English | Telugu

పరారీలో రాకీ MD.. అంతా తూచ్ అంటున్న సుమ! 

రాకీ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ ఫ్లాట్‌లను అమ్మడానికి, ప్రజలను అట్ట్రాక్ట్ చేయడానికి సుమతో యాడ్స్ చేయించిన విషయం తెలిసిందే. ఐతే ఇక్కడ ప్లాట్స్ కోసం భారీ మొత్తంలో డబ్బు చెల్లించి చాలా కుటుంబాలు మోసపోయాయని అలాగే రాకీ అవెన్యూ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామయ్య వేణు పరారీలో ఉన్నారని, తన కస్టమర్లకు ఏ మాత్రం స్పందించడం లేదని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో రాఖీ అవెన్యూస్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ చంద్రిక అవంతిక ఫేజ్‌-2 పేరుతో ప్లాట్లు కట్టించి ఇస్తామని తమవద్ద నుంచి సుమారు రూ.16 కోట్లు పైబడి పెట్టుబడిగా డబ్బులు కట్టించుకుని మోసం చేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుమ ఒక పోస్ట్ ని రిలీజ్ చేశారు.

రాకీ అవెన్యూస్‌తో తన అనుబంధాన్ని తెలియజేస్తూ కొన్ని ప్రకటనలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఐతే 2016 నుండి 2018 వరకు జాబ్ లో భాగంగా చేసిన యాడ్స్ అని అవి ఇప్పుడు చెల్లవు అని చెప్పారు సుమ. ప్రస్తుతం ఈ కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఒక పోస్టర్ ని తన ట్విట్టర్ లో ఆమె పోస్ట్ చేశారు. ఐతే ఈ కంపెనీతో లావాదేవీలు చేసుకున్నవారికి న్యాయం చేయాలనీ తాను కోరుతున్నట్లు చెప్పారు. ఎలాంటి ప్రకటన ఐనా కూడా దాన్ని కంఫర్మ్ చేసుకోకుండా, అఫీషియల్ గా నిర్ధారించుకోకుండా ముందుకు అడుగు వేయొద్దంటూ చెప్పారు సుమ. దీనిపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని కూడా అన్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.