కాలి పిక్కల నొప్పికి కారణాలు..

  మీ కాళ్ళ లో పిక్కలలో నొప్పులు ఉంటె అది పెరిఫెరల్ హార్ట్ డిసీజ్ అని మీకు తెలుసా?... మీ కాళ్ళలో క్రామ్ప్స్ వస్తే అది ప్యాడ్ కావచ్చు స్ట్రాన్ ఫర్డ్ కు చెందిన ఒక ప్రముఖ నటుడు జాసన్ గ్రే హస్రత్ ఫైల్యూర్ అయ్యింది. గిన్నెలు శుభ్రం చేస్తున్న ఒక వృద్ధురాలికి గుండె ఏమైంది. దీనికి కారణం ఏమిటి ఈ అంశం పై మరింత సమాచారం మీకోసం. మీ కాళ్ళలో క్రామ్ప్స్ వస్తున్నాయా? మీరు వ్యాయామం చేస్తున్న ప్పుడు మీ కాళ్ళు మరింతగా నొప్పికి గురి అయ్యుంది అంటే అది ప్యాడ్ అని అంటున్నారు నిపుణులు. ప్యాడ్ అంటే... ప్యాడ్ అంటే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ దీనిని తక్షణం పరీక్షించుకోవాలి.అని నిపుణులు సూచిస్తున్నారు.పెరిఫెరల్ హార్ట్ డిసీజ్ రావడానికి కారణం మీ ఆర్టరీ లో ఫ్లాక్స్ వృ ద్ది కావడమే. అలా మీ కాళ్ళలో ఫ్లాక్స్ ఉంటె అది మీ రక్త ప్రసారానికి నియంత్రిస్తుందని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వృద్ధులు 6౦ -నుండి 7౦ సంవత్సరాల వారి పై దీని ప్రభావం 1౦ %మాత్రమే  ఉంటుంది.ప్యాడ్ తీవ్రంగా ఉన్న కేసుల్లో ఫ్లాక్స్ లేదా క్లాట్స్ వల్ల ఒక్కోసారి కాలు తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. అని అంటున్నారు  పెంస్ట్ ల్ కు చెందినా డాక్టర్ మేత్యుస్ సిం డ్రిక్ వ్యాస్క్యులర్ సర్జన్. ఈ విషయం స్పష్టం చేసారు. ప్యాడ్ -లక్షణాలు... ప్యాడ్ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ తోలిదశలో లక్షణాలు కనపడవు. సహజంగా తరచుగా కాళ్ళలో నొప్పి వస్తూ ఉంటుంది.కారణం మీ కండరానికి సరిపడా ఆక్సిజన్ లేదా న్యుట్రీ షియన్  అందకపోయి ఉండవచ్చు. ప్యాడ్స్ బాగా వృద్ది చెందితే చాలా తీవ్రంగా ఉంటుంది. ఫ్లాక్స్ ఒక కాలు,లేదా రెండు కాళ్ళ లోనూ రావచ్చు.వ్యాయామం  చేస్తున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు తీవ్రంగా నొప్పి రావచ్చు. కారణం మీ కండరాలకు ఆక్సిజన్ అందక పోవడమే అది మరింత వృధీ చెందితే అక్కడ గాయాలు మొదలు అవుతాయి. ఆప్రదేశంలో గడ్డలు ఫ్లాక్స్ ఏర్పడతాయి. లేదా పాదాలలో గాయం మానదు. అదే పనిగా కాళ్ళలో నొప్పులు వస్తే లేదా కాళ్ళ లో స్పందన లేకపోవడం తిమ్మిరి పట్టింసట్లుగా ఉంటె అది గ్యాంగ్రిన్ కావచ్చు. వ్యాస్క్యులర్ సమస్యలు పెరుగుతూ పోతాయి.సరైన నిర్ధారణ డయాగ్నోసిస్ లేకుండా రోగులకు గాయాలు అయినవారికి పదాలలో వచ్చే గాయాలు మానవు. ఈ అంశం పై సిండ్రిక్ పెన్ స్టేట్ విడుదల చేసింది. ప్యాడ్ ను సత్వరం గుర్తించిన వెంటనే దానిని మధ్యలోనే చికిత్స చేయాలి.ప్యాడ్ కు సంబందించిన లక్షణం కనపడగానే మీరు మీ డాక్టర్ ను సంప్రదించాలి. అది మీరు తీసుకునే ఆహారం లో మార్పులు వ్యాయామం మందులు పద్దతులు ఉపయోగించి బ్లాక్  అయిన  ఆర్టరీ కి చికిత్స చేస్తారు. ప్యాడ్ లో మీ జన్యుపరమైన అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి 5 గురిలో 4 గురికి ప్రమాదం లో ఉన్నట్లే. పొగ త్రాగడం హై బిపి కొలస్త్రాల్ హై బ్లడ్ షుగర్ డయాబెటీస్ ఉంటె ప్రామాదమే అని అంటున్నారు. నిపుణులు. పొగ తాగారో అది మీ కాళ్ళ నొప్పులు ఫ్లాక్స్ ను దగ్గరుండి మరీ నడిపిస్తుంది. ప్యాడ్ ఉన్న వారిలో ఒక వేళ రక్త ప్రవాహం నిలిచిపోతే వ్యాయామం చేయడం ముఖ్యం . ఈ సమస్యనుండి బయట పడడానికి డాక్టర్ ను సంప్రదించాలి శస్త్ర చికిత్స చేయాల్సి వస్తే దీర్ఘకాలిక ప్రయోజనం ఏమిటి అన్న విషయాన్ని పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. కాళ్ళ నొప్పులే కదా అని నిర్లక్ష్యం చేసారో భారీ మూల్యం తప్పదు.                                      
