
ustaad bhagat singh: ఒకే ఫ్రేమ్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కి కొత్త లుక్
-థియేటర్స్ లో సందడి చేస్తున్న ఉస్తాద్ -సినిమా ఎలా ఉంది -చిరు రాకతో అదనపు ఆకర్షణ పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)పవర్ ప్యాక్డ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh)థియేటర్స్ లో తన హవా కొనసాగిస్తూ ఉంది. ఫ్యామిలీస్ కూడా ఉస్తాద్ బాట పడుతుండంతో పాటు మూవీ చూసాక వాళ్ళందరు మీడియాతో మాట్లాడుతు 'ఈ మధ్య కాలంలో ఎలాంటి అసభ్యత లేకుండా వచ్చిన మూవీ ఉస్తాద్. పలానా సీన్స్ మాకు బాగా నచ్చాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఉస్తాద్ ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)దంపతులు కూడా జాయిన్ అయ్యారు. రీసెంట్ గా హైదరాబాద్ లో చిరంజీవి, సురేఖ దంపతులు, పవన్ దంపతులు కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ ని వీక్షించారు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ లోని 'వాన వాన వెల్లువాయే' సాంగ్ కి పవన్ డాన్స్ చేస్తున్న సీన్ తో పాటు తొలిప్రేమలోని 'ఈ మనసే, నా మనసే' సాంగ్ కి చిరంజీవి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ స్పెషల్ షో లో హరీష్ శంకర్, శ్రీలీల, అనిల్ రావిపూడి, ఆనంద్ సాయి దంపతులు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలతో పాటు మరికొంత మంది శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. మైత్రి మూవీస్ నే ఎక్స్ వేదికగా సదరు మొత్తం వీడియోని షేర్ చేసింది. Also read: Ntr vs chiranjeevi: ఎన్టీఆర్ పై చిరంజీవి ట్వీట్.. ఇది రేంజ్ అంటే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానుల కామెంట్స్ తో మైత్రి ఎక్స్ సర్వర్ క్రాక్ అయ్యే పరిస్థితి. పవన్ ప్రీవియస్ చిత్రం 'ఓజి' ని కూడా చిరంజీవి, సురేఖ గారు చూసిన విషయం తెలిసిందే. https://x.com/MythriOfficial/status/2035298848344822027?s=20
Mar 21, 2026‘లవ్ జిహాద్’ ఆరోపణలకు చెక్ పెట్టిన మోనాలిసా.. బెదిరింపులపై స్పందించిన భర్త!
మహా కుంభమేళా 2025లో తన నీలి రంగు కళ్లతో, రుద్రాక్ష మాలలు అమ్ముతూ రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన 'రుద్రాక్ష గర్ల్' మోనాలిసా భోస్లే ఇప్పుడు వార్తల్లో నిలిచారు. తన ప్రియుడు, నటుడు ఫర్మాన్ ఖాన్ను ఆమె పెళ్లాడటంతో ఈ జంట ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కేరళలోని తిరువనంతపురంలో వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి కేరళ మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే వీరి వివాహాన్ని 'లవ్ జిహాద్' అంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేయడంతో పాటు, వీరికి బెదిరింపులు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై భర్త ఫర్మాన్ ఖాన్ మీడియా ముందు గట్టిగానే స్పందించారు. తాము ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నామని, ఇందులో ఎటువంటి బలవంతం లేదని ఫర్మాన్ స్పష్టం చేశారు. "మేము ముందుగా మనుషులం. ఎవరి మతాన్ని వారు పాటిస్తూనే ఒకరినొకరు గౌరవించుకుంటాం. ఆమె హిందూగానే ఉంటుంది, నేను ముస్లింగానే ఉంటాను. ఇక్కడ మత మార్పిడి ప్రసక్తే లేదు" అని ఆయన కుండబద్ధలు కొట్టారు. మోనాలిసా కూడా తన తండ్రికి ఇష్టం లేకపోయినా, తన ఇష్ట ప్రకారమే ఈ వివాహం చేసుకున్నానని మీడియాకు వివరించారు. వీరిద్దరూ 'నాగమ్మ' అనే మలయాళ సినిమా షూటింగ్ సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆరు నెలల ప్రేమ ప్రయాణం తర్వాత పెళ్లి పీటలెక్కారు. ఫర్మాన్ ఖాన్ ఉత్తరప్రదేశ్కు చెందిన నటుడు కాగా, మోనాలిసా మధ్యప్రదేశ్ వాసి. వీరిద్దరి కెరీర్ పరంగా చూస్తే ప్రస్తుతం ఈ సినిమా సెట్స్పై ఉంది. ఈ సినిమాలోని వీరి కెమిస్ట్రీ నిజ జీవితంలో కూడా ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ యాప్ ద్వారా వీరు తమ వివాహాన్ని చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకున్నారు. కేరళ ప్రజలు తమకు ఎంతో మద్దతుగా ఉన్నారని, అవసరమైతే అక్కడే సెటిల్ అవుతామని కూడా ఈ జంట ప్రకటించడం విశేషం.
Mar 21, 2026చిన్ననాటి స్నేహితుడితో బిగ్బాస్ ఫేమ్ పునర్నవి ఏడడుగులు.. వైరల్ అవుతున్న పిక్స్!
