English | Telugu

అనసూయను టార్గెట్ చేసిన రష్మీ...


రష్మీతో చిట్ చాట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆడియన్స్ కానీ ఫాన్స్ కానీ రష్మీ-సుధీర్ జోడిని బాగా ఇష్టపడతారు. కానీ ఈ చిట్ చాట్ లో మాత్రం రష్మీ సుధీర్ ప్రస్తావన తేకుండా కాన్వెర్జేషన్ అంతా ప్రదీప్, అనసూయ గురించే మాట్లాడింది. జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకరింగ్ చేయడం కోసమే అనసూయను టార్గెట్ చేసి పంపేశారని అంటున్నారు దానికి మీ సమాధానం ఏంటి అని అడిగేసరికి "అలా చేయలేదు. ఆమె తన ఫిలిమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. ఆ విషయాన్ని ఆమె ఓపెన్ గా చెప్పారు కూడా. ఎవరి ఎవరినో టార్గెట్ చేసి పంపేయడానికి ఇదేమన్నా రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్దమా" అని కామెడీ ఆన్సర్ ఇచ్చింది. అలాగే ఇంకొన్ని ప్రశ్నలకు ఇలా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చింది "సినిమాల్లో నాకు మంచి రోల్స్ రాకపోవడానికి కారణం లక్ లేకపోవడం.

ఇదంతా లక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక యాంకరింగ్లో తనకు పదికి పది మార్కులు ఇచ్చుకుంది శ్రీముఖి, అనసూయకు తొమ్మిదిన్నర మార్కులు ఇచ్చింది. నాకు ప్రదీప్ తో పెయిర్ గా చేయడం ఇష్టం ఏ వయసు వాళ్ళనైనా నవ్విస్తాడు. ప్రదీప్ తో ఫ్రెండ్లీ బాండింగ్ ఉంటుంది. ఆల్ రౌండర్ అతను... ఆన్ కెమెరా కానీ ఆఫ్ కెమెరా కానీ జోక్స్ ఎక్కువగా వేసేది ఆటో రాంప్రసాద్. బాగా విసిగించేది ఆది. ఇక కామెడీ షోస్ కి రోజా జడ్జ్మెంట్ పర్ఫెక్ట్. ఆమెలో కూడా ఆమెకే తెలీని కామెడీ టైమింగ్ ఉంటుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ గారి జడ్జ్మెంట్ బాగుంటుంది. కొట్టాలంటే ఆదిని కొడతా, ముద్దు పెట్టాలంటే ప్రదీప్ కి ముద్దిస్తా, సుధీర్ కి వార్నింగ్ ఇస్తా. అలాగే పార్టీకి వెళ్లాలంటే డిజె టిల్లుతో వెళ్తా, ట్రిప్ ప్రదీప్ తో , షాపింగ్ సుధీర్ తో వెళ్తా. " అంటూ ఇంటరెస్టింగ్ గా చిట్ చాట్ చేసింది రష్మీ.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.