
మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి!
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) కలిసి నటిస్తున్న యాడ్స్ ఇన్ స్టాగ్రామ్ లైక్స్ లో గ్లోబల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ జంటకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను ఈ లైక్స్ తెలియజేస్తున్నాయి. విరోష్ జోడి ఇటీవల కలిసి చేసిన ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్ కు ఇన్ స్టాగ్రామ్ లో 9.1 మిలియన్ పైగా లైక్స్ వచ్చాయి. ఈ లైక్స్ ఇంకా పెరుగుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఒక యాడ్ కు వరల్డ్ వైడ్ గా వచ్చిన సెకండ్ హయ్యెస్ట్ లైక్స్ ఇవే కావడం గమనార్హం. ఫస్ట్ హయ్యెస్ట్ లైక్డ్ పోస్ట్ కూడా విరోష్ చేసిందే కావడం విశేషం. వీరి వెడ్డింగ్ టైమ్ లో ఎండార్స్ చేసిన మాన్యవార్ యాడ్ 11.5 మిలియన్ కు పైగా లైక్స్ తో హయ్యెస్ట్ లైక్డ్ యాడ్ పోస్ట్ గా గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పోస్ట్ కు 104 మిలియన్ వ్యూస్ రావడం మరో రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ఫుట్ బాల్ స్టార్స్ మెస్సి, రొనాల్డో కలిసి చేసిన లూయిస్ వ్యూటన్ యాడ్ పోస్ట్ కు మించిన లైక్స్ విరోష్ చేసిన మాన్యవార్ కపుల్ యాడ్ పోస్ట్ కు దక్కాయి. వరల్డ్ వైడ్ సోషల్ మీడియాలో అడ్వర్టయిజింగ్ లో విరోష్ జోడి ఇలా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ రికార్డ్ స్థాయి లైక్స్ విజయ్, రశ్మిక చేస్తున్న యాడ్స్ కు గ్లోబల్ రీచ్ తీసుకొస్తున్నాయి. విజయ్, రశ్మిక జోడి త్వరలో "రణబాలి" చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు.
May 13, 2026ప్రపంచంలోనే అత్యంత దారుణమైన బిజినెస్ ‘సినిమా’: నిర్మాత PVP కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ). భారీ చిత్రాల నిర్మాణానికి పెట్టింది పేరుగా నిలిచిన ఆయన, గత కొంతకాలంగా సినీ రంగానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పీవీపీ, తాను ఎందుకు సినిమాలను వదిలేయాల్సి వచ్చిందో వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సినీ నిర్మాణం అనేది ప్రపంచంలోనే అత్యంత దారుణమైన వ్యాపారమని పీవీపీ కుండబద్దలు కొట్టారు. మనం కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటే, సెట్స్లో నిర్మాతను ఒక బఫూన్లా చూస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా కోసం సర్వం ధారపోసే వ్యక్తికి కనీస గౌరవం లేని చోట ఉండటం వృధా అని భావించి తాను బయటకు వచ్చేశానని ఆయన స్పష్టం చేశారు. గతంలో జరిగిన వివాదాల గురించి ప్రస్తావిస్తూ.. 'టెంపర్' సినిమా సమయంలో బండ్ల గణేష్తో తలెత్తిన ఫైనాన్స్ గొడవలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. తాను ఒక బ్యాంకు తరహాలో పెట్టుబడి పెట్టి, ఆ డబ్బును వెనక్కి అడగడమే తప్పైపోయిందని, మన సొంత డబ్బు కోసం కూడా అవమానాలు పడటం తన వల్ల కాలేదని పేర్కొన్నారు. పీవీపీ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ ఫైనాన్స్ విభాగంలో ఉన్న ఇబ్బందులను ఎత్తి చూపుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో హాలీవుడ్ తరహాలో కార్పొరేట్ స్టూడియో సిస్టమ్ లేదని, ఇక్కడ అంతా హీరోల చుట్టూనే తిరుగుతుందని ఆయన విమర్శించారు. హీరోలు చెప్పిందే వేదంగా సాగుతున్న ఈ వాతావరణంలో నిర్మాత ఒక జోకర్ లాగా మిగిలిపోతున్నారని, సినిమా ఫ్లాప్ అయితే ఆ నష్టం భరించేది కేవలం నిర్మాత మాత్రమేనని.. కానీ ఆ కష్టం ఎవరికీ పట్టదని పీవీపీ తన మనసులోని మాటను బయటపెట్టారు. రవితేజ 'బలుపు' సినిమాతో టాలీవుడ్ లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చిన పీవీపీ సినిమాస్, ఆ తర్వాత 'ఊపిరి', 'మహర్షి', 'క్షణం' వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా మహేష్ బాబుతో చేసిన మహర్షి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, పీవీపీ మళ్ళీ కెమెరా ముందుకు రాకపోవడం గమనార్హం. కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల నుండి కూడా తాను ప్రస్తుతానికి విరామం తీసుకున్నానని ఆయన వెల్లడించారు. పీవీపీ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఆయన మాటలకు మద్దతు తెలుపుతూ, టాలీవుడ్లో నిర్మాతల పరిస్థితి నిజంగానే ఇలా ఉందా? అని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పీవీపీ వ్యాపార రంగంలో బిజీగా ఉండగా, భవిష్యత్తులో ఏదైనా భారీ మార్పులు వస్తే తప్ప ఆయన తిరిగి వెండితెరపై తన ప్రొడక్షన్ హౌస్ లోగోను ప్రదర్శించే అవకాశం లేదని తెలుస్తోంది.
May 13, 2026
Tollywood: మీకే కాదు.. మాకు కూడా సమస్యలు ఉన్నాయి.. నిర్మాతల సంచలన ప్రెస్ మీట్!
ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం సాయంత్రం తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిటర్లు ఏక పక్షంగా ప్రెస్ మీట్ నిర్వహించి బెదిరించినట్టుగా మాట్లాడటం సరికాదని, అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని నిర్మాతలు అన్నారు. ఎగ్జిబిటర్ల సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అదే సమయంలో తమ సమస్యలకు కూడా పరిష్కారం కావాలని నిర్మాతలు అన్నారు. నిర్మాత యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న ఎగ్జిబిటర్స్ ప్రెస్ మీట్ నిర్వహించి వారికి అన్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ అంశంపై నిర్మాతల కోణం కూడా తెలియజేయాలని, నిజానిజాలు తెలపాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. ఎగ్జిబిటర్లు బాగా ఇబ్బందులు పడుతున్నారు, అందుకే పర్సెంటేజ్ విధానానికి రావాలి అనుకుంటున్నామని తెలిపారు. ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడుతున్నారు.. మేము దానికి అంగీకరిస్తాం. కానీ, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని మీరు దయచేసి గ్రహించండి. ఎన్నో ఏళ్లుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ సంతోషంగా లేరు. కానీ, మేము ఒక్కరిమే మా ప్రయోజనం మేము చూసుకొని వెళ్ళిపోతాము అనడం సరైనది కాదు. మూడు సెక్టార్లు కూర్చొని మాట్లాడుకోవాలి. రాత్రికి రాత్రే జరిగిపోవాలంటే జరిగిపోయేవి కావు. ముగ్గురికీ సమస్యలు ఉన్నాయి. చర్చించుకొని పరిష్కరించుకుందాం. 'హరి హర వీరమల్లు' విడుదల సమయంలో ఈ సమస్య తెరపైకి వచ్చింది. అప్పటినుంచి ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. ఇన్ని సినిమాలకు లేని సమస్య మళ్ళీ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇప్పుడే జరిగిపోవాలని ఎందుకు పట్టుబడుతున్నారు? ఇలా చేయడం కరెక్ట్ కాదు. అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుందాం. నాలుగైదు నెలల నుంచి సరైన సినిమా లేక అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. పెద్ది రూపంలో ఒక మంచి సినిమా వస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సరైనది కాదు. సమస్య ఉంది, మేము కాదనడం లేదు. ఎగ్జిబిటర్ల సమస్యతో పాటు అన్ని సమస్యలు చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుందాం. ఒక పద్దతి ప్రకారం చేసుకోవాలి. థియేటర్లను గ్రేడింగ్ చేసుకోవాలి. అన్ని థియేటర్లలో ఒకే రకమైన వసతులు ఉండవు కాబట్టి అన్నింటిని ఒకే గాడికి కట్టలేము. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వసతులు మెరుగు పర్చాలి. ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటే పరిస్కారమవుతాం. అందరం కలిసికట్టుగా ముందుకి వెళ్దాం." అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "ఎకో సిస్టమ్ లో ఒకరు బాగోకపోతే ముగ్గురూ బాగోరు. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ముగ్గురూ బాలేదు. ప్రెస్ మీట్ పెట్టి ఎగ్జిబిటర్ల పరిస్థితి బాలేదని చెప్పారు. కానీ, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల పరిస్థితి కూడా అలాగే ఉంది. కొన్ని నెలల నుంచి చూస్తూనే ఉన్నాం. కంటెంట్ లేక శ్రీరాములు లాంటి థియేటర్ ను మూసేయాల్సి వచ్చిందని వాళ్ళే చెప్పారు. ఎగ్జిబిటర్లు ఇలాంటి షరతులు పెట్టడం వల్ల నిర్మాతల నుంచి ఇంకా కంటెంట్ తగ్గిపోతుంది తప్ప, దాని వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు కదా. ఇలా ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకొని, ఫలానా తేదీ చివరి రోజు అంటూ బెదిరించినట్టుగా మాట్లాడకండి. ఇక్కడ ఉన్న నిర్మాతలవి 50 శాతానికి పైగా షూటింగ్ అయిపోయిన సినిమాలు కనీసం 25 ఉన్నాయి. వీటిలో చిన్న, పెద్ద అన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే 70-80 శాతం బడ్జెట్ ఖర్చు పెట్టి ఉన్నాము. ఇలాంటి సమయంలో కొత్త విధానం తీసుకొస్తామంటే అది సబబుగా ఉండదు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాల విషయంలో ఆ విధానాన్ని అంగీకరించలేము. కొత్తగా నిర్మించబోయే సినిమాల విషయంలో ఈ విధానంపై ఆలోచిస్తాము. కానీ, దానికి కొన్ని షరతులు ఉన్నాయి. థియేటర్ల గ్రేడింగ్, మెయింటనెన్స్ ఛార్జ్, ఆన్ లైన్ టికెట్ బుకింగ్ కన్వినెన్స్ ఛార్జ్ వంటి విషయాలపై చర్చించిన తర్వాత.. కొత్తగా నిర్మించబోయే సినిమాల విషయంలో పర్సెంటేజ్ విధానానికి వెళ్ళడంలో మాకు అభ్యంతరం లేదు. ఒక పెద్ద ఎగ్జిబిటర్, ఆయనకు 300 మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. ఎన్నో సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఆదాయానికి గండి కొడుతున్న అలాంటి ఆయన.. నిన్న ప్రెస్ మీట్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల కష్టాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించింది. ఇతర రాష్ట్రాల్లో పర్సెంటేజ్ విధానం అమల్లో ఉంది అంటున్నారు. కానీ, ఆయా రాష్ట్రాల్లో ఎవరి పరిస్థితి బాలేదు. వాళ్ళకంటే మనమే మెరుగైన స్థితిలో ఉన్నాము. అలాంటిది మనం వెనక్కి వెళ్లడం ఎందుకు?. ఎగ్జిబిటర్ ఎంత ముఖ్యమో, డిస్ట్రిబ్యూటర్ కూడా అంతే ముఖ్యం కదా. అలాంటిది డిస్ట్రిబ్యూటర్ ను చంపేసి, ఎగ్జిబిటర్ ను కాపాడాలి అనడం ఎంతవరకు కరెక్ట్?. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మెరుగైన వసతులు కల్పిస్తే.. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది." అన్నారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. "నిన్న ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్ చూసిన తర్వాత మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే అది బెదిరించినట్టుగా ఉంది కానీ, కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుందాం అన్నట్టుగా లేదు. మనంలో మనం ఇలా కొట్టుకోవడం వల్ల లోకువ అయిపోతాం. సమస్యను పరిష్కరించుకునే దిశగా మనం వెళ్ళట్లేదు. ఈ అంశంపై ఫిల్మ్ ఛాంబర్ తరపు నుంచి కూడా మీటింగ్ లు జరిగాయి. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే, అలా ఏక పక్షంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో మాకు అర్థం కావడంలేదు. ప్రతిసారీ ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఏదోక ఆటంకం కలిగిద్దామనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా సినిమాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకొని, టికెట్ ధరలు పెంచుకున్నాం. అలాంటిది నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. అనుమతి లభించినా, మేము థియేటర్లలో ప్రదర్శించం అంటున్నారు. అంటే ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా వెళ్దాం అనుకుంటున్నారో ఏంటో అర్థం కావడంలేదు. ఇలా చేయడం సరైనది కాదు. ప్రతి సినిమా మన సినిమానే. సినిమా నడిస్తేనే సినీ పరిశ్రమను నమ్మకున్న మనందరం నడుస్తాం. అది పక్కన పెట్టి, ఒక్కో సినిమాకు ఒక్కోలా చేయడం అనేది సరైనది కాదు. అందరం కూర్చొని మాట్లాడుకొని, నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది." అన్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. "20 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎవరు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో అందరికీ తెలుసు. 20 సంవత్సరాల నుంచి ఎగ్జిబిటర్లకు న్యాయం చేయలేనిది ఈరోజు గుర్తుకొచ్చిందా?. మొన్న సంక్రాంతి సినిమాలకు కూడా టికెట్ రేట్లు తెచ్చుకున్నారు కదా?. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబు?" అన్నారు.
