ఇంట్లో షుగర్ టెస్ట్ చేసుకునేవారు చేసే బిగ్ మిస్టేక్స్ ఇవే..!

డయాబెటిస్ రోగులు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెరను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. దీని సహాయంతో మందులను సక్రమంగా తీసుకుంటూ ఉండటమే కాకుండా ,  ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి,    తీవ్రమైన సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో గ్లూకోమీటర్‌తో చక్కెర స్థాయిని తనిఖీ చేసుకుంటూ ఉంటారు.  ఇది ఆరోగ్యానికి మంచిదే.  కానీ చాలాసార్లు ఈ పరీక్ష తప్పుగా జరుగుతోందని డయాబెటిస్ నిపుణులు అంటున్నారు.  దీని కారణంగా రీడింగ్ కూడా తప్పుగా వస్తుంది. ఇంట్లో రక్తంలో చక్కెరను తనిఖీ చేసేటప్పుడు  చాలామంది చేస్తున్న తప్పులేంటి? వాటిని ఎలా నివారించాలి?తెలుసుకుంటే.. చేతులు కడుక్కోకపోవడం.. చాలా మంది చేతులు కడుక్కోకుండానే పరీక్షలు చేసుకుంటారు. చెమట, నూనె లేదా చేతులపై చిన్న ఆహారం ముక్క కూడా తప్పుడు రీడింగ్ ఇస్తుంది. అందువల్ల, రక్తంలో చక్కెరను తనిఖీ చేసే ముందు ఎల్లప్పుడూ  చేతులను సబ్బుతో కడుక్కోవాలి.  చేతులు పూర్తీగా ఆరిన తరువాత పరీక్ష చేసుకోవాలి.   వేలు గుచ్చడానికి ప్రతిసారీ ఒకే వేలును ఉపయోగించడం.. ప్రతిసారీ ఒకే ప్రదేశం నుండి రక్తాన్ని తీయడం వల్ల అక్కడి చర్మం కఠినంగా మారుతుంది. దీని వల్ల  రక్తాన్ని తీయడం కష్టమవుతుంది. వేళ్లను మారుస్తూ ఉండాలి.  ఒకే వేలును పదే పదే ఉపయోగించకూడదు. పాత స్ట్రిప్స్ వాడకం.. టెస్ట్ స్ట్రిప్స్ కు గడువు తేదీ ఉంటుంది. చాలా సార్లు  పాత లేదా తేమతో కూడిన స్ట్రిప్స్ వాడతారు. ఇది తప్పు రీడింగ్ లను ఇస్తుంది. స్ట్రిప్స్ ను ఎల్లప్పుడూ పొడి,  చల్లని ప్రదేశంలో ఉంచాలి.  అలాగే  గడువు తేదీని తనిఖీ చేసుకుంటూ ఉండాలి. రక్త నమూనా తీసుకోవడానికి ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం.. కొన్నిసార్లు రక్తం బయటకు రానప్పుడు,  వేలిని చాలా గట్టిగా నొక్కుతారు, ఇది కణజాల ద్రవాన్ని రక్తంతో కలిపి రీడింగ్‌ను ప్రభావితం చేస్తుంది. మృదువుగా  గుచ్చాలి.  అవసరమైతే చేతిని కొద్దిగా రబ్ చేయాలి,  లేదా క్రిందికి వంచాలి. తప్పు సమయంలో తనిఖీ చేయడం.. ఖాళీ కడుపుతో, భోజనం చేసిన 2 గంటల తర్వాత లేదా నిద్రపోయే ముందు రక్తంలో చక్కెరను తనిఖీ చేయడానికి సరైన సమయం. తప్పు సమయంలో తనిఖీ చేయడం వల్ల నివేదిక గందరగోళంగా మారే అవకాశం ఉంటుంది. ఇది తీసుకునే ఆహారం గురించి, వాడాల్సి మందుల గురించి కూడా గందరగోళం క్రియేట్ చేస్తుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
Publish Date: Jul 12, 2025 10:30AM

మోషన్ సిక్నెస్..  లాంగ్ జర్నీలలో వాంతుల భయమా? ఒక రోజు ముందు ఇలా చేయండి..!

  లాంగ్ జర్నీ చాలామందికి ఇష్టం. అయితే అనుకున్న సులువుగా వీటిని ప్లాన్ చేయడానికి ధైర్యం సరిపోదు.  దీనికి కారణం మోషన్ సిక్నెస్. దీన్నే వాంతుల సమస్య, తల తిరగడం అంటారు. ప్రయాణంలో  వాంతులు లేదా తల తిరుగుతున్నట్లు అనిపిస్తే ప్రయాణంలోని సరదా అంతా పాడైపోతుంది. మోషన్ సిక్‌నెస్ అనేది ఒక సాధారణ సమస్య, ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు,  స్త్రీలలో సర్వసాధారణం. బస్సు, కారు, రైలు లేదా విమానం..ఇలా ప్రయాణం ఎందులో అయినా సరే..  ప్రయాణించేటప్పుడు మన చెవులు, కళ్ళు,  శరీర సమతుల్యత అసౌకర్యానికి లోనైనప్పుడు , వికారం, చెమట, తల తిరగడం,  వాంతులు వంటి పరిస్థితులు తలెత్తుతాయి. అయితే ఒక రోజు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ మోషన్ సిక్నెస్ కు చెక్ పెట్టవచ్చు. ప్రయాణాన్ని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. ఆహారం.. ప్రయాణానికి ఒక రోజు ముందు భారీ, వేయించిన,  కారంగా ఉండే ఆహారాన్ని తినకుండా ఉండాలి. ఇది కడుపులో భారంగా మారుతుంది,  గ్యాస్ లేదా ఆమ్లత్వం కారణంగా  అనారోగ్యం పెరుగుతుంది. తేలికైన, సులభంగా జీర్ణమయ్యే,  ఫైబర్ ఆధారిత ఆహారాన్ని తినాలి. నిద్ర.. అలసట,  నిద్ర లేకపోవడం శరీరాన్ని బలహీనపరుస్తుంది. ఇది ప్రయాణ సమయంలో తలనొప్పి లేదా వాంతులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రయాణానికి ఒక రోజు ముందు తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. మందులు.. గతంలో మోషన్ సిక్‌నెస్ చాలాసార్లు జరిగి ఉంటే వైద్యుల సలహా మందులు వాడవచ్చు. ప్రయాణానికి 30-60 నిమిషాల ముందు వైద్యులు సిఫార్సు చేసిన మందులు  తీసుకోవాలి.  తద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది. అల్లం లేదా నిమ్మకాయ నీరు.. అల్లం,  నిమ్మకాయ రెండూ కడుపుని శాంతపరచడానికి సహజ నివారణలు. అల్లం టీ లేదా గోరువెచ్చని నిమ్మకాయ నీరు ఒక రోజు ముందుగానే తీసుకోవడం మంచిది. ఇది వికారం అవకాశాలను తగ్గిస్తుంది. ముఖ్యమైన వస్తువులు.. ప్రయాణానికి ఒక చిన్న బ్యాగును సిద్ధంగా ఉంచుకోవాలి.   అందులో వాంతి బ్యాగ్, టిష్యూ పేపర్, పుదీనా క్యాప్సూల్స్, మౌత్ ఫ్రెషనర్,  వాటర్ బాటిల్ ఉండాలి.  మార్గంలో ఏదైనా అసౌకర్యాన్ని ఎదుర్కొంటే ఈ వస్తువులు సహాయపడతాయి.                                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
Publish Date: Jul 11, 2025 10:30AM

ఈ ఇంటి చిట్కా ఫాలో అయితే చాలు.. మోకాళ్ల నొప్పి మాయం కావడమే కాదు.. చకచకా నడిచేస్తారు!

