English | Telugu

గుప్పెడంత మనసు..పార్ట్ 2 త్వరలో..


బుల్లితెర మీద కార్తీక దీపం ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత గుప్పెడంత మనసు కూడా అదే రేంజ్ మంచి ఫీల్ గుడ్ స్టోరీతో ఆడియన్స్ అలా తన వైపు తిప్పేసుకుంది. కానీ ఇప్పుడు సడెన్ గా ఈ సీరియల్ ని ముగించేస్తున్నారు సీరియల్ మేకర్స్. దీంతో ఆడియన్స్ మాత్రం బాగా ఫీలవుతున్నారు. ఈ టీమ్ మొత్తం వీడియోస్ ని ఫొటోస్ ని షేర్ చేయడం అలాగే కట్ చేసి తినిపించుకోవడం చూసాక ఈ సీరియల్ ఎండ్ ఐపోతోంది అని నమ్మారు ఆడియన్స్. ఇక ఆడియన్స్ కూడా బాగా ఎమోషనల్ అవుతున్నారు. కార్తీక దీపం ఎలా ఐతే పార్ట్ 2 తో వచ్చిందో అలాగే గుప్పెడంత మనసు కూడా పార్ట్ 2 తో రావాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ సీరియల్ ఫాన్స్.. "ప్లీజ్ డైరెక్టర్ గుప్పెడంత మనసు పార్ట్ 2 రావాలి. హీరొ గోల్ , హీరోయిన్ గోల్ చూపించకుండానే ఆపేస్తున్నారు. ఈ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ మీద మాకు సీరియల్ కావాలి. కేక్ కటింగ్ టైములో మీరు అన్నారు కదా పార్ట్ 2 చేద్దాం అని. ఆ మాట నిలబెట్టుకోండి.

ఫ్యాన్స్ వెయిటింగ్ పార్ట్ 2 చూడడానికి. ఎన్నో పనికిమాలిన సీరియల్స్ ఉన్నాయి. ఎండ్ చేయమన్నా చెయ్యట్లేదు. ఈ గుప్పెడంత మనసులో తల్లి, తండ్రితో కొడుకుకు ఉన్న బంధం ఎంతో బాగా చూపించారు. ఎన్ని సంవత్సరాలు ఈ సీరియల్ ప్రసారమైన కూడా చూసేవాళ్ళం...సీరియల్ అప్పుడే ఇపోతోందంటే బాధగా ఉంది. ప్లీజ్ ఎండ్ చేయకండి" అంటూ నెటిజన్స్ తెగ మెసేజెస్ పెడుతున్నారు. మరి ఈ సీరియల్ మేకర్స్ కూడా అభిమానుల కోరిక మేరకు గుప్పెడంత మనసు పార్ట్ 2 ని తీసుకొస్తారేమో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.