స్త్రీల వేళ్లకు హంగులు... కాక్ టెయిల్ రింగులు ఆడవాళ్ల చేతివేళ్లు చూడటానికి చాలా మృదువుగా అందంగా ఉంటాయి. అలాంటి చేతివేళ్లు ఇంకా అందంగా కనిపించాలంటే వాటికి నెయిల్ పాలిష్ వేసుకోవడమో, రింగులు పెట్టుకోవడమో చేస్తాం. ఇంకా కొంచెం మోడ్రన్ గా కనిపించాలంటే... ఇప్పుడు కాక్ టెయిల్ రింగులు దొరుకుతున్నాయి. ఇవి స్టోన్స్ తో ఉండి చాలా అందంగా ఉంటాయి. వివిధ రంగుల్లో, ఆకారాల్లో  దొరుకుతున్నాయి. ఇవి ఆకారంలో పెద్దగా ఉండి కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.ఈ రింగులు ట్రెడిషనల్ వేర్ గా కంటే పార్టీ వేర్ కి చాలా బాగా నప్పుతాయి. స్టోన్స్ తో పెద్దగా ఉండటం వలన మధ్య వేలుకి ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇవి పూర్వం ఎప్పటినుంచో ఉన్నా ఇప్పుడు మళ్లీ కొత్తగా వివిధ హంగులతో మార్కెట్ లోకి వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.  

ప్రసవం తరువాత మహిళలు ఇవి తింటే అద్భుతమైన శక్తి సొంతమవుతుంది! ప్రసవం తరువాత స్త్రీలలో శారీరక, భావోద్వేగ మార్పులు చాలా ఉంటాయి. ఇవన్నీ హార్మోన్ల మార్పుల వల్ల జరిగేవి.. ఈ కారణంగా తల్లి, బిడ్డ ఇద్దరికీ చాలా జాగ్రత్త అవసరం.  డెలివరీ తరువాత కూడా తల్లిబిడ్డలకు ఇద్దరికీ సరైన జాగ్రత్త, సరైన వైద్య సేవలు అవసరమవుతాయి. ఈ హార్మోన్స్ ను, శారీరక స్థితిని తిరిగి మాములు స్థాయికి తిరిగి తీసుకుని రావడానికి అవి మాత్రమే కాకుండా ఆహారం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రసవం తర్వాత శరీర మార్పులకు, స్థితికి తగ్గట్టు ఆహారాన్ని కూడా మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. అదే సందర్భంలో పోషకాలు అవసరమైన ఆహారం కూడా పుష్కలంగా తీసుకోవాలి. లేకపోతే శరీరం తొందరగా అలసిపోతుంది. బిడ్డకు పాలు ఇవ్వవడంలో సమస్యలు ఏర్పడటం నుండి మహిళల్లో అలసట, రక్తహీనత, ఎముకలు బలహీనంగా మారడం వంటి ఎన్నో సమస్యలు చాప కింద నీరులా చుట్టుముడతాయి.  మీరు ప్రసవానంతరం తొందరగా  కోలుకోవడానికి ఈ ఆహారాలు డైట్ లో భాగం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.   పెసరపప్పు.. పెసరపప్పులో ఐరన్, పొటాషియం, కాపర్ మెగ్నీషియం, అలాగే ఫైబర్, విటమిన్ B6, ఫోలేట్ వంటి ఖనిజాలు ఉంటాయి. బి కాంప్లెక్స్ విటమిన్లు కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నానికి సహాయపడతాయి. శరీరంలో  శక్తి స్థాయిని పెంచుతాయి బాదం.. బాదంపప్పులు నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటుంది. ఇవి తీసుకునే ఆహారం శరీరంలో  శక్తిగా మార్చడంలో సహాయపడతాయి. వేయించిన  గుమ్మడికాయ గింజలు మెగ్నీషియం కంటెంట్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల గుమ్మడికాయ గింజలు అద్భుతంగా పనిచేస్తాయి.  వేయించిన గుమ్మడి గింజలను ప్రతిరోజూ కొద్దిగా తీసుకుంటే మంచిది.  బొప్పాయి బొప్పాయిలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరంలో సులభంగా శోషించబడతాయి, త్వరగా శక్తిని అందిస్తాయి. అదనంగా, బొప్పాయిలో పాపైన్, చైమోపాపైన్ వంటి ఎంజైమ్‌లు ఉంటాయి, ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి, పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి. ఇది ఆహారం నుండి పోషకాలను బాగా ఉపయోగించుకోవడంలో శరీరానికి సహాయపడుతుంది, శరీరానికి కావల్సిన శక్తి స్థాయిలను పెంచుతుంది.  నెయ్యి అలసట అనేది అంతర్లీన ఒమేగా-3 లోపం వల్ల ఏర్పడే సాధారణ లక్షణం, కాబట్టి నెయ్యి (ఒమేగా 3  గొప్ప మూలంగా నెయ్యిని పరిగణిస్తారు)ని   ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటే శరీరానికి  కావలసిన శక్తి అందుతుంది. ప్రసవం అనంతరం పైన చెప్పుకున్నా ఆహారాలు తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగానూ, శారీరక, మానసిక స్థాయిలు సక్రమంగా నిర్వహించడంలోనూ సహాయపడుతాయి.                                       ◆నిశ్శబ్ద.


