కొన్ని మొహమాటాలు లేకుంటే జీవితం ఎంతో బాగుంటుంది!

జీవితం చాలా విలువైనది. ముఖ్యంగా జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు మరీ ముఖ్యమైనవి. జీవితాన్ని అవి ప్రభావితం చేస్తాయి. జీవితం ప్రభావితమైనపుడు అనుకూలతలు చోటు చేసుకుంటే  ఒకే. కానీ ప్రతికూలతలు ఎదురైతే మాత్రం జీవితం కుదుపులకు లోనవుతుంది. ఆ కుదుపులు అన్నీ మనిషి మానసిక పరిస్థితులను అతలాకుతలం చేస్తాయి. మరి ఇన్ని అనర్థాలకు ఒకే ఒక విషయం కారణం అవుతుందంటే అది నిజంగా చిన్న విషయం అని ఎలా అనుకోవాలి? మొహమాటం! కాదని, లేదని లేక ఇష్టం లేకపోయినా ఒప్పుకునే ప్రవర్తన స్వభావం మొహమాటం. ఇది ఎంతో సున్నితమైన అంశం కూడా.  *మా అమ్మాయికి మొహమాటం ఎక్కువ పెద్దగా మాట్లాడదు. (పర్లేదు మనుషులు అలవాటు కానిది ఈ కాలంలో మునిగిపోయి మాట్లాడేవాళ్ళు తక్కువే. అలవాటైతే మాట్లాడతారు) * మా అబ్బాయికి మొహమాటం ఎక్కువ ఎవరితో ఎక్కువగా కలవడు(బహుశా ఇంట్రోవేర్ట్ కావచ్చు. అంతర్ముఖులుగా ఉండేవారు అనవసర గోడవల్లోకి వెళ్లరు కాబట్టి సమస్య ఏమీలేదు) * మా ఆయనకు మోహమాటం ఎక్కువండి ఎవరైనా ఏదైనా అడిగితే కాదని చెప్పలేరు.(ఇదీ పాయింట్. మోహమాటంతో ఏమీ కాదని చెప్పలేక ఇబ్బందుల్లో ఇరుక్కుపోరూ) *అయ్యో మీరు మరీ మొహమాట పడకండి. మీకేం కావాలన్నా అడగండి. నేను సహాయం చేస్తాను కదా( ఈ బాపతు మనుషులు దారిన పోయే దాన్ని నెత్తికి ఎక్కించుకునేరకం) *సరేనని చెప్పకపోతే వాళ్ళు నొచ్చుకుంటారేమో (ఇలా భావించి ఎన్నో విషయాలలో దిగబడిపోయేవాళ్ళు ఎక్కువ) పై విధంగా  చెప్పుకుంటే ఎంతో మంది ఇలా మొహమాటంతో తమని తాము ఇబ్బందుల్లోకి నెట్టేసుకుంటారు. తరువాత తీరిగ్గా అలా చెయ్యకుండా ఉంది ఉంటే బాగుండెమో, ఏమి చేస్తాం పరిస్థితి అలా మారిపోయింది అనుకుంటారు. ఇంతకూ ఏ పరిస్థితి ఎలా మతింది. మొహమాటం అనేది  ఎలాంటి విషయాలలో వదిలేస్తే జీవితం బాగుంటుంది?? ఆర్థిక విషయాలు! డబ్బులు ఎవరికీ చెట్లకు కాయవు. కొందరు సహాయం అడుగుతుంటారు. అవతలి వాళ్లకు సహాయం చేయడం మానవత్వమే. కానీ ఈ ఆర్థిక విషయాలలో అనవసరమైన తలనొప్పుల్లోకి వెళ్ళకపోవడమే మంచిది. అప్పులు ఇవ్వడం, ఇప్పించడం, ష్యురిటీలు ఇవ్వడం వంటివి మీరు ఆర్థికపరంగా కాసింత మంచి స్థాయిలో ఉంటేనే చెయ్యండి. ఒకవేళ సమస్య మీకు ఎదురైనా భరించగలను అనే నమ్మకం ఉంటేనే చెయ్యండి. వ్యక్తిగత నిర్ణయాలు! సాధారణంగా వ్యక్తిగత నిర్ణయాలలో చదువు, పెళ్లి ముఖ్యమైనవి. అది వద్దు ఇది చదువు అని కొందరు చెబుతారు, అక్కడొద్దు ఇక్కడే ఉండు అని కొందరు చెబుతారు. మోహమాటానికో వాళ్లకు అనుభవం ఉంది కాబట్టి చెబుతున్నారు అనో ఆసక్తి లేని రంగంలోనూ, ఆసక్తి లేని కోర్సులలోనూ చేరద్దు.  అలాగే మరొక విషయం పెళ్లి. అబ్బాయి బాగున్నాడు, ఆర్థికంగా మంచి స్థాయి. మంచి ఉద్యోగం, సాలరీ బాగుంది. ఒకమ్మాయికి కావాల్సింది నిజంగా ఇంతేనా?? ఎంత కేర్ గా చూసుకుంటారు, ఎంత అర్థం చేసుకుంటారు అనేది కదా ముఖ్యమైన విషయం. ఇంకా కేవలం అమ్మాయి, అబ్బాయి మధ్య మాత్రమే జరిగే విషయాల మాటేమిటి?? చుట్టాలు, తెలిసినవాళ్ళు చెప్పే పై విషయాలు విని పెళ్లి లాంటి వాటికి ఒప్పేసుకుంటే తరువాత జీవితకాల బాధలు అనుభవించాలి. అందుకే కాబోయే జీవిత భాగస్వామితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోవడం మంచిది కదా. ఇక్కడ మిస్సయిన ఇంకొక విషయం సహోద్యోగుల దగ్గర మొహమాటం. వాళ్ళు అడిగారని వాళ్ళ పనులు కూడా చేసిపెడుతూ ఉండటం. వ్యక్తిగత సమయాలను త్యాగం చేసేయ్యడం. ఇది మొదట్లో పెద్ద సమస్య కాదు కానీ మెల్లిగా వాటి ఫలితాలు తెలుస్తాయి. అలాగే ఇరుగు పొరుగు మనుషుల దగ్గర కూడా ఇదే అవుతుంది. అందుకే మొహమాటం లేకుండా ఇబ్బందికరం అనిపించే విషయాలను కాదని చెప్పడం కుదరదని చెప్పడం మంచిది.                                  ◆వెంకటేష్ పువ్వాడ.
Publish Date: May 28, 2025 10:30AM

సెకండ్ బేబి కోసం స్కెచ్ ఇలా..!

పెళ్ళైన ప్రతి జంట పిల్లల్ని కనడం అనేది కామన్. అయితే మొదటి బిడ్డను కనడం కంటే రెండవ బిడ్డను కనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొదటిసారి తల్లిదండ్రులు అయ్యేటప్పుడు పేరెంట్స్ నుండి మంచి అటెన్షన్ ఉంటుంది. పైగా ఆర్థిక స్థితి కూడా మరీ అంత ఇబ్బందిగా ఏమీ ఉండదు. కానీ రెండవసారి పిల్లల్ని కనేటప్పుడు ఆర్థిక స్థితి గురించి, పరిస్థితుల గురించి మాత్రమే కాకుండా మానసిక స్థితుల గురించి కూడా ఆలోచించాలని చెబుతున్నారు. మానసిక స్థితి గురించి ఆలోచించడం ఏంటి అనే అనుమానం వస్తే అన్నిటికీ సమాధానమే ఇప్పుడు తెలుసుకోబోయేది. కమర్షియల్ స్టేటస్! కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చేముందు అది కేవలం కొన్నిరోజుల సంబరం కాదు. అది జీవితకాల బాధ్యత అని విషయాన్ని ఆలోచించాలి. చాలామంది పిల్లల్ని కనేసి ఆ తరువాత ఖర్చులను చూసి చిరాకు పడుతూ ఉంటారు. ముఖ్యంగా మగవాళ్ళు ఈ విషయంలో చాలా ఆలోచన చెయ్యాలి. పిల్లలుగా ఉన్నప్పుడు అయ్యే ఖర్చులే కాకుండా పెరిగే కొద్దీ పిల్లల అవసరాలు, చదువులు మొదలైన వాటి గురించి కూడా ఆలోచించాలి.  మెంటల్ స్టేటస్! సాధారణంగా చాలామంది మెంటల్ స్టేట్స్ గురించి ప్రస్తావిస్తే బిడ్డను మోసే మహిళ మానసికంగా సన్నద్ధంగా ఉందా లేదా అనే విషయం చూసుకుంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ అప్పటికే ఒకసారి బిడ్డను మోసి ఉంటారు కాబట్టి మళ్ళీ బిడ్డను కనడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చు. ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం, మొదటి ప్రసవంలో ఎలాంటి చేదుఅనుభవాలు లేకపోతే తప్ప రెండవసారి బిడ్డను కనడానికి అయిష్టత చూపించరు. అయితే ఇదంతా ఒక కోణం అయితే మరొక కోణం కూడా ఉంటుంది. అదే కుటుంబంలో అప్పటికే ఉన్న చిన్న మనసు మానసిక పరిస్థితి.  ప్రాధాన్యత మారిపోవడం! మొదటిసారి బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులకు, పెద్దలకు అందరికీ ఆ బిడ్డ చాలా అపురూపం అయిపోతుంది. ప్రతిదీ బిడ్డకోసమే అన్నట్టు అన్ని చేసుకుపోతారు. కానీ ఒక్కసారిగా మరొక బుల్లి బుజ్జాయి ఇంట్లోకి రాగానే అందరి అటెన్షన్ ఆ చిన్న ప్రాణం దగ్గరకు వెళ్ళిపోతుంది. అప్పటివరకు తనకే అటెన్షన్ ఇచ్చిన వాళ్ళు వేరే దగ్గరకు వెళ్లడం మొదలుపెట్టేసరికి తెలియకుండానే అయిష్టత, తనకు ఇంపోర్టెన్స్ తగ్గించారనే కోపం, అందరూ అక్కడే ఉంటున్నారని జెలసి ఫీలవడం మొదలైనవి జరుగుతాయి. అది మాత్రమే కాకుండా అప్పటి వరకు ఏది అడిగినా కాదనకుండా అమర్చిపెట్టిన వాళ్ళు కాస్తా అందులో భాగం చేసి చెల్లికో, తమ్ముడికో పెట్టడం లేదా నువ్వు ఇప్పుడు పెద్ద కాబట్టి తమ్ముడి కోసం, చెల్లి కోసం ఇవ్వాలి అని చెప్పడం పిల్లల్లో చెప్పలేనంత మానసిక సమస్యలను సృష్టిస్తుంది. మరేం చెయ్యాలి? ఆర్థిక స్థితి గురించి ఎలాగైతే ఆలోచిస్తారో అలాగే ఇంట్లో ఉన్న పిల్లల మానసిక స్థితి గురించి కూడా ఆలోచన చెయ్యాలి. తమ్ముడు లేదా చెల్లి వస్తారు నీకోసం అనే మాటలు పిల్లలతో చెబుతూ ఉండాలి. దాని వల్ల పిల్లాడిలో నా తమ్ముడు, చెల్లి అనే ఫీలింగ్ ఇంకా బాధ్యత ఏర్పడతాయి.  ప్రసవం తరువాత కూడా పెద్ద పిల్లలను పట్టించుకోకుండా ఎప్పుడూ చిన్న పిల్లల దగ్గర గడపకూడదు. పెద్ద పిల్లల కంటే చిన్న పిల్లలకు తల్లిదండ్రుల అవసరం ఎక్కువ ఉన్నా దాన్ని పెద్ద పిల్లలతో కలసి తల్లిదండ్రులు పంచుకోవాలి. ఆ చిన్న పిల్లాడికి లేదా పాపకు పెద్దలు మాత్రమే కాదు నువ్వు కూడా అవసరమే అనే విషయాన్ని తెలియజేయాలి. ఇలాచేస్తే రెండవసారి ప్రసవంలో ఇంటికి వచ్చే కొత్త అతిథిని తల్లిదండ్రుల కంటే ఆ తోడబుట్టిన మనసే ఎక్కువ ప్రేమిస్తుంది.                                    ◆వెంకటేష్ పువ్వాడ.
Publish Date: May 27, 2025 10:30AM