నటి, బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం ఓ ఇంటికి కోడలైంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటూ విదేశాల్లో ఉన్నత చదువుల్లో బిజీగా ఉన్న ఈ భామ, తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో తన చిరకాల మిత్రుడు హేమంత్వర్మతో కలిసి ఏడడుగులు వేసింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, తమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు. వరుడు హేమంత్వర్మ సినీ పరిశ్రమలో ప్రముఖ ఫొటోగ్రాఫర్గా రాణిస్తున్నారు. వీరిద్దరూ చిన్ననాటి నుంచే స్నేహితులు కావడం విశేషం. గతేడాది డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జోడీ, తాజాగా మార్చి 20న వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆర్భాటాలకు పోకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక సింపుల్గా జరిగింది. పునర్నవి భూపాలం అనగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ‘ఉయ్యాల జంపాల’ సినిమా. ఆ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన సునీత పాత్రలో ఆమె పండించిన అమాయకత్వం, నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా, ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం బిగ్ బాస్ రియాలిటీ షోనే. అందులో తన ముక్కుసూటి తనంతో బోల్డ్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత వెండితెరపై బిజీ అవుతుందని అందరూ భావించినప్పటికీ, పునర్నవి మాత్రం తన కెరీర్ విషయంలో భిన్నమైన నిర్ణయం తీసుకుంది. గ్లామర్ ఫీల్డ్కు విరామం ప్రకటించి, లండన్కు వెళ్లి సైకాలజీలో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. అక్కడి నుంచే సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఇప్పుడు నేరుగా పెళ్లి వార్తతో అందరికీ స్వీట్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పునర్నవి వెడ్డింగ్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ లుక్లో పునర్నవి ఎంతో కళగా కనిపిస్తుండగా, వరుడు హేమంత్ కూడా క్లాసీగా ఉన్నాడు. ఈ జంటను చూసిన నెటిజన్లు “మేడ్ ఫర్ ఈచ్ అదర” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం ఈ కొత్త దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Mar 21, 2026ఓటీటీని షేక్ చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సుడల్: ది వార్టెక్స్
ఇటీవలికాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్కి పెరుగుతున్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. థియేటర్లలో కంటే ఇంట్లోనే కూర్చుని ఓటీటీలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే రకరకాల జోనర్స్ సినిమాలను ఆయా సంస్థలు అందుబాటులో ఉంచుతున్నాయి. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న 'సుడల్: ది వార్టెక్స్' (Suzhal: The Vortex) వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తమిళం నుంచి తెలుగు సహా పలు భాషల్లోకి అనువదించిన ఈ సిరీస్ గ్రిప్పింగ్ నేరేషన్తో ప్రేక్షకులను కట్టి పడేస్తోంది. ఈ కథ సాంబలూరు అనే చిన్న గ్రామంలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంతో మొదలవుతుంది. సరిగ్గా అదే సమయంలో యూనియన్ లీడర్ షణ్ముగం (పార్థిబన్) చిన్న కూతురు నీలా కనిపించకుండా పోతుంది. ఈ రెండు సంఘటనల వెనుక ఉన్న నిగూఢ సత్యాలను ఛేదించే క్రమంలో ఎదురయ్యే మలుపులే ఈ సిరీస్కి ఆయువుపట్టు. ముఖ్యంగా ఈ సిరీస్లో నటీనటుల పెర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పాలి. ఐశ్వర్య రాజేష్ తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన శ్రియారెడ్డి పవర్ఫుల్ నటనను కనబరిచారు. కథిర్ మరియు పార్థిబన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. 'విక్రమ్ వేద' వంటి సంచలన చిత్రానికి కథను అందించిన పుష్కర్-గాయత్రి ద్వయం ఈ సిరీస్ను క్రియేట్ చేయడం విశేషం. సాంకేతికంగా కూడా ఈ సిరీస్ ఉన్నత స్థాయిలో ఉంది. సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. కేవలం క్రైమ్ మాత్రమే కాకుండా సామాజిక అంశాలను, ముఖ్యంగా చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాలను మరియు వాటి తాలూకు మానసిక ప్రభావాలను ఈ సిరీస్ లో చాలా లోతుగా చర్చించారు.
Mar 21, 2026
Ntr vs chiranjeevi: ఎన్టీఆర్ పై చిరంజీవి ట్వీట్.. ఇది రేంజ్ అంటే
-ఉగాది రోజున ఎన్టీఆర్ జాతీయ అవార్డుతో చిరు -ఆ రోజు మాట్లాడలేదు -కానీ ఇప్పుడు తన ట్వీట్ తో ఎన్టీఆర్ రేంజ్ చెప్పేసాడు తెలుగు సినిమా, అభిమానుల, ప్రేక్షకుల, ప్రజల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నటరత్నపద్మశ్రీ నందమూరి రామారావు(Ntr). ఆయన పేరుపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అవార్డుని మొన్న ఉగాది రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అందుకున్న విషయం తెలిసిందే. ఆ విషయంపై రీసెంట్ గా చిరంజీవి ఎక్స్ వేదికగా తన భావాన్ని పంచుకోవడం జరిగింది. ఏమని స్పందించాడో చూద్దాం. 'తెలుగు సినిమాకి ఉన్న కీర్తిని ఖండాంతరాలకి చేర్చిన మహానుభావుడు. చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారి పేరిట ఏర్పాటు చేసిన అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో గొప్ప గౌరవం కూడాను. ఎన్టీఆర్ అంటే కళల సమ్మేళనం. N అంటే నాట్యం, T అంటే తాళం, R అంటే రాగం. ఈ విధంగా తన పేరుతోనే లలిత కళలని ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు. దేవుడు ఎలా ఉంటాడో మనకి తెలియకపోయినా తాను పోషించిన క్యారక్టర్ ల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభావంతుడు. రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం. ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిదంటు చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నాడు. also read: Sri gowri priya: తెలుగు హీరోలపై కోపం.. తమిళ హీరోలతో మాత్రం రొమాన్స్ నా! ఇప్పుడు ఈ ట్వీట్ తో అవార్డు అందుకున్న రోజు ఎన్టీఆర్ గురించి చిరంజీవి మాట్లాడలేదనే విమర్శలకి చెక్ పడినట్లయింది. ఎన్టీఆర్, చిరంజీవి కలిసి తిరుగులేని మనిషి చిత్రంలో బావ, బామ్మర్దులుగా చేసారు. ఎన్టీఆర్ గారు తనని కలిసినప్పుడల్లా ఫైనాన్షియల్ విషయంలో జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇచ్చేవారని చిరంజీవినే స్వయంగా చాలా సందర్భంలో చెప్పుకొచ్చాడు. అనంతర కాలంలో చిరంజీవి నుంచి వచ్చిన కొన్ని సినిమా ఫంక్షన్స్ కి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ హాజరయ్యారు.