  మోకాళ్ల నొప్పులు ప్రజల జీవితాన్ని కష్టతరం చేస్తాయి. దీని కారణంగా, లేవడం, కూర్చోవడం,  నడవడం నుండి రోజువారీ పనులు చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. మోకాళ్లలో నిరంతరం నొప్పితో బాధపడే వారు ఈ సమస్యకు సర్జరీ లేదా చాలా తీవ్రమైన చికిత్సలతో తప్ప నయం కాదని అనుకుంటూ ఉంటారు.  అయితే ఇంటి చిట్కాతో మోకాళ్ల నొప్పిని ఈజీగా తగ్గించవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.  ఈ చిట్కా వల్ల మోకాళ్ల నొప్పి తగ్గడమే కాదు.. హాయిగా చకచకా తిరిగేసేంత శక్తి మోకాళ్లకు వస్తుంది అంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో తెలుసుకుంటే.. మోకాళ్లలో వాపు, మోకాళ్లు బిగుసుకుపోయినట్టు ఉండటం,   నొప్పి ఎక్కువగా ఉండటం  వంటి సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక పురాతన  పేస్ట్ ఉంది.    దానిని మోకాలి నొప్పి ఉన్న  ప్రాంతంపై పూసి రాత్రంతా అలాగే ఉంచాలి.  ఉదయం నిద్రలేచిన తర్వాత  చాలా ఉపశమనం కలుగుతుందట. ఈ ఆయుర్వేద పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..   పేస్ట్ తయారీ విధానం.. మోకాలి నొప్పి నుండి సహజ ఉపశమనం పొందడానికి,  ఆయుర్వేద పేస్ట్‌ను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం  కావలసిన పదార్థాలు.. 1 టీస్పూన్ ఆముదం 1 టీస్పూన్ తేనె 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి 1  నిమ్మకాయ. తయారు విధానం.. ఒక గిన్నెలో అన్ని పదార్థాలను బాగా కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ చాలా గట్టిగా  లేదా చాలా పలుచగా ఉండకూడదు.  మధ్యస్థంగా మోకాలి మీద రాసినప్పుడు కారిపోకుండా లేదా తొందరగా ఆరిపోయి రాలిపోకుండా ఉండాలి. ఈ పేస్ట్ ను చాలా సులభంగా అప్లై చేయవచ్చు. తయారు చేసుకున్న ఆయుర్వేద పేస్ట్ ను పలుచని పొరలాగా మోకాలిపై నొప్పి ఉన్న ప్రాతంలో లేదా మోకాలు అంతటగా  పూయాలి.  దానిపై మెత్తని  కాటన్ వస్త్రాన్ని చుట్టాలి.  8-10 గంటలు అలాగే ఉంచాలి. దీన్ని రాత్రి సమయంలో అప్లై చేసుకుంటే చాలా మంచిది.  ఉదయం గోరువెచ్చని నీటితో సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. ప్రయోజనాలు.. ఈ పేస్ట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీన్ని పూయడం వల్ల వాపు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది మోకాలు బిగుసుకుపోవడాన్ని  తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
Publish Date: Jul 10, 2025 10:30AM

గుడికి వెళ్లడం ద్వారా షుగర్ కంట్రోల్ చేయవచ్చట.. ఇదెలాగో తెలిస్తే షాకవుతారు..!

  మధుమేహాన్ని నిర్వహించడానికి  చాలా పద్ధతులను ప్రయత్నిస్తారు. తీపి ఆహారం తగ్గించడం,  చక్కెరకు దూరంగా ఉండటం,  అధిక మద్యపానాన్ని నివారించడం,   ఒత్తిడిని నిర్వహించడం.. ఇలా చాలా విషయాలు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.  కానీ గుడికి వెళ్లడం ద్వారా షుగర్ నయమవుతుందని మీరు విన్నారా?  గుడికి వెళ్లడం  వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుందని,  కొన్ని సందర్భాల్లో మధుమేహం పూర్తిగా నయమవుతుందని అంటున్నారు. ఇది  నిజమే అని పోషకాహార నిపుణులు కూడా పేర్కొనడం గమనార్హం. ఇదెలా అనే విషయం తెలుసుకుంటే.. గుడికి వెళ్లడం అంటే ఇంటి నుండి గుడి ఎంతో కొంత దూరంలో ఉంటుంది.  ఇది ఒక చక్కని వాకింగ్ సెషన్ లాంటిది. అంతేకాదు.. గుడికి వెళ్తే అక్కడ మళ్లీ ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇంకొక ముఖ్య విషయం ప్రశాంతత.  గుడిలో ప్రశాంతత ఉంటుంది. అక్కడ కొట్టే గంట చుట్టు ప్రక్కల వాతావరణాన్ని చాలా పాజిటివ్ గా ఉంచుతుంది.  గుడి చుట్టూ ఉండే మొక్కలు, ఇతర  విషయాలు కూడా చాలా పాజిటివ్ గా ఉంచుతాయి. ఇది సహజంగానే మనిషిలో ఒత్తిడి తగ్గిస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా ఉండేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. సాధారణంగానే రోజుకు ఒక 10వేల అడుగులు వేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వరకు నియంత్రించవచ్చు. అంతేకాదు.. ప్రీడయాబెటిస్ ను కూడా నయం చేయవచ్చు. ఇలా గుడికి వెళ్తూ కార్బోహేడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని నియంత్రించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే మధుమేహం నియంత్రణ.. కొన్నేళ్లు ఇలా చేస్తే మధుమేహాన్ని నయం చేయడం సాధ్యమే.. అంటున్నారు.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
Publish Date: Jul 9, 2025 10:30AM

బిపి అదుపులో ఉండాలంటే వారానికి ఎన్ని నిమిషాలు వ్యాయామం చేయాలంటే..?

