లిక్విడ్ లిప్‌స్టిక్  ఇలా అప్లై చేస్తే అదుర్స్!   పెదవుల అందాన్ని పెంచడానికి లిప్స్టిక్ వాడతారు. ఒకప్పుడు లిప్స్టిక్ కోన్ రూపంలో లభించేది. కానీ అన్నీ డవలప్ అయినట్టు ఫ్యాషన్ కూడా డవలప్ అయిపోయింది. లిప్స్టిక్ కాస్తా లిక్విడ్ రూపంలోకి మారింది. పైపెచ్చు లిక్విడ్ లిప్స్టిక్ కూడా వేసుకోవాల్సిన రీతిలో వేసుకుంటే చాలా కాలం పాటు పోకుండా పెదవులను మెరిపిస్తుంది. లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు ఈ కింది టిప్స్ పాటిస్తే చాలు.. మేకప్ అంటే అంతగా ఇష్టం లేని మహిళలు కూడా లిప్స్టిక్, కాటుక పెట్టుకుంటారు. ముఖ్యంగా ఇప్పట్లో వచ్చిన లిక్విడ్ లిప్స్టిక్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లిప్స్టిక్ వేసుకోవడానికి ముందు పెదవులకు మాయిశ్చరైజర్ రాయడం తప్పనిసరి. మాయిశ్చరైజర్ రాయడం వల్ల పెదవులు తేమను కోల్పోకుండా మృదువుగా ఉంటాయి. పైగా లిప్స్టిక్ పెదవులు అంతా బాగా పరచుకుంటుంది. కానీ లిక్వి్డ్ లిప్స్టిక్ కు మాయిశ్చరైజర్ అవసరం లేదు. పెదవులు మరీ గరుకుగా ఉంటే తప్ప మాయిశ్చరైజర్ రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా చాలా లైట్ గా మాయిశ్చరైజర్ రాస్తే సరిపోతుంది. పెదవులు పర్ఫెక్ట్ షేప్ కనిపించాలంటే మాత్రం లిప్ లైనర్ ఖచ్చితంగా అప్లై చేయాలి. ఏ రంగు లిప్స్టిక్ వాడతారో ఆ రంగు  లిప్ లైనర్ ను ఎంచుకోవాలి. ఇద కూడా చాలా సన్నగా ఉండాలి. అలా ఉంటే పెదవుల షేప్ బాగా సెట్ అవుతుంది. మరీ ముఖ్యంగా పెదవుల మూలలను సరిచేయడం మరవకూడదు. సాధారణ లిప్స్టిక్ కు,  లిక్విడ్ లిప్స్టిక్ కు తేడా ఉంటుంది.  లిక్విడ్ లిప్స్టిక్ క్రీమ్ లాగా ఉంటుంది. దీన్ని సాధారణ లిప్స్టిక్ మాదిరి రెండు మూడు లేయర్లు వెయ్యాల్సిన అవసరం లేదు. అలా వేస్తే పెదవులు చాలా థిక్ గా వికారంగా కనపిస్తాయి. అందుక లిక్విడ్ లిప్స్టిక్ ను కేవలం ఒక లేయర్ మాత్రమే అప్లై చేయాలి.  అది వేసాక కూడా కొద్దిసేపు దాన్ని అలాగే వదిలెయ్యాలి అలా చేస్తే లిప్స్టిక్  ఆరిపోతుంది. ఒకవేళ లిక్విడ్ లిప్స్టిక్ ఎక్కువగా అప్లై చేసి ఉంటే టిష్యూ పేపర్ సహాయంతో దాన్ని సెట్ చేసుకోవాలి. ఇందుకోసం టిష్యూ పేపర్ ను పెదవుల మధ్య పెట్టుకుని పెదవులను గట్టిగా ప్రెస్ చేయ్యాలి. ఇలా చేస్తే పెదవుల మీద అదనపు లిక్విడ్ ఈజీ గా తొలగిపోతుంది. లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేయడం గురించి తెలుసుకుని ఉంటారు కానీ కరెక్ట్ రంగు ఎంపిక చేసుకునేవారు చాలా అరుదు. అందుకే లిక్విడ్ లిప్స్టిక్ సరైన రంగు ఎంచుకోవడం ముఖ్యం. ఇలా పెదవుల అందం అదుర్స్.                                                *నిశ్శబ్ద

గర్భిణీ స్త్రీలు ఈ ఆహారాలు తింటే అంతే సంగతులు! ఆడపిల్ల జీవితంలో వివాహం, గర్బం దాల్చడం కీలకమైన మలుపులు. వీటి తరువాత నుండి మహిళల జీవితం చాలా మార్పులకు లోనవుతుంది. పండంటి పాపాయి పుట్టాలంటే మంచి ఆహారం తీసుకోవాలని  వైద్యుల నుండి పెద్దల వరకు చెబుతారు. అయితే ఇప్పటి కాలం అమ్మాయిలు చాలామంది ఉద్యోగాల కారణంగా పెద్దలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరికి అసలు తాము తీసుకునే ఆహారాల మీద స్పష్టతే ఉండదు.  ఈ కింది ఆహారాలు గర్బవతులు అస్సలు తీసుకోకూడదని, అలా తింటే మాత్రం చాలా ప్రమాదమని అంటున్నారు.  ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ గర్భవతులు మొలకెత్తిన గింజలకు దూరం ఉండాలి. మొలకెత్తిన గింజలలో బ్యాక్టీరియా  ఎక్కువగా డవలప్ అవుతుంది.  వీటిని తింటే జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి. పాలు కూడా ఆరోగ్యానికి మంచివే అయినా పాశ్చరైజేషన్ చేయని పాలు మాత్రం గర్భవతులకు ప్రమాదం. వీటిలో  లిస్టేరియా, ఇకోలి, సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి కడుపులో పెరుగుతున్న బిడ్డకు హాని కలిగిస్తాయి. ఉడికించిన కోడిగుడ్లు అందరికీ మంచివే.  అయితే కొందరు పచ్చిగుడ్లు కూడా తింటారు. మరికొందరు హాఫ్ బాయిల్ అంటూ సగం ఉడికీ ఉడకని గుడ్లు తింటారు. అయితే గర్భవతులు ఆరోగ్యం బాగుండాలంటే పచ్చిగుడ్లు తినడం అవాయిడ్ చేయాలి. దీవివల్ల వాంతులు, వికారం వంటి ప్రమాదాలు ఎదురవుతాయి. గర్భవతులు మద్యపానం, ధూమపానంకు దూరం ఉండాలి. ఇవి కడుపులో బిడ్డకు హాని కలిగిస్తాయి. సముద్రంలో లభించే క్యాట్ ఫిష్, షార్క్ వంటి చేపలలో పాదరసం ఎక్కువ శాతం ఉంటుంది. ఈ చేపలను తినడం వల్ల కడుపులో బిడ్డ నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. బొప్పాయికి, గర్భిణులకు మద్య ఉండే విషయాలు అందరికీ తెలిసిందే. అయితే పచ్చి బొప్పాయి తినడం వల్ల గర్భిణులకు గర్భస్రావం  అయ్యే కారణం ఉంటుంది. కాఫీ కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇందులో కెఫిన్ ఆరోగ్యం చేకూరుస్తుంది. కానీ కాపీ ఎక్కువ తాగితే కెఫిన్ కంటెంట్ కడుపులో బిడ్డపై చెడు ప్రభావం చూపిస్తుంది.  కెఫిన్ తొందరగా జీర్ణం కాకపోవడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు కూడా పెరుగుతాయి.                                               *నిశ్శబ్ద.


పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం పెడుతున్నారా? ఇది చదవాల్సిందే.. పిల్లలను కనడానికి యువతీయువకులు ఎంత సంతోషిస్తారో వారు పెరిగి పెద్దవుతున్నప్పుడు ఒకవైపు సంతోషం ఉన్నా అంతకు మించి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి పాలు తాగించడం పెద్ద కష్టం కాదు. కానీ పిల్లలు పెరిగే కొద్ది అన్నం తినడానికి  చాలా మారాం చేస్తారు. దీనివల్ల పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడుతుందని భయపడతారు. ఇందుకే పోషకాలను భర్తీ చేయడానికి హెల్త్ డ్రింకులు తాగించడానికి, అన్నం తినిపించడానికి వారిని ఏమారుస్తారు. ఒకప్పుడు కథలు చెబుతూ, భయపెడుతూ అన్నం పెట్టేవారు. కానీ ఇప్పుడు మొబైల్ లో కార్టూన్స్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. అసలు పిల్లలకు మొబైల్ చూపిస్తూ అన్నం తినిపించవచ్చా?  అలా చేస్తే ఏమవుతుంది? నేటికాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆహారం పెట్టడానికి ఎన్నుకున్న సులువైన మార్గం మొబైల్ చూపిస్తూ అన్నం తినిపించడం. పిల్లలకు ఆహారం పెట్టే విషయంలో జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలలో 90శాతం మంది మొబైల్ లేనిదే ఆహారం తీసుకోవడం లేదు. ఇలా మొబైల్ చూస్తూ ఆహారం తీసుకోవడం అనేది పిల్లలకు ఒక అలవాటుగా మారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పిల్లలు అయినా, పెద్దలు అయినా మొబైల్ చూస్తూ లేదా