మాటలతో కట్టిపడేయాలంటే ఇలా ఆకట్టుకోవాలి!

మాట ఆభరణం మనిషికి అంటారు పెద్దలు. మాటే మంత్రము అంటారు కవులు. మాట ఇతరులను ముగ్ధులను చేస్తుంది, ఆకర్షిస్తుంది. అందంగా ఆకట్టుకునేలా మాట్లాడటం కూడా ఒక కళ. ఇప్పటి యూత్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో మాట్లాడటం గురించి కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ మాట్లాడటంలో అందరూ తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిన విషయాలు కొన్ని ఉంటాయి.  ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు ఆ సంభాషణలో మనం ఎప్పుడూ ఇతరులతో వాదించడానికి ప్రయత్నం చేయకూడదు. సంభాషణలో మనకు తెలిసిన విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అంతేకానీ వాదనకు దిగటం అంత మంచిది కాదు. ఎందుకంటే వాదనే గొడవలకు దారి తీస్తుంది. సంభాషణలో ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తూ మాట్లాడాలి. ఇతరులు చెప్పిన దాన్ని వారి ముఖం మీదే తప్పు అని ఖండిస్తూ మాట్లాడకూడదు. ఎప్పుడూ కూడా సంభాషణలో మనం మాట్లాడేది తప్పు అని మీరు గమనించినా లేక ఇతరులు తెలియజేసినా హుందాగా ఆ తప్పును అంగీకరించాలి. అంగీకరించడంలో కూడా గొప్ప వ్యక్తిత్వం వ్యక్తం అవుతుంది. అంతేగానీ ఆ తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నించకూడదు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసే ఇతర పనులు కూడా తప్పిదాలే అవుతాయి. ఒకదాని వెనుక ఒకటిగా తప్పుల చిట్టా పెరుగుతుంది. సంభాషణని ఎప్పుడూ కూడా స్నేహపూర్వకంగా ప్రారంభించాలి. అలాగే చిరునవ్వుతో ముగించాలి. అప్పుడే విలువను కాపాడుకోగలిగిన వారమవుతాము. నచ్చని విషయాలు ఉన్నా, న్యాయమైన విషయాలు లేకపోయినా వాటిని సుతిమెత్తగా నవ్వుతూనే చెప్పాలి తప్ప గొడవకు దారితీసేలా ఆవేశంగా ఉండకూడదు. ఇతరులు చెప్పే విషయాలను మనం ఎప్పుడూ జాగ్రత్తగా వినాలి. వారు చెబుతున్నప్పుడు మీరు కూర్చున్న కుర్చీలో లేదా కూర్చున్న స్థానంలో కొంచెం ముందుకు వంగి వినాలి. వారికి అటెన్షన్ ఇస్తున్నామనే అభిప్రాయం  కలుగుతుంది. చెప్పాల్సిన విషయాన్ని ఎలాంటి తడబాటు లేకుండా, దాపరికం లేకుండా చెబుతారు. ఇతరుల అభిప్రాయాలపట్ల సానుకూలంగా స్పందించాలి. ఎప్పుడూ కూడా సంభాషణలో ఇతరులను ఆకర్షించాలంటే ఎదుటి వారిని ఎక్కువగా మాట్లాడనివ్వాలి. మనం చెప్పాలనుకున్న విషయాలు, మనం చేయాలనుకున్న ఆలోచనలనూ ఇతరుల ఆలోచనలుగా చేసి వాటిని ఆమోదించాలి. విషయాలను మనం చూసే కోణంలో కాక ఇతరుల కోణంలోంచి చూడాలి, ఆలోచించాలి. మనం ఇతరులపట్ల చూపవలసింది గౌరవాన్ని అనే విషయం మరచిపోకూడదు. వారు చెప్పే మంచిని మనస్ఫూర్తిగా అభినందించాలి. సంభాషణలో అన్నీ నాకు తెలుసు అనుకొనే మనస్తత్వాన్ని వదులుకోవాలి. అవతలి వారు అభిప్రాయాన్ని విషయాన్ని పూర్తిగా చెప్పేంతవరకూ వినాలి. అంతేకానీ మధ్యలో  తొందరపడి ఎటువంటి సూచనలు, సలహాలు ఇవ్వకూడదు. సూచనలు ఇచ్చే ముందు వారు చెప్పిన విషయాన్ని సమగ్రంగా అర్ధం చేసుకొన్నాకే ఇవ్వండి. ఇతరులతో సంభాషించే ముందు సంభాషణను అభినందనతో ప్రారంభించాలి. ఇతరులు చేసిన పొరబాట్లను బహిరంగంగా విమర్శించకూడదు. ఇతరులను విమర్శించే ముందు మీ తప్పుల్ని మీరు అంగీకరించాలి. ఇతరులకు ఆజ్ఞాపూర్వకమైన సూచనలు ఇవ్వవద్దు. దానికి బదులుగా సలహాపూర్వక సూచనలు ఇవ్వాలి. సంభాషణలో ఎప్పుడూ కూడా ఇతరులను అవమానించకూడదు. ఇతరులలో ఉన్న మంచి గుణాలను గాని లేక ఇతరులలో మీరు ఆశిస్తున్న మంచి గుణాలను వారికి ఆపాదించి, వారిని ఆ విధంగా ఉండేలా మలచుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం ఇతరులను ఆకర్షించుకోగలుగుతాము. ఎప్పుడైనా సరే ఎదుటివారి మంచిని బయటకు చెప్పి వారిలో ఉన్న తప్పును ఇది ఇలా ఉండచ్చా?? అలా ఉంటుందని నాకు తెలియదు లాంటి మాటలతో చెప్పాలి. అలా చెబితే మన మాటల ద్వారా అది తప్పేమో అనే ఆలోచన చేసి చివరికి వారు దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఇదీ మాటల్లో ఉన్న మర్మం, మాటకు ఉన్న ఆకర్షణ, మాటకున్న శక్తి.                                      ◆నిశ్శబ్ద.
Publish Date: May 24, 2025 10:30AM

మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో, లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయండి!