  బిపి ని సాధారణంగా  రక్తపోటు అని కూడా పిలుస్తారు.  హై బిపి ఉంటే మాత్రం దాన్ని అధిక రక్తపోటు అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్య. అధిక రక్తపోటు  గుండెపోటు,  స్ట్రోక్‌లకు కారణమవుతుంది.   వృద్ధాప్యంలో చిత్తవైకల్యం వచ్చే ప్రమాద కారకంగా కూడా ఉంటుంది. ప్రతి నలుగురు పురుషులలో ఒకరు,  దాదాపు ఐదుగురు స్త్రీలలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కానీ చాలా మందికి దీని గురించి స్పష్టంగా తెలియదు.  అందుకే దీనిని  సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. బిపిని నిర్వహించడానికి సరైన ఆహారం,  క్రమం తప్పకుండా వ్యాయామం చాలా ముఖ్యమైనవి.  వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే వారానికి ఎన్నినిమిషాలు లేదా గంటలు వ్యాయామం చేయాలనే విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. హై బిపి అంటే.. అధిక రక్తపోటు అనేది ఒక తీవ్రమైన సమస్య. దీనిలో ధమని గోడలపై రక్త పీడనం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. దీని అర్థం  గుండె రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్,  మూత్రపిండాల వ్యాధితో సహా అనేక వ్యాధులకు కారణమవుతుంది. హై బిపి ప్రమాదం తగ్గించాలంటే.. అధిక రక్తపోటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు,  క్రమం తప్పకుండా వ్యాయామం,  వ్యాయామ అలవాట్లను కూడా అలవర్చుకోవాలి. శరీరంలో  అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి ఈ అలవాట్లు కూడా అవసరం.  ఇది అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఎన్ని గంటల వ్యాయామం? ఏ వ్యాయామాలు చేయాలి? వయోజన వ్యక్తులు అయితే  ప్రతి వారం కనీసం ఐదు గంటలు మితమైన వ్యాయామం చేస్తే అధిక రక్తపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ముఖ్యంగా వారు 60 సంవత్సరాల వయస్సు వరకు వ్యాయామ అలవాటును కొనసాగించడం మంచిది. వారానికి 5 గంటల వ్యాయామం, ఇందులో కొన్ని తీవ్రమైన ఏరోబిక్ కార్యకలాపాలు,  మితమైన తీవ్రత కలిగిన వ్యాయామాల  కలయిక ఉండాలి. ఇది  రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. వ్యాయామం ఎలా హెల్ప్ అవుతుంది? వ్యాయామం రక్తపోటును ఎలా నియంత్రించడంలో సహాయపడుతుందో  అని చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది.   క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అది గుండెను బలపరుస్తుంది.  బలమైన గుండె ఎక్కువ కష్టపడకుండానే ఎక్కువ రక్తాన్ని పంప్ చేయగలదు. ఈ విధంగా రక్త నాళాలపై బలం తగ్గుతుంది.  ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది. సాధారణ రక్తపోటు 120/80 mmHg లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
Publish Date: Jul 8, 2025 10:30AM

వర్షాకాలంలో ఈ 5 కూరగాయలు కొనకపోవడమే మంచిది..!

  సీజన్ ను బట్టి ఆహారపు అలవాట్లు మార్చుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా సీజన్ తో పాటు కొన్ని రకాల కూరగాయలను కొత్తగా జత చేసుకోవడం లేదా కొన్ని తినకుండా వదిలిపెట్టడం వంటివి చేస్తారు.  అదే విధంగా వర్షాకాలంలో  5 రకాల కూరగాయలు తినడం మంచిది కాదని, సాధ్యమైతే వీటిని ఈ వర్షాకాలంలో పూర్తీగా వదిలిపెట్టడం మంచిదని అంటున్నారు వైద్యులు,  ఆహార నిపుణులు. ఇంతకీ వర్షాకాలంలో వదిలిపెట్టాల్సిన కూరగాయలు ఏమిటి? వాటిని ఎందుకు వదిలిపెట్టాలి? తెలుసుకుంటే.. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చాలామంది క్యాబేజీ తినడం తగ్గిస్తారు. దాని నుండి వచ్చే పురుగులు చాలా ప్రమాదకరమైనవిగా భావిస్తారు. కానీ క్యాబేజీ మాత్రమే కాకుండా పురుగులు ఉన్న కూరగాయలు చాలా ఉన్నాయి.  అవి శుభ్రం చేసిన తర్వాత కూడా అందులో పురుగులు  పూర్తిగా బయటకు రావు.  అందుకే వర్షాకాలంలో  కొన్ని కూరగాయలు అస్సలు తినకూడదని అంటారు. ఆకుకూరలు.. పాలకూర, మెంతికూ,  ఆవాల చెట్టు ఆకులు  .. ఇలా చాలా రకాల ఆకుకూరలు వర్షాకాలంలో తినకపోవడమే మంచిది.   వాటిని ఎంత బాగా కడిగినా కొన్ని కంటికి కనిపించనంత సన్నని పురుగులు, సూక్ష్మజీవులు అలాగే ఉంటాయి. క్యాబేజీ,  క్యాలిఫ్లవర్.. క్యాబేజీ,  కాలీఫ్లవర్ లలో పొరలు, పువ్వులు ఉంటాయి.  ఈ పొరల మధ్య తేమ, బ్యాక్టీరియా,  ఫంగస్ సులభంగా పెరుగుతాయి. వీటిని తినకపోవడమే మంచిది.  ఒకవేళ వీటిని తినాలని అనుకుంటే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి ఆ నీటిలో వీటిని బాగా కడగాలి. పుట్టగొడుగు.. వర్షాకాలంలో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది.  ఈ కారణంగా చాలామంది విటమిన్-డి కోసం అయినా పుట్టగొడుగులను తినాలని అనుకుంటారు. పైగా వర్షాల కారణంగా పుట్టగొడుగులు కూడా బాగా పండుతాయి.  కానీ పుట్టగొడుగులు ఎంత ఆరోగ్యమూ.. వీటిని  సరిగ్గా శుభ్రం చేయకపోతే లేదా కొద్దిగా కలుషితమైనా చాలా చెడ్డ చేస్తుంది. పుట్టగొడుగులు  ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతాయి. బంగాళదుంపలు.. ఆహార నిపుణుల ప్రకారం వర్షాకాలంలో బంగాళాదుంపలు తినకపోవడం మంచిది.  ఎందుకంటే బంగాళదుంపలు  త్వరగా మొలకెత్తుతాయి. కాబట్టి బంగాళాదుంపలను ఇలా తినకూడదు. అయితే, సరిగ్గా నిల్వ చేస్తే బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తవు . వీటిని అయితే తినవచ్చు. జాగ్రత్త.. వర్షాకాలంలో కూరగాయలు అయినా ఆకుకూరలు అయినా చాలా తాజాగా ఉండాలి.  తాజాగా ఉన్నా సరే.. వీటిని వేడి నీటిలో ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే వండుకోవాలి. లేకపోతే వీటిలో ఆరోగ్యానికి హాని కలిగించే పురుగులు, రసాయనాలు, సూక్ష్మక్రిములు ఉంటాయి.                                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
Publish Date: Jul 7, 2025 10:30AM

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 అలవాట్లు..!

