ajmal kasab hanged death

కసబ్ ఉరిని పాక్ కు ప్యాక్స్ చేశాం : షిండె

    ముంబై మరణ మరణహోమంలో సజీవంగా పట్టుబడ్డ పాక్ జాతీయుడు అజ్మల్ కసబ్ ఉరిశిక్ష అమలు చేసినట్లు కేంద్ర హో౦మంత్రి సుశీల్ కుమార్ షిండె తెలిపారు. మరణ శిక్షపై కసబ్ పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ ను తిరస్కరిస్తూ రాష్ట్రపతి తనకు పంపినట్లు వెల్లడించారు. పిటిషన్ తిరస్కరణ అనతరం పూణే లోని ఎర్రవాడ జైలులో ఉరిశిక్ష అమలు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వానికి చేరవేసినట్లు చెప్పారు. కసబ్ మృతుదేహం పంపమని ఆ దేశం కోరలేదని పేర్కొన్నారు. ఉరిశిక్ష రహస్యంగా అమలు చేయడం తప్పనిసరని చెప్పారు. 26/11 ముంబాయి దాడులకు సంబంధించి న్యాయ విచారణ పూర్తియినట్లు వెల్లడించారు.

Mamata no trust motion

మమతా అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వం

  యూపీఏకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాను అంటున్న మమతకు మద్దతు ఇవ్వడానికి సీపీఎం ఒప్పుకోవడం లేదు. ఈ మేరకు సీపీఎం నాయకుడు ప్రకాశ్ కారత్ ఈ విషయాన్ని ప్రకటించాడు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంపై మమతా బెనర్జీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని కారత్ స్పష్టం చేశాడు. ఎఫ్ డీఐలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టబోతున్న అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకునేందుకు మమత అన్ని పార్టీల నాయకులను స్వయంగా కలుస్తోంది. ఇప్పటికే సీపీఐ మమత తరపున ఓటింగ్ లో పాల్గొంటామని ప్రకటించింది. మమత పెట్టే అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు ఉంటుందని తెలిపింది. అయితే సీపీఎం మాత్రం అందకు సమ్మతించడం లేదు. ఇక బీజేపీ ఈ విషయంపై చర్చించాలని ఇది వరకే ప్రకటించింది. ఒకవేళ బీజేపీ అవిశ్వాసానికి అనుకూలంగానే నిలబడ్డా…ఎస్సీ, బీఎస్పీల చేతిలోనే అవిశ్వాస తీర్మానం ఊపిరి ఉంటుంది. వారు అనుకుంటే యూపీఏను దింపడం పెద్ద విషయం కాదు.

teen rape claim

రేప్ చేయబోయిన వ్యక్తి నాలుక కొరికేసింది

  తనపై అత్యాచారం చేయబోయిన ఓ యువకుడి నాలుకను కొరికేసింది ఓ యువతి. ఉత్తర ప్రదేశ్ లోని బర్తానా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కైలాష్ బహేలియా అనే యువకుడు పదిహేడేళ్ల ఓ యువతి ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ యువతి తనను తాను రక్షించుకునేందుకు ఆ యువకుడి నాలుకను తన పళ్లతో రెండు ముక్కలుగా కొరికేసింది. రక్తం కారుతున్న నాలుకతో ఆ యువకుడు వెంటనే బయటకు పరుగెత్తాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. నాలుకలోని కొద్ది భాగం తెగిపోయందని, ఆ యువకుడు జీవితాంతం స్పష్టంగా మాట్లాడలేడని వైద్యులు తెలిపారు. నాలుక కొరికనందుకు పశ్చాత్తాప పడటం లేదని, తప్పని పరిస్థితుల్లోనే అలా చేశానని ఆ యువతి పేర్కొంది.

gujarat elections 2012

గుజరాత్ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్

      గుజరాత్ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ ని ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొదటి దశలో డిసెంబర్ 13న రాష్ట్రంలో 87 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయ్. అభ్యర్ధులు ఈ నెల 24లోగా నామినేషన్లు సమర్పించాల్సుంటుంది.   అధికార బిజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఇంకా అభ్యర్ధుల్ని ఖరారు చేయనేలేదు. కాంగ్రెస్ అభ్యర్ధుల తుది జాబితాని తయారుచేసేందుకు గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అభ్యర్ధుల ఎంపికలో తలమునకలైన బిజెపి కొన్ని పేర్లని అధిష్టానం పరిశీలనకోసం పంపింది.   గుజరాత్ ఎన్నికలకోసం ఈసీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. పెద్దఎత్తున భద్రతా బలగాల్ని దించుతోంది. తొలిసారిగా రిటర్నింగ్ అధికారులు ప్రత్యేక పరీక్షని రాయబోతున్నారు. నవంబర్ 23న రెండోదశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది.   ప్రచారపర్వంలో ముందంజలో ఉండేందకు బిజెపి తొలిసారిగా త్రీడీ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పోటోని త్రీడీ ఫార్మేట్ లో సభావేదికలమీదికి తీసుకొచ్చేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల మోడీ పూర్తిగా జనం మధ్యలోనే ఉన్నరన్న భావనని కలిగించేందుకు బిజెపి ఈ ఏర్పాట్లు చేస్తోంది.