పిల్లలు ఎత్తు పెరగాలన్నా.. దృఢంగా ఉన్నాలన్నా ఈ ఆసనాలు వేస్తే చాలు! వేసవి సెలవులు ప్రారంభమయ్యాక పిల్లలను కంట్రోల్ చెయ్యడం పెద్దలకు కాస్త కష్టమే. మండిపోతున్న ఎండల్లో పిల్లలను బయటకు పంపాలంటే భయం. అలాగై వాళ్ళు ఇంట్లో ఉండాలంటే చాలా చిరాకు పడతారు. ఈ కారణంగా పిల్లలకు టీవీ, మొబైల్, వీడియో గేమ్  వంటివి చేతిలో పెట్టి వారిని  కంట్రోల్ చేస్తుంటారు. దీనికి తోడు ఫుడ్ విషయంలో కూడా బోలెడు రకాలు చేయించుకుని తింటూ, ఆయిల్ ఫుడ్ ఆస్వాదిస్తూ ఉంటారు. ఏ కారణాల వల్ల పిల్లల్లో బద్దకం, బరువు పెరగడం, చురుకుదనం తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి పిల్లల్ని తిరిగి స్కూల్స్ ఓపెన్ చేసే సమయానికి ఆక్టివ్ గా చేయడానికి కొన్ని యోగాసనాలు రోజూ ప్రాక్టీస్ చేయించడం మంచిది. దీనివల్ల పిల్లల శరీరం దృఢంగా మరడమే కాదు, చాలా చురుగ్గా ఆలోచనా తీరులో మరింత ముందుంటారు. ఆ ఆసనాలు ఏమిటంటే. తాడాసనం.. పిల్లల ఏకాగ్రతను పెంచడానికి, వారు క్రమం తప్పకుండా తాడాసనం సాధన చేయాలి. తాడాసన సాధనతో పిల్లల శ్వాస సామర్థ్యం పెరుగుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల శక్తి స్థాయి పెరుగుతుంది. మానసిక స్థితి బాగానే ఉంటుంది. పిల్లలు ఎత్తు కూడా పెరుగుతారు. వృక్షాసనం.. వేసవి సెలవుల్లో పిల్లలు ఇంటి నుంచి బయటకు రాలేనప్పుడు రోజంతా ఇంట్లోనే కంప్యూటర్, మొబైల్, టీవీ చూస్తూ గడిపేస్తే బాడీ పెయిన్ పోగొట్టుకోవడానికి వృక్షాసనం మంచి ఎంపిక. రోజంతా ఒకే భంగిమలో కూర్చోవడం, పడుకోవడం వల్ల వారి శరీరం నొప్పులు మొదలవుతాయి. ఇది కాకుండా, ఒత్తిడి కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, పిల్లలలో వృక్షాసనాన్ని అభ్యసించే అలవాటును పెంచాలి. వృక్షాసన అభ్యాసం మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. వెన్ను, మెడ నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. ధనురాసనం.. పిల్లల శరీరం దృఢంగా మారడానికి, కండరాల బలం కోసం ధనురాసనాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆసనం పిల్లల వెన్ను భాగాన్ని బలపరుస్తుంది. వెన్ను, చేయి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. శారీరక శ్రమను ఓర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. శరీరం దృఢంగా మారుతుంది.                                         ◆నిశ్శబ్ద.