  ఈ రోజుల్లో చెడు జీవనశైలి,  తప్పుడు ఆహారపు అలవాట్లు  గుండె ఆరోగ్యంపై  చాలా చెడ్డ  ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా మన చిన్న చిన్న రోజువారీ అలవాట్లు గుండెకు హాని కలిగిస్తాయి.  ఇవి క్రమంగా  గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. దీనితో పాటు నేటికాలంలో అన్ని సమస్యలకు మందులు వాడటం,  ఖరీదైన చికిత్సలు తీసుకోవడం  కూడా కొన్నిసార్లు  శరీరానికి హాని కలిగిస్తాయి.  అధిక వ్యాయామం కూడా గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.  ఇలా నేటి కాలంలో చాలా కారణాలుగా గుండె జబ్బుల ప్రమాదం క్రమేపీ పెరుగుతోంది.  గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే.. కొన్ని సులభమైన,  ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం. ఇది శరీరానికి ఎటువంటి హాని లేకుండా  చేస్తుంది. అటువంటి 5 సులభమైన అలవాట్ల గురించి తెలుసుకుంటే.. భోజనం తర్వాత నడక.. భోజనం తర్వాత 10 నిమిషాల నడక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే కూర్చునే అలవాటును మార్చుకోవాలి.  ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాల తేలికపాటి నడక చేయాలి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  బరువు పెరగకుండా నిరోధిస్తుంది. ఒమేగా-3 ఫ్యాట్స్.. రోజువారీ ఆహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె,  మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇది గుండె, మెదడు,  వాపును నియంత్రించడంలో సహాయపడుతుంది. సాల్మన్, చేపలు, అవిసె గింజలు,  వాల్‌నట్‌ల వంటి వాటి నుండి  ఒమేగా-3ని పుష్కలంగా పొందవచ్చు. నిద్ర.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ 7-9 గంటలు మంచి నిద్ర పొందడం ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మందికి రాత్రిపూట ఫోన్ వాడటం,  టీవీ చూడటం అలవాటు కారణంగా నిద్ర సైకిల్ దారుణంగా దెబ్బతింటోంది. తక్కువ నిద్రపోవడం వల్ల ఊబకాయం, వ్యాధులు,  అలసట వంటి సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ నిషేధం.. మంచి గుండె ఆరోగ్యానికి ప్లాస్టిక్ వస్తువులను నివారించడం,  గాజు లేదా స్టీల్ కంటైనర్లు ఉపయోగించడం ముఖ్యం. ప్లాస్టిక్‌లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి.  ఇవి హార్మోన్లకు,  శరీరానికి హాని కలిగిస్తాయి. ప్లాస్టిక్ రసాయనాలు నెమ్మదిగా శరీరంలో విషాన్ని వ్యాపింపజేస్తాయి. ఇది క్యాన్సర్,  ఇతర వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల ఆహారాన్ని నిల్వ చేయడానికి గాజు లేదా స్టీల్  పాత్రలు మంచివి. ఇవి  గుండె ఆరోగ్యానికి అలాగే మొత్తం ఆరోగ్యానికి సురక్షితమైనవి. బరువు.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  బరువు,  BMI ని చూస్తే సరిపోదు. రక్త పరీక్షలపై కూడా శ్రద్ధ వహించాలి.  బరువు లేదా BMI కంటే రక్త పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. LDL, CRP,  ఫాస్టింగ్ ఇన్సులిన్ వంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. గుండె జబ్బులను నివారించడానికి ఇది ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ఆహారం.. గుండె ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలంటే  ఆహారంలో పండ్లు,  ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. వాటిలో  గుండెను బలంగా,  ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయి.  వాటిని సరిగ్గా తినకపోతే, అది గుండెకు హాని కలిగిస్తుంది. ఈ రోజుల్లో, చాలా మంది ఏదో ఒక విషయం గురించి ఒత్తిడి తీసుకోవడం చాలా సహజం అయిపోయింది. ఇది గుండెపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.                                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
Publish Date: Jul 5, 2025 10:30AM

జాగ్రత్త.. బెర్రీలు తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకూడదు..!

బెర్రీలు చాలా మంది ఇష్టంగా తినే పండ్లు. వీటిలో బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ.. ఇట్లా చాలా రకాలు ఉంటాయి.  తియ్యగా, పుల్లగా ఉంటూ ప్రత్యేకమైన సువాసన కలిగి ఉండే బెర్రీలు అంటే అందరికీ ఇష్టమే..  వీటిని ఉపయోగించి చేసే జ్యూస్ లు, స్మూతీలు, ఐస్ క్రీమ్ లకు చాలా ఆదరణ ఉంది.  వీటి ప్లేవర్ అంత బాగుంటుంది మరి. అయితే బెర్రీలు తినగానే కొన్ని రకాల ఆహారాలు, ద్రవ పదార్థాలు అస్సలు తీసుకోకూడదు అంట.  అలా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడి ఫుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం ఉంటుందట. ఇంతకీ బెర్రీలు తిన్న తరువాత తీసుకోకూడని పదార్థాలు ఏంటో తెలుసుకుంటే.. పాలు.. బెర్రీలు తిన్న తర్వాత పాలు తీసుకోవడం కానీ, లేక  పాలు కలిపి బెర్రీలను తినడం కానీ ఆరోగ్యానికి మంచిది కాదట.  ఇది జీర్ణక్రియకు ప్రమాదకరం. రెండూ కలిసి యాసిడ్-బేస్ రియాక్షన్‌కు కారణమవుతాయి. దీని వలన గ్యాస్, కడుపు నొప్పి,  అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. దోసకాయ.. దోసకాయ,  బెర్రీలు  రెండూ శరీరాన్ని చల్లబరిచే  ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరంలో  అవసరానికి మించి చల్లదనం పెరుగుతుంది.  ఇది జలుబు,  అజీర్ణానికి కారణమవుతుంది. నీరు.. బెర్రీలు  తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్, తిమ్మిర్లు,  కొన్నిసార్లు వాంతులు కూడా వస్తాయి. బెర్రీలు తిన్న తర్వాత  కనీసం 30 నిమిషాల తర్వాత నీరు త్రాగాలి. ఊరగాయలు..  బెర్రీలు,  ఊరగాయలు రెండూ పుల్లగా,  ఆమ్లంగా ఉంటాయి. వీటిని కలిపి తినడం వల్ల ఆమ్లత్వం, గుండెల్లో మంట,  కడుపు నొప్పి వచ్చే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. అందుకే బెర్రీలు తిన్న తర్వాత ఊరగాయల జోలికి పోకూడదు. సిట్రస్ పండ్లు.. నారింజ, నిమ్మ వంటి పండ్లను సిట్రస్ పండ్లు అంటారు.  బెర్రీలను   తిన్న వెంటనే సిట్రస్ పండ్లను  తినకూడదు. ఎందుకంటే ఈ రెండూ పుల్లని పండ్లు. దీనివల్ల విరేచనాలు,  కడుపు నొప్పి వస్తుంది. కూల్ డ్రింక్స్.. బెర్రీలు తిన్న తర్వాత చల్లని పానీయాలు తాగకూడదు. దీని వల్ల శరీరంలో రసాయన ప్రతిచర్య ఏర్పడుతుంది. ఇందులో ఉండే చక్కెర,  కార్బన్ డయాక్సైడ్ బెర్రీలలో ఉండే  సహజ ఆమ్లంతో కలిసిపోయి గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తాయి.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
Publish Date: Jul 4, 2025 10:30AM

రోజూ పచ్చి టమోటాలు తింటే జరిగే మేలు ఏంటో తెలుసా?