మనం ప్రేమించే వ్యక్తి మనతో ఉన్నప్పుడు కలిగే అనుభూతి గురించి మాటల్లో చెప్పలేం. ఆ సమయంలో ఆనందం రెట్టింపు అవుతుంది. అయితే ఎవరైనా రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు వారి భాగస్వామిని వారు నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలనుకుంటారు. వారి భావాలను ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మంచి డేటింగ్ భాగస్వామిని ఎలా ఎంచుకోవాలో కొన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం. మీరు చెప్పింది వినడం: మీ పార్టనర్ మీ మాటలను జాగ్రత్తగా వింటుంటే మీ మాటలను సీరియస్ గా తీసుకుంటే వారు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవాలి. అది నిజమైన ప్రేమకు సంకేతం వంటిది. ఎల్లప్పుడూ అండగా ఉండటం: కష్టమైనా, సుఖమైనా ఆ సందర్భంలో మీకు అండగా నిలిచేవారు నిజమైన భాగస్వామి. మీ సంతోషంలో, దుఖంలో మీ భాగస్వామి మీకు సపోర్టుగా ఉండాలి. మీ దుఖంలో పాలుపంచుకోవడం, మీకు ధైర్యాన్ని ఇవ్వడం..ఇది నిజమైన ప్రేమకు అర్థం. ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం: మీరు అనారోగ్యంగా ఉన్న సమయంలో మీ భాగస్వామి ప్రేమను సులభంగా అర్థంచేసుకోవచ్చు. మీరు అనారోగ్యానికి గురైనప్పుడు మీ భాగస్వామి మిమ్మల్ని చిన్నపిల్లల్లా చూసుకుంటారు. సకాలంలో మందులు, ఆహారం అందిస్తారు. అలాంటి వ్యక్తి మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. కోపంగా ఉన్నప్పుడు భరోసానివ్వడం: మీరు కోపంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మాత్రమే మిమ్మల్ని శాంతిపజేస్తారు. ఎవరైనా మిమ్మల్ని ప్రేమించనట్లయితే..మీ బాధ వారికి ఎలాంటి తేడా కలిగించదు. కాబట్టి మీరు కోపంగా ఉన్నప్పుడు మీ భాగస్వా మి బాధపడి, మిమ్మల్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తే అలాంటి వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవాలి.  
Publish Date: May 23, 2025 1:03PM

కలలో ఏమి కనిపిస్తే దేనికి సంకేతం?

కలలు అందరికీ వస్తాయి. అయితే ప్రతి కలలో ఏదో ఒకటి కనబడుతూ ఉంటుంది అందరికీ. అలా కలలో కనిపించే వస్తువు, ప్రదేశం ఇతరం ఏదైనా సరే.. దాన్ని బట్టి మనిషికి కొన్ని విషయాలను సూచిస్తుంది మనిషి అంతరంగం. మనిషి కలలో ఏమి కనబడితే ఏమవుతుంది?? ఏది దేనికి సంకేతంగా భావించబడుతుంది?? దానికి వివరణలు ఏమిటి?? ఫ్రాయిడ్ తన సిద్ధం ద్వారా నిరూపించిన విషయాలు ఇవీ... దేవదూత : కలగన్నవారు ఆధ్యాత్మిక శక్తి, ఉన్నతాత్మ, దివ్యగుణాలను (దయ, ప్రేమ, కరుణ, పవిత్రత) పొందాలనే ఆకాంక్షలకు ప్రతీక దేవదూత కలలో కనిపించడం. శిశువు: కొత్త జన్మ, కొత్త ఆదర్శాలను గుర్తించడం, చిన్న పిల్లల్లాగా  నిస్సహాయతను వ్యక్తం చేయడం దీనికి సంకేతం. అలాగే పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనే కోరిక, గర్భధారణ విషయంలో భయానికి ప్రతీక. చెంపలు: ఇవి  పిరుదులకు ప్రతీకలు, ఇవి కలలోకి వస్తే లైంగికేచ్చ అంతర్లీనంగా సంఘర్షణలో ఉన్నట్టు అర్థం. చెంపలు ఈ భావాన్ని  వ్యక్తం చేస్తాయి.  కన్ను:  దూరదృష్టిని, ఆప్రమత్తతను సూచిస్తుంది. జరగబోయే వాటి గురించి అప్రమత్తతను తెలియజేయడం దీని అర్ధం.  పెళ్లి కూతురు:  స్త్రీల కలలలో ఎక్కువగా కనిపించేది పెళ్లి కూతురు. మగవాడు పెళ్ళికూతురు గురించి కలగనడు. పెళ్ళికూతురే కలలో పెళ్ళి కూతురిని చూస్తే ప్రేమను వేడుకొందన్న మాట. తల్లిదండ్రుల శృంఖలాల నుంచి బయటికి అడుగుపెట్టడం దీనికి సంకేతం.  దొంగ : విలువైనది దేనినైన తస్కరించేవాడు. స్త్రీల విషయంలో మానాన్ని, కలగన్న వాడే దొంగ అయితే తను చేసిన, చేయనున్న దోషాలను బయటపెట్టడం, దొంగ తండ్రిని సూచించవచ్చు. ఫ్రాయిడ్ ప్రకారం, దొంగల భయం శైశవంలో పాతుకుపోతుంది. మంచం ప్రక్కన నిలబడ్డ తండ్రిని, ఆకస్మికంగా నిద్ర లేచిన బిడ్డ చీకట్లో చూచి దొంగ అనుకొంటాడు.  శవం: ఇది ఎప్పుడూ మనుష్యులు చావడాన్నే సూచించదు. అవాంఛనీయ ఆశ. ప్రేమసంబంధాల అంతాన్ని సూచించవచ్చు. తను కాదనుకొన్నవారిని మరణం ద్వారా తొలగిస్తాడు. తానే శవమైతే అనారోగ్యాన్ని, మృత్యుభయాన్ని, తను అనుభవిస్తున్న రోగబాధను సూచించవచ్చు.  పోలీసు:  అధికారం, శిక్ష, రక్షణ, అంతరాత్మ ఇవన్నీ విడివిడిగా లేదా కలిపి. రాణి: రాణి కలలో కనిపిస్తే తల్లి కాబోతున్నట్టు సంకేతమట. స్నానాల గది : లైంగిక, రుగ్మత, రహస్యకార్యమేదైన ఉంటే దానికి ఇది సంకేతం.  సేతువు : ఒక స్థితి నుంచి మరొక స్థితికి పరివర్తనం చెందటం. సేతువును దాటటమంటే కష్టాలను దాటడం. శ్మశానం : తన లేదా ఇతరుల మరణ వాంఛ. ప్రేమ భంగం లేదా సంబంధం తెగిపోవడం కూడా దీనికి సంకేతం. గుడి: ఆధ్యాత్మికంగా పైకి ఎదగడం, అపరాధాలను ప్రక్షాళనం చేసుకోవడం.  వ్యవసాయ క్షేత్రం : ప్రేమ, పెండ్లి, సంతానాలను సూచిస్తుంది.  హోటలు: హోటల్ కలలోకి రావడం అరుదే. అయితే ఇది పరివర్తన దశ. హోటలు తాత్కాలిక నివాసం. వాటి అంతస్తులు చేతనా చేతనలను సూచిస్తాయి. ద్వీపం : ఏకాంత సూచకం. ఒంటరిగా మౌనంగా ఉండాలని అనుకోవడానికి ఇది సూచన.  ఊబి: పరిస్థితులు తనను ముంచుతున్నాయను కొంటాడు స్వాపి. ఇతరుల సహాయం లేక బయట పడలేననుకొంటాడు. ఊబి ఎలాగైతే మనిషిని తనలోకి లాక్కుని సజీవంగా మరణం తెస్తుందో అలాగే నిజంగా జరుగుతుందని భయాడతారు. ఇలా కలలో కొన్ని విషయాలు కొన్ని సంకేతాలను ఇస్తాయి. అవన్నీ ఫ్రాయిడ్ తన సిద్ధాంత  పరిశీలన ద్వారా  రూపొందించినవి.                                          ◆నిశ్శబ్ద.
Publish Date: May 22, 2025 10:30AM

మంచి నిద్రకు అద్భుతమైన మందు!