Mamata Banerjee UPA

యూపీఏను దించేస్తాం: మమత

      యూపీఏ 2 ప్రభుత్వాన్ని పడగొట్టి తీరతామని తృణమూల్ నేతలు తొడగొడుతున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వ్యవహారంలో గుర్రుగా ఉన్న తృణమూల్ అధినేత్రి మమత కేంద్ర ప్రభత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు శక్తిని కూడగట్టుకుంటున్నారు.   పార్టీలన్నీ మద్దతిస్తే యూపీఏ 2 ప్రభత్వం కూలిపోవడం ఖాయమని మమత జోస్యం చెబుతున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే వామపక్ష నేతలతో సంప్రదింపులు జరిపిన మమతా దీదీ బీజేపీ సపోర్ట్ ని కూడా తీసుకునేప్రయత్నం చేస్తున్నారు.     వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాల్లో చిక్కుకు పోయిన యూపీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని అమ్మేస్తోందని తృణమూల్ అధినేత్రి మమత ఆరోపించారు. అవిశ్వాసంపై మమత తీవ్రంగా స్పందించినా కాంగ్రెస్ నేతలు మాత్రం లైట్ తీస్కుంటున్నారు. 2014 వరకూ యూపీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం ఖాయమని తేల్చి చెబుతున్నారు.  

 Rahul gandi ec

రాహుల్ గాంధీపై ఈసీ విచారణ

      ఆస్తులకు సంబంధించి ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీపై విచారణకు ఆదేశించింది. అమేథీ లోక్ సభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి లేఖ రాసింది. జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈసీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.   సుబ్రమణ్య స్వామి ఇచ్చిన ఫిర్యాదు కాపీని రిటర్నింగ్ అధికారికి పంపించాలని ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ అధికారిని ఆదేశించింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 195 ప్రకారం అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఉందని రిటర్నింగ్ అధికారి భావిస్తే చర్యలు తీసుకునే వీలుంటుంది.   2009 లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఈసీ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో అసోసియేట్ జర్నల్స్ లో రాహుల్ గాంధీ తనకున్న పేర్లని పేర్కొనలేదని సుబ్రమణ్యస్వామి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోనియా, రాహుల్ గాంధీలు పెద్దఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడ్డారనికూడా గతంలో సుబ్రమణ్యస్వామి ఆరోపించారు.

Delhi student died

ఢిల్లీ వర్సిటీ విద్యార్ది ఆత్మహత్య

    ఢిల్లీ విశ్వవిద్యాలయంలో 21 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ది శివశేఖర్ తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శేఖర్ ది బీహార్ లోని నలంద జిల్లా.. విశ్వవిద్యాలయం ఆవరణలోని హిందూ కాలేజ్ హాస్టల్లో 112వ నెంబర్ గదిలో శేఖర్ ఒక్కడే ఉంటున్నాడని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.   శేఖర్ ఉరేసుకుని ఉండడాన్ని గమనించిన తోటి విద్యార్దులు శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో చూసి హాస్టల్ వార్డెన్ కి సమాచారం అందించడంతో విషయం వెలుగులోకొచ్చింది. శివ శేఖర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉత్తర ఢిల్లీలోని హిందూ రావు ఆస్పత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.     శివ శేఖర్ గది నుంచి పోలీసులు క్లాస్ లెక్చర్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాంట్లోని ఓ పేజీలో ఇది నా జీవితం అని రాసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Rahul gandi Sonia gandi