Publish Date: Mar 19, 2024 1:10PM

ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికల కోడ్ వర్తించదా?

ఆంధ్రప్రదేశ్ లో అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి మీడియా సమావేశం ఏర్పాటు కేసి మరీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేశారు. ఈ ప్రకటనతో దేశం అంతటా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని చెప్పారు. అయితే ఏపీలో మాత్రం ఎన్నికల కోడ్ అమలు అవుతున్న పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైసీపీ ఆగడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు వైసీపీ కార్యకర్తలుగానే వ్యవహరిస్తున్నారు. వైసీపీ దాడులకు గురైన బాధితులు ఫిర్యాదులు చేస్తే.. పోలీసలు మాత్రం బాధితులపైనే ఎదురు కేసులు పెడుతున్నారు. దాడులు చేసిన వారు దర్జాగా తిరుగుతున్నారు. ఇక ఫ్లెక్సీల తొలగింపు విషయానికి వస్తే.. పోలీసువారి పహారాతో అధికారులు సెలక్టివ్ గా తెలుగుదేశం, జనసేన ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారు. వైసీపీకి చెందిన ఫ్లెక్సీల జోలికి వెళ్లడం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నా.. ఎన్నికల సంఘం కళ్లకు మాత్రం కనిపించడం లేదు.   అన్నిటికీ మించి అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాల కంటే జగన్ మోహన్ రెడ్డి సేవలో తరించడమే ముఖ్యమన్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర సచివాలయ అధికారులు జగన్ సేవ కోసం ఎన్నికల కోడ్ ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తుందన్న బెదురు వారిలో కనిపించడం లేదు. ఎన్నికల సంఘం పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ రాదన్న ధీమాయో ఏమో.. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి నాలుగు రోజులు గడిచినా ఇప్పటి వరకూ ఏపీ స్టేట్ పోర్టల్ నుంచి ముఖ్యమంత్రి జగన్, ఆయన కేబినెట్ మంత్రుల ఫొటోలను ఇంకా తొలగించలేదు.  అలాగే వైసీపీ  నవరత్నాల పథకాల లోగో, సంక్షేమ పథకాల వివరాలు అలాగే కొనసాగుతున్నాయి. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన   48 గంటల్లోగా అన్ని ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచి రాజకీయ పార్టీ నేతల ఫొటోలను తొలగించాలి. అలా తొలగించకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ఏపీలో మాత్రం అవేమీ జరగడం లేదు.  అంతే కాదు.. చివరికి టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పంపిణీ చేసే ప్యాడ్ లతో కూడా వైసీపీ ప్రచారం జోరుగా సాగుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే కోడ్ ను ఉల్లంఘించి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను పంపిణీ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఆర్డీవో ఆ ప్యాడ్ లను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసి కూడా ఎమ్మెల్యే అనుచరుల బెదరింపులకు తలొగ్గి వాటిని ఉపంసంహరించుకున్నారని తెలిసింది.  ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్నికల కోడ్ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. అడ్డుకోవలసిన అధికార యంత్రాంగం చేతులెత్తేసింది.   ఏపీకి ఎన్నికల కోడ్ వర్తించదా అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. 