May 13, 2026ప్రభాస్ రియల్ హీరో అనిపించుకున్నారు.. మరి సైలెంట్గా ఎందుకు ఉన్నారో తెలుసా?
వెండితెరపై తన గంభీరమైన నటనతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్, నిజ జీవితంలో తన దయాగుణంతో 'మ్యాన్ ఆఫ్ ది పీపుల్' అనిపించుకుంటున్నారు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాదు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడంలో కూడా ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా ప్రభాస్ గతంలో చేసిన ఒక గొప్ప కార్యం మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' సినిమా కోసం ప్రభాస్ ఎంతగా కష్టపడ్డారో మనందరికీ తెలిసిందే. ఆ చిత్రంలోని శివుడు, అమరేంద్ర బాహుబలి పాత్రల కోసం ఆయన తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. ఇందుకోసం విదేశాల నుండి సుమారు కోటి రూపాయల వ్యయంతో అత్యాధునిక జిమ్ పరికరాలను తెప్పించుకున్నారు. అయితే ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్ ఆ పరికరాలను ఏం చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ ఆ ఖరీదైన జిమ్ ఎక్విప్మెంట్ను తన వద్దే ఉంచుకోకుండా, ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న వర్ధమాన అథ్లెట్ల కోసం విరాళంగా ఇచ్చారు. క్రీడల్లో రాణించాలనే పట్టుదల ఉండి, సరైన వసతులు లేని క్రీడాకారులకు ఈ అంతర్జాతీయ స్థాయి పరికరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. తన వ్యక్తిగత అవసరాల కోసం కొనుగోలు చేసిన వస్తువులను సమాజ హితం కోసం మళ్లించి ప్రభాస్ తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు తాము వాడిన వస్తువులను జ్ఞాపకాలుగా భద్రపరుచుకుంటారు లేదా వేలం వేస్తారు. కానీ ప్రభాస్ మాత్రం అవి మరో నలుగురి భవిష్యత్తుకు ఉపయోగపడాలని భావించడం విశేషం. ఈ పరికరాల ద్వారా శిక్షణ పొందుతున్న యువ అథ్లెట్లు ప్రస్తుతం జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ప్రచారం కోరుకోకుండా నిశ్శబ్దంగా సహాయం చేయడం ప్రభాస్ నైజం అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. బాహుబలి వంటి విజువల్ వండర్ తర్వాత ప్రభాస్ రేంజ్ గ్లోబల్ స్థాయికి వెళ్ళింది. ఆ సినిమా కోసం ఆయన ఐదేళ్ల కాలాన్ని కేటాయించడమే కాకుండా, శారీరకంగా ఎంతో శ్రమించారు. అప్పట్లో ఆ కండలు తిరిగిన దేహం వెనుక ఉన్న రహస్యం ఈ జిమ్ పరికరాలే. ఇప్పుడు అవే పరికరాలు రేపటి తరం క్రీడాకారులను తయారు చేస్తుండటం అభిమానులకు ఎంతో గర్వకారణంగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. "సినిమాలో మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ మీరు బాహుబలి అన్నా" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏ చిన్న సహాయం చేసినా గొప్పగా చెప్పుకునే రోజుల్లో, ఇంతటి పెద్ద సహాయాన్ని నిశబ్దంగా చేసిన ప్రభాస్ నిజంగా గ్రేట్ అని ఇండస్ట్రీ వర్గాలు కూడా కొనియాడుతున్నాయి.
May 13, 2026
సివంగిలా సమంత.. ‘మా ఇంటి బంగారం’ ఎప్పుడంటే..?
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత (Samantha), రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). సమంత హీరోయిన్గా నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘మా ఇంటి బంగారం’ టీజర్ ఇప్పటికే అందరిలోనూ బజ్ను క్రియేట్ చేసింది. ‘తస్సాదియ్యా’ అనే పాట కూడా యూట్యూబ్ని షేక్ చేసేస్తోంది. మంచి బజ్ను క్రియేట్ చేసిన ఈ సినిమాని జూన్ 19న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు రిలీజ్ డేట్ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో సమంత చీరకట్టులో ఆ గన్ను పట్టుకున్న తీరు, ఆ చూస్తున్న చూపులు అదిరిపోయాయి. వేటకు వెళ్తున్న సివంగిలా సమంత లుక్ కనిపిస్తోంది. ‘ఓ బేబీ’ తరువాత నందినీ రెడ్డి, సమంత కలిసి చేస్తున్న చిత్రం కావడంతో సహజంగానే ఆడియెన్స్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రాజ్ నిడిమోరు స్టోరీ, స్క్రీన్ ప్లేని అందిస్తుండటంతో మరింతగా హైప్ ఏర్పడింది. ఈ సినిమాలో దిగ్నాథ్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్ని పోషించారు. శ్రీ ముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రంగా ‘మా ఇంటి బంగారం’ రాబోతోంది. ఈ సినిమాని జూన్ 19న గ్రాండ్గా రిలీజ్ చేయబోతోన్నారు.