  భారతీయ వంటగదిలో టమోటా ఒక ముఖ్యమైన భాగం. అది కూరలో అయినా, సలాడ్ అయినా లేదా చట్నీ అయినా టమోటా లేకుండా రుచి అసంపూర్ణంగా అనిపిస్తుంది. అయితే టమోటాను ఇలా కూరలలో కాదు.. పచ్చిగా తినమని చెబుతున్నారు ఆహార నిపుణులు.  దీని వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. పచ్చి టమోటాలలో లైకోపీన్, విటమిన్ సి, పొటాషియం,  ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరంలోని వివిధ భాగాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. సాధారణంగా సలాడ్ లో పచ్చి టమోటా చేర్చుకోవడం చూస్తూంటాం. ప్రతిరోజూ పచ్చి టమోటా తినడం వల్ల కలిగే 6 గొప్ప ప్రయోజనాలను తెలుసుకుంటే.. చర్మానికి చేసే మేలు.. పచ్చి టమోటాలలో ఉండే లైకోపీన్,  విటమిన్ సి చర్మానికి సహజమైన బూస్టర్‌గా పనిచేస్తాయి.  చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.  ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. ప్రతిరోజూ పచ్చి టమోటా తినడం వల్ల చర్మం  మెరుపు పెరుగుతుంది.  వృద్ధాప్య సంకేతాలు నెమ్మదిస్తాయి.  మొటిమలు లేదా జిడ్డుగల చర్మం సమస్యలు ఉంటే టమోటాలు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి.. టమోటాలలో లభించే లైకోపీన్, పొటాషియం,  ఫోలేట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇది రక్తపోటును సమతుల్యం చేస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది,  రక్త నాళాలు దెబ్బతినకుండా నిరోధిస్తుంది. ప్రతిరోజూ పచ్చి టమోటాలు తినడం వల్ల గుండె జబ్బులు, ముఖ్యంగా గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి టమోటాలు సహజ ఔషధంగా పనిచేస్తాయి. దీనిని సలాడ్, జ్యూస్ లేదా నేరుగా కోసి తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు తగ్గడంలో..  బరువు తగ్గించుకునే ప్రయాణంలో ఉన్నవారికి  టమోటా భలే సహాయపడుతుంది.  ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి,  ఫైబర్,  నీరు ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. టమోటా జీవక్రియను కూడా సక్రియం చేస్తుంది.  శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును నెమ్మదిగా కాల్చడంలో సహాయపడుతుంది. పొట్ట ఆరోగ్యానికి..  టమోటాలలో ఉండే ఫైబర్, సహజ ఆమ్లాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది గ్యాస్, ఆమ్లతత్వం,  మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. ప్రతిరోజూ  టమోటా తినడం వల్ల కడుపు శుభ్రపడుతుంది, పేగు పనితీరు మెరుగుపడుతుంది. దీనితో పాటు, ఇది ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాకు మద్దతు ఇస్తుంది, ఇది మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి.. టమాటాలో విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, వైరల్,  అలెర్జీలతో పోరాడటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మారుతున్న వాతావరణంలో శరీరం సులభంగా అనారోగ్యానికి గురవుతుంది. ఇలాంటి వాతావరణంలో  టమోటా  రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది పిల్లలు,  వృద్ధులకు కూడా  రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పూర్తి పోషకాలను పొందడానికి దీనిని  తాజాగా తినడం మంచిది. డిటాక్స్ చేస్తుంది.. టమోటాలు శరీరం నుండి విషాన్ని తొలగించే సహజ నిర్విషీకరణ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది కాలేయం,  మూత్రపిండాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది,  శరీరాన్ని శుభ్రపరుస్తుంది. బయటి ఆహారాన్ని ఎక్కువగా తినేవారికి లేదా అనారోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉన్నవారికి ప్రతిరోజూ టమోటాలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీర శక్తిని కూడా నిర్వహిస్తుంది,   అలసటను దూరం చేస్తుంది. ఉదయం లేదా భోజనానికి ముందు టమోటాను  తినడం మంచి ప్రయోజనాలు కలిగిస్తుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..  
Publish Date: Jul 4, 2025 10:30AM

ఈ 5 ఆహారాలు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే చాలు.. ఎన్నేళ్లు గడిచినా యవ్వనంగా ఉంటారు..!

  వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడటం, జుట్టు నెరవడం, శరీరంలో శక్తి లేకపోవడం వంటి అనేక సమస్యలు మొదలవుతాయి. అయితే, ఆరోగ్యకరమైన ఆహారం,  ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా చాలా కాలం పాటు యవ్వనంగా,  ఆరోగ్యంగా ఉండవచ్చు. కొన్ని ఆహారాలు (Foods for Anti-Aging) కూడా  యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. అవి యాంటీ ఏజింగ్ లక్షణాలతో నిండి ఉంటాయి.  శరీరాన్ని లోపలి నుండి బలంగా చేస్తాయి. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుని వాటిని  రెగ్యులర్ గా తీసుకుని, అవెలా పనిచేస్తాయో తెలుసుకుంటే.. టమోటా. టమోటా ఆహార రుచిని పెంచడమే కాకుండా, చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే లైకోపీన్ చర్మాన్ని సూర్యుని హానికరమైన కిరణాల నుండి రక్షిస్తుంది,  ముడతలను తగ్గిస్తుంది. అలాగే ఇది గుండె జబ్బులు,  క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే  ఆహారంలో టమోటాను ఖచ్చితంగా చేర్చుకోవాలి. టమోటాలను ఆహారంలో అనేక విధాలుగా భాగం చేసుకోవచ్చు. పసుపు.. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన కర్కుమిన్ ఉంటుంది. అందువల్ల దీనిని "గోల్డెన్ స్పైస్" అని పిలుస్తారు. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.  మెదడు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల ఉదయం పసుపు కలిపిన పాలు తాగడం లేదా పసుపు నీరు త్రాగడం కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు.. పెరుగు ప్రోబయోటిక్స్ యొక్క అద్భుతమైన మూలం. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మంచి జీర్ణక్రియ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో,  చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పెరుగులో ఉండే కాల్షియం ఎముకలను బలపరుస్తుంది,  వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిస్తుంది. కాబట్టి  ఆహారంలో పెరుగును ఖచ్చితంగా చేర్చుకోవాలి. రోజూ ఒక గిన్నె పెరుగు తినడం వల్ల  మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. గ్రీన్ టీ. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి,  జీవక్రియను పెంచుతాయి. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి.  బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అందువల్ల, ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కాలేయం కూడా చాలా ప్రయోజనాలను పొందుతుంది.                              *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
Publish Date: Jul 3, 2025 10:30AM

ప్లాస్టిక్ బాటిల్ లో నీరు తాగడం.. ఎముకలను దెబ్బ తీస్తుందా?

