Top Stories

సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేశాడు..ఇక బీజేపీనే రక్షణ : కిషన్‌రెడ్డి

  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులెత్తేశాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పులు ఇచ్చేవారు లేరని, నన్ను ఎవరు నమ్మేవాడు లేడని  చేతులెత్తేశాడని కేంద్ర మంత్రి అన్నారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి స్వ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం.. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, ఒక కుటుంబం బారినపడి ఏ రకంగా బలి అయ్యామో మనకు తెలుసన్నారు. ధనిక రాష్ట్రంగా మొదలైన తెలంగాణ.. లక్షల కోట్లు అప్పుల పాలైందని కిషన్ రెడ్డి అన్నారు.  ఇక గడిచిన ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే  ఆరు గ్యారెంటీల పేరుతో మోసిందన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు, దళితులకు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.  పరిపాలన చేతకాక, హామాలు అమలు చేయలేక కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో చేతులెత్తేసిందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.అవినీతి పాలనతో, దోపిడీ, కుంభకోణాలతో, అహంకారంతో, కుటుంబ పాలనతో తెలంగాణను దెబ్బతీశారో చూశామన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్​ఎస్​ పార్టీ ఏ రకంగా పనిచేసిందో మనం చూశామని చెప్పుకొచ్చారు.  
సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేశాడు..ఇక  బీజేపీనే రక్షణ : కిషన్‌రెడ్డి Publish Date: Jun 22, 2025 6:05PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం : టీపీసీసీ చీఫ్

  స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రేపు జరిగే మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్, ఫోన్ ట్యాపింగ్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన  ట్యాపింగ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయంతోనే ట్యాపింగ్ జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కు గురైన బాధితుల పేర్లను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తక్షణమే బయటపెట్టాలని ఆయన స్పష్టం చేశారు. "ఈ వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని గౌడ్ స్పష్టం చేశారు. ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరూ చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందేనని, దోషులు ఎంతటి వారైనా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. కోట్ల ప్రజాధనాన్ని నీళ్లలో పోసిందని ఆరోపిస్తూ ఆర్థిక దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు చేశారు.  బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ హక్కుల కోసం వెనక్కి తగ్గమని, ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగినప్పటికీ బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా రాజకీయ నేతలు, సినీ తారలు, జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని మండిపడ్డారు. 2022 నుంచి 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయని, ఈ విషయంలో సిట్ ముందు సాక్షిగా వాంగ్మూలం ఇచ్చానని ఆయన తెలిపారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం : టీపీసీసీ చీఫ్ Publish Date: Jun 22, 2025 4:43PM

పోలీసుల అదుపులో జగన్ కారు డ్రైవర్‌

  వైసీపీ అధినేత జగన్ కారు డ్రైవర్‌ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి నల్లపాడు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కారు కింద పడిన వ్యక్తిని గుర్తించారా? ఆ సమాచారాన్ని జగన్‌కు తెలియజేశారా? ప్రమాదం జరిగిన వెంటనే వాహనం ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు? తదితర విషయాలపై జగన్‌ కారు డ్రైవర్‌ నుంచి సమాచారాన్ని పోలీసులు తెలుసుకుంటున్నారు. మరోవైపు జగన్‌ పర్యటనకు సంబంధించి వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయన పర్యటనను ఎవరెవరు వీడియోలు తీశారనే దానిపై ఆరా తీస్తున్నారు.  వారి నుంచి ఫుటేజీని సేకరిస్తున్నారు. కాగా జగన్ పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు టైరు కింద పడి మృతి  చెందిన వీడియో వైరల్ అవుతుంది. ఈ కేసులో A1గా కారు డ్రైవర్ రమణారెడ్డిని, A2గా వైఎస్ జగన్‌ను, A3గా కారు యజమానిని చేర్చాలని పోలీసులు నిర్ణయించారు.ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్‌లో అదనంగా 304 పార్ట్ 2 సెక్షన్ వర్తించే అవకాశం ఉంది. బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. ఎఫ్ఐఆర్‌లో సెక్షన్స్ మార్చి కోర్ట్ మెమో పంపాలని అధికారులు నిర్ణయించారు. 
పోలీసుల అదుపులో జగన్ కారు డ్రైవర్‌ Publish Date: Jun 22, 2025 4:08PM

బసవతారకం ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు.. పాల్గొన్న గవర్నర్‌

  హైదరాబాద్‌‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో  సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆస్పత్రి ఛైర్మన్‌ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర  మాట్లాడారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, మేనేజ్‌మెంట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. క్యాన్సర్‌ వ్యాధితో మరణించిన ఎన్‌టీఆర్‌ సతీమణి బసవతారకం పేరు మీద 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ ఆస్పత్రి.. ఇప్పటివరకు లక్షల మంది రోగులకు వైద్య సేవలు‌ అందించిందని గుర్తుచేశారు.ఎన్టీఆర్ ఐకానిక్ లీడరని, లెజెండరీ యాక్టరని మంత్రి కొనియాడారు. ఈ సందర్బంగా ఆస్పత్రి ఛైర్మన్‌ బాలయ్య మాట్లాడుతు తన తల్లి బసవతారకం కోరిక మేరకు ఈ క్యాన్సర్‌ ఆస్పత్రి స్థాపించటం జరిందని అన్నారు.  క్యాన్సర్‌ పేషెంట్స్‌కు అండగా ఉండటం కోసం ఎంతో మంది దాతలు ఆస్పత్రికి సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనో లేక లాభాలు పొందాలనే ఆశతోనో ఈ ఆస్పత్రిని ప్రారంభించలేదని ఈ సందర్భంగా బాలకృష్ణ చెప్పారు. తనకు దామోదర రాజ నరసింహ పేరుతో ఒక సినిమా చేయాలని ఉందన్నారు. 110 పడకలతో మొదలై.. నేడు దేశంలోనే అత్యున్నత ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే 1000 పడకలతో అమరావతిలోనూ క్యాన్సర్‌ వైద్యశాల ఏర్పాటు చేస్తాం. మొదటి దశలో 300 పడకలతో ప్రారంభిస్తాం. మాకు అన్నివిధాలుగా సహకారం అందిస్తోన్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు’’ అని బాలయ్య అన్నారు.  బాలకృష్ణ దాతృత్వం కలిగిన నటుడు, నేత. పేదలకు మంచి వైద్యం అందించాలనేదే బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి లక్ష్యమని గవర్నర్ జిష్ణుదేవ్ అన్నారు . రానున్న కాలంలోనూ పేదలకు మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రతి ఏటా 50 నుంచి 55 వేల మంది కొత్తగా క్యాన్సర్‌ బారిన పడుతున్నారని మంత్రి రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొబైల్ క్యాన్సర్‌ స్క్రీనింగ్ యూనిట్లను ప్రారంభించబోతున్నామని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో క్యాన్సర్‌ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. త్వరలోనే వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, క్యాన్సర్‌ స్క్రీనింగ్, డయాగ్నొస్టిక్‌, డే కేర్ కీమోథెరపి, పాలియేటివ్ కేర్ వంటి సేవలన్నీ ఈ సెంటర్లలో‌ అందిస్తామని అన్నారు.  
బసవతారకం ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు.. పాల్గొన్న గవర్నర్‌ Publish Date: Jun 22, 2025 3:08PM

విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే?

  టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై గిరిజన సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాక్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదని.. అక్కడి ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం వాళ్లే మీద ఎటాక్ చేస్తారన్నారు. కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే..500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా, పని లేకుండా కొట్లాడుతారన్నారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి’ అని అన్నారు. విజయ్‌ దేవరకొండ ఆదివాసులను అవమానించేలా మాట్లాడారని ట్రైబల్స్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ బాపూనగర్‌ అధ్యక్షుడు కిషన్‌రాజ్‌ చౌహాన్‌ కిషన్ సహా గిరిజన సంఘాలు తప్పుబట్టాయి.
విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే? Publish Date: Jun 22, 2025 2:38PM

పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక పురోగతి

  జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ పురోగతి సాధించింది. టెర్రరిస్టులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పర్వీజ్ అహ్మద్, బషీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హిల్ పార్క్‌కు చెందిన  బషీర్  అహ్మద్ ఉగ్రవాదులకు సాయం చేశారని ఎన్ఐఏ తెలిపింది. ఈ ఘటనలో లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు పాక్ ఉగ్రవాదుల హస్తమున్నట్లు ధ్రువీకరించింది.  అరెస్టు చేసిన ఇద్దరు నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)లోని సెక్షన్ 19 (ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించినందుకు శిక్ష) కింద కేసు నమోదు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.ఏప్రిల్ 22న పహల్గాంలోని ప్రముఖ ప్రాంతమైన బైసరన్‌ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టి పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.   
పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక పురోగతి Publish Date: Jun 22, 2025 12:31PM

సత్తెనపల్లిలో సింగయ్యని తొక్కించింది జగన్ కారే

    మాజీ సీఎం జగన్ ఇటీవల గుంటూరు జిల్లా సత్తెనపల్లి పర్యటనలో రోడ్డు సింగయ్య అనే వ్యక్తి మృతి షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.  సింగయ్య తొలుత జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని మృతి చెందాడని భావించారు. అయితే, జగన్ కారే స్వయంగా సింగయ్య మెడపై నుంచి వెళ్లిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  సింగయ్యను ఢీకొట్టింది సాక్షాత్తూ జగన్ ప్రయాణించిన వాహనమేనని న్యూస్ రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.ఈ క్రమంలో పోలీసులకు కీలకమైన వీడియో ఆధారం లభించింది. జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద ఓ వ్యక్తి పడి నలిగిపోతున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.  వీడియోలో జగన్ కారు పైనుంచి వైసీపీ పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా, అదే సమయంలో ఓ కార్యకర్త (సింగయ్య) కారు టైర్ల కింద పడి నలిగిపోవడం స్పష్టంగా రికార్డయింది. మరో వీడియోలో, కారు కింద వృద్ధుడు పడినట్టు స్థానికులు కేకలు వేస్తున్నా, వాహనాన్ని ఆపకుండా ముందుకు పోనిచ్చినట్టు కనిపించింది. జగన్ కాన్వాయ్ వాహనం కాకుండా వేరే వాహనం తగిలి ప్రమాదంలో సింగయ్య చనిపోయాడు గతంలో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్  తెలిపారు. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగయ్య మృతికి కారణమైన వారిపై, ముఖ్యంగా జగన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి దారుణ ఘటన జరిగినా, తన కాన్వాయ్ కారణంగా సొంత పార్టీ కార్యకర్త మరణిస్తే కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడంపై జగన్ తీరును పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
 సత్తెనపల్లిలో సింగయ్యని తొక్కించింది జగన్ కారే Publish Date: Jun 22, 2025 12:02PM

సోనియా గాంధీ..ఇరాన్ వైపు ఎందుకున్న‌ట్టు ఆమె క్రిష్టియ‌న్ క‌దా?