Mar 21, 2026నితిన్ లైనప్ అదిరిందిగా.. మూడు ప్రాజెక్టులతో ఫ్యాన్స్కి గొప్ప ట్రీట్!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన కెరీర్లో మళ్లీ పూర్వ వైభవం సంపాదించుకునేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. వరుస పరాజయాలు పలకరించినప్పటికీ, ఎక్కడా తగ్గకుండా వైవిధ్యమైన కథలతో బాక్సాఫీస్ వద్ద భారీ కమ్బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నితిన్ ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టి అభిమానులకు అదిరిపోయే ట్రిపుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం నితిన్ ప్రతిభావంతుడైన దర్శకుడు వి.ఐ. ఆనంద్తో కలిసి ఒక భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్లను హ్యాండిల్ చేయడంలో దిట్ట అయిన ఆనంద్, ఈసారి నితిన్ కోసం ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ నితిన్ కెరీర్కు ఎంతో కీలకం కానుంది. కేవలం ఈ ఒక్క చిత్రంతోనే ఆగిపోకుండా, నితిన్ మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ఆయ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు అంజితో నితిన్ చేతులు కలిపారు. తన సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' బ్యానర్పైనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. జూలై నుంచి చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది నితిన్ ప్లాన్. అంతేకాకుండా, వచ్చే నెలలో మరో కొత్త దర్శకుడితో ఒక క్రేజీ ప్రాజెక్టును ప్రకటించేందుకు నితిన్ సిద్ధమవుతున్నారు. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో రూపొందనున్న ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇలా వరుసగా మూడు సినిమాలు లైనప్లో ఉండటంతో నితిన్ తన మార్కెట్ను మళ్లీ సెట్ చేసుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నితిన్ సినీ ప్రస్థానం గమనిస్తే, 'జయం', 'దిల్', 'సై' వంటి చిత్రాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చినప్పటికీ 'ఇష్క్', 'అ ఆ', 'భీష్మ' వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో తన స్టామినా ఏంటో నిరూపించారు. అయితే, గత కొన్ని చిత్రాలు నిరాశపరచడంతో ఈసారి కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా నితిన్ తదుపరి చిత్రాలపై భారీగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వి.ఐ. ఆనంద్ సినిమాతో నితిన్ సరికొత్త అవతారంలో కనిపిస్తారని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హిట్ దర్శకులతో జతకట్టడం, విభిన్న జోనర్లను ఎంచుకోవడం చూస్తుంటే నితిన్ బాక్సాఫీస్ వద్ద గట్టి వేటకే సిద్ధమైనట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. రానున్న నెలల్లో టీజర్లు, ట్రైలర్లతో నితిన్ సందడి మొదలుకానుంది. నితిన్ స్పీడ్ చూస్తుంటే ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ సినిమాలు నితిన్ కెరీర్ను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.
Mar 21, 2026
Sri gowri priya: తెలుగు హీరోలపై కోపం.. తమిళ హీరోలతో మాత్రం రొమాన్స్ నా!
-మ్యాడ్ లో శృతిగా ఫుల్ పాపులర్ -ఈ నెల 27 నా హ్యాపీ రాజ్ తో సెల్యులాయిడ్ పైకి -శ్రీ గౌరీ ప్రియకి హీరోలపై వివక్ష ఉందా! రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువతని, సోషల్ మీడియా లవర్స్ ని రామ్ నితిన్ చెంప పగలకొట్టింది ఎవరు అని సమయం, సందర్భం లేకపోయినా పర్లేదు అడగండి. వాళ్లంతా ఇంకేం మాట్లాకుండా శృతి' అని చెప్తారు. మనం అడిగింది మ్యాడ్ మూవీ గురించి అని వీళ్ళకెలా తెలుసు అని మనం అనుకుంటూ ఉంటే, వాళ్లేమో శృతి క్యారక్టర్ తో తమకి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని గత స్మృతులు చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంతలా మ్యాడ్ లోని ఒకే ఒక చెంప దెబ్బ సన్నివేశంతో శ్రీ గౌరీప్రియ(Sri Gowri Priya)ఫుల్ పాపులర్ అయ్యింది. దీంతో తన అప్ కమింగ్ మూవీ హ్యాపీ రాజ్(Happy Raj)పై అభిమానులు ఒక లుక్ వేసి ఉంచారు. నిన్న హైదరాబాద్ లో సదరు మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా శ్రీ గౌరీప్రియ మాట్లాడిన మాటలు అభిమానులకి, సోషల్ మీడియాకి సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయి. ఆ మాటలేంటో చూద్దాం. ఆమె మాట్లాడుతు నేను తమిళ హీరోలతో రొమాంటిక్ గా, తెలుగు హీరోలతో యారంగిట్ గా ప్రవర్తిస్తూ కొడతానని అంటారు. నేను ఒక్క మూవీలో మాత్రమే హీరోని కొడతాను.అయినా నేనేమైనా హీరోలని కొట్టాలని కంకణం కట్టుకున్నానా! నాకు మాత్రం ఎవరి మీద కోపం లేదు. పైగా నేను తమిళ సినిమాల్లో ఏడుస్తానని, తెలుగు సినిమాల్లో మాత్రం సంతోషంగా ఉంటానని కూడా కొంత మంది అంటారు. నాకు వచ్చిన ఆఫర్స్ మేరకే నా క్యారక్టర్ రియాక్షన్ ఉంటుందని చెప్పుకొచ్చింది. Also read: Niharika konidela: నీహారిక కొణిదెల విడాకులకి కారణం తెలిసింది.. ఇదే అసలు నిజం కాకినాడకి చెందిన అచ్చ తెలుగింటి అమ్మాయి అయిన శ్రీ గౌరీప్రియ క్యారక్టర్ ఆర్టిస్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ తమిళ్ లో మోడరన్ లవ్ చెన్నై, ట్రూ లవర్ వంటి చిత్రాల ద్వారా సోలో హీరోయిన్ గా తమిళ ప్రేక్షకులకి దగ్గర అయ్యింది. ఇప్పుడు హ్యాపీ రాజ్ తో తమిళ,తెలుగు భాషల్లో ఒకే సారి సందడి చేయనుంది. మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాష్ కుమార్ హీరో కాగా ముస్తఫా..ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా అంటూ తెలుగు రాష్టాల ప్రేక్షకులని తన మైకంలో పడేసిన హీరో అబ్బాస్ పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరియ రాజ్(Mariya raj)దర్శకుడు. మార్చి 27 రిలీజ్ డేట్.