May 13, 2026జైలర్ 2 కోసం వెయిటింగ్ తప్పదా? తలైవా ఫ్యాన్స్కు షాకింగ్ అప్డేట్!
సూపర్స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'జైలర్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించింది. ఈ భారీ విజయానికి సీక్వెల్గా వస్తున్న 'జైలర్2'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల మరికొంత కాలం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదని టాలీవుడ్ మరియు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, చిత్రాన్ని సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసే దిశగా మేకర్స్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చిత్రబృందం భావిస్తుండటమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని సమాచారం. సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు చిత్రీకరించిన కొన్ని కీలకమైన సీన్లు దర్శకుడు నెల్సన్ ఆశించిన స్థాయిలో రాలేదని టాక్ వినిపిస్తోంది. దీంతో స్క్రిప్ట్ పరంగా మరిన్ని మెరుగులు దిద్ది, కొన్ని సన్నివేశాలను రీ-షూట్ చేసే ప్లాన్లో ఉన్నారట. ఎడిటింగ్ టేబుల్ వద్ద జరుగుతున్న ఈ మార్పుల వల్ల సినిమా షూటింగ్ షెడ్యూల్స్ కూడా కాస్త తారుమారయ్యాయి. మరోవైపు, ఈ సీక్వెల్లో నటించే స్టార్ కాస్టింగ్ మరియు వారి క్యామియో రోల్స్కు సంబంధించిన డేట్స్ సర్దుబాటు చేయడం కూడా టీమ్కు సవాలుగా మారింది. సుమారు నెల రోజులకు పైగా చిత్రీకరణ ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ వంటి భారీ స్టార్ సినిమా కావడంతో, అవుట్పుట్ పర్ఫెక్ట్గా ఉండాలని నిర్మాతలు ఎంత సమయమైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. గతంలో విడుదలైన 'జైలర్' పార్ట్ వన్ దాదాపు 600 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. అందువల్ల సీక్వెల్పై ఉన్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రజనీకాంత్ మేనరిజమ్స్ మరియు నెల్సన్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్లు పార్ట్ 2లో నెక్స్ట్ లెవల్లో ఉండబోతున్నాయని సమాచారం. ప్రస్తుతానికి ఈ వాయిదా వార్తపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో రజనీ అభిమానులు ఈ వార్తపై రకరకాలుగా స్పందిస్తున్నారు. సినిమా ఆలస్యమైనా పర్వాలేదు కానీ, మరో 'ముత్తువేల్ పాండియన్' రేంజ్ హిట్ రావాలని కోరుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్పై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
May 13, 2026
టాలీవుడ్లో ప్రకంపనలు.. నిర్మాతల మండలికి నట్టి కుమార్ రాజీనామా!
తెలుగు సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ (TFPC) జాయింట్ సెక్రటరీ పదవికి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు కౌన్సిల్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు ఆయన ఒక సుదీర్ఘమైన బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖలో కౌన్సిల్ పనితీరుపై ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. నట్టి కుమార్ తన రాజీనామా లేఖలో కౌన్సిల్ పరిపాలనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రస్తావించారు. పర్సెంటేజ్ విధానాన్ని హ్యాండిల్ చేయడంలో కౌన్సిల్ విఫలమైందని, దీనివల్ల ఎగ్జిబిటర్లు పైచేయి సాధిస్తుంటే చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యవర్గ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, గిల్డ్ పెత్తనం సాగడం వంటి అంశాలను ఆయన ఎండగట్టారు. కౌన్సిల్లో ప్రజాస్వామ్యం కరువైందని, ఎన్నికలు లేదా నిబంధనలు లేకుండానే సంస్థ కొనసాగుతోందని నట్టి కుమార్ ఆరోపించారు. పరిపాలన, ఆడిటింగ్, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, జవాబుదారీతనం లేని చోట తాను పదవిలో కొనసాగడం అర్థరహితమని ఆయన స్పష్టం చేశారు. కనీసం తన రాజీనామా తర్వాత అయినా సభ్యులందరూ మేల్కొని, సంస్థను వృత్తిపరంగా, పారదర్శకంగా నడపాలని ఆయన కోరారు. నట్టి కుమార్ రాజీనామాపై నిర్మాత మండలి ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, పరిశ్రమలో చిన్న నిర్మాతల పక్షాన నిలిచే వ్యక్తిగా పేరున్న నట్టి కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం, మండలిలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.
May 13, 2026వెలవెలబోతున్న థియేటర్లు.. బాక్సాఫీస్ గండం నుంచి టాలీవుడ్ గట్టెక్కుతుందా?