ఈ కాలంలో హాయిగా నిద్రపోవడం కూడా అదృష్టమే. ఎంతో మంది నిద్రలేమితో సతమతమవుతుంటారు. నిద్ర పట్టాలని ఎన్నో మార్గాలు అనుసరిస్తుంటారు. కానీ ఏవీ చక్కని పలితాన్ని ఇవ్వవు. కొందరు ధ్యానం అంటారు అయిదు నిమిషాలు స్థిరంగా కూర్చోలేరు. మరికొందరు ఒత్తిడి అంటారు దానివల్ల నిద్రలేమి అంటారు దాని కోసం డాక్టర్లను సంప్రదిస్తారు. మందులు వాడుతూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళు అలా మందుల వల్ల నిద్రకు అలవాటు పడి తరువాత వాటిని వాడటం ఒక్కరోజు ఆయన ఇక నిద్ర ఖరాబ్. మళ్లీ నిద్ర రాదు, పట్టదు. ఇంకొందరికి ఆలోచనలు.  జీవితం గూర్చి, భవిష్యత్తు గూర్చి.మరికొందరికి ఓర్వలేనితనం వల్ల నిద్ర పట్టదు. చెప్పుకోవడానికి, వినడానికి కాస్త ఆస్చశ్రయంగా అనిపించినా ఇది నిజం. ఒకరు ఎదుగుతున్నారంటే భరించలేని వాళ్ళుంటారు. వాళ్ళు ఎప్పుడూ ఇతరులు ఎదిగిపోతున్నారని ఆలోచిస్తూ తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఇదే కోవకు చెందినవాళ్ళు మరికొందరు ఉంటారు. ఇంకొందరు అయితే చాటింగ్ లు, బ్రౌజింగ్ లు, అనవసరపు పనులు చేస్తూ చేతులారా నిద్రను దూరం చేసుకుంటారు. ఇట్లా కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు. నిద్ర పట్టకపోవడానికి కూడా బోలెడు కారణాలు ఉన్నాయి. అయితే నిద్రకు ఒక చక్కని మందు ఉంది. అదేంటో తెలియాలి అంటే కింద విషయం చదవాలి. అనగనగా ఒకరాజు. ఆయన గొప్పవాడు. రాజ్యం ఉంది, సంపదలు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. సకల సౌభాగ్యాలు ఉన్నాయి. కానీ ఆయనకు లేనిది ఒకటే నిద్ర. నిద్ర పట్టదు. పరుపు మీద పడుకుని దొర్లి దొర్లి పెడతాడు. కానీ నిద్ర రాదు. ఒకరోజు రాత్రిపూట నిద్రపట్టక తోటలోకి వెళ్ళాడు. ఆ తోటకు ఆనుకుని అడవి ఉంది. ఆ అడవి నుండి ఆ వేళ ఏదో శబ్దం వస్తోంది. ఈ సమయంలో ఎవరో చూడాలి అనుకుని తోట నుండి అడవిలోకి వెళ్ళాడు రాజు. ఆ అడవిలో ఒక వ్యక్తి చెట్టు నరుకుతూ కనిపించాడు. వెన్నెల వెలుగు ఉండటంతో పని జరుగుతోంది.  "నువ్వు రాత్రిపూట నిద్రపోకుండా చెట్టు నరుకుతున్నావు. నీకు నిద్ర పట్టదా" అని అడిగాడు రాజు. రాజు సాధారణ బట్టలు వేసుకుని ఉండటంతో ఆ వ్యక్తి అతన్ని రాజు అనుకోలేదు. "ఎందుకు రాదు అలా పడుకుంటే కొన్ని సెకండ్లలోనే .శవం మాదిరి నిద్రపోతాను. కానీ పని జరిగితేనే డబ్బులొస్తాయి. కాబట్టి తప్పదు పని చేయాలి" అన్నాడు ఆ వ్యక్తి. "ఏంటి సెకండ్లలోనే నిద్ర వచ్చేస్తుందా నేను నమ్మను" అన్నాడు రాజు. "నమ్మకపోతే నేను ఏమి చేయలేను" అన్నాడు ఆ వ్యక్తి. "ఒకపని చేద్దాం. నేను నీ బదులు చెట్టు నరుకుతాను. నువ్వు సెకండ్లలోనే నిద్రపోతా అన్నావుగా నిద్రపో చూద్దాం" అన్నాడు రాజు. ఆ వ్యక్తి సరేనని గొడ్డలి రాజుకు ఇచ్చి చెట్టుకింద అలా పడుకుని నిమిషంలోపలే గురక పెట్టి నిద్రపోయాడు. "పట్టు పరుపులు, మెత్తని దుప్పట్లు అన్ని ఉన్నా నాకు నిద్ర రాదు. వీడు చెట్టు కిందనే ఇట్లా ఎలా నిద్రపోయాడు" అనుకున్నాడు రాజు. ఆ తరువాత వాడికి మాట ఇచ్చాను కాబట్టి చెట్టు నరకాలి అనుకుని చెట్టు నరికేసాడు. అలవాటు లేని పని అవ్వడం వల్ల చేతులు బొబ్బలెక్కాయి. చెమటతో శరీరం తడిసి ముద్దయ్యింది.అలసట కలిగింది. కాళ్ళు, చేతులు లాగేసాయి. మెల్లిగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి అతడి పక్కనే అలా నడుము వాల్చాడు. నిమిషంలోపలే హాయిగా నిద్రపోయాడు. ఉదయాన్నే రాజుకు మెలకువ రాగానే అనుకున్నాడు. మనిషికి శారీరక కష్టమే మంచి నిద్రను ప్రసాదిస్తుంది అని.  కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే మంచి నిద్ర కావాలి అంటే కష్టపడి పనిచేయాలి. దురదృష్టం కొద్దీ ఈ కాలంలోప్రతి ఇంట్లో పని దొంగలు ఎక్కువ ఉంటున్నారు. పని మనుషులను పెట్టుకోవడం కూడా అందుకు ఓ కారణం. మనిషి శరీర ఆరోగ్యానికి, మంచి నిద్రకు ఏ వైద్యుడు ఇవ్వలేని గొప్ప ఔషధం కష్టం. అందుకే కష్టపడాలి. నష్టం ఏమి ఉండదు. ◆ వెంకటేష్ పువ్వాడ  
Publish Date: May 21, 2025 10:30AM

తల్లిదండ్రులే చేతులారా పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు.. కారణాలు ఇవే!

పిల్లలను పెంచడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడాలి. ఒక్కోసారి పిల్లలు చేసే అల్లరిని, వారు చెప్పే కట్టు కథలను తెలివిగా ఎదుర్కోవలసి ఉంటుంది. మరికొన్నిసార్లు పిల్లలు చేసే తప్పులను, మోసాన్ని తట్టుకోవలసి వస్తుంది,  కొన్నిసార్లు  పిల్లల డిమాండ్లను నెరవేర్చవలసి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చేస్తున్న ప్రతిదీ వారి మంచికోసమేనని, అది మంచి పనేనని భావిస్తుంటారు. దానికి అనుగుణంగానే నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కానీ చాలా మంది తల్లిదండ్రులు తమకు తెలియకుండానే మంచి అనే భ్రమలో పిల్లల జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. దీనికి సంబంధించి విషయాలను పేరెంటింగ్ నిపుణులు, కౌన్సిలర్లు కూడా వెల్లడిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చేస్తున్న తప్పులేంటో తెలుసుకుంటే.. నిర్ణయాలు.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది కావాలంటే అది చేయనివ్వమని నిర్ణయాలు పూర్తీగా పిల్లల చేతుల్లో పెట్టడం  తరచుగా కనిపిస్తుంది. పిల్లలు  తమ కెరీర్‌లో ఏమి కోరుకుంటున్నారు, వారికి ఏమి కావాలి, పిల్లలు కోరుకుంటున్నది ఏంటి?  ఈ విషయాలన్నింటికి సంబంధించి  తల్లిదండ్రులు చాలావరకు పిల్లల ఇష్టానికి వదిలేశాం అని చెబుతూ ఉంటారు.  పిల్లల ఇష్టమే మా ఇష్టం, మేము మా అభిప్రాయాలు పిల్లల మీద రుద్దడం లేదు. అని చెప్పుకుంటూంటారు కూడా.   ఈ కారణంగానే పిల్లల కెరీర్, వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు వారి చేతుల్లోనే పెడుతుంటారు. కానీ ఇది సరైన పద్దతి కాదని పేరెంటింగ్ నిపుణులు, కౌన్సిలర్లు అంటున్నారు. తల్లిదండ్రుల తప్పేంటి? చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏది అడిగినా దానికి నో చెప్పరు. దీనికి కారణం పిల్లలు ఇష్టమైన రంగంలో చాలా ఆసక్తి చూపిస్తారని దీని వల్ల వారు సులువుగా కెరీర్ లో విజయం సాధించి సెటిల్ అవుతారని నమ్మడం. కొందరు తల్లిదండ్రలు అయితే తమ పిల్లలు ఆసక్తి చూపించిన రంగంలో వారిని చేర్చి ప్రోత్సహించడానికి లక్షలాది రూపాయలు పోయడానికి అయినా సిద్దంగా ఉంటారు. కానీ పిల్లలు కెరీర్ లో విజయం సాదించలేకపోతారు. దీనికి కారణాన్ని పేరెంటింగ్ నిపుణులు కింది విధంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికాలం తల్లిదండ్రులు  చాలా బిజీ జీవితాలు గడుపుతున్నారు. పిల్లలకు ఏ లోటూ రాకూడదని లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టడానికి అయినా సిద్దమవుతారు. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించడం లేదు. ఆ లోటు భర్తీ చేయడానికి, అది బయటకు కనిపించకుండా ఉండటానికి వారు డబ్బును అడ్డు పెట్టుకుంటున్నారు. డబ్బుతో పిల్లలు విజయం సాధిస్తారని అనుకుంటున్నారు. కానీ ఇది చాలా పెద్జ తప్పు. చిన్న తనం నుండే తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన మార్గనిర్దేశకత్వం చేస్తూంటే అది వారి జీవితాన్నిసరైన దిశలో తీసుకెళ్తుంది. కేవలం డబ్బు వెచ్చింది పిల్లల బాగోగులను చూడటం అంటే అది కృత్రిమంగా పిల్లలను పెంచడం లాంటిది. అదే పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పటి నుండి వారి జీవితాన్ని  తోడ్పాటు ఇస్తూ వారి ఆలోచనలు సరైనవా కాదా అని వారితోనే చర్చింది ఆ తరువాత నిర్ణయం తీసుకునే అదికారం పిల్లలకు ఇస్తే అప్పుడు పిల్లలకు తమ జీవితంలో సాధించాల్సింది ఏంటి అనే విషయం మీద స్పష్టత వస్తుంది. అలా కాకుండా పిల్లల జీవితం ఎదగడానికి కేవలం డబ్బు సరిపోతుందని తల్లిదండ్రులు బావిస్తే అది చాలా పొరపాటు అవుతుంది.                                              *నిశ్శబ్ద.  
Publish Date: May 20, 2025 10:30AM

అమ్మాయిల టేస్టులు!