Publish Date: Mar 19, 2024 10:51AM

మాటలొస్తే చాలు రాజ్యం నీదే!

మనిషిని ఆకట్టుకునేది మాట! మనిషి వ్యక్తిత్వాన్ని సుస్పష్టం చేసేది మాట! మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది మాట! ఇట్లా మాట మనిషిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అయితే అదే మాట తూటా లాగా ఇతరులను గాయపరుస్తుంది! ఆవేశంలో బయటకు వచ్చేమాట ఆయుధం కన్నా పదునైనది. అందుకే కోపం, ఆవేశం ఉన్నపుడు మౌనంగా ఉండటం ఎంతో ఉత్తమం. చాలామంది కొన్ని సార్లు ఎంతో ఆత్మీయులు, మరెంతో కావలసినవాళ్ళ దగ్గర ఏదైనా చిన్న తగాదా వచ్చినప్పుడు ఆవేశంలో ఏదో ఒకటి అనేస్తారు, ఆవేశం కాస్తా చల్లారిపోయాక తాము ఏమి మాట్లాడాము అనేది మరోసారి విశ్లేషించుకున్నాక అప్పుడు తెలుస్తుంది ఎంత అవివేకమైన పని చేశామో అని. కానీ అప్పుడు ఆ తప్పును తిరిగి ఒప్పుకున్నా, అవతల మనిషి మనసుకు అయిన గాయం అంత తొందరగా మానిపోదు. బహుశా కొందరిని ఆ మాటల తాలూకూ గుర్తులు జీవింతాంతం వెంటాడి మీకు దూరంగా ఉండేలా నిర్ణయం తీసుకునేందుకు ప్రేరేపించవవచ్చు కూడా. మాట మనిషికి ఆభరణం! నిజంగా నిజమే! మనిషి మాట్లాడే మాట ఆ మనిషి ఏంటి అనేది తెలుపుతుంది. ఆవేశం, కోపం, అసహనం చిరాకు ఇలాంటివన్నీ దరిదాపులకు రానివ్వకుండా మాట్లాడగలగడం కొందరికే సాధ్యమని అనుకుంటారు కానీ ప్రయత్నిస్తే ఎవరైనా వీటిని సాదించగలరు. ఎన్నో కంపెనీలు ఈ రకమైన క్వాలిటీస్ ఉన్న అభ్యర్గులకె ఉద్యోగాలు ఇవ్వడం గమనిస్తూనే ఉన్నాం కూడా.  మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కేవలం ఉద్యోగ సంస్థలలో పనిచేసేవాళ్లకు మాత్రమే కాదు, జీవిత ప్రయాణంలో ప్రతి మనిషి ఉత్తమంగా ఉండేందుకు కూడా అవసరం.  మనం ప్రతిరోజు ఎన్నో పనుల దృష్ట్యా కొత్త వాళ్ళతో మాట్లాడాల్సి రావచ్చు, కొందరిని కాంప్రమైజ్ చేయాల్సి రావచ్చు, అందరి దగ్గరా ఓకేవిధంగా మాట్లాడలేం కదా! అన్ని తెలుసుకుని అడుగేసేవాడు ఉత్తముడని పెద్దల మాట. కాబట్టే మాట్లాడటం అనేది కూడా ఒక కళ అన్నారు. మాటకు మెరుగులు దిద్దేది మనిషి ముఖంలో సన్నని చిరునవ్వు. నవ్వుతూ పలకరించడం అవతలి వ్యక్తిని పర్ఫెక్ట్ గా రిసీవ్ చేసుకోవడమే. అయితే ఇది అన్ని చోట్లా, అన్ని వేళలా పనికిరాదు.  సందర్భాలు, సంఘటనలు, అవతలి వ్యక్తి మూడ్ ని బట్టి మాట్లాడాలి. చాలామంది చేసే పని ఏమిటంటే తమ మూడ్ ని బట్టి మాట్లాడుతుంటారు కానీ అది వంద శాతం తప్పు. మన మూడ్స్ ను ఇతరుల మీద చూపించకూడదు. మాటలో వినయం ఉండాలి. ఎదుటివారు చిన్న వాళ్ళు అయినా పెద్దవాళ్ళు అయినా గౌరవించి మాట్లాడాలి. పిచ్చిపిచ్చిగా దిక్కులు చూస్తూ, గట్టిగా నవ్వుతూ ఎప్పుడూ మాట్లాడకూడదు. సన్నని నవ్వుతో, మాట్లాడేటప్పుడు విషయాన్ని వీలైనంత వరకు సాగతీయకుండా తొందరగా ముగించాలి. ముఖ్యంగా కొత్తవాళ్ళ దగ్గర ఎప్పుడూ పిచ్చాపాటి కబుర్లు చెప్పకూడదు. మరొకరిని తక్కువ చేసి మాట్లాడటం ఎంత తప్పో, అనవసరంగా పనిపెట్టుకుని పొగడటం కూడా అంతే తప్పు.  