Aracheta Gorinta / Mehendi / Gorinta Designs / Mehndi / Learn Simple & Easy Mehendi Designs / Learn Gorintaku Designs / Learn Tattoo Designs / Henna Designs

కాబోయే భర్తతో అమ్మాయిలు తప్పక మాట్లాడాల్సిన విషయాలివి! పెళ్లిళ్లు.. నిశ్చితార్థాల సందడి మొదలైపోయింది. పెళ్లిళ్లు అంటే ఇక ఎలాగూ పెద్దవాళ్ళు ప్లాన్ చేసినట్టు జరుగుతాయి. కానీ ముడిపడిన తరువాత జీవితాన్ని డీల్ చేసుకోవాల్సింది అమ్మాయి, అబ్బాయే..  అయితే పెళ్లి తరువాత ఇలా జరగాల్సింది, ఇలా జరుగుతుందని అనుకున్నాను, ఇలా ఉండాల్సింది  కానీ అలా లేదు, అంతా నీ ఇష్టమేనా?? నాకు విలువ లేదు, నువ్వు చెప్పినట్టే వినాలా?? బాద్యతలన్నీ ఒక్కరే మోయాలా?? నేను విసిగిపోయాను.. నీతో వేగలేను.. లాంటి మాటలతో ఒకరినొకరు బాధపెట్టుకుని బంధాన్ని తెంచుకునే వరకు వెళతారు చాలామంది. మరీ ముఖ్యంగా పెళ్లి తరువాత అమ్మాయిలే ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు. బాధ్యతల దగ్గర నుండి కెరీర్ వరకు ఎన్నో విషయాలు కాబోయే జీవితభాగస్వామితో చర్చించడం ఎంతో అవసరం. చాలా వరకు విషయాలను లైఫ్ పార్టనర్ తోనే చెప్పగలరు. కాబట్టి అమ్మాయిలు  కాబోయే భర్తతో ఈ కింది విషయాలను తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఉంది. నిశ్చితార్థం, పెళ్లికి మధ్య సమయంలో భాగస్వామితో మాట్లాడటం ద్వారా వారి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. దీంతో పాటు పెళ్లి తర్వాత ఒకరినొకరు నిందించుకోకుండా ఉండొచ్చు. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే బాధ్యతల గురించి మాట్లాడాలి.. నిశ్చితార్థం తర్వాత, భాగస్వామితో కుటుంబం మరియు సంబంధాల గురించి బహిరంగంగా మాట్లాడాలి. భవిష్యత్తులో ఎవరు ఏ బాధ్యతను నిర్వర్తించాలనేది ముందుగా నిర్ణయించుకోవాలి. పెళ్లి తర్వాత ఇది చాలా సులభం అవుతుంది. ఈ విషయం మాట్లాకపోతే పెళ్లి తరువాత ఒకరిమీధ ఒకరు నిందలేసుకునేదాకా సమస్య వెళుతుంది. అడ్జెస్మెంట్ గూర్చి మాట్లాడకపోతే అట్టర్ ప్లాప్ అవుతారు..  పెళ్లికి ముందు అడ్జస్ట్‌మెంట్‌ గురించి మాట్లాడాలి . మీ సమస్యలతో పాటు, మీ భాగస్వామికి మీ మనసును  విప్పి చెప్పాలి. ఇష్టాఇష్టాలు, ఇష్టం లేని విషయాలు మాట్లాడటం చాలా ముఖ్యం. అవతలి వారి ఇష్టాలు తెలుసుకుని ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం.  కెరీర్ చాలా ముఖ్యం.. ఈ అంశం అమ్మాయిలకు చాలా ముఖ్యమైనది. అసలే నేటికీ చాలా చోట్ల అమ్మాయిలు పెళ్లి తర్వాత ఉద్యోగాలు చేయడం లేదు. అబ్బాయిలు కూడా మొదట ఒకే చెప్పి ఆ తరువాత వొద్దు నాటారు.  దానివల్ల చాలా ఇబ్బందులు మొదలవుతాయి. ఇలా జరగకూడదు అంటే ముందుగానే కెరీర్ గురించి ఫైనల్ చేయాలి. ఉద్యోగం గురించి, ఆర్థిక అవసరాల గురించి ధైర్యంగా చెప్పాలి. కుటుంబ నియంత్రణ.. పెళ్లయిన కొద్ది రోజుల వరకు పిల్లలు వొద్దని ప్రఝీ జంట అనుకుంటారు. కానీ పెద్దలు మాత్రం పెళ్లయ్యక అమ్మాయి ఎప్పుడెప్పుడు శుభవార్త చెబుతుందా అని ఎదురుచూస్తుంటారు. ఈ విషయం గురించి గురించి కాబోయే భార్యాభర్తలు ముందుగానే మాట్లాడుకోవడం చాలా బాగుంటుంది. దీనివల్ల పిల్లల చదువులు, వారికి మంచి కెరీర్ ఇవ్వవడానికి ఆర్థిక భరోసా ఏర్పాటుచేసుకోవడం బాగుంటుంది.   తల్లిదండ్రుల బాధ్యత  నేటి కాలంలో అమ్మాయిలు కూడా వారి తల్లిదండ్రులకు సహాయం చేస్తారు. అటువంటి పరిస్థితిలో, వారు తమ భాగస్వామితో ముందుగానే దాని గురించి మాట్లాడాలి. తద్వారా తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే అమ్మాయిలకు తమ తల్లిందండ్రుల విషయంలో  చేదు అనుభవాలు ఎదురవుతాయి.                                      ◆నిశ్శబ్ద.