టీవి చూస్తూ తింటే ఆహారం రుచి ఫీల్ కాలేరు. పిల్లలకు ఆహారం రుచి తెలియడం చాలా ముఖ్యం. మొబైల్ చూస్తూ తినడం వల్ల అది మిస్ అవుతారు. పైగా పరిధికి మించి తినేస్తారు. దీనివల్ల పిల్లలో ఊబకాయం ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లలు మొబైల్ చూస్తూ తినడం వల్ల వారిలో జీవక్రియ మందగిస్తుంది. ఫిజికల్ యాక్టివిటీకి పిల్లలు దూరం అవుతార. ఎప్పుడూ మొబైల్ చూడటానికే ఇష్టపడతారు. మొబైల్ చూస్తూ అన్నం తినే పిల్లలు కృత్రిమంగా తయారవుతారు. వారికే తెలియకుండా వారిలో ఒక మానసిక శాడిజం అభివృద్ది చెందుతుంది. అదే ఇతరులను తిట్టడం, కొట్టడం, మొండి చేయడం వంటి పనులలో వ్యక్తం అవుతుంది. తల్లిదండ్రుల మాట అస్సలు వినరు. వారి ప్రవర్తన క్రమశిక్షణ లేని జీవితానికి దారితీస్తుంది. చిన్నతనంలోనే పిల్లలు అంత ఘోరంగా మొబైల్ చూస్తే వారి కళ్లు దెబ్బతింటాయి. చిన్నప్పుడే కళ్లజోడు వాడాల్సి రావడానికి అదొక కారణం.                                                          *నిశ్శబ్ద.  

Aracheta Gorinta / Mehendi / Gorinta Designs / Mehndi / Learn Simple & Easy Mehendi Designs / Learn Gorintaku Designs / Learn Tattoo Designs / Henna Designs

చలికాలంలో చర్మం పగుళ్లా.. ఇదొక్కటి వాడితే మెరిసిపోతారు! చలికాలం  పాటలలోనూ, సినిమాలలోనూ మాత్రమే బాగుంటుంది. కొన్ని సార్లు వేడి వేడి ఆహారం, పకోడిలో, కాల్చిన మొక్కజొన్న పొత్తుల కోసమో చలికాలాన్ని తల్చుకుంటాము. కానీ నిజానికి చలికాలం వచ్చిందంటే పెద్ద పెట్టున చర్మానికి ఎసరు పెడుతుంది. చర్మం పగిలిపోతుంది. కొన్నిసార్లు చర్మం ఎర్రగా మారిపోయి రక్తం కూడా కారుతుంది. ఇంట్లోనుండి అడుగు బయట పెట్టాలన్నా, స్లీవ్ దుస్తులు వేసుకోవాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వీటన్నింటికి కేవలం ఒకే ఒక్కటి చెక్ పెడుతుంది. అదే తేనె. తేనెను ఆయుర్వేదం అమృతంతో పోలుస్తుంది.తేనెలో ఎన్నోపోషకాలు, మరెన్నో ఔషద గుణాలు ఉన్నాయి. కొన్ని సార్లు తేనెను సౌందర్య సాధానంగా కూడా ఉపయోగిస్తారు. అసలు చలికాలంలో తేనెను ఎందుకు వాడాలి? ఎలా వాడితే చర్మం మెరుస్తుంది? చాలామంది తేనెను ఉదయాన్నే వేడినీళ్లలో వేసుకుని తాగుతుంటారు. కానీ చలికాలంలో తేనెను ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తేనె చర్మం మీద లోతుగా పేరుకున్న మలినాలను తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని రిపేర్ చేస్తాయి. చర్మం మీద ముడుతలు తగ్గిచడంలో, వాడిన చర్మానికి జీవం ఇవ్వడంలో తేనె ది బెస్ట్. చలికాలంలో ముఖ చర్మం పగలడం వల్ల, చలి కారణంగా చర్మం మీద దురద, మచ్చలు వస్తాయి. కానీ పెరుగులో తేనెను కలిపి రాసుకోవాలి.  లేదంటే శనగపిండిలో తేనె కలిపి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల ముఖ చర్మం మీద మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ముడతలు పడి వదులుగా మారిన చర్మం తిరిగి బిగుతుగా మారాలంటే  తేనె బెస్ట్ ఫలితాలు ఇస్తుంది. నిమ్మరసం లేదా యాపిల్ సైడర్ వెనిగర్ లో తేనె వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే ఈ ముడతలు పోయి ముఖం యవ్వనంగా మారుతుంది.                                                          *నిశ్శబ్ద.