ఒకప్పుడు టాలీవుడ్ అంటే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే ఫ్యాక్టరీ. కానీ, కాలక్రమేణా పరిస్థితులు మారుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల మేజిక్ ఉన్నప్పటికీ థియేటర్ల దగ్గర మునుపటి సందడి కనిపించడం లేదు. ప్రేక్షకులు సినిమా హాళ్లకు రావడానికి వెనకాడుతుండటంతో టాలీవుడ్ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా థియేటర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. మల్టీప్లెక్స్ల ఛార్జీలు, పార్కింగ్ ఫీజులు సామాన్యులకు భారంగా మారడం ఒక ఎత్తైతే, కంటెంట్లో నాణ్యత లేకపోవడం మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కేవలం స్టార్ పవర్ నమ్ముకుని సినిమాలు తీస్తే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని ఇటీవలి ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఓటీటీ విప్లవం తర్వాత ఆడియన్స్ మైండ్సెట్ పూర్తిగా మారిపోయింది. సినిమా రిలీజైన కొన్ని వారాల్లోనే డిజిటల్ ప్లాట్ఫామ్స్లోకి వస్తుండటంతో, థియేటర్లకు వెళ్లి ఖర్చు చేయడం కంటే ఇంట్లోనే కూర్చుని చూడటానికే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల నిర్మాతలకు నాన్-థియేట్రికల్ బిజినెస్ పరంగా లాభం చేకూరినప్పటికీ, ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావడం లేదని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రెంటల్ విధానం కంటే షేర్ పద్ధతిలో సినిమాలు ప్రదర్శించడం మేలని వారు భావిస్తున్నారు. ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించినా, రేట్లు పెంచితే ప్రేక్షకులు అసలు రారనే భయం వారిని వెంటాడుతోంది. గతంలో 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్' వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటినప్పటికీ, చిన్న మరియు మధ్యతరహా సినిమాలకు ఆదరణ కరువైంది. కేవలం విజువల్ వండర్స్ లేదా కొత్తదనంతో కూడిన కథలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ క్రమంలో దర్శకులు, రచయితలు తమ పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోషల్ మీడియాలో కూడా థియేటర్ల పరిస్థితిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. "సినిమా బాగుంటేనే థియేటర్ వరకు వెళ్తాం" అని నెటిజన్లు తెగేసి చెబుతున్నారు. ఇక హీరోల భారీ రెమ్యూనరేషన్లు కూడా ప్రొడక్షన్ కాస్ట్ను పెంచేసి నిర్మాతలను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని ఇండస్ట్రీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవాలంటే నిర్మాణ వ్యయం తగ్గించుకోవడంతో పాటు, ప్రేక్షకుడిని థియేటర్ కు రప్పించేలా బలమైన కంటెంట్ను అందించాలి. రాబోయే పెద్ద సినిమాలైనా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసి థియేటర్లకు కొత్త వెలుగులు నింపుతాయేమో వేచి చూడాలి.
May 13, 2026
Raajeev Kanakala: రాజీవ్ కనకాల అలెర్ట్.. రంగంలోకి నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి
తెలుగు సినిమా ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు రాజీవ్ కనకాల(Rajeev Kanakala). ఏ క్యారక్టర్ లోకైనా పరకాయ ప్రవేశం చేసి సదరు క్యారక్టర్ ని ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా ఉండేలా చేయగలిగే ధీశాలి. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్ అనే టాగ్ లైన్ కూడా రాజీవ్ సొంతం. రీసెంట్ గా రాజీవ్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. దీంతో ఉన్న పళంగా వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చాడు. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. హైదరాబాద్లో ఉన్న వైబ్రాంట్ అనే స్కూల్ ఈవెంట్ కి రాజీవ్ గెస్ట్ గా హాజరయ్యాడు. దీంతో రాజీవ్ తీరుపై నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి ఆర్గనైజేషన్ స్పందిస్తు వైబ్రాంట్ స్కూల్ ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా నడుస్తుంది. అటువంటి స్కూల్ ని రాజీవ్ ఎలా ప్రమోట్ చేస్తాడంటు సదరు నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి ఆర్గనైజేషన్( NVTS ) ఫైర్ అయ్యింది. దీంతో రాజీవ్ కనకాల ఇన్ స్టాగ్రామ్ వేదికగా వీడియో రిలీజ్ చేసాడు. అందులో అయన మాట్లాడుతు వైబ్రాంట్ స్కూల్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వెళ్లాను. మంచి మార్కులు సంపాదించిన స్కూల్ పిల్లలకి నా చేతుల మీదుగా చిన్నపాటి బహుమతులు, సత్కారాలు, సన్మానాలు జరిగాయి. సెలబ్రిటీ అనుకోండి.. తెలిసిన వ్యక్తి అనుకోండి.. మీలో ఒకడిగా అక్కడికి వెళ్లడం జరిగింది. అక్కడ నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి ఆర్గనైజేషన్ పవన్ వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగారు. Also read: Mouni Roy: భర్తతో విడిపోతున్నారా? రూమర్లకి చెక్ పెడుతున్న మౌనీ రాయ్ పిక్స్ నాకు నిజంగా ఆ స్కూల్ గురించి అవన్నీ తెలియదు. సందేహాలు ఏమైనా ఉంటే పేరెంట్స్ అంతా ఆ స్కూల్ దగ్గరకు వెళ్లి కనుక్కోండి. NVTS వాళ్లు ఏవైతే అడిగారో అవన్నీ కనుక్కుని మీ పిల్లల్ని జాయిన్ చేయండి. స్కూల్ ప్రమోషన్స్ లో నా ఫోటోలు, వీడియోలు వాడొద్దు అని వైబ్రాంట్ యాజమాన్యానికి చెప్పాను. స్కూల్ విషయంలో నన్ను అలెర్ట్ చేసిన NVTS కి ధన్యవాదాలని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు.
May 13, 2026
CM Vijay: సీఎం విజయ్పై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు!
తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా దళపతి విజయ్ (Thalapathy Vijay) పేరే వినిపిస్తోంది. 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన విజయ్.. తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ కి మీ సలహా ఏంటి? అని మీడియా ప్రశ్నించగా.. కమల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. "విజయ్ను కేవలం ఒక సినిమా నటుడిగా మాత్రమే చూడకండి. ఆయనకు ఇంకా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఏ రంగం నుంచి అయినా రాజకీయాల్లోకి రావచ్చు, అందులో తప్పేమీ లేదు. అయితే, ఆయన మా సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి రావడం నాకు వ్యక్తిగతంగా చాలా గర్వంగా ఉంది" అని కమల్ పేర్కొన్నారు. ఒక సీనియర్ నటుడిగా, తోటి రాజకీయ నాయకుడిగా విజయ్కు కమల్ ఇస్తున్న మద్దతు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ ని కూడా తమిళనాడు కొత్త సీఎం విజయ్ గురించి మీడియా అడగగా.. ఆయన సమాధానం చెప్పకుండా, చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్ళారు.