మానవ శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. ఇవి  శరీరానికి మద్దతు ఇస్తాయి. శరీరంలో అవయవాలను రక్షిస్తాయి,  అంతేకాదు.. శరీరం వివిధ రకాలుగా  కదలడానికి సహాయపడతాయి. అందువల్ల ఎముకలు  జీవితాంతం బలంగా ఉండటం చాలా ముఖ్యం. బలమైన ఎముకలు ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల నుండి కూడా  రక్షిస్తాయి. అస్టియోపోరోసిస్ సమస్య వస్తే  ఎముకలు బలహీనంగా,  పెళుసుగా మారుతాయి, అవి విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత కూడా ప్రభావితమవుతుంది.  అవి మునుపటి కంటే బలహీనంగా మారుతాయి. కానీ చాలా మందిలో  వయసు పెరిగే ముందే ఎముకలు బలహీనంగా మరడం ఈ మధ్య కాలంలో  ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి  అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ఎముకలు బలహీనంగా మారడానికి ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం కూడా ఒకటని వైద్యులు అంటున్నారు.  చాలా షాకింగ్ కు గురిచేసే ఈ విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ప్లాస్టిక్ బాటిల్ లో నీరు తాగడం.. రోజూ ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ చేసిన నీటిని తాగితే, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా  ఎముకలకు చేతులారా సమస్య తెచ్చిపెట్టినట్టేనట. వాస్తవానికి ప్రతిరోజూ ఈ బాటిళ్లలో నీటిని నిల్వ చేసి వాటి నుండి నీటిని తీసుకుంటే  ఎముకలు బలహీనపడతాయట. ఎందుకు హానికరం.. ప్లాస్టిక్ బాటిళ్లలో బిపిఎ అనే రసాయనం ఉంటుంది. ఇది శరీరంలోని విటమిన్ డి గ్రాహకాలను ప్రభావితం చేస్తుంది. విటమిన్-డి గ్రాహకాలు అంటే..  విటమిన్ డి గ్రాహకాలు అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇవి శరీరం కాల్షియంను గ్రహించడానికి సహాయపడతాయి. కానీ BPA వాటితో జోక్యం చేసుకున్నప్పుడు, శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించలేకపోతుంది. దీని అర్థం పోషకాహారం ఎముకలకు చేరదు. అంటే శరీరానికి తగినంత కాల్షియం ఆహారం ద్వారా తీసుకున్నా అది శరీరం గ్రహించకుండా ఉంటుంది.  ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం దీనికి ప్రధాన కారణం అవుతుంది. జరిగే ప్రమాదం? పోషకాహారం ఎముకలకు చేరకపోతే, అది అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది. కీళ్ల నొప్పులు,  పగుళ్లు (ఎముక విరిగిపోవడం) ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా మహిళలలో మెనోపాజ్ తర్వాత   ఇప్పటికే కాల్షియం లోపం ఉంటోంది.ఇక ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల ఎముకల సమస్యలు మరింత పెరుగుతాయి.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
Publish Date: Jul 3, 2025 10:30AM

పొడపత్రి ఆకులతో  డయాబెటిస్ కి  చెక్!

  డయాబెటిస్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. నేటికాలంలో  దీని ప్రమాదం అన్ని వయసుల వారిలో కనిపిస్తోంది. జీవనశైలి,  ఆహారపు సరిగా తీసుకోకపోవడం, మొదలైన తప్పుల వ్లల   20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కూడా డయాబెటిస్ రావడం జరుగుతోంది. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించకపోతే లేదా సరిగ్గా చికిత్స చేయకపోతే, కాలక్రమేణా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.   కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే డయాబెటిస్ ఉంటే, ప్రతి ఒక్కరూ దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.  మెరుగైన ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఇంటి నివారణలు,  మందుల సహాయంతో, డయాబెటిస్‌ను నివారించడమే కాకుండా, దాని వల్ల కలిగే నష్టాలను కూడా తగ్గించవచ్చు. అలాగే డయాబెటిస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. దీని కోసం డయాబెటిస్ కిల్లర్ ఆకు చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంతకీ ఈ డయాబెటిస్ కిల్లర్ ఆకులు ఏంటి? ఇవెలా పని చేస్తాయి?  తెలుసుకుంటే.. పొడపత్రి.. డయాబెటిస్ ఉన్నవారికి వేప, తులసి,  కరివేపాకు, మునగ వంటివి బాగా పనిచేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర సమస్య తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.  కానీ పొడపత్రి ఆకులు మాత్రం చాలా ప్రత్యేకం.  ఇవి టైప్-2 డయాబెటిస్ ను మాత్రమే కాకుండా టైప్ -1 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుందట.  పొడపత్రికి ఆయుర్వేదంలో చాలా ఆదరణ ఉంది.   ఆయుర్వేదంలో పొడపత్రిని 2000 సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తున్నట్టు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ ఆకు పొడి, సారం రెండూ  డయాబెటిస్ చికిత్సలో ప్రయోజనకరంగా ఉంటుంది. జిమ్నెమిక్ ఆమ్లం.. పొడపత్రి  మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎలా మేలు చేస్తుందో తెలుసుకోవాలి అంటే.. ఆ ఆకులో ఉన్న ప్రత్యేకత తెలుసుకోవాలి. ఈ మొక్కలో ఉండే ప్రధాన క్రియాశీల సమ్మేళనాలలో  జిమ్నెమిక్ ఆమ్లం ఒకటి. ఇది  మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలో తేలింది. తీపి పదార్థాలను తినే ముందు దీనిని తీసుకుంటే.. జిమ్నెమిక్ ఆమ్లం  రుచి మొగ్గలపై చక్కెర గ్రాహకాలను అడ్డుకుంటుంది. ఇది తీపిని రుచి చూసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.  తీపి ఆహారాన్ని రుచిపరంగా తక్కువ ఆకర్షణీయంగా చేస్తుందట. జిమ్నెమిక్ ఆమ్లం ప్రేగులలో ఈ గ్రాహకాలను కూడా నిరోధించగలదని, ఇది శరీరంలో చక్కెర శోషణను తగ్గిస్తుందని కనుగొంది. దీని కారణంగా, భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అయితే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే స్త్రీలు లేదా పిల్లలు దీనిని ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది డయాబెటిస్ మందులకు ప్రత్యామ్నాయం కాదు.  వైద్యుడిని సంప్రదించకుండా దీనిని ఉపయోగించడం సరైనది కాదని అంటున్నారు. ఇప్పటికే డయాబెటిస్ మందులు తీసుకుంటున్న వ్యక్తులు ఇలాంటి  నివారణలు ఉపయోగించే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. దీన్ని మీరే ఉపయోగించడం వల్ల కొన్నిసార్లు మందులతో రియాక్షన్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
Publish Date: Jul 2, 2025 10:30AM

ఎక్కువగా ఆవలింపులు వచ్చే వారికి ఉండే అసలు సమస్యలు ఇవీ..!