కాంగ్రెస్ ముందస్తు ఎన్నికల కసరత్తు

  ప్రతిపక్షాల్ని అదనుచూసి దెబ్బతీసేందుకు ముందస్తు ఎన్నికలే సరైన మార్గమని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా హస్తినలో ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో వేగంగా మారిపోతున్న పరిణామాలుకూడా ముందస్తు ఎన్నికలకు సంబంధించిన సూచనలు చేస్తున్నాయని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయ్. ములాయం, మాయావతిలపై ఎక్కువకాలం ఆధారపడడం మంచిదికాదని భావిస్తున్న యూపీయే అధినేత్రి సోనియా ముందస్తు ఎన్నికల కసరత్తుని మొదలుపెట్టేశారని పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ములాయం ముందస్తుగా లోక్ సభ ఎన్నికలకు తన పార్టీ అభ్యర్ధుల్ని ప్రకటించడంతో హడావుడి మరింత ఎక్కువయ్యింది.   రాహుల్ గాంధీ త్వరలోనే అతి పెద్ద బాధ్యతని చేపడతారంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన ప్రకటనకూడా ముందస్తు ఎన్నికల సన్నాహాల్ని తలపిస్తోంది. పార్టీ తరఫున కీలక బాధ్యతల్ని స్వీకరించేందుకు రాహుల్ సన్నద్ధం చేస్తున్న సీనియర్లు, సోనియా తనయుడిని ప్రథాని కుర్చీలో కూర్చోబెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు.   వచ్చే ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఢిల్లీ శాసన సభలకు జరగబోయే ఎన్నికలతోపాటుగా లోక్ సభ ఎన్నికలుకూడా జరిపితే బాగుంటుందన్న ఆలోచన కాంగ్రెస్ అధినేత్రి సోనియా చేస్తున్నట్టు సమాచారం. పరిస్థితిని అంచనా వేసేందుకు, గెలుపు గుర్రాల్ని నిర్ణయించేందుకు ఇప్పటికే 50 మంది సభ్యుల రాహుల్ సేన దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో సర్వే చేపట్టింది.

Aung San Su Kyi met Manmohan

ఆంగ్ సాన్ సూకీ బిజీ బిజీ షెడ్యూల్

    భారత్ – మియన్మార్ దేశాలమధ్య ప్రజాస్వామ్య పోరాటం విషయంలో సారూప్యత ఉందని ఆంగ్ సాన్ సూకీ అన్నారు. నెహ్రూ విశ్వవిద్యాలయంలో చేసిన స్మారకోపన్యాసంలో ఆమె ఈ విషయాల్ని ప్రస్తావించారు. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ అంటే తనకి చాలా ఇష్టమని ఆమె చెప్పారు.     ఆరురోజుల భారత పర్యటనలో భాగంగా ఆంగ్ సాన్ సూకీ భారత ప్రథాని మన్మోహన్ సింగ్ ని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. మియన్మార్ కష్టాల్లో ఉన్నప్పుడు భారత్ పట్టించుకోకపోవడం తనకి చాలా బాధకలిగించిందని ఆమె చెప్పుకొచ్చారు. ఇకపై భారత్ తమకి అన్ని విషయాల్లోనూ అండగా ఉంటుందన్న ఆశని వ్యక్తం చేశారు.  

Kavoori sambasivarao

మన్మోహన్ తో కావూరీ భేటీ - తీరని అలక

    కేంద్రమంత్రివర్గ విస్తరణలో తనని నిర్లక్ష్యం చేసినందుకు అలిగి రాజీనామా చేసిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావ్ ఏమాత్రం వెనక్కి తగ్గడానికి ఇష్టపడడంలేదు. రాజీనామా విషయమై కావూరిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.   కావూరితో భేటీ అయిన ప్రథాని ఎన్నో విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కావూరి మాట వినలేదు. ప్రథాని మన్మోహన్ దగ్గర తన మనస్తాపాన్ని ఆయన పూర్తిగా బైటపెట్టారని పార్టీవర్గాలు చెబుతున్నాయ్. ప్రథానితో సమావేశానికి సంబంధించిన వివరాల్ని తాను బైటికి చెప్పలేనంటూ కావూరి మాట దాటేశారు.   భవిష్యత్ కార్యాచరణపై కావూరి ఇంకా ఓ నిర్ణయం తీసుకోనప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానంపై ఈ సారి చాలా గట్టిగానే అలిగినట్టు తెలుస్తోంది. ఎన్నోఏళ్లుగా పార్టీకి అండగా నిలబడ్డ తనని కాదని జూనియర్లకి పెద్దపీట వేయడమేంటని కావూరి నేరుగా ప్రథానమంత్రిని ప్రశ్నించినట్టు సమాచారం.   తనకి మంత్రిపదవి దక్కకపోవడంకంటే ఎన్టీఆర్ తనయ పురధేశ్వరికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్రమంత్రి పదవిని ఇవ్వడం కావూరికి ఎంతమాత్రమూ నచ్చలేదన్నది పార్టీలో సీనియర్ల మాట. పార్టీకి కష్టకాలంలో అండగా నిలబడినందుకు చాలా మంది బహుమతే లభించిందంటూ కావూరి సన్నిహితుల దగ్గర అసంతృప్తిని వెళ్లగక్కిన విషయం తెలిసిందే.  