May 13, 2026
Mouni Roy: భర్తతో విడిపోతున్నారా? రూమర్లకి చెక్ పెడుతున్న మౌనీ రాయ్ పిక్స్
మెగాస్టార్ విశ్వంభర(Vishwambhara)ఫేమ్ మౌనీ రాయ్(Mouni Roy)తన భర్త సూరజ్ నంబియార్(Suraj Nambiar)తో విడిపోనుందనే న్యూస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో విడిపోతున్నారనే వార్తలకి బలం కూడా చేకూరినట్లయింది. రీసెంట్ గా ఈ విషయంపై మౌనీ రాయ్ స్పందించడం జరిగింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 'మీడియా సంస్థలన్నింటికీ నా విన్నపం. దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయకండి. మాకు కొంత సమయం, ప్రైవసీ ఇవ్వండి" అంటూ నోట్ రాసుకొచ్చింది. ఆమె నేరుగా విడాకుల గురించి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ, వస్తున్న వార్తలు తప్పుడు కథనాలు అని పేర్కొనడం గమనార్హం. కానీ సూరజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఆ ఇద్దరి పెళ్లి ఫోటోలని తొలగించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే తన అకౌంట్ ని డీయాక్టివేట్ చేశాడు. మౌనీ రాయ్ స్నేహితురాలు అగ్ర హీరోయిన్ దిశా పటానీ కూడా సూరజ్ను అన్ఫాలో చేసింది. మరి మౌనీ రాయ్ ఏమో అవాస్తవాలని అంటుంది. Also read: Suriya: చప్పుడు లేని వీరభద్రుడు.. కారణం ఇదేనా! మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ వివాహం జనవరి 27, 2022న గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఫోర్ ఇయర్స్ కే విడిపోతున్నారనే వార్తలు రావడం అభిమానులని కలవరపెడుతోంది.మౌని రాయ్ నాగిని సీరియల్ ద్వారా దేశ వ్యాప్తంగా పేరు పొందిన విషయం తెలిసిందే.
May 13, 2026
తమిళనాడు అసెంబ్లీలో ‘పుష్ప 2’ సెగ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే, ఈ సినిమా క్రేజ్ కేవలం థియేటర్లకే పరిమితం కాకుండా ఇప్పుడు అసెంబ్లీ హాల్స్కు కూడా పాకింది. తాజాగా తమిళనాడు అసెంబ్లీ వేదికగా 'పుష్ప 2' సినిమాలోని ఒక అంశంపై జరిగిన చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అధికార పక్షాన్ని విమర్శించే క్రమంలో పుష్ప రాజ్ను ఉదాహరణగా తీసుకోవడం విశేషం. "పుష్ప 2 సినిమాలో చూపించినట్లుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సోఫాలు పంపిస్తున్నారు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో ఒక్కసారిగా నవ్వులు పూయించడమే కాకుండా రాజకీయ వేడిని కూడా పెంచాయి. సినిమాల్లోని సన్నివేశాలను రాజకీయ విమర్శలకు వాడుకోవడంలో ఉదయనిధి ఎప్పుడూ ముందుంటారు, ఇప్పుడు పుష్ప సినిమా సీన్లను ఆయన ప్రస్తావించడం వైరల్ అవుతోంది. అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఈ పుష్ప రిఫరెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ "పుష్ప రాజ్ రేంజ్ అది" అంటూ పోస్టులు పెడుతుండగా, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఉదయనిధి స్టాలిన్ తెలివిగా సినిమా ట్రెండ్ను వాడుకొని విమర్శలు గుప్పించారని అభిప్రాయపడుతున్నారు.
May 13, 2026సంస్కృత చలనచిత్ర పరిశ్రమకు శ్రీకారం చుట్టిన జనార్థన మహర్షి!
భారతీయ చలనచిత్ర రంగం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మరియు హిందీ పరిశ్రమలు. కానీ, వీటన్నింటికీ మూలమైన సంస్కృత భాషలో ఒక పూర్తిస్థాయి సినిమా ఇండస్ట్రీ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచననే నిజం చేస్తూ, ప్రముఖ రచయిత మరియు దర్శకుడు జనార్థన మహర్షి ఒక చారిత్రాత్మక అడుగు వేశారు. భారతీయ సంస్కృతిని, సంస్కృత భాషా మాధుర్యాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన "సంస్కృత ఫిలిం ఇండస్ట్రీ"ని ప్రారంభిస్తున్నారు. సంస్కృతం అంటే కేవలం పౌరాణికాలు, శ్లోకాలకే పరిమితం అనే అపోహను తొలగించడమే ఈ ఇండస్ట్రీ ముఖ్య ఉద్దేశం. అసలు సంస్కృత ఫిలిం ఇండస్ట్రీని స్థాపించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ఇందులో ఎంత మంది భాగస్వాములుగా చేరబోతున్నారు. ఈ సంస్థ కార్యకలాపాలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి జనార్థన మహర్షి మాట్లాడుతూ.. "తెలుగు, తమిళ పరిశ్రమల తరహాలోనే ఇది కూడా ఒక సినిమా ఇండస్ట్రీ. ఇందులో కేవలం పౌరాణికాలే కాదు, చక్కని సెన్సిబుల్ కథలతో కూడిన కమర్షియల్ సినిమాలు కూడా నిర్మించవచ్చు. ఇప్పటికే నేను 'విశ్వదర్శనం', 'దేవస్థానం' వంటి చిత్రాల్లో శ్లోకాలను ఆ విధంగానే ప్రయోగించాను. ఇప్పుడు మరింత సీరియస్గా సంస్కృత భాష ప్రధానంగా సినిమాలు తీయబోతున్నాను" అని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఒక ఆసక్తికరమైన తర్కాన్ని ఆయన వినిపించారు. మన ఆధ్యాత్మిక గ్రంథాలైన విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, భగవద్గీత అన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఒకవేళ భగవంతుడు మన ముందు ప్రత్యక్షమైతే, ఆయనతో సంభాషించడానికి సంస్కృతం అవసరమని, అలాగే స్వర్గానికి వెళ్ళిన తర్వాత దేవతలతో మాట్లాడాలన్నా ఈ భాషలో ప్రావీణ్యం ఉండాలన్నది ఆయన ఉద్దేశం. అందుకే 'జయతు జయతు సంస్కృతం' అనే కాన్సెప్ట్తో ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నారు. Bharathiya Sanskrit Film Federation పేరుతో ప్రారంభిస్తున్న ఈ ఇండస్ట్రీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మే 16 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో కన్నడ నుంచి రాక్లైన్ వెంకటేష్తో పాటు తనికెళ్ల భరణి, కె.వి.రమణాచారి వంటి ఎందరో ప్రముఖులు భాగస్వామ్యం కాబోతున్నారు. ఈ ఇండస్ట్రీలో ఎవరైనా సంస్కృత భాషలో సినిమాలు తీయవచ్చు లేదా దర్శకత్వం వహించవచ్చు. వారికి ఈ ఇండస్ట్రీ తరపున పూర్తి సహకారం ఉంటుంది. అంతేకాదు, వారి సినిమాలకు సంబంధించిన వరల్డ్ వైడ్ ప్రమోషన్స్, ఫిలిం ఫెస్టివల్స్కు పంపడం, కమర్షియల్ డీల్స్లో సహాయం చేయడం వంటి బాధ్యతలను జనార్థన మహర్షి స్వయంగా తీసుకోనున్నారు. గతంలో జి.వి.అయ్యర్ వంటి వారు సంస్కృతంలో చిత్రాలు తీసినప్పటికీ, ఇప్పుడు జనార్థన మహర్షి ఏకంగా 12 సినిమాలు తీయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటికే మూడు సినిమాలను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. సంస్కృత సినిమాను ఒక భాషగా ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న జనార్థన మహర్షి 'సన్ ఆఫ్ సాన్స్క్రిట్' అనిపించుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చారిటీ మరియు ట్రస్ట్ రూపంలో సాగే ఈ ప్రయత్నం భారతీయ సినిమా చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆశించవచ్చు. సంస్కృత భాషాభిమానులు, సినీ ప్రియులు ఈ వినూత్న ప్రయత్నానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
May 13, 2026
Suriya: చప్పుడు లేని వీరభద్రుడు.. కారణం ఇదేనా!