  ఆవలింత అనేది మనమందరం అనుభవించే ఒక సాధారణ శారీరక ప్రక్రియ. తరచుగానిద్రపోవడం లేదా అధిక అలసటగా ఉన్నప్పుడు ఆవలింపులు వస్తుంటాయి.   కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆవలింపులు తగ్గిపోతాయని అనుకుంటాం. కానీ తరచుగా ఆవలింతలు వస్తుంటే మాత్రం అది నిద్రకు సంబంధించిన సమస్య కానే కాదు అంటున్నారు వైద్యులు. కొన్నిసార్లు ఇది శరీరంలోని ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుందట. ఎవరైనా సాధారణం కంటే ఎక్కువగా ఆవలిస్తున్నారని అనిపిస్తే,   తగినంత నిద్ర పోయిన  తర్వాత కూడా పదే పదే ఆవలిస్తున్నారని  భావిస్తే దానిని లైట్ గా తీసుకోకూడదు.  దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటే.. మెదడుకు ఆక్సిజన్ లేకపోవడం.. ఆవలింతకు ప్రధాన కారణం మెదడుకు తగినంత ఆక్సిజన్ చేరకపోవడం. శరీరంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు లేదా కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరిగినప్పుడు, మెదడు ఆవలింత ద్వారా ఉష్ణోగ్రతను,  ఆక్సిజన్ మొత్తాన్ని నియంత్రిస్తుందట. ఈ పరిస్థితి వేడి,  తేమతో కూడిన వాతావరణంలో లేదా ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం ద్వారా జరుగుతుందట. లోతైన శ్వాస తీసుకోవడం, స్వచ్ఛమైన గాలిలో నడవడం,  వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉండటం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. శారీరక,  మానసిక ఒత్తిడి.. ఒత్తిడి,  ఆందోళన కూడా తరచుగా ఆవలించడానికి కారణమవుతాయి. మనం ఒత్తిడికి గురైనప్పుడు, మన శ్వాస ప్రక్రియ సక్రమంగా ఉండదు. ఇది మెదడుకు ఆక్సిజన్ సరఫరాను ప్రభావితం చేస్తుంది. దీనితో పాటు, ఒత్తిడి కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.  ఈ  ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం మరియు లోతైన శ్వాస వ్యాయామం వంటి పద్దతుల సహాయం తీసుకోవచ్చు మందుల దుష్ప్రభావాలు.. యాంటీ-డిప్రెసెంట్స్, యాంటిహిస్టామైన్లు లేదా నొప్పి నివారణ మందులు వంటి కొన్ని మందులు తరచుగా ఆవలింతకు కారణమవుతాయి. ఈ మందులు మెదడు రసాయనాలను ప్రభావితం చేస్తాయి. ఇవి నిద్ర లేదా మగత అనుభూతికి దారితీస్తాయి. మందులు ఆవలింతను పెంచుతున్నాయని అనిపిస్తే   వైద్యుడిని సంప్రదించడం మంచిది. వైద్యులు మందుల మోతాదును సర్దుబాటు చేయవచ్చు లేదా ప్రత్యామ్నాయ చికిత్సలను సూచించవచ్చు. ఆరోగ్య సమస్యలు.. తరచుగా ఆవలింతలు పడటం వల్ల స్లీప్ అప్నియా, నార్కోలెప్సీ లేదా థైరాయిడ్ సమస్యలు వంటి కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. స్లీప్ అప్నియా అధిక నిద్రకు కారణమవుతుంది.  రాత్రి నిద్రపోతున్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కారణంగా నిద్ర పూర్తిగా ఉండదు.   మరుసటి రోజు చాలా అలసిపోయినట్లు అనిపించవచ్చు. దీని కారణంగా ఆవలింత పగటిపూట పదేపదే రావచ్చు. నార్కోలెప్సీ కూడా నిద్రకు సంబంధించిన సమస్య. ఇందులో, ఒక వ్యక్తి ఎప్పుడైనా,  ఎక్కడైనా అకస్మాత్తుగా నిద్రపోవచ్చు. ఈ వ్యాధిలో రోగి పగటిపూట చాలాసార్లు నిద్రపోతాడు. దీని కారణంగా  ఎక్కువగా ఆవలిస్తూ ఉంటారు. అలసట, తలనొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఆవలింతతో పాటు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
Publish Date: Jul 1, 2025 10:30AM

గట్ మైక్రోబయెమ్ అంటే ఏంటి? దీనికి మానసిక స్థితి, రోగనిరోగధక స్థితికి మధ్య ఉన్న సంబంధం ఏంటి?

    మన ప్రేగులలో, మన మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే లెక్కలేనన్ని సూక్ష్మజీవులు మన శరీరంలో ఉంటాయి.  'గట్ మైక్రోబయోమ్' అని పిలువబడే చిన్న బ్యాక్టీరియా, వైరస్‌లు,  ఇతర సూక్ష్మజీవులు జీర్ణక్రియలో పాత్ర పోషిస్తాయి.  ఇవి  మన మానసిక స్థితి, రోగనిరోధక శక్తితో పాటు మొత్తం ఆరోగ్యాన్ని కూడా ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు మన శారీరక,  మానసిక ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన మరియు సమతుల్య గట్ మైక్రోబయోమ్ ఎంత ముఖ్యమో  ఎప్పటికప్పుడు పరిశోధనల ద్వారా నిరూపిస్తున్నాయి. కంటికి కనిపించని ఈ జీవులు మన శరీరంలో ముఖ్యమైన విధులను ఎలా నియంత్రిస్తాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుంటే.. గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? గట్ మైక్రోబయోమ్ అనేది మన ప్రేగులలో నివసించే ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవుల సమూహం. ఈ బ్యాక్టీరియా ఆహారాన్ని జీర్ణం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి మరియు హానికరమైన పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఈ సూక్ష్మజీవులు మన శరీరంలోని అనేక విధులను నియంత్రించే  వ్యవస్థగా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ మంచి మరియు చెడు బ్యాక్టీరియాల సమతుల్యతను కలిగి ఉంటుంది. ఈ గట్ మైక్రోబయోమ్  అసమతుల్యతగా ఉంటే.. జీర్ణ సమస్యలు, ఒత్తిడి లేదా తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. జీర్ణక్రియ,  రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది.. గట్ మైక్రోబయోమ్ జీర్ణవ్యవస్థకు ఆధారం. ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి మరియు పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది.   రోగనిరోధక వ్యవస్థలో 70% ని ఇదే నియంత్రిస్తుంది . మంచి బ్యాక్టీరియా హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడటం ద్వారా  ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది.  మైక్రోబయోమ్ అసమతుల్యంగా ఉంటే అది మలబద్ధకం, విరేచనాలు, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కారణమవుతుంది. అందుకే నిపుణులు పెరుగు,  పులియబెట్టిన ఆహారం వంటి ప్రోబయోటిక్స్ కలిగిన ఆహారాలను ఆహారంలో చేర్చాలని సూచిస్తుంటారు.  ఎందుకంటే అవి గట్ మైక్రోబయోమ్‌ను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మానసిక స్థితి మరియు మానసిక ఆరోగ్యానికి సంబంధం.. గట్ మైక్రోబయోమ్ మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  ఎందుకంటే ఇది గట్-మెదడు కు ప్రత్యేకంగా ఒక సిస్టమ్  ద్వారా మెదడుకు అనుసంధానించబడి ఉంటుంది. పేగు బాక్టీరియా సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి మానసిక స్థితిని నియంత్రిస్తాయి.  మైక్రోబయోమ్ అసమతుల్యంగా ఉంటే  ఒత్తిడి, ఆందోళన లేదా నిరాశకు కారణమవుతుంది. ఫైబర్ మరియు ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారం మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. గట్ మైక్రోబయోమ్‌ను ఆరోగ్యంగా ఉంచే మార్గాలు.. గట్ మైక్రోబయోమ్‌ను ఆరోగ్యంగా ఉంచడానికి, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు గింజలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి . ప్రోబయోటిక్స్ (పెరుగు, మజ్జిగ),  ప్రీబయోటిక్స్ (ఉల్లిపాయ, వెల్లుల్లి) మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర,  యాంటీబయాటిక్‌లను అధికంగా వాడకుండా ఉండాలి. ఎందుకంటే ఇవి మైక్రోబయోమ్‌కు హాని కలిగిస్తాయి. తగినంత నీరు, క్రమం తప్పకుండా వ్యాయామం,  మంచి నిద్ర కూడా పేగు ఆరోగ్యానికి చాలా అవసరం.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
Publish Date: Jun 30, 2025 10:30AM