  ఈ కాలంలో అమ్మాయిలు బాగా అప్డేట్ అయ్యారు. వాళ్ళు ప్రతి విషయంలో ప్లానింగ్ గా ఉంటారు. ముఖ్యంగా చదువు, ఉద్యోగం, భాగస్వామి, ఫ్యూచర్ ప్లాన్స్ ఇలా వ్యక్తిగత విషయాలలో ఏ మాత్రం తగ్గకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. భారతీయ జనాభాలో అమ్మాయిలు, అబ్బాయిలా సగటు నిష్పత్తి చూస్తే అమ్మాయిల శాతం తక్కువగా, అబ్బాయిల శాతం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కారణంగా పెళ్లి కావాల్సిన అబ్బాయిలకు అమ్మాయిలను వెతకడం కాస్త కష్టమవుతోంది. మొదటే అమ్మాయిల కొరత అంటూ ఉంటే, ఇంకా అమ్మాయిల గట్టి నిర్ణయాల వల్ల అబ్బాయిలు, అబ్బాయిలు తల్లిదండ్రులు కిందామీదా అయిపోతున్నారు పెళ్లి విషయంలో. వాటికి తగ్గట్టు ఈకాలంలో ఆడపిల్లలు తల్లిదండ్రుల్ని బాగా చేసుకుంటున్నారని బుద్ధి సగటు తల్లిదండ్రులకు కలిగినప్పటి నుండి అడపిల్లల్ని కూడా ఏమాత్రం తక్కువలేకుండా చదివించడం చేస్తున్నారు. అందుకే అబ్బాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు వేటలో ఉన్నారు అమ్మాయిల కోసం. వధువు కావలెను అనే బోర్డ్ పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. వధువులు ఓకే చెప్పడానికి అబ్బాయిలలో కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవేంటి మరి?? చదువు! సాధారణంగా ఈ కాలంలో విద్యావంతురాళ్లు అయిన అమ్మాయిలే ఎక్కువ. కనీసం గ్రాడ్యుయేట్ అయినా పూర్తి చేసినవాళ్ళు ఉంటారు. ప్రభుత్వ పథకాలు, రీయింబర్స్మెంట్స్ పుణ్యమా అని అమ్మాయిలు కూడా ఇంజనీరింగ్, పీ.జీ, పీ.హెచ్.డి పట్టాలు చక్కగా అందుకుంటున్నారు. ప్రతి అమ్మాయి తనకంటే విద్యాధికుడిని భర్తగా కోరుకుంటుంది. అంటే అమ్మాయి కంటే అబ్బాయి మరింత విద్యాధికుడు అయి ఉండాలి.  ఉద్యోగం! ప్రభుత్వ ఉద్యోగస్తుడిని చేసుకుంటాను అని గిరి గీసుకుని కూర్చునే అమ్మాయిలు ప్రస్తుతమైతే లేరు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు అయితే అటువైపు ఆలోచన చేస్తారు. ఈ కాలంలో మంచి విద్యార్హతకు ప్రయివేటు సంస్థలలో చాలా మంచి అవకాశాలే ఉంటున్నాయి. కాబట్టి సంపాదన బాగా ఉంటే ఉద్యోగానికి వంక పెట్టడం అమ్మాయిలు చెయ్యరు.  ఆర్థిక విషయాలు! చాలామంది అంటూ ఉంటారు మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోతున్నాయి అని. నిజం చెప్పాలంటే ఈ కాలంలో డబ్బు లేకుండా బతికే మహానుభావుడు ఎవరూ ఉండరు. డబ్బు విషయంలో జాగ్రత్త ఉండేవాడికే జీవితంలో కాసింత ఆర్థిక లోటు లేకుండా సమస్యలను డీల్ చేయగలిగే సత్తా ఉంటుంది. ఎందుకంటే 99% సమస్యలు అన్నీ ఆర్థికంగా ఎదురవుతున్నవే ఉంటున్నాయి ఈ కాలంలో. అందుకే ఆర్థిక విషయాలలో సరైన ప్లానింగ్ ఉన్నవాళ్లకు అమ్మాయిలు  పెద్ద పీట వేస్తుంటారు. ప్రైవేట్ అండ్ పర్సనల్ స్పేస్! ప్రతి వ్యక్తికి కాసింత స్పేస్ అవసరం. భార్యాభర్తల మధ్య దాచాల్సిన పర్సనల్స్ ఏమి ఉంటాయి. భర్తకు తెలియకుండా బయట పనులు ఏమి ఉంటాయి అనేది కొందరి వాదన. అయితే గూడాఛారిలాగా ప్రతి విషయం మీద నిఘా పెడుతూ ఉంటే మాత్రం ఏ అమ్మాయి కూడా భరించలేదు. ప్రతి విషయాన్ని ఇంట్లో అత్తకు, మామకు, భర్తకు చెప్పి తీరాలి అనే డిమాండ్స్ కు అమ్మాయిలు చాలా వ్యతిరేకం. కాసింత స్వేచ్ఛను గనుక అమ్మాయిలకు ఇవ్వగలిగితే వాళ్ళు చేసే ప్రతి పనిని తమకు తామే ఇంట్లో వాళ్లకు చెబుతారు. ఇక్కడ ఒక చిన్న ఇగో అండ్ డామినేషన్ లైన్ ఉంటుంది దాన్ని చెరుపుకోవడం లేదా ఆ చిన్న గీతను పెంచి పెంచి పెద్ద గోడలాగా మార్చడం ఆ కుటుంబంలో అందరి ప్రవర్తన మీదా ఆధారపడి ఉంటుంది. ప్రాధాన్యతలు! అమ్మాయిల ప్రాధాన్యతలు ఎప్పుడూ ఫ్యూచర్ ప్లాన్స్ మీదనే ఉంటాయి. అలాగని ప్రస్థుతాన్ని అసలు విస్మరించేవాళ్లేమి కాదు. భర్త తన తల్లిదండ్రులకు ఎంత ఇంపార్టెన్స్ అయినా ఇవ్వచ్చు, కానీ భార్యకు అంతకంటే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇంకా సమస్యలను నలుగురి ముందు చెప్పి, చుట్టాలు పక్కాల మధ్య పంచాయితీలు పెట్టించి బాపతు అబ్బాయిలకు, భార్యాభర్తల వ్యక్తిగత విషయాలలో వేరే ఎవరో జోక్యం చేసుకోవడం వంటి వాటికి అమ్మాయిలు విరుద్ధం మరి. వీటన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం అబ్బాయిలు ఏ పనిని అయినా సొంతంగా చేయడం, సొంత నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ప్రతి విషయానికి ఇతరుల నిర్ణయాల మీద డిపెండ్ అయ్యేవాడు అయితే అసలు భరించలేరు.  అమ్మాయిలు ఒకే చెప్పాలంటే కొంచం చూసుకోండి మరి!!                                 ◆వెంకటేష్ పువ్వాడ.    
Publish Date: May 17, 2025 10:30AM

ప్రేమించడం తప్పు కాదు.. కానీ  రిలేషన్ నిలబడాలంటే ఇవి ముఖ్యం..!

   ఎవరితోనైనా ప్రేమ గురించి మాట్లాడటం చాలా సులభం, కానీ ఆ సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం చాలా కష్టం. చాలా మంది కొన్ని రోజుల రిలేషన్ లో ఉన్న  తర్వాత విసుగు ప్రదర్శిస్తూ ఉంటారు. వారు చేసే కొన్ని తప్పుల వల్ల ఇద్దరి మధ్య  సంబంధం బలహీనపడుతుంది. ఈ తప్పుల వల్ల  రిలేషన్  లోతును,  దాని బాధ్యతలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రేమ అయినా, పెళ్లి అయినా, స్నేహం అయినా.. ఇలా ఏ రిలేషన్ అయినా సరే.. కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.  ఆ నియమాలను తెలుసుకోకపోతే ఎంత మందితో కొత్తగా రిలేషన్ మొదలుపెట్టినా సరే.. అది తొందరగా బ్రేకప్ అవుతుంది.  ముఖ్యంగా ప్రేమికులు, భార్యాభర్తలు వారి రిలేషన్ లో ఈ క్రింది విషయాలను తప్పనిసరిగా తెలుసుకుని ఆచరించాలి. నమ్మకం.. సంబంధంలో నమ్మకం లేకపోతే దాని పునాది బలహీనంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో  భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకూడదు. ఇద్దరి  మధ్య ఏదైనా అపార్థం ఉంటే ఇద్దరూ కలిసి కూర్చుని దాని గురించి మాట్లాడి, అపార్థాన్ని తొలగించుకోవాలి. ఏ సంబంధంలోనైనా ఓపెన్ గా మాట్లాడటం,  సమస్యను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల ఇద్దరి మధ్య  సమన్వయం కూడా పెరుగుతుంది. స్వేచ్ఛ.. ప్రతి సంబంధంలో ఎదుటి వ్యక్తికి స్పేస్  ఇవ్వడం చాలా ముఖ్యం. చాలా మంది తమ హక్కులను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎదుటి వ్యక్తిపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు, ఎదుటి వారి స్వేచ్ఛను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. దీని కారణంగా సంబంధం బలహీనపడటం ప్రారంభమవుతుంది. అందుకే భార్యాభర్తలు తమ భాగస్వాములకు  స్పేస్ ఇవ్వాలి. వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు వారికి ఉందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇది చేయకపోతే భాగస్వామి సంబంధంలో ఊపిరాడకుండా పోవడం ప్రారంభిస్తాడు. దీని వల్ల బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. కమ్యూనికేషన్.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు  సంభాషించకపోతే, సంభాషణలో పారదర్శకత ఉండదు. మాట్లాడకపోవడం వల్ల ఇద్దరి మధ్య  అపార్థాలు ఏర్పడతాయి. దీని కారణంగా సంబంధం  పునాది బలహీనపడటం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడాలి. శ్రద్ద.. చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఏం తింటావని అడగడం, జాగ్రత్తగా ఉండమని చెప్పడం, నచ్చిన చోటకు వెళ్లడం, గొడవను పెద్దవి చేసుకోకుండా ఒకరి బాధను మరొకరు పంచుకోవడం వంటివి చేస్తుంటే భాగస్వామికి  ఖచ్చితంగా నచ్చుతుంది. వారు ఎల్లప్పుడూ బంధంలో ఉండాలని అనుకుంటారు.  ఏవైనా గొడవలు జరిగినా వాటిని పరిష్కరించుకుని బంధం నిలబెట్టుకోవాలి అనుకుంటారు. పోలిక.. భార్యాభర్తలు ఇద్దరూ ఎవరూ ఎవరిని ఇతరులతో పోల్చకూడదు.  బయట సంబంధంలో ఉన్నవారిని,  ఇతరులను చూసి వాళ్లు బాగున్నారు, వాళ్లు మంచివారు,  నువ్వు చెడ్డ.. ఇలాంటి కోణంలో ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇలా పోలిస్తే అది వారి మనసును బాధపెడుతుంది.  తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, చిన్న చూపు చూస్తున్నారని భావిస్తారు.  దీనివల్ల బంధంలో అప్యాయత తగ్గుతుంది.                                                   *రూపశ్రీ.  
Publish Date: May 15, 2025 10:30AM

భార్యాభర్తల మధ్య సైలెంట్ డైవోర్స్ గురించి  తెలుసా..!