  కాంగ్రెస్ ని బేసిగ్గా ఖాన్.. గ్రెస్ అని అంటారు. ఎందుకంటే ఈ పార్టీ తొలి  నుంచి ముస్లిం ప్రీతి  పాత్ర‌మైన పార్టీగానే పేరు సాధిస్తూ వ‌చ్చింద‌ని చెబుతారు. ఇదంతా ఇలా ఉంటే సోనియా గాంధీ ఫ‌క్తు క్రిష్టియ‌న్. ఒక వేళ ఆమె ఇరాన్- ఇజ్రాయెల్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంటే స‌పోర్ట్ చేయాల్సింది ఇజ్రాయెల్ కి. కార‌ణం ఆమె పాటించే క్రైస్త‌వం పుట్టిందే ఇజ్రాయెల్ లోని బెత్లెహామ్ లో. బెత్లెహామ్ జెరూస‌లేమ్ కి ద‌క్షిణంగా ప‌ది కిలోమీట‌ర్ల దూరంలో ఉండే ఒకానొక చిన్న ప‌ట్ట‌ణం. బైబిల్ ప్ర‌కారం.. ఏసు ఒక తొట్టెలో ఇక్క‌డ మ‌రియా జోసెఫ్ ల కుమారుడిగా జ‌న్మించాడు. ఇక్క‌డి చ‌ర్చ్ ఆఫ్ నేటివిటీని ఏసు జ‌న్మ‌స్త‌లంగా భావిస్తారు.మీరు కావాలంటే చూడండి.. భార‌త్ లోని అత్య‌దిక క్రైస్త‌వులు.. ఇరాన్ వైపా ఇజ్రాయెల్ వైపా అంటే తాము ఇజ్రాయెల్ వైపేనంటారు.  కార‌ణం ఇజ్రాయెలే క్రైస్త‌వ జ‌న్మ‌స్థ‌లి  కాబ‌ట్టి వారి అభిమానం అలా ఉంటుంది.  కానీ ఇక్క‌డ చూస్తే సోనియాగాంధీ ఆచారం పాటించ‌డానికి క్రైస్త‌వం పాటిస్తారు. త‌న కుమార్తెను సైతం ఒక క్రైస్త‌వుడైన రాబ‌ర్ట్ వాద్రాకిచ్చి పెళ్లి చేశారు. కానీ ఇరాన్ వైపు వంత పాడుతున్నారు. బేసిగ్గా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని అర్ధం చేసుకోద‌లిస్తే.. ఇక్క‌డేం క‌నిపిస్తుందంటే ఇరాన్ ద‌గ్గ‌ర అణు శ‌క్తి క‌రెక్టు కాదు. కార‌ణం ఆ నిల్వ‌ల  కార‌ణంగా హ‌మాస్, హిజ్బుల్లా త‌దిత‌ర ఇస్లామిక్ సంస్థ‌ల చేతుల్లోకి ఈ అణు శ‌క్తి మొత్తం వెళ్తుంది. గ‌తంలో ఇదే పాకిస్తాన్ అణు దేశ‌మైన‌పుడు. ఆ దేశ అణు శాస్త్ర‌వేత్త సుల్తాన్ బ‌షీరుద్దీన్.. లాడెన్ కి అణు సాంకేతిక ప‌రిజ్ఞానం ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఈ విష‌యంపై ఎఫ్ బీ ఐ కూడా సీరియ‌స్ అయితే.. ఐఎస్ఐ అత‌డ్ని విచారించ‌డ‌మే కాదు అప్ప‌ట్లో అత‌డి ప‌ద‌వి నుంచి కూడా తొల‌గించారు.అందుకే ఇజ్రాయెలీ మొస్సాద్ ఇరాన్ కి సంబంధించిన అణు శాస్త్ర‌వేత్త‌ల‌ను వ‌రుస బెట్టి హ‌తం చేస్తూ వ‌చ్చింది. ఆప‌రేష‌న్ నార్నియా పేరిట 2022 నాటి నుంచి వీరిపై టార్గెట్ పెడుతూ వ‌స్తోంది.  తాజా యుద్ధంలో  కూడా ఇరాన్ అణు కేంద్రాల‌పై బాంబులు వేయ‌డం మాత్ర‌మే కాకుండా అణు శాస్త్ర‌వేత్త‌ల‌ను ఇప్ప‌టి  వ‌ర‌కూ చాలా మందిని హ‌త‌మార్చింది. ఇదంతా ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కార‌మే ఇజ్రాయెల్ చేస్తోంది. దీన్ని అర్ధం చేసుకోకుండా ఇరాన్ వైపు సోనియాగాంధీ ఉండ‌ట‌మేంట‌న్న‌ది చాలా మందికి అర్ధం  కాని  ప్ర‌శ్న‌.1979 వ‌ర‌కూ ఇరాన్, ఇజ్రాయెల్ మిత్ర దేశాలే. ఎప్పుడైతే.. ఇరాన్ ఇస్లామిక్ రెవ‌ల్యూష‌న్ ప్రకారం వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లైందో అప్ప‌టి నుంచి.. ఇరాన్ మ‌త‌ప‌ర‌మైన విధానాలు పాటిస్తూ వ‌చ్చింది. లెబ‌నాన్ కి దాని ఉగ్ర సంస్థ అయిన హిజ్బుల్లాకు నిధులు, ఆయుధాలు ఇవ్వ‌డంతో పాటు ఈ తీవ్ర‌వాదుల‌కు శిక్ష‌ణ కూడా ఇవ్వ‌డం  మొద‌లైంది. ఇక హామాస్ సంగ‌తి స‌రే స‌రి. ఇరానియ‌న్ ఇస్లామిస్టులు హ‌మాస్ కి వీరాభిమానులు. ఒక వేళ ఇజ్రాయెల్ వీరిపై దాడులు చేయ‌కుంటే..  ఈ దేశం ఉనికి ఇక్క‌డి క్రైస్త‌వం మొత్తం మ‌ట్టి కొట్టుకుపోతుంది. క్రీస్తు పుట్టిన ఆన‌వాళ్ల‌ను హ‌మాస్ నామ‌రూపాల్లేకుండా చేస్తుంది.అలాంటి త‌న జ‌న్మ‌త‌హ వ‌చ్చిన క్రైస్త‌వాన్ని వ‌దిలి.. ఇరాన్ వైపు సోనియా నిలుస్తాన‌ని అన‌డంలో అర్ధ‌మేంటి? అన్న‌దెవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. దానికి తోడు ఇజ్రాయెల్ ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌న‌కు ఎంతో సాంకేతిక స‌హ‌కారం అందిస్తోంది. మొన్న‌టి ఆప‌రేష‌న్ సిందూర్  విష‌యంలో.. స్కై స్ట్రైక‌ర్లను మ‌నం అంత విజ‌య‌వంతంగా ప్ర‌యోగించామంటే అందుకు కార‌ణం ఇజ్రాయెల్ ఆయుధ సాంకేతిక ప‌రిజ్ఞాన‌మే. మ‌నం సంప్ర‌దాయంగా ఇజ్రాయెల్ వైపు ఉంటూ వ‌స్తున్నాం. కార‌ణం మ‌నం ఇస్లామిక్ ఉగ్ర‌వాదానికి విప‌రీత‌మైన బాధితులం. కానీ సోనియా చూస్తే తాము ఇరాన్ వైపే ఉంటామ‌న‌డంలో అర్ధ‌మేంటి? అంటే ఇస్లామిక్ తీవ్ర‌వాదానికి కొమ్ము కాస్తామ‌నా? అన్న‌ది త‌మ‌కు అర్ధం కావ‌డం లేదంటున్నారు చాలా మంది.  
సోనియా గాంధీ..ఇరాన్ వైపు ఎందుకున్న‌ట్టు ఆమె క్రిష్టియ‌న్ క‌దా? Publish Date: Jun 22, 2025 11:33AM

ఓరినాయ‌నో..ట్రంప్‌కి నోబుల్ శాంతి బ‌హుమ‌తా?