పార్టీలలో తింటూ తాగుతూ మాట్లాడుకోవడం కామన్. అయితే నోట్లో ఏదైనా ఆహారపదార్థం ఉన్నపుడు, లేదా ఏదైనా తాగుతూ నోట్లో ఉన్నపుడు మాట్లాడకూడదు. దీనివల్ల నోట్లో లాలాజలం ఎదుటివారి మీద పడే అవకాశాలు ఉంటాయి. నోరు కాళీ చేసుకున్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. అలాగే పూర్తిగా పళ్ళు ఇకిలించి నవ్వుతూ మాట్లాడకూడదు. సన్నని నవ్వుతో మాట్లాడాలి. అలాగని మరీ చిన్న గొంతుతో మాట్లాడటం వల్ల ఎదుటివారు కాస్త అర్థం చేసుకోవడానికి ఇబ్బంది కావచ్చు. కాబట్టి స్పష్టంగా, మధ్యస్థ గొంతుతో, చెప్పాలనుకునే విషయాన్ని చెప్పాలి. హుందాగా ఉండాలి. అడ్డదిడ్డంగా, వంకర్లు తిరిగిపోతూ మాట్లాడకూడదు. మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని మాత్రమే చూస్తూ మాట్లాడాలి. అపుడపుడు తల అటు ఇటు కదిలించినా పర్లేదు కానీ అసలు ఎదుటి వ్యక్తికంటే చుట్టూ పరిసరాలను గమనించుకుంటూ ఉండటానికి ఎక్కువ సమయం కేటాయించకూడదు. అలా చేస్తే ఎదుటి వాళ్ళను అవమానించినట్టు అవుతుంది. ఏదేమైనా మాట్లాడటం కూడా ఒక కళ. దాన్ని ఆచరణలో పెట్టేవాళ్లు నలుగురిని తమవైపు చాలా సులువుగా ఆకట్టుకోగలరు. ◆ వెంకటేష్ పువ్వాడ  
Publish Date: Mar 19, 2024 10:30AM

మంగళగిరిలో లోకేష్ మ్యాజిక్!.. అనుమానం లేదు విజయం చినబాబుదే!

మంగళగిరి.. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఏపీలో హాట్ సీట్ అనడంలో సందేహం లేదు. ఔను రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టీ మంగళగిరి నియోజకవర్గంపైనే ఉంది.  నిన్న మొన్నటి వరకూ మంగళగిరిలో  ఏ పార్టీ పరిస్థితి ఏమిటి?  అన్న చర్చ జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం అసలు పార్టీల పరిస్థితి ఏమిటన్న ముచ్చటే లేదు. ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థి లోకేష్ విజయం పక్కా అన్నదే అందరి భావన.  వాస్తవానికి మంగళగిరి ఎప్పడూ తెలుగుదేశం పార్టీకి ఫేవరెట్ సీటు కాదు. నియోజకవర్గం ఆవిర్భావం తరువాత.. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో విజయం సాధించింది కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే. అదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే రాష్ట్ర విభజన తరువాత ఇప్పటి వరకూ జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. 1985 తరువాత మంగళగిరి నియోజవకర్గంలో తెలుగుదేశం గెలిచింది లేదు.   అలాంటి అంటే తెలుగుదేశంకు అంతగా అచ్చిరాని మంగళగిరి నియోజకర్గం నుంచి నారా లోకేష్   ప్రత్యక్ష రాజకీయ ఎన్నికల బరిలోకి ఎంట్రీ ఇచ్చారు. అవును తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం అధినేత తనయుడిగా గత ఎన్నికలలో లోకేష్ పోటీ చేయదలచుకుంటే పార్టీకి కంచుకోట వంటి నియోజకవర్గాన్ని ఎన్నికుని పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. లోకేష్ మాత్రం సవాల్ స్వీకరించేందుకే మొగ్గు చూపారు. పార్టీకి అంతగా అనుకూలం కాని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎన్నికుని ఆయన 2019 ఎన్నికలలో పోటీకి దిగారు. అలా దిగడం ద్వారా లోకేష్  ఎలాంటి పరిస్థితులనైనా, పోటీనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని చాటారు. ఆ ఎన్నికలలో పరాజయం పాలైనా, వెనకడుగు వేయలేదు.  నియోజకవర్గాన్ని వదలలేదు. అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ, నియోజకవర్గ సమస్యలపై అలుపెరుగని పోరు సాగించారు. మరో సారి అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.  మామూలుగా అయితే మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం విజయాల హిస్టరీ చూసి, అక్కడ నుంచి ఒకసారి ఓటమి పాలై కూడా మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటే టన్నలు కొద్దీ ధైర్యం ఉండాలి.  