  నేటి కాలంలో విడాకుల కేసులు పెరిగినప్పటికీ, విడాకుల కొత్త పోకడలు కూడా ఉనికిలోకి వచ్చాయి. ఈ కొత్త విడాకుల నిబంధనలలో గ్రే విడాకులు, స్లీవ్ విడాకులు, సిల్వర్ విడాకులు మొదలైనవి ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజుల్లో  నిశ్శబ్ద విడాకుల కేసులు కూడా పెరుగుతున్నాయి. సైలెంట్ డైవోర్స్ అంటే నిశ్శబ్ద విడాకులు. ఈ రకమైన విడాకులలో చాలా సార్లు దంపతులకు తమ సంబంధం నిశ్శబ్ద విడాకుల వైపు కదులుతోందని లేదా వారు ఇప్పటికే సైలెంట్ డైవర్స్   తీసుకున్నారని వారి కూడా  తెలియదు. తమ మధ్య సైలెంట్ గా విడాకులు  జరిగాయని ఆ జంట గ్రహించినప్పుడు వారు చట్టబద్ధంగా విడిపోతారు. ఇది విడాకుల చట్టపరమైన ప్రక్రియకు ముందు దశ కావచ్చని ఫ్యామిలీ కౌన్సిలర్లు అంటున్నారు. సైలెంట్ డైవర్స్ అంటే.. సైలెంట్ డైవర్స్  అంటే భార్యాభర్తలు చట్టబద్ధంగా కలిసి ఉండే వైవాహిక పరిస్థితి. అంటే విడాకులు తీసుకోలేదు కానీ భావోద్వేగ, మానసిక,  కమ్యూనికేషన్ స్థాయిలో ఒకరి నుండి ఒకరు పూర్తిగా విడిపోతారు. ఇద్దరూ ఒకే ఇంట్లో  నివసిస్తుంటారు కానీ వారి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదా సంభాషణ ఉండదు. వారి మధ్య భౌతిక దూరం కూడా ఉండవచ్చు. ఇది బంధం నిశ్శబ్దంగా అదృశ్యమవడాన్ని సూచిస్తుంది. సైలెంట్ డైవోర్స్ లో ఇద్దరి మధ్య సంబంధం సజీవంగా ఉంటుంది.  కానీ బంధంలో ఆత్మ,  జంట మధ్య పరస్పర అనుబంధం చనిపోతుంది. సైలెంట్ డైవర్స్ సిగ్నల్స్ ఇవే.. భార్యాభర్తల మధ్య బంధం సైలెంట్ డైవోర్స్ వైపు వెళుతోందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కొన్ని సిగ్నల్స్ కనిపిస్తాయి.  వాటి ద్వారా దీన్ని గుర్తించి జాగ్రత్త వడవచ్చు. సంభాషణ ఉండదు.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు సాధారణ విషయాలే కాదు.. ఒకరితో ఒకరు ముఖ్యమైన విషయాల గురించి కూడా మాట్లాడుకోరు. వారి మధ్య దాదాపుగా కమ్యూనికేషన్ ఉండదు. రోజువారీ విషయాలు కేవలం లాంఛనాలుగా జరుగుతూ ఉంటాయి. ఎమోషనల్ డిస్టెన్స్.. భార్యాభర్తలు ఒకరి భావాలను ఒకరు పట్టించుకోరు. ఇద్దరి మధ్య ఎమోషన్ డిస్టెన్స్ ఏర్పడుతుంది. ఒకరి సుఖదుఃఖాలను ఒకరు పంచుకోరు.  ఒకరి సమస్యలను లేదా ఆలోచనలను ఒకరు పట్టించుకోరు. శారీరక దూరం.. సైలెంట్ డైవర్స్ దిశగా వేళ్లే భార్యాభర్తల బంధంలో  వారి శారీరక  సంబంధాన్ని కోల్పోతారు. కలిసి కూర్చోవడం, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం, కౌగిలించుకోవడం,  కలిసి పడుకోవడం వంటివి దూరం అవుతాయి.   గదిని పంచుకోవచ్చు కానీ రూమ్‌మేట్ లాగా ఎవరికి వారు ఉంటారు. సమయం ఇవ్వకపోవడం.. భార్యాభర్తలు ఒకరికొకరు సమయం ఇవ్వనప్పుడు సమయాన్ని కలిసి  గడపాలని అనుకోరు . కలిసి తినాలనే కోరిక, బయటకు వెళ్లాలనే కోరిక లేదా సెలవు దినాల్లో కలిసి సమయం గడపాలనే కోరిక తగ్గినప్పుడు వారు సైలెంట్ డైవోర్స్ వైపు  ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఆసక్తి.. సాధారణంగా భార్యాభర్తలు  ఒకరి జీవితం గురించి ఒకరు తెలుసుకోవాలనుకుంటారు. వారు గొడవ పడినా, తమ భాగస్వామి రోజు ఎలా గడిచిందో, ఏం చేశారో, తమ స్నేహితులు ఎలా ఉన్నారో తెలుసుకోవడంలో   ఆసక్తి కలిగి ఉంటారు. కానీ వారి మధ్య అలాంటి సాధారణ విషయాలు కూడా  అదృశ్యమైనప్పుడు, వారి మధ్య సైలెంట్ డైవర్స్ పరిస్థితి ఏర్పడుతుంది. గొడవలు.. కొన్నిసార్లు వాదనలు లేదా విభేదాలు లేకపోవడం మంచిదని అనిపించవచ్చు. కానీ వాటి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదని కూడా ఇది సూచిస్తుంది. వారికి ఒకరి నుండి ఒకరు ఎటువంటి ఆశలు ఉండవు. కాబట్టి వారు ఒకరితో ఒకరు గొడవ పడటానికి కూడా ఇష్టపడరు. సైలెంట్ డైవోర్స్ గురించి కొన్ని నిజాలు.. భార్యాభర్తలు చాలా మంది తమ పిల్లలను పెంచడానికి మాత్రమే కలిసి ఉంటారు. వారు భార్యాభర్తలుగా తమ సంబంధంలో సంతోషంగా లేరు కానీ తమ పిల్లల కోసం చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా ఉంటారు విడాకులు సమాజంలో అవమానానికి కారణమవుతున్నాయి. సామాజిక కళంకం, కుటుంబ ఒత్తిడి,  విమర్శల భయాన్ని నివారించడానికి, జంటలు విడాకులు తీసుకోరు,  అందుకే ఇద్దరి మధ్య సైలెంట్ వాతావరణం ఏర్పడుతుంది. దీన్నే సైలెంట్ డైవోర్స్ అంటారు. భర్తలు డైవోర్స్ వల్ల ఆర్థికంగా లాస్ అవుతారు. దీని వల్ల విడాకులు ఇవ్వకుండా  ఆర్థిక లక్ష్యాల  కోసం రాజీగా  సైలెంట్ డైవోర్స్ ఎంచుకుంటారు. బంధంలో ప్రేమ, గౌరవం,  అవగాహన కాలక్రమేణా ముగిసినప్పుడు ప్రజలు బాధ్యతల కోసం మాత్రమే కలిసి ఉంటారు.                                         *రూపశ్రీ.  
Publish Date: May 14, 2025 12:55PM

వివాహం తర్వాత మగవాళ్లు  పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదట..!

వివాహం ఇద్దరు వ్యక్తుల జీవితాలను మార్చే సంఘటన.  ఇది జీవితంలో చాలా ముఖ్యమైన దశ.  వివాహం తరువాత సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలి అంటే  మగవాళ్లు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. ఇంతకీ అవేంటో ఎందుకు చేయకూడదో తెలుసుకుంటే.. వివాహం తర్వాత పురుషులు చేయకూడని పనులు.. వివాహం అయిన మగవాళ్లు ఎక్కడికైనా వెళ్ళేముందు ఆలోచించాలి.  తొందర పడి సొంతంగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకోవడం వల్ల అతని జీవితంలో నష్టపోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఇతరుల ఉద్దేశాలు ఏంటో అర్థం చేసుకోకుండా ఇతరులతో వెళ్లడం చాలా నష్టాలకు దారి తీస్తుంది. వివాహం అయిన తరువాత మగవాళ్లు బయటి మహిళల పట్ల ఆకర్షితులు అవుతుంటారు. ఇలా ఆకర్షితులు అయ్యే మగవాళ్లకు వారి వైవాహిక జీవితంలో చాలా ప్రమాదాలు ఎదురవుతాయి.  ఇది అవతలి వ్యక్తి మనోభావాలను కూడా దెబ్బతీస్తుంది.  అలాంటి ప్రవర్తన వల్ల మొత్తం కుటుంబం అంతా ప్రభావితమవుతుంది. మనిషికి సంతృప్తి అనేది లభించడం చాలా కష్టం.  ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని అనుకుంటూనే ఉంటాడు. వివాహం అయిన మగవాళ్లు ఉన్న వాటితో తృప్తి చెందలేకపోతే  ఆ వ్యక్తి అశాంతికి లోనవుతాడు. ఈ అసంతృప్తి వైవాహిక జీవితంలో కూడా చాలా నష్టాలు,  సమస్యలకు కారణం అవుతుంది. నిర్ణయాలు అందరూ తీసుకుంటారు. కానీ వివాహం అయిన మగవాళ్లు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాల్సి ఉంటుంది.  భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా నష్టపోతారు. అలాగే నిర్ణయాలు తీసుకునే ముందు భార్యకు తప్పకుండా చెప్పాలి.                                 *రూపశ్రీ.  
Publish Date: May 13, 2025 10:30AM

అందరూ మిమ్మల్ని ఇష్టపడాలంటే.. ఇలా చేయండి..!