  ఈ ప్ర‌పంచానికి ఏదో అయ్యింది. త‌న చేతుల‌కు ఇన్నేసి  ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను అంటించుకుంటోన్న ట్రంప్ ని ఏకంగా నోబుల్ శాంతి బ‌హుమ‌తికి అది కూడా పాకిస్థాన్న లాంటి ఉగ్ర పిశాచ దేశం  ప్ర‌తిపాదించ‌డం అంటే. ఈ క‌లియుగం దాదాపు అంతానికొచ్చేసిన‌ట్టేనా. అంటే అవున‌నే తెలుస్తోంది.మొన్నంటే మొన్న యూఎస్ జ‌న‌ర‌ల్ పాక్ జ‌న‌ర‌ల్ మునీర్‌ గురించి మాట్లాడుతూ.. ఆయ‌న ఉగ్ర‌వాద నిరోధంలో కీల‌క పాత్ర పోషించార‌న‌డం ఎలాంటిదో.. ఇప్పుడు ట్రంప్ ప్ర‌పంచ యుద్ధ వాతావ‌ర‌ణం కంట్రోల్ చేస్తున్నార‌ని పాక్  కామెంట్ చేయ‌డం కూడా స‌రిగ్గా అలాంటిదేన‌ని అంటారు కొంద‌రు అంత‌ర్జాతీయ దౌత్య వ్యాపారాల నిపుణులు.మునీర్ ఎంత‌టి ఉగ్ర వ్య‌తిరేఖో, ట్రంప్ కూడా అంతటి యుద్ధ వ్య‌తిరేకి, శాంతి  పిపాసిగా చూడాల్సి వ‌స్తుంద‌ని అంటారు వీరంతా.  కార‌ణ‌మేంటంటే మొన్నంటే మొన్న జీ7 నుంచి వెళ్తూ వెళ్తూ ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మెక్రాన్  ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబుతూ.. కాల్పుల విర‌మ‌ణ కాదు అంత‌క‌న్నా మించి జ‌ర‌గ‌బోతుంద‌ని అన్న ట్రంప్ కి నోబుల్ శాంతి బ‌హుమ‌తా? ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్ వాసులంతా త‌మ త‌మ ఇళ్ల‌ను వ‌దిలి వెళ్లాల్సిందేన‌ని సూచించిన వ్య‌క్తికి నోబుల్ శాంతి బ‌హుమ‌తా? ఇప్ప‌టికే ప‌శ్చిమాశియాకి త‌న యుద్ధ నౌక‌ల‌ను త‌ర‌లించ‌డంతో పాటు భారీ ఎత్తున బంక‌ర్ బ‌స్ట‌ర్ బాంబుల‌ను త‌ర‌లించ‌మ‌ని ఆదేశించిన వ్య‌క్తికి నోబుల్ శాంతి బ‌హుమ‌తా? ర‌ష్యాతో ఉక్రెయిన్ యుద్దంలో ఉండ‌గానే అరుదైన ఖ‌నిజ నిల్వ‌లు త‌మ‌కు ద‌క్కేలా ఒప్పందాలు చేసుకున్న బేహారి ట్రంప్ కి శాంతి బ‌హుమ‌తా? తాము 85 కోట్ల రివార్డు ప్ర‌క‌టించిన హ‌ఫీజ్ స‌యీద్.. అక్క‌డ త‌న కొడుకు త‌ల్హాతో స‌హా ఉగ్ర విధ్వంస‌కాండ చేస్తుంటే.. అత‌డికి అత‌డి కొడుక్కీ పాక్ సైన్యం పెద్ద ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తుంటే.. ఉగ్ర‌వాదుల మ‌ర‌ణాల స‌మ‌యంలో సైనికాధికారులు వెళ్లి మ‌రీ వారి మృత‌దేహాల‌కు జాతీయ జెండా క‌ప్పి వ‌స్తుంటే.. సుల్తాన‌న్ బ‌షీరుద్దీన్ అనే ఒక అణు ఉగ్ర‌వాది  కొడుకు ఏకంగా  ఆ దేశ డీజీఐఎస్పీఆర్ గా  సైన్యంలో అత్యంత పెద్ద హోదాలో ఉంటే..  ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉగ్ర అరాచ‌కాల‌కు కేంద్ర‌మై చేతినిండా ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటుకున్న పాక్ ఏమిటీ? అంత‌క‌న్నా  ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటించుకుంటోన్న ట్రంప్ కి నోబుల్ శాంతి బ‌హుమ‌తి కి సిఫార్సు చేయ‌డ‌మేంటి? అది కూడా మునీర్ కి ట్రంప్ విందు ఇచ్చిన మూడు రోజుల త‌ర్వాత పాక్ నుంచి ఈ ప్ర‌క‌ట‌న రావ‌డ‌మేంటి? అయితే ఇక్క‌డ మునీర్ కే ఇంత ప్ర‌యారిటీ ఏంట‌ని చూస్తే.. డ‌బ‌ల్యూఎల్ఎఫ్ వంటి త‌న  కుటుంబ సంస్థ‌లో పాకిస్తాన్నే  ఏకంగా తాక‌ట్టు పెట్టేందుకు ఆయ‌న ద‌గ్గ‌రుండి ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేయించ‌డం వ‌ల్లే.. ఇదంతా జ‌రుగుతున్న‌ట్టు ఒక అంచ‌నా. లేకుంటే ఆప‌రేష‌న్ సిందూర్ లో వార్ ప్లాన్స్ లేవు ఓన్లీ ప్రేయ‌ర్సే అని చేతులెత్తేసిన మునీర్ కి.. యూఎస్ ఆర్మీ 250వ పెరెడ్ కి అందుకే పిలిచిన‌ట్టుగా ఒక స‌మాచారం. అంతే కాదు మునీర్ కి పాక్ చ‌రిత్ర‌లోనే  రెండో సారి  ఫీల్డ్ మార్ష‌ల్ హోదా ర‌ప్పించ‌డంలోనూ ట్రంప్ పాత్ర ఉన్న‌ట్టు తెలుస్తోంది. అలాంటి మునీర్ ఏం చేస్తాడు.. భార‌త్ పైకి ఉగ్ర‌వాదుల‌ను ప్రేరేపించేలా కామెంట్లు చేస్తాడు. ఆ త‌ర్వాత వారు.. పహెల్గాం వంటి దాడుల‌కు తెగ‌బ‌డ‌తారు. ఇక ఐఎంఎఫ్, వ‌ర‌ల్డ్ బ్యాంక్ నుంచి భారీ ఎత్తున ప్యాకేజీలు పాక్ కి రావ‌డంలోనూ ట్రంప్ పాత్ర బ‌లంగా ఉంది. ఈనిధుల్లోని కొంత మొత్తాల‌ను మ‌సూద్ అజ‌ర్ వంటి  ఉగ్ర‌నాయ‌కుల‌కు న‌ష్ట‌ప‌రిహారం కింద ఇస్తుంది  పాక్. మొన్నంటే మొన్న ప‌హెల్గాం సూత్ర‌ధారి క‌సూరీని ఐక్య‌రాజ్య స‌మితి ఉగ్ర‌వాద జాబితాలో చేర్చితే.. అదో గ‌ర్వ‌కార‌ణంగా అత‌డు ప‌బ్లిగ్గా రోడ్ల మీద తిరుగుతూ కామెంట్లు చేస్తుంటే పాక్  పిన్ డ్రాప్ సైలెన్స్. అలాంటి  పాకిస్థాన్ చేసే ప్ర‌తి ఉగ్ర చ‌ర్య‌నూ ఖండించాల్సింది పోయి విందులూ వినోదాలు గౌర‌వాలు ప‌ద‌వులతో పాటు నిధులు ఇప్పిస్తోంది ట్రంప్ స‌ర్కార్.  ఈ మొత్తం వ్య‌వ‌హారంతో పాటు చైనాకి ప్ర‌స్తుతం ఎంతో ద‌గ్గ‌ర‌గా ఉన్న  పాక్ ద్వారా ట్రంప్ ప‌రిపాల‌న మ‌రింత‌గా ఏదో ఆశిస్తున్న‌ట్టుగా భావిస్తున్నారు. దీంతో ఈ సంబంధ బాంధ‌వ్యాలు మ‌రింత‌గా బ‌ల‌ప‌డేలా ఈ రెండు దేశాలు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోందని అంచనా వేస్తున్నారు. తొలి ట్రంప్ పాల‌న ఇదే పాకిస్థాన్ కి హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. మీ దేశంలోని ఉగ్ర‌వాదాన్ని మీరు క‌ట్ట‌డి చేయ‌కుంటే నిధులివ్వ‌మ‌ని ఖ‌రాకండిగా చెప్పారు కూడా. అదే  సెకండ్ ట‌ర్మ్ వ‌చ్చేలోగా.. పాక్ చైనాకు మ‌రింత ద‌గ్గ‌ర కావ‌డంతో.. ఇదిగో దాన్ని బుజ్జగించి.. చైనాను దారికి తెచ్చుకోవ‌డంలో భాగంగా ట్రంప్ ఇటు మునీర్ ద్వారా త‌మ సంస్థ‌ల్లో పాక్ ని ఇన్వాల్వ్ చేయ‌డం.. అటు అత‌డి ద్వారా ఇటు భార‌త్, చైనాల‌కు ఏక కాలంలో చెక్ పెట్టేలా అడుగులు వేయ‌డం వంటివి జ‌రుగుతున్న‌ట్టు భావిస్తున్నారు నిపుణులు.అయితే ఇక్క‌డ కొస‌మెరుపు ఏంటంటే ఖ‌మైనీ అంత‌మే ధ్యేయంగా సాగుతున్న ఇజ్రాయెల్ కి ఇంత స‌పోర్ట్ చేస్తూ.. ఇదంతా శాంతి కోసం చేస్తున్న  య‌త్న‌మ‌ని.. త‌న‌లాంటి శాంతి  కాముకుల‌కు నోబుల్ శాంతి బ‌హుమ‌తి రాద‌ని ఆయ‌న‌కు ఆయ‌న రివ‌ర్స్ స్టేట్ మెంట్ ఇచ్చుకోవ‌డం ఏదైతే ఉందో.. అది ట్రంప్ కి తెలిసినంత మ‌రెవ‌రికీ తెలీద‌ని చెప్పాలంటారు దౌత్య‌నిపుణులు.
ఓరినాయ‌నో..ట్రంప్‌కి  నోబుల్ శాంతి బ‌హుమ‌తా? Publish Date: Jun 22, 2025 11:21AM

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అండ్ కోకి.. రప్పా రప్పా మొద‌లైన‌ట్టేనా?

  ట్యాపింగ్ వ్య‌వ‌హారం  కేసీఆర్ అండ్ కోని మ‌రింతగా వెంటాడేలా తెలుస్తోంది. రీసెంట్ గా ప్ర‌ణీత్ రావును విచారించింది సిట్. ఆరు వంద‌ల మంది ప్రొఫైల్స్ ఎలా త‌యారు చేశారు. వారి  ఫోన్లు విని ఏం చేశారు? ఆ స‌మాచారం ఎక్క‌డికి చేర‌వేసేవారు?లాంటి ప్ర‌శ్న‌ల‌తో ప‌లు వివ‌రాల‌ను సేక‌రించారు. అయితే వీటితో సోమ‌వారం ప్ర‌భాక‌ర్ రావును మ‌రింత‌గా విచారించ‌నున్నారు. ప్ర‌భాక‌ర్ రావు నుంచి ఎలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం  రాబ‌ట్టాల్సి ఉందో వాటికి అవ‌స‌ర‌మైన ప్ర‌శ్న‌లు వేసి ప్ర‌ణీత్ నుంచి స‌మాధానాలు రాబ‌ట్టారు అధికారులు. మావోయిస్టుల‌తో సంబంధం లేక పోయిన వారిని  కూడా ఈ కోవ‌లోకి ఎలా తెచ్చారు? అందుకు మీరు పాటించిన ప్ర‌మాణికాలేంట‌ని  కూడా  ప్ర‌శ్నించారు. మొత్తానికి ఐద‌వ సారి సిట్ అధికారుల ముందు హాజ‌రైన ప్ర‌ణీత్ రావును ఐదు గంట‌ల మేర  ప్ర‌శ్నించారు.  ప్ర‌ణీత్ ఇచ్చిన స‌మాధానాల‌ను అనుస‌రించి ప్ర‌భాక‌ర్ రావును సోమ‌వంరం ప్ర‌శ్నించ‌నున్నారు. రివ్యూ క‌మిటీ ఆమోదం, త‌న‌పై ఉన్న ఇత‌ర ఉన్న‌తాధికారుల సూచ‌న‌ల మేర‌కే తాను ప‌ని చేశాన‌ని అన్నారు ప్ర‌భాక‌ర‌రావు, దీంతో నాటి రివ్యూ క‌మిటీ అధికారుల వివ‌రాలు కూడా బ‌య‌ట‌కు లాగి త‌ద్వారా వారిని కూడా విచారించ‌నుంది సిట్. ఇప్ప‌టికే 15 మంది బాధితుల‌ను విచారించిన సిట్.. ఆపై వారి నుంచి తీసుకున్న వివ‌రాల‌తోనూ ప్ర‌భాక‌ర్ రావును విచారించ‌నుంది. గ‌త పాల‌కుల ఆదేశాల మేరకే ప్ర‌భాక‌ర్ రావు ఇదంతా చేసిన‌ట్టు చెబుతున్నా.. కేసీఆర్ కి ఇంకా నోటీసులు ఎందుకివ్వ‌లేదో చెప్పాల‌ని అడిగారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మ‌క్క‌య్యింద‌ని ఇక్క‌డే మీకు అర్ధం కావ‌డం లేదా? అని  ప్ర‌శ్నించారాయ‌న‌.  మొద‌ట ప్ర‌భాక‌ర్ రావుకు ఇచ్చే ఆ రాచ‌మ‌ర్యాద‌ల‌ను త‌గ్గించాల‌ని  కూడా  డిమాండ్ చేశారాయ‌న‌.  
ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అండ్ కోకి.. రప్పా రప్పా మొద‌లైన‌ట్టేనా? Publish Date: Jun 22, 2025 11:06AM

వివేకా హత్యకేసు నిందితుడు పోలీసులకు ఫిర్యాదు...చంపాలని చూస్తున్నారు

  కడప ఎంపీ అవినాష్ రెడ్డి మనుషులు తనను వెంబడించారని వివేకా హత్య కేసులోని ఎం -2 నిందితుడు సునీల్ యాదవ్ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ  ఫిర్యాదు మేరకు  సునీల్ యాదవ్ పెళ్లి రోజు కావడంతో క్రిష్ణుడి గుడికి వెళ్లి  అక్కడి నుంచి తన వాహనంలో ఇంటికి వస్తున్న సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులైన లోకేశ్వర్ రెడ్డి, పవన్ కుమార్ (వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ )లతోపాటు మరో ఇరువురు వాహనంలో వెంబడించారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. తన వాహనం ముందు వెళ్తుంటే దాన్ని అనుసరిస్తూ మరో వాహనం వస్తూ ఉండడం గమనించానని తెలిపారు .ఈ వాహనంలో లోకేశ్వర్ రెడ్డి పవన్ కుమార్ ల ను గుర్తించినట్లు పోలీసులకు తెలిపారు.  తనకు ప్రాణం ఉందని పులివెందుల అర్బన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే హత్య సినిమాకు సంబంధించి కొన్ని వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది .ఆ సమయంలో పవన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారించారు. గతంలో కూడా తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు సునీల్ యాదవ్ ఫిర్యాదు చేయడం జరిగింది. తాజాగా  జరిగిన సంఘటన నేపథ్యంలో మరో సారి తనకు ప్రాణహాని  ఉందని సునీల్ యాదవ్  ఫిర్యాదు చేశారు .ఈ ఫిర్యాదు పై పోలీసులు విచారణలో చేయనున్నట్లు సమాచారం.
వివేకా హత్యకేసు నిందితుడు  పోలీసులకు ఫిర్యాదు...చంపాలని చూస్తున్నారు Publish Date: Jun 22, 2025 10:50AM

ఆ స్థలం అహోబిలం మఠందే

  నెల్లూరు రూరల్ పరిధి పరిధిలోని కనుపర్తిపాడు గ్రామం 295 సర్వే నెంబర్ 1.80 ఎకరాల స్థలానికి సంబంధించి తమకు 1869 నుంచి హక్కులు ఉన్నాయని అహోబిలం మఠం కార్యదర్శి కేసి వరదరాజన్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించి తాము ప్రతి ఏడాది  కిస్తీలు కూడా చెల్లించామన్నారు.  2007 సంవత్సరంలో ఈ పొలం అన్యాక్రాంతమైందని తర్వాత ఆదాల కుటుంబ సభ్యుల చేతికి వెళ్లిందన్నారు. ఈ భూమి అహోబిలం పీఠం సంబంధించి నరసింహ స్వామికి చెందినది. దీనిపై మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి చుట్టూ అనేకసార్లు తిరిగినా న్యాయం చేయలేదన్నారు. రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో విచారించి పీఠానికి అన్ని హక్కులు ఉన్నాయని తేల్చారన్నారు. నరసింహ స్వామి భూమి ఆయనకే దక్కాలన్నారు.  
 ఆ స్థలం అహోబిలం మఠందే  Publish Date: Jun 22, 2025 10:41AM

తెలంగాణలో స్థానిక ఎన్నికలు.. ఇప్పట్లో లేనట్లే ?