Mar 21, 2026సింహం Vs నక్క.. శంబాల టీమ్ భారీ సోషియో ఫాంటసీ.. హీరో ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ వరుస విలక్షణమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రీసెంట్ గా 'ఊరు పేరు భైరవకోన', 'రాయన్' వంటి చిత్రాలతో విజయాలను అందుకున్న ఈ హీరో, ఇప్పుడు తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'శంబాల' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్ లో సింహం మరియు నక్కల మధ్య పోరాటాన్ని చూపిస్తూ పవర్, విధి, ఆధిపత్యం అనే అంశాలను హైలైట్ చేశారు. "సమ్ వార్స్ నెవర్ ఎండ్.. సమ్ కింగ్స్ నెవర్ డై" అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ సినిమా థీమ్పై భారీ అంచనాలను పెంచుతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించనున్నారు. 'శంబాల' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత అదే ప్రొడక్షన్ హౌస్ మరియు డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈసారి అంతకు మించిన గ్రాండియర్తో ఈ సోషియో ఫాంటసీని తెరకెక్కించబోతున్నారు. సందీప్ కిషన్ ఈ చిత్రంలో గతంలో ఎన్నడూ చూడని సరికొత్త గెటప్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. యాక్షన్కి ఫాంటసీ అంశాలను జోడించి పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్ మరియు రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మిగిలిన నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. 'శంబాలస టీమ్తో సందీప్ కిషన్ చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Mar 21, 2026
Niharika konidela: నీహారిక కొణిదెల విడాకులకి కారణం తెలిసింది.. ఇదే అసలు నిజం
-డైవర్స్ పై నోరు విప్పిన నీహారిక -ఇన్ని రోజులు ఎన్నో ఊహాగానాలు -వాటన్నిటికీ చెక్ -అసలు నిజం ఏంటి! హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ గా మారి హిట్ జర్నీని కొనసాగించడమంటే మాములు విషయం కాదు. అందుకు ఎన్నో గట్స్ ఉండాలి. పైగా ప్రెజెంట్ చాలా చిత్రాలు హిట్ అనే పదానికి డిస్టెన్స్ ని చాలా కాన్ఫిడెన్స్ గా మెయింటెన్ చేస్తూ వస్తున్నాయి. అలాంటిది నిహారిక కొణిదెల(Niharika konidela)'డెడ్ లైన్, కమిటీ కుర్రోళ్ళు తో విభిన్నమైన మేకర్ గా గుర్తింపు పొంది నిర్మాతగా సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలేంటో చూద్దాం. నీహారిక త్రీ ఇయర్స్ బ్యాక్ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపైనే ఆమె మాట్లాడుతు ఎవరు కూడా విడిపోవాలని పెళ్లి చేసుకోరు. కానీ మా మధ్య వచ్చిన విభేదాలు పరిష్కరించలేనివి. అందుకే విడిపోవాలని ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకోవడం మంచిధనిపించింది. విడాకులు నిర్ణయం తీసుకున్న వెంటనే నాన్నకి చెప్పాను. సైలెంట్ గా విన్నారు. వాళ్లు కూడా పెళ్లి తర్వాత నన్ను చూస్తూనే ఉన్నారు. నీ జీవితంలో నువ్వు సంతోషంగా లేవనుకున్నప్పుడు ఎక్కడా ఉండాల్సిన అవసరం లేదు అన్నారు. ఒకరినొకరు బాగా గొడవపడి విడిపోతే అది తొందరగా మరచిపోతాం. కానీ ఇలా విడిపోతే ఆ బాధ నుంచి బయటపడటం చాలా కష్టం. ఈ విషయంలో విడాకులు అనేవి ఇప్పుడు తీసుకుంటున్నది కాదు. ఎప్పటినుంచో ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత ఫ్రెండ్ గా అతనితో కాంటాక్ట్ లో కూడా లేనని నీహారిక చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి. Also read: Allu arjun: తిప్పండి మీసం.. అన్నిటికి సమాధానం చెప్పే రోజు వచ్చింది! తన అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే వచ్చే నెల ఏప్రిల్ మూడున 'రాకాసా' అనే మూవీతో నిర్మాతగా మరో సారి ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా చేస్తుండగా , మానస శర్మ(Manasa Sharma)దర్శకురాలు.
Mar 21, 2026మనసును తాకే సరికొత్త ప్రేమకథ ‘సాఫ్ట్ లవ్’.. ఓటీటీ ప్రియులకు పండగే
ఇటీవలికాలంలో థియేటర్లలో కంటే ఓటీటీలోనే సినిమాలు చూసి ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆడియన్స్ అభిరుచిని గమనించి వారి మనసులకు దగ్గరగా ఉండే సినిమాలను తీసుకొస్తున్నాయి. దేశీయ చిత్రాలనే కాకుండా వివిధ దేశాల్లో సూపర్హిట్ అయిన సినిమాలను ఓటీటీ ద్వారా అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు. అందులో భాగంగానే ఇప్ప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక సరికొత్త ప్రేమకథ స్ట్రీమింగ్ అవుతోంది. దక్షిణ ఆఫ్రికా, నైజీరియా సంస్కృతుల నేపథ్యంలో తెరకెక్కిన ‘సాఫ్ట్ లవ్’ ఇప్ప్పుడు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మనసును తాకే అందమైన కథతో ఈ చిత్రాన్ని అందరూ మెచ్చే విధంగా తెరకెక్కించారు. కథ విషయానికి వస్తే.. జెండీ జేలే అనే ఒక రిలేషన్షిప్ ఎక్స్పర్ట్, తన పెళ్లి రోజే తన కాబోయే భర్త చేతిలో మోసపోతుంది. ఆ అవమానంతో ప్రేమ మీద నమ్మకం కోల్పోయిన ఆమెకు, అనుకోకుండా ఎడ్వర్డ్ అనే ఫోటోగ్రాఫర్ పరిచయమవుతాడు. జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను మర్చిపోయి, ఈ ఇద్దరూ మళ్ళీ ప్రేమలో ఎలా పడ్డారు? వారి ప్రయాణంలో ఎదురైన అడ్డంకులేంటి? అనే అంశాలను దర్శకుడు హోమ్స్ అవా ఎంతో మనోహరంగా చూపించారు. నైజీరియా మరియు సౌత్ ఆఫ్రికాకు చెందిన నటీనటుల కలయికలో వచ్చిన ఈ చిత్రం, ఆయా ప్రాంతాల జీవనశైలిని మరియు విభిన్న సంస్కృతులను అందంగా ఆవిష్కరించింది. కేవలం ప్రేమ మాత్రమే కాకుండా, స్నేహం, నమ్మకం మరియు వ్యక్తిగత ఎదుగుదల వంటి అంశాలను కూడా ఇందులో చర్చించారు. గతంలో వచ్చిన పలు రొమాంటిక్ చిత్రాల తరహాలోనే ఇది కూడా ఒక ‘ఫీల్ గుడ్’ మూవీగా గుర్తింపు పొందుతోంది.
Mar 21, 2026
Allu arjun: తిప్పండి మీసం.. అన్నిటికి సమాధానం చెప్పే రోజు వచ్చింది!