ఇన్సులిన్ తీసుకుంటున్నారా? ఈ 5 తప్పులు చేయకండి..!

  డయాబెటిస్ అనేది తీవ్రమైన,  పూర్తిగా నయం చేయలేని వ్యాధి. ఇందులో శరీరం  రక్తంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యం తగ్గుతుంది. దీనికి కారణం ఇన్సులిన్ అనే హార్మోన్ లేకపోవడం లేదా దాని  పనితీరు సరిగా లేకపోవడం. భారతదేశంలో 10 కోట్లకు పైగా ప్రజలు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. డయాబెటిస్‌ను సకాలంలో నియంత్రించకపోతే, అది శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది. ఇది కళ్ళు, మూత్రపిండాలు, నరాలు, గుండె,  రక్తపోటు, పాదాల సమస్యలు,  లైంగిక సమస్యలను కలిగిస్తుంది. చాలా మంది డయాబెటిస్‌ను మందులతో కూడా నియంత్రించలేరు.  ఇలాంటి వారు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవలసి ఉంటుంది. కానీ ఇలా ఇన్సులిన్ తీసుకునే వారు సాధారణంగా చేసే 5 ప్రధాన తప్పులు ఉన్నాయి.  ఈ తప్పుల వల్ల ఇన్సులిన్ తీసుకున్నా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గవు. ఇంతకూ ఇన్సులిన్ తీసుకునే వారు  చేసే తప్పులేంటంటే.. అర్థం చేసుకోవడంలో పొరపాటు.. చాలా సార్లు రోగులు డాక్టర్ సలహాను సరిగ్గా అర్థం చేసుకోలేరు.  చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ ఇన్సులిన్ తీసుకుంటారు. లేదా తప్పు సమయంలో ఇంజెక్ట్ చేస్తారు. దీనిని నివారించడానికి సులభమైన మార్గం  డాక్టర్ ఇచ్చిన మోతాదు,  సమయాన్ని  పాటించడం. గ్లూకోజ్ మానిటర్‌తో చక్కెరను తనిఖీ చేస్తూ ఉండాలి . స్టోర్ చేయడంలో తప్పులు.. ఇన్సులిన్‌ను తీవ్రమైన వేడిలో లేదా చల్లగా ఉంచినా, లేదా గడువు తేదీ తర్వాత ఉపయోగించినా, దాని ప్రభావం తగ్గుతుంది. దీన్ని చేయడానికి ఉత్తమ మార్గం మూసి ఉన్న సీసాను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం. తెరిచి ఉన్న సీసాను సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద (25°C కంటే తక్కువ) 30 రోజుల వరకు ఉంచవచ్చు. ఇన్సులిన్‌ను ఎప్పుడూ ఫ్రీజ్ చేయకూడదు. లేదా చాలా వేడి ప్రదేశంలో ఉంచకూడదు. ఎక్స్‌పైరీ డేట్.. ఇన్సులిన్ కొనుగోలు చేసేటప్పుడు దాని గడువు తేదీని తనిఖీ చేయడం ముఖ్యం. చాలా సార్లు  దాని తేదీని తనిఖీ చేయకుండా ఇన్సులిన్ కొని దాన్ని ఉపయోగిస్తారు. గడువు తేదీని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఇన్సులిన్ కొనాలి. ఇన్సులిన్ తెరిచిన 30 రోజుల్లోపు దాన్ని ఉపయోగించండి. సిరంజి రకం.. తప్పుడు రకం సిరంజితో ఇన్సులిన్ తీసుకోవడం వల్ల అధిక లేదా తగినంత మోతాదు తీసుకోకపోవచ్చు.  ఈ తప్పు చేస్తుంటే వెంటనే దాన్ని ఆపాలి. దీన్ని నివారించడానికి, 40 IU/ml ఇన్సులిన్ కోసం ఎరుపు రంగు క్యాప్ ఉన్న సిరంజిని ఉపయోగించాలి. 100 IU/ml ఇన్సులిన్ కోసం నారింజ రంగు క్యాప్ ఉన్న సిరంజిని ఉపయోగించాలి. వైద్యుడి సలహాతో సరైన సిరంజిని ఎంచుకోవాలి. ఒకే  ప్రదేశంలో ఇంజెక్షన్.. ఇన్సులిన్ ఒకే చోట పదే పదే ఇంజెక్ట్ చేస్తే, అక్కడ గడ్డలు లేదా గుంటలు (లిపోడిస్ట్రోఫీ) ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీనిని నివారించడానికి, ప్రతిసారీ ఇంజెక్షన్ సైట్‌ను మార్చాలి. ఉదాహరణకు కడుపు, తొడ, చేయి లేదా తుంటిపై. అంతకు ముందు ఇంజెక్షన్ చేసిన స్థానం నుండి కనీసం 1 సెం.మీ దూరంలో ఇంజెక్ట్ చేయాలి. గుర్తుంచుకోవలసిన విషయం.. ఇన్సులిన్ ఒక ముఖ్యమైన ఔషధం. కానీ దాని సరైన ఉపయోగం మాత్రమే ప్రభావవంతంగా ఉంటుంది. పైన పేర్కొన్న తప్పులను నివారిస్తూ,  ఎల్లప్పుడూ వైద్యుడి సలహా మేరకు ఇన్సులిన్ తీసుకోవాలి. ఇది  చక్కెర స్థాయిని  నియంత్రించడంలో,  తీవ్రమైన సమస్యలను నివారించడంలో మీకు సహాయపడుతుంది.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
Publish Date: Jun 28, 2025 10:30AM