    ఇదిగో..అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇక ఇప్పట్లో లేనట్లేనా ? అంటే, అంతే అంటున్నారు, విశ్లేషకులు. ఏదో జరగరానిది జరిగితే ఏమో కానీ, లేదంటే, స్థానిక ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి స్థానిక సంస్థల గడవు ముగిసి ఇంచుమించుగా సంవత్సరం పైనే అయింది. రాష్ట్రంలో2019లో చివరిసారిగా, విడతల వారీగా, మూడు నాలుగు నెలలు పాటు స్థానిక సంస్థల ఎన్నికలు  జరిగాయి. ఆ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌ల పదవీకాలం గత సంవత్సరం (2024) ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసింది. అలాగే,ఎంపీటీసీ, ఎంపీపీల పదవీకాలం జూలై 3న, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్ల పదవీకాలం అదే సంవత్సరం జూలై 4న ముగిసింది.  మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్ల పదవీకాలం గత ఆగష్టులో ముగిసింది ఇక అప్పటి నుంచి పంచాయతీ మొదలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల వరకు స్థానిక సంస్థలో, ప్రజా పాలన స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఈనేపధ్యంలో,గత ఫిబ్రవరి నుంచి, ప్రభుత్వం, త్వరలోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెపుతూ వస్తోంది.అయితే, తాజా పరిణామాలు, మంత్రులు, పార్టీ పెద్దలు చేస్తున్న పరస్పర విరుద్ద  ప్రకటనలను గమనిస్తే,స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరపాలనే విషయంలో ప్రభుత్వానికి, పార్టీకి కూడా క్లారిటీ లేనట్లుందని అంటున్నారు. అంతేకాదు, కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి మెడ మీద కత్తి పెడితే తప్పించి, ఇప్పట్లో స్థానిక ఎన్నికలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి మాత్రం లేదని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పొరుగు రాష్ట్రం కర్ణాటకలోను అర్బన్ లోకల్ బాడీ    ఎన్నికలు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్నాయి, చివరకు,మే 2025 చివరకి కల్లా ఎన్నికలు నిర్వహిస్తామని కర్ణాటక ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన గడవు ముగిసినా,ఇంతవరకు ఎన్నికల ఉలుకూ పలుకూ లేదని,అంటున్నారు.తెలంగాణ రాష్ట్రంలోనూ,అదే పరిస్థితి కొనసాగినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. నిజానికి ఒకవారం పది రోజుల క్రితం వరకు కూడా, కాంగ్రెస్ వర్గాలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల్లో స్థానిక ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించింది.ముఖ్యంగా, ఈ నెలాఖరులోగా పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేసిన ప్రకటన స్థానిక నేతల్లో జోష్’ పెంచింది.   అయితే కోర్టులో ఉన్న అంశాన్ని తనకు సంబంధం లేని శాఖపై ప్రకటన ఎలా చేస్తారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ మంత్రి పొంగులేటిని మందలించినట్లు వార్తలు వచ్చినందున క్రింది స్థాయి నేతల ఉత్సాహం ఒక్కసారిగా చల్లబడి పోయింది.ఎన్నికల నిర్వహణ సందిగ్దంలో పడింది. అంతే కాకుండా, పీసీసీ చీఫ్, తాజాగా, న్యాయస్థానం తీర్పు  తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, స్పష్టం చేశారు. అంటే, ఇప్పట్లో స్థానికం లేదని చెప్పకనే చెప్పారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతం ప్రకటిస్తూ చట్టబద్దత కోసం కేంద్రానికి పంపింది.దీంతో బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ అన్నిటినీ మించి, సర్వేలు, ఇంటెల్జెన్సీ నివేదికలు, ప్రభుతాన్ని,అధికార పార్టీని భయపెడుతున్నాయని అంటున్నారు.ఈ నేపధ్యంలో, స్థానిక సంస్థలఎన్నికలు,ఇప్పట్లో లేనట్లే, అంటున్నారు.
తెలంగాణలో స్థానిక ఎన్నికలు..  ఇప్పట్లో లేనట్లే ? Publish Date: Jun 22, 2025 10:33AM

ఫోన్ ట్యాపింగ్ మెగా సీరియల్లో మరో ట్విస్ట్!

తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త కథలు, కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణాలు తొంగి చూస్తున్నాయి. ఈ వ్యవహారం పై విచారణ జరుపుతున్న ప్రత్యేక  దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే  గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో  తమ ఫోన్లు ట్యాప్  అయ్యాయని అప్పట్లో ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పిలిచి మనీ వాగ్మూలాలు నమోదు  చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే  పీసీసీ అధ్యక్షడు మహేష్ కుమార్ గౌడ్ సహా అనేక మంది నాయకులను, నాయకుల అనుచరులను, ఇతరులను విచారించింది. వాంగ్మూలాలు నమోదు చేసింది.  ఇప్పుడు తాజాగా, గతంలో తన ఫోన్ ట్యాప్  అయినట్లు ఫిర్యాదు చేసిన  బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను వాగ్మూలం ఇవ్వాలని సిట్  కోరింది. రెండు మూడు రోజుల్లో  సిట్ ఎదుట హాజరై  వాగ్మూలం ఇచ్చేందుకు బండి సంజయ్ కుమార్ అంగీకరించారు. బండి సంజయ్ తో పాటుగా  ఆయన సన్నిహిత సహచరుడు, కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గం బీజేపీ కన్వీనర్  ప్రవీణ్ రావుకు  కూడా సిట్ స్వాగతం పలికింది.  నిజానికి..  ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ క్రైమ్. అందులో సందేహం లేదు. అలాంటిది  ఒకే రోజున అది కూడా, 2023 ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ రోజున  మావోయిస్టులుగా  ముద్ర వేసి మరీ 600 మంది ఫోన్లను ట్యాపింగ్ జరిగిందే నిజం అయితే, గత బీఆర్ఎస్  ప్రభుత్వం  చాలా పెద్ద నేరానికి పాల్పడిందని, అందుకు గట్టి మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని అంటున్నారు.  అయితే.. ఈ కేసులో ముడి పడిన చిక్కు ముళ్ళు అన్నీ తొలిగి, కేసు విచారణ పూర్తయ్యేందుకు ఎంత సమయం  పడుతుందో.. అసలు కేసు ఏనాటికి అయినా ఒక కొలిక్కి వస్తుందో రాదో చెప్పలేమనీ..  చెప్పాలను కోవడం సాహసమే అవుతుందనీ పదవీ విరమణ చేసిన సీనియర్  అధికారులు, న్యాయనిపుణులు  అభిప్రాయ పడుతున్నారు.  మరోవంక కేసు విచారణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. నిజానికి  ఫోన్ ట్యాపింగ్ చాలా  పెద్ద నేరం. అధికార, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సినిమా స్టార్లు, సెలబ్రిటీలు చివరకు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటే.. (చేసిందే నిజమైతే) నిజంగా అది  మహా పెద్ద నేరం.  అయితే..  కేసు విచారణ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నట్లు తోచడం లేదని కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంతే కాదు,స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు  కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు  ఫోన్ ట్యాపింగ్  మెగా సీరియల్  రన్  చేస్తున్నారని కిషన్ రెడ్డి అంటున్నారు.  అదలా ఉంటే.. ఫోన్ అక్రమ ట్యాపింగ్ ప్రధాన సూత్రం దారులు, పాత్ర దారులు, నేరాన్ని అవతలి వారిపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇంతవరకు మూడు నాలుగు పర్యాయాలు సిట్ ఎదుట విచారణకు హాజరైన  ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర రావు తాజా విచారణలో కొత్త పల్లవి ఎత్తుకున్నట్లు సమాచారం.ఇంతవరకు ఆకుకు అందకుండా పోకకు చిక్కకుండా..  పొంతనలేని సమాధానాలు ఇచ్చిన ప్రభాకర రావు, ఇప్పడు తాజాగా అంతా ఆయనే చేశారు, ఆయన చెప్పిందే నేను చేశాను, ఆయన చెప్పిన ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ చేశాను అంటూ మొత్తం నేరాన్ని అప్పటి డీజీపీ పైకి నెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అప్పటి రాజకీయ ముఖ్యులు ఎవరూ తనకు ప్రత్యక్షంగా ఆదేశాలు, సూచనలు ఇవ్వలేదని కూడా  ప్రభాకర రావు సిట్ కు చెప్పినట్లు సమాచారం.   కాగా ఈకేసులో ఇప్పటికే  సిట్ కు వాగ్మూలం ఇచ్చిన  ఇతర నిందితులు ప్రణీత్ రావు, భుజంగ రావు, రాధాకృష్ణ రావు, తిరుపతన్న ప్రభాకరరావు చెప్పినట్లే తాము పని చేశామని తమ తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇప్పడు అదే ప్రభాకర రావు డీజీపీ వైపు వేలు చూపిస్తున్నారు,. రేపు డీజీపీ  ఎవరి  వైపు వేలు చూపుతారు ..ఏమి జరుగుతుంది .. చూడాల్సింది చాలానే వుంది . చూస్తూనే ఉందాం.
ఫోన్  ట్యాపింగ్  మెగా సీరియల్లో మరో ట్విస్ట్! Publish Date: Jun 22, 2025 7:30AM

తొలి టెస్టులో భారత్ ఆలౌట్..ఇంగ్లండ్‌ ఎదుట భారీ స్కోర్

  ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 471 పరుగులకు ఆలౌటైంది. జైస్వాల్‌ (101), కేఎల్‌ రాహుల్‌ (42), శుభ్‌మన్‌ గిల్‌ (147), రిషబ్‌ పంత్‌ (134) పరుగులు చేయగా..ఏడేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ నిరాశపర్చాడు. నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా (11), శార్దూల్ ఠాకూర్ (1) నిరాశపర్చారు.  ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్‌ స్టోక్స్ 4, జోష్ టంగ్ 4, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ చెరో వికెట్ పడగొట్టారు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌.. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.ఈ క్రమంలో పంత్‌ 146 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.  
 తొలి టెస్టులో భారత్ ఆలౌట్..ఇంగ్లండ్‌ ఎదుట భారీ స్కోర్ Publish Date: Jun 21, 2025 7:02PM

రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలి : సీపీఐ నారాయణ

  బనకచర్ల ప్రాజెక్ట్‌ వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని సీపీఐ నేత నారాయణ కొరారు. బనకచర్ల ప్రాజెక్టు కంటే ముందు హంద్రీనీవా, వంశీధర లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నాని ఆయన తెలిపారు. వెనకబడిన ప్రాంతాలకు నీరు అందేలా కృషి చేయాలని అన్నారు. ఎవరికీ నష్టం లేకుండా ప్రభుత్వాలు చూడాలని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రం సహాయం తీసుకోవాలని ఆయన తెలిపారు.  కొంతమంది ప్రాంతీయ ధోరణితో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని నారాయణ ఆరొపించారు.రాష్ట్రాలు రెండుగా విడిపోయాయిన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు శత్రువులు కాదని ఆయన హితవు పలికారు. ఎవరికి నష్టం లేని పద్ధతిలో పరిష్కారం చేసుకుంటే మంచిదని పేర్కొన్నారు.ఈనెల 23న తెలంగాణ క్యాబినేట్ సమావేశం ఉంది. అందులో చర్చించి, ఆ తర్వాత నేనే ఒకడుగు ముందుకేసి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తా’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిపాదించారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఏపీ ప్రీ ఫీజిబులిటి రిపోర్ట్‌ (పీఎ్‌ఫఆర్‌) ఇవ్వడం వల్లే వివాదం మొదలైందన్నారు. పీఎ్‌ఫఆర్‌ ఇచ్చే ముందే తెలంగాణతో చర్చించి ఉంటే వివాదం ఉండేది కాదని నారాయణ తెలిపారు.  
రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలి : సీపీఐ నారాయణ Publish Date: Jun 21, 2025 6:47PM

ఈ నెల 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం

  తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం  ఈ నెల 27వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఖరీఫ్ సీజన్ అవసరాల నిమిత్తం నీటి విడుదలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత సంవత్సరంలో ఇరు రాష్ట్రాల వాటాలు, ప్రాజెక్టులలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు పోను సాగునీటికి ఎంత కేటాయించాలనే అంశాలపై అధికారులు కూలంకషంగా చర్చించనున్నారు. ఈ మేరకు కేఆర్‌ఎంబీ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చింది. రెండు రాష్ట్రాల అధికారులు తమ తమ రాష్ట్రాల అవసరాలు, డిమాండ్లను ఈ సమావేశంలో బోర్డు ముందు ఉంచనున్నారు. ఇన్సెంటివ్‌ క్యాన్సిల్ చేయడంతోపాటు రికవరీ చేయాలని కృష్ణా బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బోర్డు ఉద్యోగులు గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని 2023లో హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలోనే డివిజన్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్‌పై చర్చించేందుకు 20వ స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేశారు.   
ఈ నెల 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం Publish Date: Jun 21, 2025 6:19PM

పాడి ఉత్పత్తిలో రాజీవ్ ముర్రా బ్రీడ్ డెయిరి

  పాడి పంట. ఈ జంట వ్యవస్థల్లో పశువులు సుభిక్షంగా ఉంటే చాలు.. పంటలు, పల్లెలు, రైతు కుటుంబాలు యథాతథంగా బాగుంటాయి. కనీస రవాణాకు ఇబ్బంది ఉండదు. 1970 వరకు రైతు భారతానిది ఇదే పరిస్థితి. ఆహ్లాదభరిత వాతావరణంలో మంచి పశువులు, దృఢంగా, ఆరోగ్యంగా చక్కటి పాడినిచ్చేవి. హరిత విప్లవం దుష్ప్రభావాల ఫలితంగా... దేశీ గేదెలు, ఆవుల్లో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది, ఈ నేపథ్యంలో సగటున 20 నుంచి 25 లీటర్ల దిగుబడితో భారత పాల అవసరాలను తీరుస్తోంది... ముర్రా బ్రీడ్  మాత్రమే! ఈ విషయాన్ని గ్రహించిన ఆదర్శపోషకుల్లో ఒకరు... రాజీవ్ చిలకపాటి. లండన్ లో మాస్టర్స్ చేసిన ఈ రైతు బిడ్డ... స్వదేశానికొచ్చాక తన ఆశయంపై దృష్టిపెట్టారు. వ్యవసాయంపై మక్కువ... ఆవులు, గేదెలు, కోళ్లపై అలవిమాలిన ఆసక్తితో దేశమంతా తిరిగారు.  ఏటికేటికీ అంతరించిపోతున్న మేలుజాతి పశుసంపదను సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. లక్ష్య సాధనలో భాగంగా ABC మ్యూచువల్లి ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో వ్యయప్రయాసలకోర్చి అధిక పాలచార కలిగిన ప్యూర్ ముర్రా దున్నపోతుల సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేశారు. ABC సెమెన్ స్టేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ గా...నాణ్యతలో రాజీ పడకుండా అత్యుతన్నత ప్రమాణాలతో ల్యాబ్ ను నెలకొల్పారు. నాలుగు ఎకరాల్లో అధిక పాల చారనిచ్చే ఉత్తమమైన ముర్రా దున్నపోతులతో... పశుసంపద వృద్ధి, జన్యు మెరుగుదలపై దృష్టిపెట్టారు. నియంత్రిత పర్యావరణంలో ఉన్న ABC సెమన్ స్టేషన్ చూడాలంటే మాత్రం ... ముందస్తు అనుమతి తీసుకోవాలి.  సందర్శకులు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ప్రతీ విభాగంలో వెటర్నరీ టెక్నిషియన్స్ సూచించిన విధంగా బయోసెక్యూరిటి ప్రోటోకాల్స్ పాటించాలి. ప్రవేశం ద్వారం నుంచి ప్రవేశించేటప్పుడే సంపూర్ణంగా శానిటైజ్ చేసుకోవాలి. ఒక విభాగం నుంచి ఇంకో విభాగానికి మారేటప్పుడు శానిటైజ్డ్ చేసిన యాప్రాన్స్, మాస్క్, హెడ్ క్యాప్ ధరించాలి. ఎక్కడి చెప్పులు అక్కడే విడిచిపెట్టాలి. నాలుగు ఎకరాల ఈ సువిశాల ప్యూర్ ముర్రా దున్నపోతుల సామ్రాజ్యంలో సందర్శకులు అడుగడుగునా మానిటరింగ్ చేయబడతారు. అధిక వంశపారంపర్యం గల వీర్యం ఉత్పత్తి చేసే వ్యవస్థ కావడం వల్ల... సమర్థవంతమైన నిర్వహణ విషయంలో  రాజీవ్... ఎక్కడా రాజీపడకపోవడం వారి నిబద్ధతకు తార్కాణం  అధికపాడి, లైంగిక, జన్యుపరమైన వ్యాధుల్లేని ప్రీమియర్ ముర్రా బ్రీడ్ ను అభివృద్ధి చేయడం ABC సెమన్ స్టేషన్ ముఖ్య ఉద్దేశం. ABC ఫ్రోజెన్ సెమన్ స్ట్రాస్ తయారయ్యే క్రమంలో... ప్యూర్ ముర్రా దున్నల నుంచి సేకరించిన వీర్యాన్ని..?అనేక కఠిన పరీక్షలు చేస్తారు. నాణ్యత నియంత్రణ చర్యల ద్వారా బాక్టీరియా రహిత వాతావరణంలో వీర్యాన్ని ప్రాసెస్ చేస్తారు. ఫ్రెంచ్ మినీ స్ట్రాలో 0.25 ఎమ్.ఎల్. నిక్కచ్చిగా ప్యాక్ చేస్తారు. ఆ తర్వాత అల్ట్రాసోనిక్‌ సీలు చేసి, ఇంక్‌జెట్ ముద్రిస్తారు. ఒక్కో స్ట్రాలో దాదాపు 2 కోట్ల వీర్యకణాలుంటాయి. ఈ స్ట్రాస్ ని డ్రీప్ ఫ్రీజ్ లో నిల్వ చేస్తారు. నిర్ణీత కాలం తర్వాత లిక్విడ్ నైట్రోజన్ క్యానుల్లో భద్రపరిచి... దేశవ్యాప్తంగా పాడి రైతులకు పంపిణీ చేస్తారు  గేదెల నుంచి వచ్చే పేడను ఎప్పటికప్పడు మిని ట్రాక్టర్ పడ్లర్ తో నెట్టేస్తారు. ఆ వ్యర్థాన్ని కూలీలు దూరంగా పోగేస్తారు. పశువుల కడిగిన నీళ్లు, మూత్రాన్ని... ఓ పెద్ద బావిలో సేకరిస్తారు. ఆ నీటిని తమ పశుగ్రాస క్షేత్రాలకు పారిస్తుంటారు. అలా సహజంగా పండించిన గ్రాసాలు, దాణాల మిశ్రమాన్నే మేపడం వల్ల కాబోలు దూడల నుంచి గేదెల వరకు అన్ని చలాకీగా కనిపిస్తుంటాయి. ఈ డెయిరీ చూసిన పాడిరైతులు ఎవరైనా సరే... నాలుగు బ్రీడ్ దూడలో, పడ్డలో మన పాకలో కూడా ఉంటే బాగుండనేలా ప్రభావితం చేస్తుంది రాజీవ్ డెయిరీ. ఇంతలా తోటి పోషకులను ప్రభావితం చేస్తున్న ఈ వ్యవస్థ నిర్మాణంలో రాజీవ్...సుదీర్ఘ ప్రణాళిక, క్రమశిక్షణ, కృషి... శ్లాఘనీయం! ఉత్తరాది ఆదర్శ రైతులను సైతం దక్షిణాదికి రప్పించిన ఆయన నైపుణ్యశైలి... హర్షణీయం మొత్తంగా పాడి రైతు ఆర్థికాభివృద్ధికి అవిరళ కృషిచేస్తున్న రాజీవ్ సంకల్పం... అభినందనీయం  
పాడి ఉత్పత్తిలో రాజీవ్ ముర్రా బ్రీడ్ డెయిరి       Publish Date: Jun 21, 2025 5:01PM

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. డీజీసీఏ కీలక ఆదేశాలు

  అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను తొలిగించాలని ఎయిరిండియాను ఆదేశించింది. విమాన సిబ్బంది క్రూ షెడ్యూల్,  రోస్టరింగ్ పనులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులు.. పైలెట్లకు తగిన లైసెన్సింగ్, రెస్ట్, తప్పనిసరి నిబంధనలను ఉల్లంఘించారన్నది డీజీసీఏ వాదన.  ఐవోసీసీ అడిటింగ్‌లో ఈ విషయం బయటపడింది. అయితే ఇటీవలి అహ్మదాబాద్‌ ఘటన నేపథ్యంలోనే డీజీసీఏ చర్యలకు ఎయిరిండియాకు సిఫారసు చేసినట్లు స్పష్టం అవుతోంది.   అంతేకాదు.. క్రూ షెడ్యూలింగ్ నిబంధనలు, లైసెన్సింగ్, ఫ్లైట్ టైం లిమిటేషన్స్ తదితర అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే ఇక నుంచి భారీ జరీమానాలు విధిస్తామని డీజీసీఏ హెచ్చరిస్తోంది కూడా. కాగా.. జూన్‌ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌ఫోర్టు  నుంచి లండన్‌కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఓ భవనంపై కూలి.. ముక్కలై.. పేలిపోయింది. ఈ దుర్ఘటలో మొత్తం 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఇక ఈ ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రిలో డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మృతదేహాలను అధికారులు గుర్తిస్తున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. డీజీసీఏ కీలక ఆదేశాలు Publish Date: Jun 21, 2025 4:38PM