స్టార్ హీరో సూర్య(Suriya)కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త సినిమా వస్తుందంటే చాలు పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ కోవలోనే రేపు 'వీరభద్రుడు' గా (తమిళంలో 'కరుప్పు') తెలుగు, తమిళ నాట అడుగుపెడుతున్నాడు. అయితే తెలుగు వెర్షన్ లో ఇంకా ఎలాంటి మూమెంట్, బజ్ కనిపించడం లేదు. సాధారణంగా సూర్య సినిమాలకి అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉంటాయి. కానీ వీరభద్రుడు ఆ విషయంలో వెనుకబడి ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో కూడా బుకింగ్స్ చాలా సాధారణంగా ఉన్నాయి. మునుపటి సినిమా రెట్రో తో పోలిస్తే బుకింగ్స్ 50% కంటే తక్కువగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. Also read: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్ ప్రమోషన్స్ తెలుగులో తక్కువగా జరగడం, నీరసానికి ప్రధాన కారణాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరి సాలిడ్ మౌత్ టాక్ వస్తే కానీ రేపు మార్నింగ్ షోస్ తర్వాత బుకింగ్స్ ఊపందుకుంటాయేమో చూడాలి. సూర్య సరసన త్రిష(Trisha)జత కట్టగా ఆర్జే బాలాజీ(Rj Balaji)తెరకెక్కించాడు. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణం
May 13, 2026
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్
తగ్గేదేలే అనే రీతిలో పలు ఆసక్తికర తెలుగు సినిమా వార్తలు తెలుగు సినిమా ప్రేమికులు, పాఠకుల కోసం అందుబాటులో ఉన్నాయి. 1 . నాగార్జున విషయంలో హైకోర్ట్ కీలక తీర్పు.. అనుమతి పత్రాలు చూపండి అని ఆదేశాలు నా పేరుతో టీ షర్ట్స్ ని ఒక సంస్థ విక్రయిస్తుందని కొన్ని రోజుల క్రితం నాగార్జున ఢిల్లీ హై కోర్ట్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు స్పందిస్తు నాగార్జునతో నేరుగా ఒప్పందం లేనప్పుడు ఆయన పేరు, ఫోటోలని వాడుకుంటూ టీ షర్టులు ఎలా అమ్ముతారు. మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా హక్కులు పొందామని చెప్తే సరిపోతుందా! ప్లెయింటిఫ్ తో మీకు పరిచయం కూడా లేనప్పుడు ఆ వస్తువులని అమ్మే చట్టబద్ధత మీకు ఎక్కడి నుంచి వచ్చింది. అనుమతి పాత్రలు ఉన్నాయా అని ఢిల్లీ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 2. విజయ్ ఇక సెకండ్ ప్లేస్ లోనే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, రాజకీయాల్లో తనకంటు ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్న దళపతి విజయ్ మరో అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు. ప్రముఖ సినిమా వెబ్ సైట్ ఐఎండీబీ తాజాగా విడుదల చేసిన 'పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్' జాబితాలో విజయ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అంతకు ముందు వారంలో 21 వ స్థానంలో ఉన్న విజయ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి రావడం విశేషం. 3 . భోపాల్లో ‘పెద్ది’ సౌండ్.. థర్డ్ సాంగ్ లాంచ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో పెద్ది నుంచి తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ కి సంబంధించిన శుభవార్త బయటకు వచ్చింది. 'సౌండ్ ఆఫ్ పెద్ది' పేరుతో మే 23వ తేదీన మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో స్పెషల్ సాంగ్ని గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్లో రెహమాన్ స్వయంగా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. ఆయన స్వరపరిచిన బాణీలకి స్టేజ్ పై లైవ్ మ్యూజిక్ తోడైతే, ఆ వైబ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ ఒక రేంజ్ లో సక్సెస్ అయిన విషయం తెలిసిందే. 4 . బాలకృష్ణ, ఎన్టీఆర్ మల్టీస్టారర్! గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మల్టిస్టారర్ చెయ్యాలి అనే డిమాండ్ ఎప్పట్నుంచో ఫ్యాన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా మళ్ళీ తమ కోరికని వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ కోరికని బాలయ్య, ఎన్టీఆర్ తీరుస్తారేమో చూడాలి. బాలయ్య ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చిత్రంతో బిజీగా ఉండగా, ప్రశాంత్ నీల్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. 5 . IBOMMA మళ్లీ వచ్చేసింది! కొంతకాలంగా నిలిచిపోయినట్లు కనిపించిన IBOMMA వెబ్సైట్ తాజాగా మళ్లీ ఆన్లైన్లో కనిపించడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. సైట్ ని ఆపరేట్ చేస్తున్నాడనే ఆరోపణలతో రవిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేయగా.. సైట్ కూడా క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు మళ్లీ కొత్త సినిమాలతో సైట్ యాక్టివ్ కావడం ఇండస్ట్రీకి పెద్ద షాక్గా మారింది. ఈ పరిణామంపై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రవి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్న విషయం తెలిసిందే. 6 . మెగాస్టార్ చిరంజీవి జెన్ జీ లుక్ వైరల్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎంతో స్లిమ్గా, స్టైలిష్గా జెన్ జీ లుక్ లో యువ హీరోలకి సైతం పోటీ ఇచ్చేలా ఉన్నారు. దీంతో సదరు స్టిల్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. గత కొంతకాలంగా చిరు కఠినమైన డైట్ క్రమశిక్షణతో కూడిన వర్కవుట్స్ చేస్తున్నారు. అందుకే అంత ఎనర్జిటిక్గా కనిపిస్తున్నారని సినీ వర్గాల టాక్. 