ప్రజలను ఆకట్టుకుని ఓడిన చోటే విజయకేతనం ఎగురవేయగలనన్న ధీమా ఉండాలి. మంగళగిరి నియోజకవర్గం నుంచే 2024 ఎన్నికలలో పోటీకి రెడీ అవ్వడం ద్వారా ఆ రెండూ తనలో పుష్కలంగా ఉన్నాయని లోకేష్ రుజువు చేసుకున్నారు.   ఓడిన చోటనే మళ్ళీ గెలిచి తానేంటో నిరూపిస్తానంటూ ముందుకు అడుగేశారు. చరిత్రను తిరగరాసి తండ్రి చంద్రబాబుకు బహుమతి ఇస్తానంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.  ఇక లోకేష్ గత ఐదేళ్లుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకమైన తీరు గమనించిన పరిశీలకులు ఇప్పుడు తెలుగుదేశం గెలుపు గ్యారంటీ స్థానాలలో మంగళగిరిని మొదటి స్థానంలో చెబుతున్నారు.  గత ఐదేళ్లుగా నారా లోకేష్ ఇక్కడ  పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.   పరిశీలకులైతే మంగళగిరిలో వైసీపీ అడ్రస్ గల్లంతేనని విశ్లేషిస్తున్నారు. అందుకు ఉదాహరణగా వైసీపీ మంగళగిరిలో రెండు నెలల వ్యవధిలో ఇద్దరు అభ్యర్థులను మార్చి మూడో అభ్యర్థిని తెరపైకి తీసుకురావడాన్ని చూపుతున్నారు.  స్వయంగా వైసీపీ అధినేత జగన్  దృష్టి పెట్టి గెలుపు గుర్రాలంటూ ఒకరిని  కాదని మరొకరిని మంగళగిరి అభ్యర్థిగా మార్చి మార్చి ప్రకటిస్తున్నా.. నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆకాశమే హద్దుగా హామీలు గుప్పిస్తున్నా  ఇక్కడ వైసీపీ నుంచి వలసలు వరదల్లా పెరుగుతున్నాయి.   మంగళగిరిని అగ్రస్థానంలో నిలపడమే  లక్ష్యమంటున్న యువనేత లోకేష్ వ్యాఖ్యలకు నియోజకవర్గ ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది.  వైసిపికి చెందిన నాయకులతోపాటు తటస్థులు సైతం  పెద్దఎత్తున తెలుగుదేశంలో చేరుతున్నారు.  జగన్ నాయకత్వంపై విశ్వాసం కోల్పోయిన  వైసిపి నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం బాట పడుతున్నారు. ఇక జనం అయితే ఎప్పుడో లోకేషే మా ఎమ్మెల్యే అన్న నిర్ణయానికి వచ్చేశారు.    అంతేనా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి వైసీపీనీ వీడి తెలుగుదేశం గూటికి చేరేందుకు వస్తున్న వారి సంఖ్య  మేడారం జాతరను తలపించేలా ఉందని పరిశీలకులు సైతం అంటున్నారంటే లోకేష్ నియోజకవర్గంపై ఎంతటి ప్రభావం చూపారో అర్ధం అవుతోంది.   మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ గా మార్చడమే లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని  నారా లోకేష్  చెబుతున్న మాటలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.  తండోపతండాలుగా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోవడానికి జనం తరలి వస్తున్నారు. ఒరవడి ఇలాగే కొనసాగితే.. మంగళగిరిలో వైసీపీకి క్యాడర్ మిగిలే అవకాశాలూ అనుమానమేనని అంటున్నారు.  అయినా లోకేష్ క్షణం విశ్రమించడం లేదు. తటస్థులను మర్యాదపూర్వకంగా కలుస్తూ,  మంగళగిరి అభివృద్ధికి సంబంధించి తన వద్ద ఉన్న ప్రణాళికను వివరిస్తున్నారు.    తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మంగళగిరి ప్రజలంతా గర్వపడేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతానని ఆయన చెబుతున్న మాటలు విశ్వసిస్తున్నారు.  పరిశీలకులు మంగళగిరిలో లోకేష్ పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాభిమాన్ని చూసి నియోజకవర్గంలో లోకేష్ మ్యాజిక్ చేశారని విశ్లేషిస్తున్నారు.  
