదు" అని ఇంద్రజ కౌంటర్ వేసింది. దానికి ఆది మళ్ళీ రివర్స్ కౌంటర్ వేసాడు. "నేనుంటే ఇంద్రజ గారు, లేకుంటే జానకి గారు" అన్నాడు దణ్ణం పెడుతూ. ఆవిడ ఆది డైలాగ్ కి పడీపడీ నవ్వుకుంది. ఇక ఈ ఎపిసోడ్ లో కొత్త సినిమా వాళ్ళు వెర్సెస్ పాత సినిమా వాళ్ళ మధ్య కాంటెస్ట్ నడిచింది. ఇక ఈ షోకి శివమ్ భజే మూవీ నుంచి హీరో హీరోయిన్స్ అశ్విన్, దిగంగన సూర్యవంశీ వచ్చారు. అలాగే కొరియోగ్రాఫర్ శేఖర్ మాష్టర్ వచ్చాడు. "ఆ కుర్చీని మడతపెట్టి" అనే సాంగ్ కి రష్మీతో కలిసి డాన్స్ చేసాడు.

ఇక ఇందులో డాన్స్ కొరియోగ్రాఫ్ చేసిన దిలీప్ మాష్టర్ కి అలాగే డాన్స్ చేసిన వంశికి తన నెక్స్ట్ మూవీలో ఏదో ఒక ఛాన్స్ కచ్చితంగా ఇస్తానని అశ్విన్ ప్రామిస్ చేసాడు. ఇక ఈ ఎపిసోడ్ ప్రోమోని చూసిన నెటిజన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు.పాత సినిమాలే సూపర్. అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు. 100 డేస్ నుంచి 500 డేస్ ఆడిన సినిమాలు ఉండేవి . అప్పట్లో ప్రొడ్యూసర్ కి ఒక వేల్యూ ఉండేది. ఇప్పుడు అంతా ఇష్టం ఐపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.