English | Telugu

ముఖేష్ గౌడ నిర్మాణంలో కొత్తగా చిత్రం..పేరు మార్చుకున్న రిషి సర్

గుప్పెడంత మనసు హీరో ముఖేష్ గౌడ తన ఫాన్స్ కి లేటెస్ట్ అప్ డేట్ చెప్పాడు. తన సినిమా టైటిల్‌‌ని రివీల్ చేశారు.‘‘ప్రతి కొత్త ప్రారంభం మన మీద మరింత బాధ్యతను పెడుతుంది. వరలక్ష్మీ వ్రతం రోజున.. చాముండేశ్వరి ఆశీర్వాదంతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాము. నా కొత్త సినిమా పేరు ‘తీర్థరూప తాండేయవారిగే’. తెలుగులో ‘ప్రియమైన నాన్నకు’ అనే టైటిల్ తో మీ ముందుకు రాబోతున్నాను. నా మనసంతా భావోద్వేగంతో నిండిపోయింది. దీంతో కొత్త జర్నీ ప్రారంభమైంది. ఇందులో మీరంతా భాగమైనందుకు ధన్యవాదాలు.

జై చాముండేశ్వరి’’ అంటూ తనకి ఎంతో ఇష్టమైన చాముండేశ్వరి దేవి ఆశీస్సులతో తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చేశాడు ముఖేష్ గౌడ. ఈ మూవీ షూటింగ్ కారణంగానే గుప్పెడంత మనసు సీరియల్ లో కొన్ని రోజులు కనిపించలేదు. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాని జై చాముండేశ్వరి ప్రొడక్షన్స్‌లో ముఖేష్ గౌడనే నిర్మిస్తున్నాడు. 2025 సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ మూవీకి సంబంధించి రిషి తన స్క్రీన్ నేమ్ ని రివీల్ చేశారు. తన పేరుని నిహర్ ముఖేష్ బిగా మార్చుకున్నాడు. ఇక మూవీలో కనిపించబోతున్న రిషి సర్ కి అభిమానులంతా కంగ్రాట్స్ చేస్తున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.