-అల్లు అర్జున్ చిత్రాల కొత్త కబురు ఏంటి -అట్లీ మూవీ ఎక్కడ దాకా వచ్చింది -లోకేష్ కనగరాజ్ మూవీ అప్ డేట్ ఏంటి! -అభిమానులు ఏం కోరుతున్నారు హీరోలపై ఫ్యాన్స్ కి ఉండే అభిమానం చూస్తే మన రెండు కళ్ళు సరిపోవు. అంతలా తమ అభిమాన హీరోని ఆరాధిస్తారు. అలాంటి అభిమానులని పొందటం హీరోలకి ఆ దేవుడు ఇచ్చిన వరంగా కూడా భావించవచ్చు. అలాంటి హీరోల్లో పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కూడా ఒకరు. ప్రెజెంట్ అట్లీతో చేస్తున్న మూవీతో బిజీగా ఉన్నాడు. మరో క్రేజీ కాంబో లోకేష్ కనగరాజ్ మూవీ కూడా అనౌన్స్ చేసాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజుల నుంచి అభిమానులు స్పందిస్తు 'సదరు చిత్రాల అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండవచ్చు కదా! అట్లీ మూవీ నుంచి పిక్స్ రిలీజ్ చెయ్యచ్చు కదా! అని అడుగుతున్నారు. మేకర్స్ నుంచి స్పందన లేకపోయే సరికి ఆ అందరు సినీ అలకతో ఉన్నారు. అలాంటి వారందరి కోసం మా తెలుగు వన్ ఛానల్ ఎక్స్ క్లూజివ్ గా సమాచారాన్ని ఇస్తుంది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8 .. ఆ రోజున అట్లీ(Atlee Kumar)మూవీ నుంచి లుక్ రిలీజ్ కానుంది. దాంతో పాటు టైటిల్, రిలీజ్ డేట్ ఇతర తారాగణాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టుగా టాక్ . ఆల్ రెడీ ఇందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతునట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే రోజు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)మూవీ షూట్ కూడా మొదలుకానుందని సమాచారం. ఈ రెండు సినిమా విశేషాలే కాదు, అల్లు అర్జున్ లైనప్ లో ఉన్న మరిన్ని సినిమాల లిస్ట్ కూడా వెల్లడి చేసే అవకాశం ఉంది. దీంతో అల్లు అర్జున్ బర్త్ డే రోజున అభిమానుల జోష్ మరింత రెట్టింపు అవ్వడం ఖాయం. also read: Ustaad Bhagat Singh: 2 nd డే కలెక్షన్స్ ఇవేనా!.. హిట్టా! ప్లాపా! ఇప్పుడు తెలుగు వన్(Telugu One)సైట్ లో వస్తున్న ఈ న్యూస్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తెలుగు వన్ కి థాంక్స్ చెప్తున్నారు. సదరు లైనప్ తో రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ ని చెడుగుడు ఆడుకోవడం ఖాయం.
Mar 21, 2026‘ది రాజా సాబ్’ ప్రీమియర్స్ రచ్చ.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..!
- రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం.. - ప్రభాస్ సినిమాకు ఆ 5 కేసులు శాపమయ్యాయా? - రాజా సాబ్ రిలీజ్ రోజు జరిగిన హైడ్రామా ఇదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందిన 'ది రాజా సాబ్' చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుదలైన సమయం కంటే, అంతకు ముందు రోజు రాత్రి జరిగిన ‘పెయిడ్ ప్రీమియర్స్’ రచ్చ టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా తెలంగాణలో ప్రీమియర్ షోల విషయంలో నెలకొన్న గందరగోళంపై తాజాగా మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధి శశి స్పందించారు. నిజానికి 'ది రాజా సాబ్' ప్రీమియర్స్ కోసం నైజాం ఏరియాలో భారీ ఏర్పాట్లు జరిగాయి. కానీ చివరి నిమిషంలో షోలు రద్దు కావడం, టికెట్ రేట్లపై స్పష్టత లేకపోవడంతో థియేటర్ల వద్ద అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ రాత్రి ఏం జరిగిందనే దానిపై క్లారిటీ ఇస్తూ.. ఆ సమయంలో కోర్టులో ఐదు కేసులు పెండింగ్లో ఉన్న విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని శశి పేర్కొన్నారు. ఆ కేసులను క్లియర్ చేసి, డాక్యుమెంటేషన్ పూర్తి చేసేసరికి సమయం మించిపోయిందని ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయని ఆశించినప్పటికీ, కోర్టు ఉత్తర్వుల కాపీలు చేతికి అందేసరికి బుధవారం రాత్రి అయ్యిందని శశి తెలిపారు. దీంతో గురువారం ఉదయం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, జీవో రావడంలో జాప్యం జరిగిందని చెప్పారు. "అధికారులు వస్తుందని చెబుతున్నా, సాంకేతిక కారణాల వల్ల అది లేట్ నైట్ అయింది. స్టార్ హీరో సినిమా కావడంతో రిస్క్ తీసుకోలేక షోలు రద్దు చేయాల్సి వచ్చింది" అని ఆయన ఆనాటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రంపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ కొండంత ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ను వింటేజ్ లుక్లో చూపిస్తామని మేకర్స్ ఇచ్చిన హామీతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, ప్రీమియర్స్ సమయంలో జరిగిన ప్లానింగ్ లోపం వల్ల అభిమానులు థియేటర్ల వద్ద నానా హంగామా చేశారు. విమల్ థియేటర్ వంటి ప్రధాన కేంద్రాల్లో పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రభాస్ నటించిన 'సలార్', 'కల్కి' వంటి చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చిన నేపథ్యంలో, 'రాజా సాబ్' కూడా అదే రేంజ్లో వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు ఆశించాయి. కానీ ఈ ప్రీమియర్ షోల ఎఫెక్ట్ సినిమా టాక్పై కూడా కొంత ప్రభావం చూపిందని ఇండస్ట్రీ టాక్. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, రాబోయే పెద్ద సినిమాల విషయంలో కనీసం రెండు వారాల ముందే అనుమతులు పొందేలా జాగ్రత్తలు తీసుకుంటామని శశి వెల్లడించారు. ప్రస్తుతం ఈ గందరగోళం ముగిసినా, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆ 'కాళరాత్రి'ని అంత సులభంగా మర్చిపోలేకపోతున్నారు. మరోవైపు ప్రభాస్ తన తదుపరి చిత్రాలైన 'సలార్2', 'స్పిరిట్' పనుల్లో బిజీగా ఉండగా, మారుతి తన తర్వాతి ప్రాజెక్టుపై దృష్టి సారించారు.