7 . క్షమాపణలు చెప్తున్న అలీ హిందువులని అవమానించే రీతిలో ఉన్న సోప్ యాడ్ చేసి ప్రముఖ నటుడు అలీ అపఖ్యాతికి గురైన విషయం తెలిసిందే. హిందువులు సోషల్ మీడియా వేదికగా అలీపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. గతంలో తాను నటించిన 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలోని ఒక పాపులర్ కామెడీ సీన్ని స్ఫూర్తిగా తీసుకుని ముంబైకి చెందిన కంపెనీ ఈ యాడ్ రూపొందించింది దాంతో కేవలం వినోదం కోసమే ఆ యాడ్ చేశాను. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదు. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరాడు. 8 . పూజాహెగ్డే కి అండగా అల్లు అర్జున్! పూజాహెగ్డే ఇటీవల కెరీర్ పరంగా కొంచం డల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంలో తనకి అవకాశం ఇవ్వబోతున్నాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అట్లీ మూవీతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. పూజా, అల్లు అర్జున్ కాంబోలో ఇప్పటికే డి జె జగన్నాధం, అల వైకుంఠ పురం వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి. 9 . వారణాసిలో వారణాసి’ షూటింగ్? మహేశ్బాబు రాజమౌళి ల ‘వారణాసి’షూటింగ్ ఇప్పుడు అసలు లెవల్కి వెళ్లబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. భారీ అండర్వాటర్ యాక్షన్ సీన్ని వారణాసిలో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మొదట ఈ సన్నివేశాన్ని హైదరాబాద్లో షూట్ చేయాలని అనుకున్నారు. కానీ 150 ట్యాంకర్ల నీటి సరఫరాకి జలమండలి అనుమతి ఇవ్వకపోవడంతో వారణాసికి షిఫ్ట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి . 10 . నట్టి కుమార్ రాజీనామా ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేయడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు తాను పంపిన రాజీనామా లేఖలో 'ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పారదర్శకత లోపించింది. కొందరు సభ్యుల ఏకపక్ష నిర్ణయాల వల్ల చిన్న నిర్మాతలకి అన్యాయం జరుగుతుంది. థియేటర్ల కేటాయింపు, వర్చువల్ ప్రింట్ ఫీజు వంటి విషయాల్లో కౌన్సిల్ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైంది. కేవలం కొందరి ప్రయోజనాల కోసమే కౌన్సిల్ కార్యకలాపాలు సాగుతున్నాయి. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
May 13, 2026
Raghu Karumanchi: రేవంత్ రెడ్డి నా క్లాస్మేట్.. ఎన్టీఆర్ సీఎం కావాలి.. నటుడు రఘు సంచలన ఇంటర్వ్యూ!
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్తో, వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi). ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన 'ఆది' సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన, పరిశ్రమలో 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, తన వ్యక్తిగత విషయాలను తెలుగువన్(TeluguOne) ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో రఘు మాట్లాడుతూ తన తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. 'ఆది' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన తమాషా సంఘటనలను వివరిస్తూ, ఎన్టీఆర్(NTR)తో ఉన్న అనుబంధం అప్పటి నుంచే బలపడిందని చెప్పారు. హీరో అనే ఫీలింగ్ లేకుండా నా లాంటి వాడిని దగ్గరకు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. అదుర్స్ సినిమా తన కెరీర్ ను టర్న్ చేసిందని, ఆ తర్వాత సినిమాలు క్యూ కట్టాయని తెలిపారు. అదుర్స్ సినిమా తర్వాతనే సాఫ్ట్వేర్ జాబ్ వదిలేశానని పేర్కొన్నారు. ఆ సినిమా విడుదలైన మరుసటి రోజే ఏకంగా 20 సినిమాల్లో అవకాశాలు వచ్చాయంటే తన పాత్ర ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయాల గురించి స్పందిస్తూ రఘు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) గారు తన క్లాస్మేట్ అని, తాము ఒకే బెంచ్ మీద కూర్చునే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. తన జాతకం ప్రకారం భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్కులు చెప్పిన విషయాన్ని కూడా బయటపెట్టారు. తనకు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టమని, సమయం వచ్చినప్పుడు పార్టీ కోసం ప్రచారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తన మనసులోని మాటను వెల్లడించారు. తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడంపై స్పందిస్తూ.. ఇక్కడ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకోవడంలో తప్పులేదని, కానీ తనకంటూ ఒక టైం రావాలని అన్నారు. ఎన్టీఆర్ గారి మనసులో ఏముందో తెలియదని, కానీ ఆయన సీఎం కావాలని అందరిలా తాను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటానని చెప్పారు. అలాగే ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలో తాను నటించే అవకాశం ఉందని, ఇప్పటికే ఆడిషన్స్ కూడా పూర్తయ్యాయని ఒక గుడ్ న్యూస్ చెప్పారు. తన 25 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని, ఇకపై రొటీన్ క్యారెక్టర్లు కాకుండా ఎమోషనల్, సెంటిమెంటల్ పాత్రలు చేయాలని ఉందని రఘు తన కోరికను వ్యక్తపరిచారు. విలన్ పాత్రలు చేయడానికి కూడా తాను సిద్ధమేనని, తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నానని అన్నారు. ఈ ఇంటర్వ్యూలో రఘు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూల కోసం తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
May 13, 2026
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com