ఇల్లు అయినా,  ఆఫీసు అయినా.. వేరే ఇతర ప్రదేశమైనా.. అందరూ మనల్ని ఇష్టపడాలని,  అందరూ మనకు ఆకర్షితమవ్వాలని,  మనల్ని గౌరవించాలని అనుకోవడంలో తప్పు లేదు. అయితే అన్ని చోట్లా ఈ గౌరవం,  అబిమానం దొరకడం కష్టం. కానీ అసాధ్యం ఏమీ కాదు.  ఈ విషయం గురించి ఆచార్య చాణక్యుడు  చాలా వివరంగా చెప్పాడు.  ఆయన చెప్పిన కొన్ని విధానాలు పాటించడం వల్ల ఆఫీసు అయినా,  ఇల్లు అయినా మరొక ప్రదేశం అయినా అందరూ గౌరవం ఇస్తూ,  ఇష్టపడతారు కూడా. ఇంతకూ చాణక్యుడు చెప్పిన విషయాలేంటో తెలుసుకుంటే.. సమిష్టి కృషి.. ఆచార్య చాణక్యుడి ప్రకారం సమిష్టి కృషితో ముందుకు వెళ్లే వారు అందరి నుండి గౌరవం పొందుతారు. అంతేకాదు అందరూ ఇలాంటి వారిని ఇష్టపడతారు.  తమ పనులు చేసుకుని వెళ్లిపోయే వారి కంటే అందరినీ తమతో కలుపుకుంటూ పనులలో వేగంగా ముందుకు వెళ్ళేవారు ఆపీసులలో మంచి గుర్తింపు,  గౌరవం తెచ్చుకోగలుగుతారు. అంతేకాదు.. అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి కూడా. పరిష్కారం.. ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యను తొందరగా పరిష్కారం చేసుకోవడం ఇతరులకు సంబంధించిన సమస్యలను అయినా తొందరగా పరిష్కరించడం చాలా మంచి విషయం. కానీ దురదృష్ట పశాత్తు చాలా మంది సమస్యలను తొందరగా పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యంగా లేదా చాలా జాప్యం చేస్తూ ఉంటారు.  కానీ సమస్యలు ఏవేనా,  ఎవరివి అయినా తొందరగా పరిష్కారం చేస్తే అందరూ గౌరవిస్తారు, ఇష్టపడతారు కూడా. గౌరవం.. ఆపీసులో అందరినీ గౌరవించాలి. పెద్దవారు అయినా  చిన్నవారు అయినా గౌరవించాలి. అలా వారికి గౌరవం ఇచ్చినప్పుడు ఎదుటివారు కూడా గౌరవం పొందుతారు. తమ కంటే తక్కువ స్థాయి ఉద్యోగస్థులను కూడా గౌరవించే వారిని అందరూ ఎల్లప్పుడూ గౌరవిస్తారు. అవకాశాలు ఇవ్వడం.. ఇతరులకు అవకాశాలు ఇవ్వడం, అవకాశాలు చూపించడం అనేది ఆపీసులలో ప్రతిభావంతులైన వ్యక్తులు ముందుకు సాగడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.  ఒకరి ప్రతిభను ప్రోత్సహించినప్పుడు ఆ వ్యక్తి మాత్రమే కాదు.. ఆ వ్యక్తి ప్రతిభను ప్రోత్సహించిన వ్యక్తి కూడా ఇతరుల నుండి గౌరవం పొందరుతారు.  తద్వారా అందరూ ఇష్టపడతారు.                                        *రూపశ్రీ.
Publish Date: May 12, 2025 10:30AM

ఆపరేషన్ సింధూర్.. ఈ పేరు వెనుక రహస్యం ఇదే..!

మూడు రోజుల కిందట భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేసింది.  ఈ సైనిక చర్యలో భాగంగా పాకిస్తాన్‌లోని అనేక ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. అర్థరాత్రి జరిగిన ఈ సంఘటన మరుసటి రోజు యావత్ భారతదేశాన్ని ఆకర్షించింది. ఈ వార్త వెలువడిన వెంటనే, దేశవాసుల తడి కళ్ళు భారత సైన్యం పట్ల విశ్వాసం,  గౌరవాన్ని ప్రతిబింబించాయి. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదు భారత దేశ పౌరులపై జరిగిన పిరికి దాడికి తగిన సమాధానం. ఈ  ఆపరేషన్ కు సింధూర్ అనే పేరు పెట్టడం దేశాన్ని,  దేశ ప్రజలను మరింతగా ఆకర్షించింది. ఈ పేరు వెనుక ఉన్న రహస్యం తెలుసుకుంటే.. "సిందూర్" అనేది ఒక చిన్న ఎర్ర చుక్క.  ఇది  భారతీయ హిందూ మత స్త్రీలకు ఎంతో పవిత్రమైనది.   ఇది భారతీయ స్త్రీ గౌరవం, ప్రేమ మరియు శక్తికి చిహ్నం.  స్త్రీల నుదుటిపై ఉన్న సింధూరం పహల్గామ్ భూమిపై రక్తంతో కలిసినప్పుడు, ఈ అవమానాన్ని సహించబోమని దేశం నిర్ణయించుకుంది. ఈ భావన ఫలితంగానే ఆపరేషన్ సింధూర్ ఏర్పడింది. ప్రాముఖ్యత.. భారతీయ సంస్కృతిలో సిందూరం అలంకరణలో ఒక భాగం మాత్రమే కాదు, ఇది లోతైన మతపరమైన,  సాంస్కృతిక అర్థాలతో కూడా ముడిపడి ఉంది. ఇది వివాహిత స్త్రీ గుర్తింపుకు,  తన భర్త దీర్ఘాయుష్షు పొందాలనే  కోరికకు చిహ్నం. స్త్రీ నుదిటిన సింధూరం పెట్టుకుంటారు. దీనిని అజ్ఞ చక్రం లేదా మూడవ కన్ను అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం ఆత్మ,  చైతన్యానికి కేంద్రంగా పరిగణించబడుతుంది. శక్తి.. సింధూరం  ఎరుపు రంగు లో ఉంటుంది. ఇది శక్తకి చిహ్నం.  ఇది శక్తిని,  పోరాటాన్ని సూచిస్తుంది. ఈ రంగు స్త్రీ  అంతర్గత బలం,  దృఢత్వాన్ని కూడా తెలియజేస్తుంది. దుర్గాదేవి విగ్రహాన్ని పూజించేటప్పుడు అమ్మవారి నుదిటిపై సింధూరం పూయడానికి ఇదే కారణం. శాంతియుతంగా ఉండే భారతదేశం చాలా పవిత్రమైన,  ఎంతో గొప్ప దేశంగా పేర్కొనబడుతుంది. అయితే అదే సమయంలో భారతదేశ పౌరుల మతం,  గౌరవం దెబ్బతింటే ముఖ్యంగా మహిళల గౌరవం,  మహిళల జీవితం,  మతం మీద దాడి జరిగితే ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ వివరిస్తుంది. చిటికెడు సింధూరం ధర తక్కువే కానీ,  భారతీయ మహిళల నుదుటన ఉన్న సింధూరం జోలికి వెళితే ఎలా ఉంటుందో ఎంతటి పర్యవసానాలు ఉంటాయో ఆపరేషన్ సింధూర్ తెలుపుతుంది.                         *రూపశ్రీ.
Publish Date: May 10, 2025 10:30AM

పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి?