Mar 21, 2026
Thadayam Web Series Review: తడయం వెబ్ సిరీస్ రివ్యూ
నటీనటులు: సముద్రఖని, శివదా, రాజ్ తిరందాస్, సుందర్ పాండియన్, మున్నార్ రమేశ్ తదితరులు ఎడిటింగ్: దినేశ్ కుమార్ మ్యూజిక్: విబిన్ భాస్కర్ సినిమాటోగ్రఫీ: కేకే నిర్మాతలు: అజయ్ కృష్ణ రచన, దర్శకత్వం: నవీన్ కుమార్ పళనివేల్ ఓటీటీ : జీ 5 ఓటీటీ ప్రేక్షకులకు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లపై ఎప్పుడూ ఆసక్తే ఉంటుంది. ఆ క్యూరియాసిటీని మరింత పెంచుతూ ఓటీటీ ప్లాట్ఫామ్ 'జీ 5' లో స్ట్రీమింగ్ అవుతున్న ఇంట్రెస్టింగ్ సిరీస్ 'తడయం'. సముద్రఖని, శివదా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథేంటో ఓ సారి చూసేద్దాం. కథ: ఆంధ్ర - తమిళనాడు సరిహద్దులోని ఒక గ్రామం అది. అక్కడ పోలీస్ స్టేషన్ లో అధియమాన్ (సముద్రఖని) ఎస్.ఐ.గా పనిచేస్తుంటాడు . 20 ఏళ్లలో అతనికి ఎప్పుడూ ఎలాంటి ప్రమోషన్స్ రావు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నా, తనకేమీ పట్టనట్టుగా అతను వ్యవహరిస్తుంటాడు. ఎప్పుడు చూసిన అతను 'టీ' కొట్లోనే కూర్చుని ఉంటాడనే ఒక విమర్శ ఉంటుంది. త్వరలో అతను వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉంటాడు. ఆ సమయంలోనే అతని పైఅధికారిగా కొత్తగా డ్యూటీలో చేరుతుంది లక్ష్మీ (శివదా). అధియమాన్ ధోరణి శివదాకి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హత్య కేసుల విషయంలో కూడా అతను కూల్ గా వ్యవహరించడంపై మండిపడుతుంది. అయితే అధియమాన్ చాలా తెలివైనవాడని , అతను ఏ విషయానికీ పెద్దగా చెలించకపోవడానికి కారణం ఉందని ఓ పోలీస్ ద్వారా లక్ష్మీ తెలుసుకుంటుంది. అదే సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస హత్యలు జరుగుతుంటాయి. కొత్తగా డ్యూటీలోకి చేరిన లక్ష్మీ ఈ మిస్టరీని ఛేదించాలని అధియమాన్ ను తన టీమ్ లోకి తీసుకుంటుంది. వరుసగా జరుగుతున్న హత్యలపై అతని అభిప్రాయం అడుగుతుంది. అప్పుడు అధియమాన్ ఏం చెప్తాడు? హంతకులు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నారనేది మిగతా కథ. విశ్లేషణ: తడయం అంటే క్లూ.. అంటే ఒక్కో క్రైమ్ కి ఒక్కో క్లూ ఉంటుంది. దానిని పోలీసులు కనిపెట్టారా లేదా అని ఈ సిరీస్ లో ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు ఎపిసోడ్ లు ఉన్నాయి. ఈ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ పద్దెనిమిది నుండి ఒరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది. ఆరు ఎపిసోడ్ లు కలిపి మొత్తంగా నిడివి రెండు గంటల ఏడు నిమిషాలు. ఇదొక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్. ఎక్కడా కమర్షియల్ హంగులకి వెళ్ళకుండా కథని వాస్తవికతకు దగ్గరగా చూపించారు. సిరీస్ లో అక్కడక్కడా కొంత రక్తపాతం సీన్లు ఉంటాయి. అయితే ఆ రక్తపాతం సీన్లు క్రైమ్ ఎలా జరిగిందనే పాయింట్ ని వివరిస్తూ తీసారు కాబట్టి అది ఒకే అనిపిస్తే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. తక్కువ అంచనాలతో ఈ సిరీస్ ని చూస్తే మంచి క్రైమ్ థ్రిల్లర్ ని చూసిన ఫీలింగ్ వస్తుంది. సిరీస్ ని కాస్త స్లోగా మొదలు పెట్టిన దర్శకుడు.. ప్రతీ ఎపిసోడ్ కి ఒక్కో క్లూని చూపిస్తూ నెక్స్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందోననే క్యూరియాసిటీని రేకెత్తించాడు. అయితే కేస్ ఇన్వెస్టిగేషన్ ని ఇంకాస్త ఎంగేజింగ్ గా గ్రిప్పింగ్ గా తీస్తే బాగుండేది. ముఖ్యంగా నేరస్తుడు ఎవడో తెలిసాక కూడా సీన్లు రిపీటెడ్ గా వస్తుంటాయి. వాటిని తగ్గించి , విలన్ తో హీరో డైలాగ్స్ ఇంకాస్త ఆడ్ చేస్తే ఇది బెస్ట్ థ్రిల్లర్ గా నిలిచిపోయేది. అయితే కథా వస్తువు బాగుంది. ఫ్రెష్ ఫీల్ ని తెప్పించేలా కథని మలిచారు దర్శకుడు. కేకే సినిమాటోగ్రఫీ, విబిన్ భాస్కర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ థ్రిల్లర్ కు మరింత బలాన్ని చేకూర్చాయి. అసభ్య పదజాలం వాడలేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడల్ట్ సీన్లు లేవు. మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిడివి కూడా తక్కువే కాబట్టి ఈ వీకెండ్ కి హ్యాపీగా చూసేయొచ్చు. నటీనటుల పనితీరు: సముద్రఖని నటన మరోసారి ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. కళ్ళతోనే భావాలు పలికించడం ఆయన ప్రత్యేకత. ఇక శివద సపోర్టింగ్ క్యారెక్టర్ కాకుండా ఇన్వెస్టిగేషన్ లో కీలకపాత్ర పోషించారు. మిగతా వారు తమ పాత్రలకి న్యాయం చేశారు. ఫైనల్ గా : మస్ట్ వాచెబుల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రేటింగ్: 2.75 / 5 ✍️. దాసరి మల్లేశ్
Mar 21, 2026
Ustaad Bhagat Singh: 2 nd డే కలెక్షన్స్ ఇవేనా!.. హిట్టా! ప్లాపా!