Publish Date: Mar 19, 2024 10:05AM

ఏపీలో తెలుగుదేశం కూటమిదే హవా!.. తేల్చేసిన మరో జాతీయ సర్వే!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమిదే అధికారమని మరో జాతీయ సర్వే సంస్థ తేల్చేసింది. ఏపీలో అధికార వైసీపీ ఈ సారి ఎన్నికలలో గణనీయంగా నష్టపోతున్నదని పేర్కొంది. రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నాయని కుండబద్దలు కొట్టింది.అదే విధంగా తెలుగుదేశం కూటమి 18 స్థానాలలో విజయకేతనం ఎగురవేయనున్నట్లు స్పష్టం చేసింది.  ఏపీలో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది.   ఏపీలో ఈ సారి జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఏపీ ఎన్నికలపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇటువంటి తరుణంలో తాజాగా టీవీ-సీఎన్ఎక్స్ నిర్వహించిన సర్వే ఫలితం సంచలనం సృష్టిస్తోంది. ఈ సర్వే   ఏపీలో రాబోయేది తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమేనని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందన్ని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 17 లోక్ సభ స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తుందని అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం పాతిక లోక్ సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో తెలుగుదేశం పార్టీ 17 స్థానాలలో పోటీ చేయనుంది. తెలుగుదేశం పార్టీ పోటీ చేసే 17 స్థానాలలో 14 స్థానాలలో విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. అలాగే కూటమిభాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీ వరుసగా రెండు, ఆరు స్థానాలలో పోటీ చేయనున్నాయి. జనసేన పోటీ చేసే రెండు స్థానాలలో ఒక స్థానంలో విజయం సాధిస్తుందనీ, ఇక బీజేపీ పోటీ చేసే ఆరు స్థానాలలో రెండింటిలో గెలుస్తుందనీ సర్వే పేర్కొంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పాతిక స్థానాలకు గానూ కేవలం ఎనిమిది స్థానాలలోనే విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.  అంటే కూటమి రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో  17 స్ధానాలను కేవసం చేసుకుంటుంది. అధికార వైసీపీ ఎనిమిది స్థానాలకు పరిమితమౌతుంది.   ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే తెలుగుదేశం 114 స్థానాలలో పోటీ చేస్తుండగా, బీజేపీ పది స్థానాలలో, జనసేన 21 స్థానాలలో అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి.  వైసీపీ 175 నియోజకవర్గాలలోనూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. రాష్ట్రంలో పోటీ ప్రధానంగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, వైఎస్ జనగ్ నేతృత్వంవలోని వైసీపీ మధ్యే ఉంటుందని సర్వే స్పష్టం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావాలని చూస్తున్నది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టిన షర్మిల ఏపీలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు శతధా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు వరకూ రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ ఆ తరువాత బలహీనపడి ఉనికి మాత్రంగా మిగిలిన సంగతి తెలిసిందే. కాగా రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభావం స్వల్పంగానే ఉంటుందనీ, ఆ పార్టీ గెయిన్ చేసే ఓట్లు వైసీపీకి నష్టం చేస్తాయనీ సర్వే అంచనా వేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలలో అధికార కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలలోనూ, బీజేపీ 5, బీఆర్ఎస్ 2, ఎంఐఎం ఒక స్థానంలోనూ గెలిచే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.  
Publish Date: Mar 19, 2024 9:25AM