పిల్లలకు ఈమధ్య కాలంలో మెదడు చురుగ్గా అవ్వడం కోసం ఫోనెటిక్ నెంబర్స్ గురించి చెబుతున్నారు. అయితే ఈ నంబర్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇది ప్రాచీన కాలంలో గ్రీకు దేశంలోవారు తమ జ్ఞాపకశక్తితో రాజుల మెప్పు పొందేందుకు అక్కడి  ఆస్థాన పండితులు కనుగొన్నారు. అచ్చుల హల్లుల ఉచ్ఛారణకు ఒక్కొక్క అంకెను కేటాయించి వాటితో పెద్ద పెద్ద అంకెలను పదాలుగా గుర్తుంచుకొని ఆ అంకెలను వెంటనే ఏ క్రమంలో అడిగితే ఆ క్రమంలో చెప్పగలగడం ఈ పద్ధతి యొక్క విశేషం. ఈ విధానాలతో అనేక మంది జ్ఞాపక శక్తి ప్రదర్శనలు ఇస్తూ మానవ మెదడు యొక్క అద్భుత శక్తిని తెలియచేయడం అందరికీ తెలిసినదే. ఈ ప్రదర్శనల వల్ల ఏమిటి లాభం అనే సందేహం కొంతమంది మేధావులకు ఉన్నప్పటికీ తమకు తెలివితేటలు లేవు తాము సరిగా చదవలేమని ఆత్మన్యూనత భావంతో బాధపడే విద్యార్థులలో ఇటువంటి ప్రదర్శనలు మంచి ఆత్మవిశ్వాసం కలిగిస్తాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అన్నింటికన్నా జ్ఞాపకశక్తికి అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఆ విషయం పట్ల ఒక వ్యక్తికున్న ఆసక్తి మరియు ప్రాధాన్యత. చాలా మంది డబ్బు విషయంలో గాని, ఇష్టమైన వారి పుట్టినరోజు విషయంలో గాని, తమ అభిమాన హీరో సినిమా వివరాల గురించి గాని, అభిమాన క్రికెటెర్ల రికార్డుల గురించి గాని ఏ మాత్రం మరచిపోవడం ఉండదు. ఎందుకంటే వాటికి వారు అధిక ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి. అలాగే చదువు కూడా అత్యంత ప్రాధాన్యతతో కూడిన విషయం అనే అవగాహన మరియు శ్రద్ధ వారికి కల్పిస్తే వాటికి సంబంధించిన విషయాలను వారు మరచిపోయే పరిస్థితి తలెత్తదు.  బాల్యం యొక్క అమాయకత్వం వలన తల్లిదండ్రుల నిర్లక్ష్యం వలన వారు చదువు పట్ల ఆసక్తి కనబరచకపోవచ్చును. పై విషయాలన్నింటినీ చదివాక ఏమి అర్థం అవుతుందంటే... శారీరకంగా, పుట్టుకతో ప్రతీ విద్యార్థికి ఒకే రకమైన మేథస్సు, సామర్ధ్యం ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలియచేసారు. పైన పేర్కొన్న అంశాలు చదివితే అందరికీ అదే అనిపిస్తుంది. ఈ మెదడు దాని సామర్ధ్యం అందరికీ ఒకేలా ఉన్నప్పుడు మరి అందరి యొక్క పనితీరు, ఫలితాలు మరియు పెరఫార్మెన్స్ ఒకేలా ఎందుకు ఉండటం లేదు. ఈ విషయం గురించి ప్రశ్న వేసుకుంటే… చాలామంది తెల్ల ముఖాలు వేస్తారు.  దీనికి సరైన విధంగా అర్థమయ్యేట్టుగా కంప్యూటర్ పరిభాషలో చెప్పుకుంటే హార్డ్వేర్ అందరికీ ఒకేలా ఉంది కాని సాఫ్ట్వేర్ సరిగా తయారుచేయాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రులది మరియు ఇటు ఉపాధ్యాయులదే. అన్నింటికన్నా ఒక విషయం బాగా గుర్తుండాలంటే ఆ విషయం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని ఆ విద్యార్థి గ్రహించాలి. అందుకే శ్రద్ధ అంటే తెలుసుకోవాలనే ఉత్సుకత, తెలుసుకోడానికి సంసిద్ధత మరియు నేర్పుతున్నవారిపట్ల గౌరవభావం. అందువలనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. నేర్చుకోవాలనే ఆసక్తిని కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది మరియు ఆసక్తి కరంగా బోధించాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే.. మరి వారి సహజ సామర్థ్యాలు మరుగునపడకుండా వారికి వారు సంపూర్ణంగా ఉపయోగపడే విధంగా తయారుచేయవలసిన గురుతర బాధ్యత అటు తల్లిదండ్రుల చేతిలో ఇటు ఉపాధ్యాయుల చేతిలో ఉంటుందనడం నిర్వివాదాంశం కదా!! ఇదే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. వాటిని పాటించాలి.                                   ◆నిశ్శబ్ద.
Publish Date: May 9, 2025 10:30AM

పెళ్లైన మహిళ జీవితాన్ని నాశనం చేసే విషయాలు ఇవే..!

    పెళ్లి ప్రతి మహిళ జీవితంలో చాలా ముఖ్యమైన దశ.  కేవలం మహిళలకే కాదు.. మగవారికి కూడా ఇది ముఖ్యమైన దశే. కానీ పెళ్లి కారణంగా జరిగే అన్యాయం,  నష్టం మగవారితో పోలిస్తే ఆడవారికే ఎక్కువగా ఉంటోంది.  మగవారి కంటే ఆడవారే పెళ్లి తర్వాత జీవితాన్ని నష్టపోతున్న వారు అధికంగా ఉంటున్నారు.  పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరూ సర్దుకుపోమ్మా..అని అమ్మాయిలకే చెబుతూ ఉంటారు. అలాగే.. వివాహ బంధం విఫలమైతే కాపురం నిలబెట్టుకోలేక పోయింది అనే మాట కూడా  అంటారు.  అయితే అసలు వైఫల్యం వరకు ఎందుకు వెళుతుంది.  పెళ్లి తర్వాత మహిళల జీవితాన్ని దెబ్బతీసే అంశాలు ఏంటి? తెలుసుకంటే.. పెళ్లి.. పెళ్లి అనేది ఆడ, మగ ఇద్దరికీ సంబంధించిన విషయం. ఇద్దరు వ్యక్తులు ఒక జంటగా మారిన తరువాత,  భార్యాభర్తలు అయిన తరువాత వారి మద్య ప్రేమ మాత్రమే కాకుండా చాలా విషయాలు ఉంటాయి. భార్యాభర్తల వరకు వస్తే.. వారి బంధం బాగానే ఉంటుంది. పెళ్ళి చేసుకుని కుటుంబాన్ని వదిలి,  భర్త తో అత్తింటికి చేరిన అమ్మాయితో అత్తింటి కుటుంబ సభ్యులు ఆరోగ్యకరమైన రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేస్తే అంతా బాగానే ఉంటుంది. కానీ చాలామంది అమ్మాయిల జీవితాల్లో ప్రేమ, గౌరవం రెండూ లోపిస్తాయి.   ప్రేమ, గౌరవం లోపిస్తే.. ప్రతి వ్యక్తికి ప్రేమ, గౌరవం ఉన్నప్పుడే సంతోషంగా ఉండగలుగుతారు. కానీ  అత్తారింట్లో ఒక అమ్మాయికి ప్రేమ, గౌరవం లోపిస్తే ఆ అమ్మాయి సంతోషంగా ఉండలేదు. దీనికి కారణం అత్తామామలు.  ఆ ఇంటి కుటుంబ సభ్యులు. చాలా వరకు అత్తారింట్లో ఆడపిల్లలను వారి అత్తామామలు మొదట్లో బానే మాట్లాడినా ఆ తరువాత కించపరిచి మాట్లాడుతుంటారు. ఇక అమ్మాయిలలో ఏదైనా లోపం ఉంటే మాత్రం  అదే విషయాన్ని ప్రతిసారి ప్రస్తావించి  ఆమెను మానసిక క్షోభకు గురిచేస్తూ ఉంటారు. తోడి కోడళ్లు.. చాలా ఇళ్లలో తోడి కోడళ్ల వల్ల ఖచ్చితంగా ఒక  కోడలు బాధితురాలిగా మారుతుంది.  అత్తగారు, మామగారు, కుటుంబ సభ్యులు కోడళ్ల మధ్య జరిగే చాలా విషయాలను పట్టించుకోరు. జిత్తులమారి స్వభావం ఉన్న కోడళ్లు మంచితనంతో ఉన్నవారిని వేధిస్తూనే ఉంటారు. ఇంటి పని దగ్గర నుండి  చాలా విషయాలలో బాధపెడుతుంటారు.   అత్తగారు.. అత్తగారు ఎప్పటికీ తల్లిలా ఉండదని,  తల్లిలా చూడలేదని చాలామంది అంటూ ఉంటారు. నిజానికి అత్తగారి విషయంలో అమ్మాయిలకు మనసులో ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడటానికి కారణం కూడా అత్తగారి ప్రవర్తనే.  అత్తగారు ఎప్పుడూ కోడలికి వ్యతిరేకంగానే ఉంటారు.  కోడలు మంచిగా మాట్లాడినా సరే గిట్టని అత్తగారు ఉన్నారు.  కోడలు అత్తగారిని మెప్పించాలని,  అత్తగారికి నచ్చే పనులు చేసినా సరే.. కోడలిని విమర్మించేవారు ఎక్కువ. కోడలు ఏం చేసినా ఆమెను సూటిపోటి మాటలతో హింసించే వారు ఎక్కువగా ఉంటున్నారు. అత్తగారి ప్రవర్తన విషయంలో కోడలు తన భర్తతో ఏదైనా చెప్పినా భర్త నుండి ఆమెకు ఎలాంటి  సహకారం, ఓదార్పు ఉండవు. ఇలా ఉన్నప్పుడు కోడలు మానసికంగా దెబ్బతింటుంది.  మనసులోనే ఆమె చాలా బాధలోకి వెళుతుంది. భర్త.. చాలామంది అమ్మాయిలు పెళ్లి తర్వాత భర్త చేసే ద్రోహానికి బలి అవుతూ ఉంటారు. చాలా మంది మగవాళ్లు పెళ్లి అనేది ఇష్టం లేకుండానే అవసరం కోసం చేసుకుంటారు.  ఇంటి పని చేయడానికి ఒక అమ్మాయి అవసరం అయిందనో.. డబ్బులు సంపాదించడానికి సంపాదించే అమ్మాయి అవసరం అయ్యిందనో.. తల్లిదండ్రుల బలవంతం మీదనో.. తల్లిదండ్రుల సంతోషం కోసమో.. ఇలా చాలా కారణాల వల్ల అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. కొందరైతే ఒకరితో ప్రేమ వ్యవహారం,  వివాహేతర సంబంధం పెట్టుకుని మరొక అమ్మాయిని పెద్దల నిర్ణయంతో పెళ్లి చేసుకుంటారు.  ఇలాంటి మగాళ్ల వల్ల అమ్మాయిలకు జీవితంలో సంతోషం అనేది ఉండదు.  జీవితాంతం వారు అత్తమామల సూటిపోటి మాటలు, భర్త నిర్లక్ష్యం మద్య సంతోషం అనేది లేకుండా బ్రతికేస్తారు.  ఇన్ని కారణాల వల్ల అమ్మాయిల జీవితాలు గందరగోళంలో పడి నాశనమవుతున్నాయి.                                      *రూపశ్రీ.
Publish Date: May 8, 2025 10:30AM