-థియేటర్స్ వద్ద కొనసాగుతున్న ఉస్తాద్ హంగామా -టాక్ పరిస్థితి ఏంటి -సెకండ్ డే ఎంత! పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఉస్తాద్ భగత్ సింగ్'(UStaad Bhagat singh)రాకతో 'ఉగాది శోభ' థియేటర్స్ కి కూడా వచ్చిన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఉస్తాద్ అదే టైంలో కొద్దిగా నెగిటివ్ టాక్ ని కూడా అందుకుంది. కానీ నిన్న రెండవ రోజు ఫ్యామిలీ ఆడియన్స్ ఉస్తాద్ బాట పట్టారు. ఇప్పుడు వాళ్లంతా క్లీన్ మాస్ ఎంటర్టైనర్ అనే టాక్ ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఉస్తాద్ రెండు రోజు కలెక్షన్స్ ఎంతో చూసేద్దాం. ఉస్తాద్ రెండు రోజులకి వరల్డ్ వైడ్ గా 65 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ సర్కిల్స్ వ్యక్తం చేస్తున్నాయి. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా 52 కోట్ల గ్రాస్ ని సాధించినట్టుగా అదే ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేసాయి. అలాంటిది సెకండ్ డే 13 కోట్లు మాత్రమే రాబట్టడం అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో టోటల్ లోన్ రన్ లో ఎంత వసూళ్లు రాబడుతుందనే ఆసక్తి అందరిలో ఉంది. also read: Dhurandhar 2: ధురంధర్ 2 పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. వారణాసి వస్తుంది కదా మర్చిపోరులే నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ అయితే సుమారు 150 కోట్ల బడ్జెట్ తో ఉస్తాద్ ని రూపొందించింది. హరీష్ శంకర్(Harish Shankar)టేకింగ్ కి మంచి పేరు వస్తుండటంతో పాటు శ్రీలీల, రాశి ఖన్నా, కె ఎస్ రవికుమార్, రావు రమేష్, పార్తీబన్ పెర్ ఫార్మెన్సు , థమన్ బిజిఏం, దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కి మంచి పేరు వస్తుంది.
Mar 21, 2026
Dhurandhar 2: ధురంధర్ 2 పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. వారణాసి వస్తుంది కదా మర్చిపోరులే
-ధురంధర్ 2 ని చూసిన రాజమౌళి -నచ్చిందా! నచ్చలేదా! -రాజమౌళి రివ్యూలో ఏముంది ధురంధర్ 2(Dhurandhar 2).. ఇప్పుడు ఇండియా వైడ్ గా ఎక్కడ చూసినా ఇదే సౌండ్ సర్క్యులేట్ అవుతూ వస్తుంది. పైగా ఈ రోజు నుంచి తెలుగు వెర్షన్ థియేటర్స్ లో ప్రత్యక్షమవ్వడంతో థియేటర్స్ అన్ని ధురంధర్ తెలుగు ఫ్యాన్స్ తో ఫుల్ రష్ గా ఉన్నాయి. ఇక పార్ట్ 2 గురించి ఎన్టీఆర్(Ntr),అల్లు అర్జున్(Allu Arjun),మహేష్ బాబు(Mahesh Babu)వంటి స్టార్స్ సైతం సినిమా సూపర్ గా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ కోవలోనే ఆస్కార్ విన్నర్ దర్శక ధీరుడు రాజమౌళి(Ss Rajamouli)ధురంధర్ 2 గురించి ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. మరి రాజమౌళి రివ్యూలో ఏముందో చూద్దాం. నాకు ధురందర్ 1 చాలా నచ్చింది, కానీ పార్ట్ 2 పరిమాణంలోను, ఆత్మలోను పార్ట్ 1 ని మించిపోయింది. రచన, నటీనటుల ఎంపిక, సాంకేతిక నైపుణ్యం, సంగీతం,సన్నివేశాల రూపకల్పన, దర్శకత్వం అన్నీ ఎలాంటి కల్మషం లేనివిగా కుదిరాయి. కానీ భావోద్వేగభరితమైన అంశాలు మూవీకి అసలైన ఆధారాన్ని ఇచ్చాయి. నిజమైన ఉత్కంఠని సృష్టించేలా కథలో మలుపులని కూడా అద్భుతంగా అల్లింది. ఆదిత్య ధర్ గారు దర్శకుడిగా అదరగొట్టారు. 4 గంటల నిడివితో రిలీజ్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. అలాంటిది మూవీ చూస్తున్నంత సేపు ఫస్ట్ ఫ్రేమ్ టూ చివరి ఫ్రేమ్ వరకు సీట్లకి అతుక్కుపోతాం. స్నేహితుడు రణవీర్ అద్భుతమైన పెర్ఫార్మ్ కనపరిచాడు. స్టార్టింగ్ లో తన సోదరితో చేసిన సన్నివేశంలో అయితే మాస్టర్ క్లాస్ పెర్ఫార్మ్. అది మొదలు హార్ట్ ని పిండేసే క్లైమాక్స్ వరకు, హంజా, జస్కిరత్గా రణవీర్ మంత్రముగ్ధులని చేసాడు. Also read: Dhurandhar 2: ధురంధర్ 2 విసుగు పుట్టించే సినిమా.. మీ డబ్బు వృధా చేసుకోవద్దు మాధవన్ గారు తన క్యారక్టర్ ద్వారా దేశం యొక్క నిస్సహాయతని, నిరాశని ఎంతో అద్భుతంగా ప్రదర్శించారని రాజమౌళి తన ఎక్స్ వేదికగా తెలిపాడు. ఇప్పడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు స్పందిస్తు 'మరి మీరు కూడా 'వారణాసి'(Varanasi)ని ధురంధర్ 2 ని మించే పోయేలా చిత్రీకరించి ఇండియన్ సినిమా కీర్తిని మరోసారి వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద చాటి చెప్పాలనే కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. https://x.com/ssrajamouli/status/2035210972089262351?s=20
Mar 21, 2026
Dhurandhar 2: ధురంధర్ 2 విసుగు పుట్టించే సినిమా.. మీ డబ్బు వృధా చేసుకోవద్దు
-పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్ 2 -కానీ రమ్య ఇచ్చిన రివ్యూ వైరల్ -తన రివ్యూలో ఏముంది మనుషులే అందరకి అందరు నచ్చరు. అలాంటిది సినిమాలది ఏముంది చెప్పండి. నచ్చే వాళ్లకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు. కానీ అంతిమంగా మెజారిటీ ప్రేక్షకుల మౌత్ టాక్ నే ప్రధానం. అనాదిగా వస్తున్న ఆ మెజారిటీ ప్రేక్షకుల నిర్ణయానికే బాక్స్ ఆఫ్ ఆఫీస్ తలవంచి రికార్డు కలెక్షన్స్ ని అందచేస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా విడుదలైన ధురంధర్ 2 కి మెజారిటీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ బజ్ వస్తుండటంతో కలెక్షన్స్ ఏ మేర వస్తాయనే ఆత్రుతతో అందరు ఎదురుచూస్తున్నారు. అలాంటి ఈ టైం లో అసలు ధురంధర్ 2 బాగోలేదు.వేస్ట్ సినిమా అని ప్రముఖ నటి రమ్య చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఆమె పోస్ట్ లో ఏముందో ఒకసారి చూద్దాం. ఎక్స్ వేదికగా రమ్య(Ramya)స్పందిస్తు 'ఇప్పుడే ధురందర్ 2(Dhurandhar 2)చూశాను, వావ్! ఆశాజనకంగా ఉన్న మూవీని సహనపరీక్షగా ఎలా మార్చవచ్చో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ధురంధర్ 2 చూస్తున్నంత సేపు అంతులేని అధ్యాయాలతో ఉన్న అత్యంత విసుగు పుట్టించే పాఠ్యపుస్తకాన్ని చదివినట్లుగా ఉంది. ఒకానొక దశలో, మీ కళ్ల ముందు జరుగుతున్న అఘాయిత్యాన్ని చూసి, మీ మెదడు ఇక ఏమీ చేయలేక నిరాశతో నవ్వడం మొదలుపెడుతుంది. మీరు నిజంగా ఈ సినిమా చూడాలనుకుంటే, దయచేసి థియేటర్లో మీ సమయాన్ని, డబ్బుని వృధా చేసుకోకండి. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో చూస్తేనే ఉత్తమంగా ఉంటుంది. దర్శకత్వం, సంభాషణలు, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటన అన్నీ నాసిరకంగానే ఉన్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు పడకుండానే హడావిడిగా సినిమాని రిలీజ్ చేశారేమో అనిపిస్తుంది. ధురందర్ పార్ట్ 1లో జనం కేరింతలు కొడుతూ, చప్పట్లు కొడుతూ, ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఒక ఎనర్జీ ఉంది. ప్రేక్షకులు అందులో లీనమయ్యారు. పార్ట్ 2 లో మాత్రం ఆడియన్స్ దేన్నీ పట్టించుకోలేదు. థియేటర్లో ఉన్న వారందరి సామూహిక నిరాశని మీరు స్పష్టంగా చూసి అనుభూతి చెందవచ్చు. మూవీ మొత్తాన్ని రణ్వీర్ మోస్తున్నాడని చెప్పే ప్రతి ఒక్కరికీ-అసలు అతను ఏమి మోస్తున్నాడు? ఎందుకంటే నాకు కనిపించిందల్లా అతని జుట్టే. మొదటి భాగంలో, అతని జుట్టుకు ఒక వ్యక్తిత్వం, ఆకర్షణ, ఒక ప్రత్యేకత ఉండేవి. ఈ భాగంలో, అది ఊరికే ఉంది. సన్నివేశాలని బ్లాక్ చేస్తూ ప్రతీదానికి అడ్డుగా ఉంది. బహుశా సహాయ నటుడి నామినేషన్కు అర్హమైనదేమో. ఇక ఆ హింస. ఇది ఒక సినిమా కాదు, ఇది ప్రాథమికంగా చుట్టూ పడి ఉన్న ఏ వస్తువుతోనైనా ఎంత సృజనాత్మకంగా హింసను సృష్టించవచ్చో చూపించే ఒక దృశ్య మార్గదర్శి. సిరంజి వాడారు. స్పానర్ వాడారు. కత్తులు, ముళ్ల బంతులు, కొడవళ్లు, గొలుసులు, తుపాకులు, బాంబులు, బాజూకాలు, షట్టర్లు - మీరు ఏది చెప్పినా, దాన్ని ఆయుధంగా మార్చేశారు. గత సన్నివేశం కంటే తర్వాతి సన్నివేశాన్ని మరింత హింసాత్మకంగా హాస్యభరితంగా ఎలా చేయాలి? అని దర్శకుడు తనతో తానే నిరంతరం పోటీ పడుతున్నట్లు అనిపిస్తుంది. అది షాకింగ్గా ఉండటం మానేసి, నవ్వు తెప్పించే స్థాయికి చేరుకుంటూనే ఉంటుంది'' also read: Dhurandhar 2: ధురంధర్ 2 పై శంకర్ షాకింగ్ కామెంట్స్.. శంకర్ డైరెక్ట్ చేసే ఎలా ఉండేదో! మీరు రెండు కాళ్ళూ నరికేసి, మొండెం మీద కిరోసిన్ పోసినా కూడా, ఆ వ్యక్తి ఏదో టెడ్ టాక్ మధ్యలో ఉన్నట్టుగా డైలాగులు చెబుతూనే ఉన్నాడు. మెడికల్ సైన్స్ జిందాబాద్. ఆస్కార్ సంగతి మర్చిపోండి, నోబెల్ బహుమతి రాబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ధురందర్ 2 ఒక పెద్ద నిరాశపరిచే సినిమా. ఇది ఒక బోరింగ్ కామెడీ. మొదటి భాగం మిమ్మల్ని నవ్వించి ఉంటే, ఈ భాగం చూశాక 'ధురందర్ 2 ఎందుకు?' అని ప్రశ్నించుకుంటారు. రణ్వీర్, నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు. ఆదిత్య ధర్.. మీ మితిమీరిన జాతీయవాదం, ప్రొపగాండా పాతబడిపోయాయి. వాటి నుంచి బయటకు రండి'' అని ప్రియ తన పోస్టులో రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ సుదీర్ఘ పోస్ట్ ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. కన్నడ చిత్ర సీమలో ఒక వెలుగు వెలిగిన రమ్య కర్ణాటకలోని మాండ్య పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరుపున ఎంపీ గా ప్రాతినిధ్యం వహించింది. తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన అభిమన్యు అనే చిత్రం ద్వారా పరిచయమయ్యింది. ఈ ఏడాది జనవరిలో ఉపేంద్రతో కలిసి రక్త్ బ్రహ్మాండ్ లో చేసింది. https://x.com/divyaspandana/status/2034864618456432777?s=20
Mar 21, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