ప్రజల సహకారంతో యోగాంధ్ర విజయవంతం : సీఎం చంద్రబాబు

  ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వైజాగ్ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజాల సహకారంతోనే కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీఎం అన్నారు. 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తాము మొదటిసారి నిర్వహించిన యోగాంధ్ర ఈవెంట్‌కు రెండు గిన్నిస్ బుక్ రికార్డులు నెలకొల్పడం సంతోషకరమని అన్నారు. ప్రజల సహాకారంతోనే యోగాంధ్రను విజయవంతం చేశామని అందుకు ప్రకృతి కూడా సహరించిందని తెలిపారు.  సూర్య నమస్కారాతో గిరిజన బిడ్డలు చరిత్ర సృష్టించారని.. యోగాంధ్ర సూపర్ హిట్ అయిందని అన్నారు. ఇవాళ్టి కార్యక్రమంలో 3.3 లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఫలించిందని అన్నారు. యోగా అందరికీ అవసరం అనే భావన తీసుకొచ్చింది మోడీనే అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 11వ యోగా డే విశాఖ డిక్లరేషన్‌ తీసుకొస్తామని.. యోగా పరిషత్‌ను ఏర్పాటు చేస్తామని, ఆరోగ్యానికి యోగానే గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు.యోగాంధ్ర' కార్యక్రమంపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రజల డబ్బు వృథా చేస్తున్నారంటూ జగన్ చేసిన ఆరోపణలను చంద్రబాబు తిప్పికొట్టారు. కొన్ని సందర్భాల్లో కొందరి గురించి మాట్లాడటం కూడా అనవసరం. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వ్యక్తులు ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది" అని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా, కలుషితం చేసేలా ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. "ఇలాంటి భూతాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించే వారిని ఉద్దేశించి ఎలా నియంత్రించాలో ప్రజలకు వివరించి వారిని చైతన్యపరుస్తాం" అని చంద్రబాబు తెలిపారు. విశాఖకు తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. మంచి పని చేస్తే ఇక్కడి ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని వ్యాఖ్యనించారు. యోగా డే వేడులకు ఒక్క పిలపునిస్తే.. లక్షల్లో జనం తరలివచ్చారని అన్నారు. విశాఖ ప్రజలది పాజిటివ్ థింకింగ్ అని.. సమైక్యతా భావం ఎక్కువని కితాబిచ్చారు. 
ప్రజల సహకారంతో యోగాంధ్ర విజయవంతం : సీఎం చంద్రబాబు Publish Date: Jun 21, 2025 3:56PM

కేబీఆర్ పార్క్ పేరు మార్చాలని తీన్మార్ మల్లన్న నిరసన

  హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ పేరు మార్చాలని  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ  కేబీఆర్ పార్కు వద్ద ఆయన ధర్నా చేశారు. కేబీఆర్ పార్కు పేరును తొలగించి వెంటనే ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టకపోతే.. ఆ పని మేమే చేస్తామని డిమాండ్ చేశారు.  వెంటనే కేబీఆర్ పార్క్ ముందు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని  కూడా పెట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. తెలంగాణలోని బీసీ సంఘాలు సైతం పేరు మార్పు చేయాలని కోరుతున్నారని తీన్మార్ మల్లన్న అన్నారు.  బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ప్రొక్లెయిన్‌తో పెకిలించి అవతల పడేసి జయశంకర్ సార్ విగ్రహం పెడతామని మల్లన్న తెలిపారు.  
కేబీఆర్ పార్క్ పేరు మార్చాలని  తీన్మార్ మల్లన్న నిరసన Publish Date: Jun 21, 2025 3:29PM

హరీష్ రావు సభలో రప్పా రప్పా ప్లకార్డులు

  సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు పుష్ప మూవీ డైలాగ్ ప్లకార్డులు ప్రదర్శించారు. 2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్" అంటూ మాజీ మంత్రి హారీశ్‌రావు, ఫోటోలతో ప్లకార్డులు రూపోందించారు. కాగా మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యాటనలోనూ ఓ యువకుడు ఇదే డైలాగ్‌తో ప్లకార్డులు ప్రదర్శించిగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల రాజకీయల్లో పుష్ప డైలాగ్ కాక రేపుతోంది.  పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్  పాపులర్ డైలాగ్స్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి ప్రవేశించాయి. 2029లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే గంగ‌మ్మ జాత‌ర‌లో వేట త‌ల‌లు న‌రికిన‌ట్టు  ర‌ప్పా ర‌ప్పా న‌రుకుతాం ఒక్కొక్క‌డినీ! పొట్టేళ్ల‌ను న‌రికిన‌ట్టు న‌రుకుతాం’ అని రాసిన ఫ్లెక్సీల‌ను కార్యకర్తలు ప్రదర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ డైలాగును వైఎస్ జగన్  సమర్ధించడంతో ఏపీలో పెద్ద రచ్చే నడుస్తోంది.దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల తదితర టీడీపీ నేతలు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. 
హరీష్ రావు సభలో రప్పా రప్పా  ప్లకార్డులు Publish Date: Jun 21, 2025 1:55PM

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి అస్వస్థత..ఆసుపత్రికి తరలింపు

  ఏపీ లిక్కర్ స్కాం కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ‌చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  అస్వస్థత గురైనట్లు తెలుస్తోంది. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇటీవల చెవిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా జులై1 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. చెవిరెడ్డిపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని సిట్ కు సమాచారం అందించారు. దీంతో సిట్ అధికారులు విజయవాడ నుంచి హుటాహుటిన బెంగళూరు చేరుకుని చెవిరెడ్డిని అదుపులోనికి తీసుకుని జూన్ 18 కోర్టులో హాజరు పరిచారు.  
వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి అస్వస్థత..ఆసుపత్రికి తరలింపు Publish Date: Jun 21, 2025 1:38PM

వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలపై స్పెషల్ స్టోరీ

   వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.. స్వయంగా మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వివాదాస్పద వాక్యాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం లేపుతున్నాయి. గురువారం రాహుల్ గాంధీ బర్త్ డే సందర్భంగా వరంగల్ పోచమ్మ మైదానంలో నిర్వహించిన రాహుల్ గాంధీ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. కొండ సురేఖ మంత్రి పదవి పోతుందని కొందరు విశ్వ ప్రచారం చేస్తున్నారని అవేవీ నమ్మకూడదని పదవి ఎక్కడికి పోదు అని మా వెనకాల రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  పరకాల నియోజకవర్గంలో 75 ఏళ్ల దరిద్రుడు ఎమ్మెల్యేగా గెలిచాడని ఎన్నికలప్పుడు వచ్చి ఒకసారి గెలిపించాలని  కాలు పట్టుకున్నాడని మళ్లీ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాన్ని వదిలేస్తానని మాట ఇచ్చాడని గుర్తు చేశారు.. పరకాల నియోజకవర్గం నుంచి త్వరలోనే తన కూతురు కొండ సుస్మిత పటేల్ రాజకీయ ప్రవేశం చేస్తారని అన్నారు. మరో సొంత పార్టీ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో గెలిచి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.. ఆయన కనుబొమ్మలు గీసుకుంటాడని ఎన్కౌంటర్లో స్పెషలిస్ట్ అని అన్నారు. చంద్రబాబు, కేసీఆర్ కేటీఆర్‌ను  వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని,అతనితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని కడియం శ్రీహరి ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు.  కొండమురళి లెక్క మీకు ఇజ్జతి మానవత్వం  ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాలు విసిరారు.. మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.. వరంగల్ జిల్లాలో మొదటి నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొండ మురళి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేది.. ఒకరికొకరు మీడియా సమావేశంలో కూడా తిట్టుకునేవారు.. కొండ మురళి కుటుంబ సభ్యులంతా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు. ఆ విధంగా ఆది నుంచి ఇప్పటివరకు వీధి మధ్య శత్రుత్వం పెరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను టార్గెట్ చేయకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవుల ప్రకాష్ రెడ్డి లపై మాజీ ఎమ్మెల్సీ కొండమురళి ఈ విధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడంతో కొండ మురళి టార్గెట్ మారిందా అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  గత కొద్ది రోజుల నుండి మంత్రి కొండా సురేఖ పదవి పోతుందని మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది.. అప్పటినుండి మంత్రి కొండ సురేఖ పైన సోషల్ మీడియాలో పలు సంఘటనలు సంబంధించి ప్రచారం చేయడంతో పాటు అది కొద్ది రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవును అనే అనిపిస్తుంది..మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గన్మెన్లను తొలగించడంతోపాటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కి ఎస్కార్ట్ గా వచ్చిన ఏసిపి సీఐలకు మెమోలు జారీ చేసిన ఘటనలు చూస్తుంటే ఏం జరుగుతుందోనని ఆశ్చర్యంనికి గురిచేస్తుంది.. వీటన్నిటిని గమనించిన కొండ మురళి ఈ విధంగా మాట్లాడారని కొండ మురళి అనుచరులు బహిర్గతంగా చర్చించుకుంటున్నారు.. మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొండ సురేఖ పదవి తప్పించేందుకు టిడిపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర లాబింగ్ చేస్తున్నారని వరంగల్ జిల్లాలో జోరుగా ప్రచారం అందుకుంది  వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ పై కూడా కొండ మురళి హాట్ కామెంట్ చేశారు... తనకు ఎస్కార్ట్ గా వచ్చిన వారిపై చర్యలు తీసుకోవడం మీద ఉన్న శ్రద్ధ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కోవర్టుల పైన పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. వరంగల్ తూర్పులో తను ఉన్నంతకాలం రెండో లీడరు రాలేడు అని  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యను కూడా ఉద్దేశించి మాట్లాడారు.. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే కక్షగట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కగార్ ఆపరేషన్ ను ఆపేయాలని అంటే పోలీసులు అడ్డుకున్నా రన్నారు. ఇప్పుడు జిల్లాకు చెందిన బీసీ బిడ్డ ఎన్కౌంటర్ అయ్యారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ప్రజల్లో ఉంటానని ప్రజలకు సేవ చేయడమే మా కుటుంబం లక్ష్యమని ధైర్యంలో తాను పెద్దపులిని అంటూ మాట్లాడారు..మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి చేసిన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలపై స్పెషల్ స్టోరీ Publish Date: Jun 21, 2025 1:22PM

అస్త‌మిస్తోన్న సూర్యుడు..మార‌న్ సోద‌రుల మ‌ధ్య గొడ‌వేంటి?

  డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్, భార‌తీయ కుబేరుల్లో ఒక‌డైన క‌ళానిధి మార‌న్ కి మ‌ధ్య ఆస్తి చిచ్చు మొద‌లైందా? అంటే అవున‌ని తెలుస్తోంది. 2003లో తండ్రి ముర‌సోలి మార‌న్ మ‌ర‌ణించారు. స‌రిగ్గా ఆ టైంలో బీజం వేసుకుందీ ఆస్తి త‌గాదా. అప్ప‌ట్లో త‌న తండ్రి మ‌ర‌ణించిన వెంట‌నే క‌ళానిధి మారన్.. అక్ర‌మంగా 12 ల‌క్ష‌ల షేర్ల‌ను నామ మాత్రం విలువ‌, అంటే రూ. 10 చొప్పున షేర్లు త‌న పేరిట కేటాయింపులు చేసుకున్నార‌నీ.. ఆ టైంలో ఈ షేరు విలువ రెండున్న‌ర వేల నుంచి సుమారు రూ.3 వేల వ‌ర‌కూ ఉండేద‌ని.. దీంతో ఆయ‌న 60 శాతం వ‌ర‌కూ వాటాల‌ను కైవ‌సం చేసుకుని అక్ర‌మంగా స‌న్ నెట్ వ‌ర్క్ య‌జ‌మాని అయ్యార‌ని ఆరోపిస్తున్నారు ద‌యానిధి మార‌న్. అందుకే తాము 2003 నాటి పాత యాజ‌మాన్య స్థితికి కంపెనీని తీసుకురావ‌ల్సిందిగా  కోరుతున్నారు ద‌యానిధి మార‌న్.  తాను కూడా చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సుడ్నేన‌నీ.. త‌న తండ్రి మ‌ర‌ణ దృవీక‌ర‌ణ‌, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన  వార‌స‌త్వ ప‌త్రాల్లేకుండానే క‌ళానిధి త‌న‌కు ద‌క్కాల్సిన  షేర్లు, డివిడెండ్లు, ఆస్తులు, ఆదాయాల‌ను ద‌క్క‌కుండా చేశార‌ని.. అవ‌న్నీ తిరిగి చెల్లించ‌కుంటే తాను సెబీ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, ఆర్వోసీ వంటి సంస్థ‌ల‌కు కంప్ల‌యింట్ తీస్కెళ్లాల్సి ఉంటుంద‌ని త‌న నోటీసుల ద్వారా హెచ్చ‌రించారు మార‌న్ బ్ర‌ద‌ర్. ఈ దిశ‌గా  జూన్ 10న మార‌న్ త‌న సోద‌రుడికి లా ధ‌ర్మ అనే సంస్థ ద్వారా నోటీసులు పంపించారు. క‌ళానిధి మార‌న్ 2003 నుంచి 2023 వ‌ర‌కూ ఏకంగా 8500 కోట్ల మేర అక్ర‌మ నిధుల‌ను ఎన్నో విభాగాల్లో పెట్టుబ‌డులు పెట్టార‌నీ.. ఇదంతా చ‌ట్ట‌విరుద్ధ‌మ‌నీ అంటారు ద‌యానిధి మార‌న్. 2024లో క‌ళానిధి ఏకంగా 455 కోట్ల విలువైన డివెండ్లు పొందార‌ని.. త‌న భార్య కావేరి, తాను క‌ల‌పి సీఈవోగా ఒక్కొక్క‌రూ అర‌వై కోట్ల‌కు పైగా.. ప్యాకేజ్ తీస్కుంటున్నార‌నీ.. ఆయ‌న 2023లో భార‌త కుబేరుల జాబితాలో 77వ బిలియ‌నీర్ గా ఎదిగారంటే దాని వెన‌క‌- ఈ అక్ర‌మ షేర్ల బ‌దలాయింపు ఉంద‌ని అంటున్నారు ద‌యానిధి మార‌న్. మ‌రీ ముఖ్యంగా కంపెనీల చ‌ట్టం 212 ప్ర‌కారం.. చూస్తే క‌ళానిధి పెట్టుబ‌డులు పెట్టిన  టీవీ, రేడియో, క్రీడా, విమాన యాన ఇలా ఎన్నో రంగాల లైసెన్సులు ర‌ద్దు అయ్యే ప్ర‌మాద‌మున్న‌ట్టు తెలుస్తోంది. స‌న్ నెట్ వ‌ర్క్ కింద 37 చానెళ్లు, 69 రేడియో స్టేస‌న్లుండ‌గా.. వీటితో పాటు స‌న్ పిక్చ‌ర్స్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థ ఉండ‌గా.. 2023లో ఈ సంస్థ నుంచి జైల‌ర్ సినిమా విడుద‌లై వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది.ఇక క‌ళానిధి కుమార్తె కావ్య మార‌న్ ఇక్క‌డ ఐపీఎల్ లో స‌న్ రైజ‌ర్స్ ఫ్రాంచైజీ  తో పాటు సౌతాఫ్రికాలోనూ ఒక క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ఈ టీములు 2016లో ఐపీఎల్, 2023-24లో ద‌క్షిణాఫ్రికా చాంపియ‌న్ గా నిలిచాయి. ఇక ఇంగ్లండ్ లోనూ ఒక క్రికెట్ టీమ్ ని కొనుగోలు చేసింది కావ్య‌నాయ‌క‌త్వంలోని స‌న్ నెట్ వ‌ర్క్. అంతే కాదు విమాన‌యానంలోనూ పెట్టుబ‌డులు పెట్టిందీ సంస్థ‌.  వీట‌న్నిటి లైసెన్సులూ ఇప్పుడు ప్ర‌మాదంలో ప‌డ్డంతో పాటు.. వెయ్యి మందికి పైగా ఉద్యోగుల కుటుంబాల‌పైనా ఈ ప్ర‌భావం ప‌డేలా తెలుస్తోంది.దానికి తోడు ద‌యానిధి మార‌న్ డీఎంకే ఎంపీ  కూడా కావ‌డంతో రాజ‌కీయంగానూ ఈ ఆస్తి వివాదం.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం  ప‌డేలా ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి దీనంత‌టికీ ఈ కుటుంబం ఫుల్ స్టాప్ పెడుతుందా లేదా తేలాల్సి ఉంది. 2018 వ‌ర‌కూ క‌రుణానిధి జీవించి ఉండ‌గా.. ఆయ‌న ద్వారా ఇలాంటి కుటుంబ స‌మ‌స్య‌లు ఎన్నో క్లియ‌ర్ అవుతూ వ‌చ్చేవి. ఎందుకంటే క‌రుణానిధికి మేన‌ల్లుడే మురుసోలి మార‌న్. దానికి తోడు త‌న మేన‌మామ మీదున్న ప్రేమ కొద్దీ ముర‌సోలి ఆయ‌న పేరును పోలిన  పేర్లు త‌న‌పిల్ల‌ల‌కు పెట్టారు.  ఈ క్ర‌మంలో ఆయ‌న లేక పోవ‌డం ఒక‌ర‌కంగా ఈ కుటుంబం మ‌ధ్య వివాదం నానాటికీ పెరిగి పెద్ద‌ద‌వుతూ వ‌చ్చింది. ఇప్పుడు క‌రుణ  త‌న‌యుడు స్టాలిన్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి. ఆయ‌న‌కున్న ప్ర‌భుత్వ, రాజ‌కీయ ప‌ని ఒత్తిడి కార‌ణంగా ఈ కుటుంబ త‌గాదాలు తీర్చే ప‌రిస్థితి  క‌నిపించ‌డం లేదు. క‌ళానిధి తెలివిగా త‌న ఒకే ఒక్క సోద‌రికి 500 కోట్ల రూపాయ‌లు బ‌దిలీ  చేసి త‌ద్వారా కుటుంబంలో త‌న‌పై ఒత్తిడి రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇక్క‌డ మ‌రో విచిత్ర‌మైన ప‌రిస్థితి ఏంటంటే.. ద‌యానిధి ఇన్నాళ్ల‌కు త‌న‌కు జ‌రిగిన  అన్యాయాన్ని గుర్తించి.. ఇప్పుడు ఇన్నేళ్ల త‌ర్వాత ఈ ర‌చ్చ‌ను చ‌ట్ట‌ప‌రంగా ఎదుర్కోడానికి సిద్ధ‌ప‌డ్డం వెన‌క ఉద్దేశ‌మేంట‌న్న‌ది అర్ధం కావ‌డం లేదెవ‌రికీ.
అస్త‌మిస్తోన్న సూర్యుడు..మార‌న్ సోద‌రుల మ‌ధ్య గొడ‌వేంటి? Publish Date: Jun 21, 2025 1:04PM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌

  బీఆర్‌ఎస్ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కి తరలించారు. ఆయనపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదుచేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించే అవకాశం ఉన్నది. మనోజ్‌రెడ్డి అనే వ్యాపారిని రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడని అతని భార్య సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఈ నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కౌశిక్‌ రెడ్డి నాలుగు రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో ఆయనకు చుక్కెదురయింది. శంషాబాద్ విమానాశ్రయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.  
 బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌ Publish Date: Jun 21, 2025 12:13PM

గచ్చిబౌలిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఆయుష, ఆరోగ్యశాఖ ఆథ్వర్యంలో ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి  గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు ఇతర ప్రముఖులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు‌. 5 వేల మంది విద్యార్థులు, యువకులు, పాల్గొని యోగాసలు వేశారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అని మంత్రి దామోదర రాజనర్సింహ  అన్నారు. మహర్షి పతాంజలి అందించిన అష్టాంగ యోగా విద్యలే నేటి యోగాకు ప్రాణాధారమని చెప్పారు. యోగా కేవలం వ్యాయామానికి సంబంధించింది కాదని.. శరీరం, మనస్సు, ఆత్మను ఏకం చేసే అద్భుత సాధమన్నారు. ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవన శైలితో బీపీ, షుగర్, క్యాన్సర్లు, కిడ్నీ సమస్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయన్నారు.  కోట్లు సంపాదించేవారికి కూడా ప్రశాంతత ఉండడం లేదని తెలిపారు. ఇలాంటి సమస్యలన్నింటికీ యోగా చక్కని పరిష్కార మార్గమని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. యోగా చేయడానికి కావాల్సిందల్లా సంకల్పం, మంచి గురువని చెప్పారు. రోజూ యోగా చేయడం వల్ల మానసిక ప్రశాతంత, శారీరక దృఢత్వం, ఏకాగ్రత పెరుగుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. యోగాను ప్రోత్సహించేందుకు 630 మంది యోగా గురువులను నియమించామని తెలిపారు. మరో 264 మంది యోగా గురువుల నియామక ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. హెల్త్ సబ్‌సెంటర్లలో రోజూ ఉదయం యోగా క్లాసులు నిర్వహిస్తుమని వెల్లడించారు
గచ్చిబౌలిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం Publish Date: Jun 21, 2025 12:01PM

విశాఖలో అట్టహాసంగా యోగా దినోత్సవం

    విశాఖ ఆర్కే బీచ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధాని ప్రజలతో కలిసి యోగా చేశారు. దాదాపు 15 వేల మందితో కలిసి ఆయన కాళీ మాత ఆలయం వద్ద యోగాసలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో కలిసి సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్ర మంత్రులు కేంద్రమంత్రులు యోగాసలు వేశారు.ఈ సందర్భంగా ప్రధానికి సీఎం చంద్రబాబు జ్ఞాపికను బహూకరించారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు.‘‘అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసింది. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయి. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ.  గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది. గ్రామగ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారు. యోగాకు వయసుతో పనిలేదు.. యోగాకు హద్దులు లేవు’’ అని మోదీ అన్నారు.అంతర్జాతీయ యోగా డే కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం లభించింది. ఒకే స్ట్రెచ్ లో మూడు లక్షల 20వేల మందికి పైగా యోగా చేయడం ప్రపంచంలోనే రికార్డు దీంతోపాటు 25,000 మంది గిరిజన విద్యార్థులు ఒకేచోట నిన్న చేసిన యోగాకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు కల్పిస్తూ ధ్రువపత్రాలను గిన్నిస్ రికార్డు ప్రతినిధులు అందజేశారు. నెలన్నర రోజుల్లో యోగాంధ్రను విజయవంతం చేయడంలో మంత్రి లోకేశ్‌ పాత్ర కీలకమైందని..నూతన కార్యక్రమాల రూపకల్పనలో ఆయన చొరవ ప్రశంసనీయమని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. ‘యోగా కేవలం వ్యాయామం కాదు.. అదొక జీవన విధానం. ఈ ఏడాది విశాఖలో యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం అద్భుతం’’ అని ప్రధాని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు
విశాఖలో  అట్టహాసంగా  యోగా దినోత్సవం Publish Date: Jun 21, 2025 11:40AM

యోగాలో శక్తివంతమైన ఆసనాలు ఏవంటే..!

యోగ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. యోగాలో చాలా రకాల ఆసనాలు ఉంటాయి. వాటిలో కొన్ని చాలా శక్తివంతమైనవి కూడా ఉన్నాయి.  యోగాలో శక్తివంతమైన (Powerful) ఆసనాలు  శరీరానికి శక్తిని, స్థిరతను, సౌష్టవాన్ని, ధైర్యాన్ని ఇచ్చే ఆసనాలు. ఇవి శారీరకంగా గట్టిగా ఉండటంతో పాటు మానసిక శాంతిని కూడా అందిస్తాయి. ఇవి శక్తి, సహనం, స్తైర్యం, ఫోకస్, ప్రాణశక్తి పెంచే విధంగా పనిచేస్తాయి. అలాంటి శక్తివంతమైన యోగాసనాలు ఏవో తెలుసుకుంటే.. శక్తివంతమైన యోగాసనాలు.. వీరభద్రాసనాలు..   వీరభద్రాసనాలలో మూడు రకాలు ఉన్నాయి.   ఇవి వేస్తుంటే శరీరానికి ధైర్యం, స్థైర్యం కలుగుతుంది. కాళ్ళు, చేతులు, వెన్నెముక బలపడతాయి. మనస్సు కేంద్రీకృతం అవుతుంది.  నౌకాసన (Boat Pose).. నౌకాసనం వస్తుంటే శరీరంలో మధ్య భాగం (core) శక్తివంతంగా తయారవుతుంది. అబ్డోమినల్ మసిల్స్, స్పైన్ బలపడతాయి. మానసిక దృఢత పెరుగుతుంది. బకాసన (Crow Pose).. బలమైన చేతులు, మోకాలుకు సపోర్ట్ కావాలంటే బకాసన వేయడం చాలా మంచిది. ఈ ఆసనం వేయడం వల్ల  ఫోకస్, సమతుల్యత అభివృద్ధి చేస్తుంది.  ధైర్యాన్ని పెంచుతుంది.  ఉర్ధ్వ ధనురాసనం (Upward Bow or Wheel Pose).. ఊర్థ్వ ధనురాసనం వేస్తే వెన్నెముక, గుండె, ఛాతీ తెరుచుకుంటాయి. ఇది  శక్తిని పంచుతుంది, ఉత్సాహం పెంచుతుంది. పరివ్రుత్త పర్వతాసన (Revolved Triangle Pose ) పరివృత్త పర్వతాసన వేయడం ద్వారా శరీరానికి లవణత (flexibility),  బలం ఇస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. శరీరాన్ని డిటాక్స్  చేయడంలో సహాయం చేస్తుంది.  అధో ముఖ శ్వానాసన (Downward Facing Dog).. అధోముఖ శ్వానాస వేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం పడుతుంది.  ఇది శక్తిని పునరుత్తేజితం చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చతురంగ దండాసన (Low Plank).. చేతులు, భుజాలు, మధ్య భాగం బలంగా తయారవుతాయి. శక్తిని కేంద్రీకరించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రాణాయామం తో కలిపితే.. శక్తివంతమైన ఆసనాలకు ప్రాణాయామం (విశేషంగా కపాలభాతి, బస్ట్రికా) తోడైతే శక్తి స్థాయి మరింత పెరుగుతుంది. సూచనలు: ఆసనాలు సాధన చేయడానికి ముందుగా మైల్డ్ వార్మప్ చేయాలి. శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యం. మొదట్లో శిక్షణ పొందిన గురువు సూచనతో చేయడం ఉత్తమం.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
యోగాలో శక్తివంతమైన ఆసనాలు ఏవంటే..! Publish Date: Jun 21, 2025 9:30AM

భారతీయుల ఆరోగ్య యోగానికి ఆది గురువు.. పతంజలి మహర్షి!

  ఈ రోజు యోగా డే అంటూ చాలా ఆడంబరంగా ఉత్సవాలలా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ప్రధాని మోడీ గారు అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా ఈసారి యోగా డే దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అందులోనూ అన్ని రాష్ట్రాల చూపులు విశాఖపట్నం ఆర్.కె బీచ్ వైపై ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఈ రోజు యోగా అనేది విదేశీయులను కూడా ఆకర్షించే అంశం అయిపోయింది.  ఇది మనిషి ఆరోగ్యానికి జీవనాడి అయ్యింది.  అయితే ఈ యోగాను భారతీయులకు అందించినది పతంజలి మహర్షి. అందుకే యోగా డే  సందర్బంగా ఆ మహనీయుడిని గుర్తుచేసుకోవడం భారతీయుల కర్తవ్యం. అలాగే..  యోగా కోసం పతంజలి మహర్షి చేసిన కృషి,  ఆయన చరిత్ర తెలుసుకుంటే.. పతంజలి మహర్షి చరిత్ర వృత్తాంతం  భారత సంస్కృతిలో ఒక గంభీరమైన, ఆధ్యాత్మికంగా ప్రేరణాత్మకమైన గాథ. ఇది పురాణ, ఇతిహాస, ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా వచ్చిందని చెప్పవచ్చు. ఆయన ఒక భగవద్భక్తుడు, తత్త్వవేత్త, గొప్ప పండితుడు. ఆయన్ను మూడు ముఖ్యశాస్త్రాలలో విపులమైన కృషి చేసినవాడిగా గుర్తిస్తారు . ఆ మూడు ఏమిటంటే.. యోగశాస్త్రం, వ్యాకరణం (సంస్కృత వ్యాకరణం),  ఆయుర్వేదం.  ఆయన చరిత్ర వృత్తాంతం..  ఆదిశేషునిగా అవతారం.. పతంజలి మహర్షి, విష్ణుమూర్తికి సేవ చేసే ఆదిశేషుని అవతారంగా పరిగణించబడతారు. ఒక సందర్భంలో, విష్ణుడు తన హృదయంలో శివుని ఆనందతాండవాన్ని దర్శించుకుంటుండగా, ఆదిశేషునికీ ఆ తాండవాన్ని చూడాలనే కోరిక కలిగిందట. అందుకు అనుగుణంగా  విష్ణుమూర్తి ఆదిశేషునికి భూలోకంలో అవతరించాల్సిందిగా సూచించాడు. గోనికా తపస్సు & పతంజలి అవతారం.. విష్ణుమూర్తి ఆదిశేవును భూలోకంలో అవతరించమని ఆదేశించి  సమయంలో గోనికా అనే పతివ్రత స్త్రీ, సూర్య భగవానుని ప్రార్థిస్తూ  లోకానికి ఉపయోగపడే బిడ్డ కావాలని తపస్సు చేస్తూ, చేతులలో నిండుగా నీటిని తీసుకుని అంజలి ఘటిస్తూ అంటే నమస్కారం చేస్తూ అర్చించుకుంటున్న  సమయంలో పాము రూపంలో ఆదిశేషుడు ఆమె చేతుల్లోకి పడిపోయాడట. అందువల్ల ఆ బాలుని పేరు పతంజలి (పతనము + అంజలి) అని ఉద్భవించింది. నటరాజుని తాండవ దర్శనం.. పతంజలి మహర్షి తన తల్లిదండ్రుల వద్ద పెరిగి, తర్వాత చిదంబరం వచ్చినాడు.  అక్కడ శివుడు నటరాజు రూపంలో తాండవం చేస్తున్నాడని తెలిసి. అతనికి శివుని తాండవాన్ని చూసే అవకాశం లభించింది. నంది, భృంగిలు అతని శరీరాకృతిపై హేళన చేసినా, అతను నోరుతో “నటరాజ నవకం” అనే స్తోత్రాన్ని గానం చేసి శివుని ఆనందింపజేశాడు. ఈ నటరాజ నవకం అనేది పూర్తీగా డమరుక శబ్దంతో ఉంటుంది. నటరాజ నవకం విని సంతోషించిన శివుడు నిన్నునాట్యంలో భాగం చేస్తాను బాధపడకు అని చెప్పి  శివుడు అతనిని తన పాదాల చుట్టూ చుట్టి తాండవంలో భాగస్వామిని చేశాడు.  ఇది పతంజలి మహర్షి  భగవత్‌ ప్రేమకు సంకేతం.  త్రికరణ శుద్ధి లక్ష్యంగా విద్యాబోధన.. శివుని ఆశీర్వాదంతో పతంజలి, భూలోకానికి త్రికరణ శుద్ధి  అంటే మనస్సు, వాక్కు, కర్మ అనేవి  సాధించేందుకు మూడు శాస్త్రాలను అందించాడు. యోగశాస్త్రం – మనస్సు శుద్ధి కోసం వ్యాకరణం – వాక్కు శుద్ధి కోసం ఆయుర్వేదం – శరీర శుద్ధి కోసం శిష్యులకు బోధన.. పతంజలి 1000 మందికి బోధన ఇవ్వాలనుకున్నాడు. అందరి అర్హతలు భిన్నంగా ఉండటంతో, ఓ తెర వెనుక ఆదిశేషురూపంలో బోధించాడు. తెర ఎత్తవద్దని చెప్పినా ఒక శిష్యుడు అతని నియమాన్ని ఉల్లంఘించి తెర తీసేశాడు. దీంతో 999 మంది విద్యార్థులు కాలిపోయారు. మిగిలిన శిష్యుడికి పతంజలి మొత్తం విద్యను బోధించాడు, కాని అతను శాపగ్రస్తుడై బ్రహ్మ రాక్షసుడయ్యాడు. శిష్యుడిని శాప విముక్తుడిని చేసిన ఘట్టం.. ఆ బ్రహ్మ రాక్షసుడు జ్ఞానాన్ని బోధించగల అర్హుడిని వెతుకుతూ, సరైన జవాబు చెప్పని వారిని మింగేవాడు. చివరికి పతంజలి మహర్షి స్వయంగా శిష్యుడి రూపంలో (చంద్రశర్మగా) వచ్చి, సరైన సమాధానం ఇచ్చి, జ్ఞానం తీసుకొని శిష్యుడిని శాపం నుండి విముక్తుణ్ని చేశాడు. ఆ రాక్షసుడు తరువాత గౌడపాదాచార్యుడుగా అవతరించాడు. ఆయన రచనలు.. యోగ సూత్రాలు (196 సూత్రాలు) – యోగ దార్శనికశాస్త్రానికి ప్రామాణిక గ్రంథం. మహాభాష్యం – పాణినీ వ్యాకరణంపై వ్యాఖ్యాన గ్రంథం. ఆయుర్వేదానికి సంబంధించిన రచనలకూ ఆయనకు ఆపాదించబడింది, కానీ ఆధారాల పరంగా స్పష్టత లేదు.  జీవసమాధి స్థలం.. పతంజలి మహర్షి జీవసమాధి స్థలం తమిళనాడు, తిరుపత్తూరు (త్రిచీ దగ్గర)లోని బ్రహ్మపురీశ్వర ఆలయంలో ఉంది.  ప్రార్థన శ్లోకం.. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన। యోఽపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోఽస్మి॥ మనస్సు, వాక్కు, శరీరం శుద్ధి కోసం పతంజలిని ప్రణమిస్తాను అని ఈ ప్రార్థన అర్థం.                                     *రూపశ్రీ
భారతీయుల ఆరోగ్య యోగానికి ఆది గురువు.. పతంజలి మహర్షి! Publish Date: Jun 21, 2025 9:30AM