Rape of minor girl| Minor girl gang raped| Minor girl raped|  girl raped uttar pradesh

ఎమ్మెల్యే కొడుక్కి కామరోగం

  యూపీలో ఓ ఎమ్మెల్యే కొడుకు అభం శుభం ఎరుగని మైనర్ ని ఎత్తుకెళ్లి మానభంగం చేశాడు. బీఎస్పీ ఎమ్మెల్యే మౌలానా జమీల్ కొడుకు గారి ఘనకార్యం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఎమ్మెల్యే కొడుకు, బావమరిది, మరో వ్యక్తి కలిసి పదిహేడేళ్ల బాలికను బలవంతంగా అడవిలోకి ఎత్తుకెళ్లిమరీ సామూహిక అత్యాచారం జరిపారట. ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించి వదిలిపెట్టారట. భయపడిపోయిన బాధితురాలు తనకి జరిగిన అన్యాయం గురించి తల్లిదండ్రులక్కూడా ఆలస్యంగా చెప్పింది. వెంటనే వాళ్లు ఠానాకి పరిగెత్తికెళ్లి జమీల్ కొడుకు నౌమన్ మీద రిపోర్టిచ్చారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించారు. ముగ్గురు నిందితులపై చాలా సెక్షన్లమీద కేసులు నమోదు చేశారుకానీ.. వాళ్లని అరెస్ట్ చేయలేదు.  తనని రాజకీయంగా దెబ్బతీసేందుకు ఎవరో పన్నిన కుట్ర ఇది అంటూ ఎమ్మెల్యేగారు అడ్డంగా వాదిస్తున్నారు.

Raman Singh Blames Girlfriends

ప్రమాదాలకు అమ్మాయిలే కారణం

    అబ్బాయిలు బైక్ నడపడం చాలా కష్టం. గేర్ మార్చాలి, క్లచ్ నొక్కాలి. బ్రేక్ తొక్కాలి.. ఈ లోగా అందమైన అమ్మాయి ఎదురుగా కనిపిస్తే బ్రేక్ జారడం చాలా కామన్.. అన్న సినిమా డైలాగ్ ని సీరియస్ గా తీసుకున్నారు చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్.. అసలు చాలా ప్రమాదాలు అందమైన అమ్మాయిలవల్లే జరుగుతున్నాయంటూ ఆయన చేసి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. నూటికి తొంభై శాతం ప్రమాదాలు కేవలం అమ్మాయిలు, సెల్ ఫోన్లు, బైకులవల్లే జరుగుతున్నాయని రమణ్ సింగ్ వ్యాఖ్యానించారు. వెనక గర్స్ ఫ్రెండ్ ఉంటే చాలు అబ్బాయిలకు ఒళ్లు పొంగుతుందని, ఎలా నడుపుతున్నారోకూడా తెలీని పరిస్థితుల్లో యాక్సిడెంట్లు చేస్తున్నారని కామెంట్ చేశారు. వేలుపోసి బైకులు కొనేవాళ్లు, వంద రూపాయలు పెట్టి హెల్మెట్ కొనలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందంగా ఉన్న అమ్మాయిల్నిచూసి చొంగకార్చుకోవాల్సిన అవసరమేంటని మహిళా సంఘాలు ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిని నిలదీస్తున్నాయి. డ్రైవింగ్ చేసేవాళ్లు కంట్రోల్లో లేకపోతే అమ్మాయిలేం చేస్తారంటూ మండిపడుతున్నాయి. అందంగా పుట్టడం అమ్మాయిలకు శాపమా.. అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయ్.

'శంకర్‌దాదా' తరహా హైటెక్ కాపీయింగ్

  వైద్యవిద్య ప్రవేశ పరీక్షల్లో మరోసారి హైటెక్ కాపీయింగ్ బట్టబయలైంది. వైద్యవిద్య సంస్థల్లో చండీగఢ్ పీజీఐఎంఈఆర్ కూ దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు ఇందులో సీటు కోసం పోటీ పడతారు. పీజీఐలోని వివిధ విభాగాల్లో పేజీ వైద్యకోర్సుల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో అత్యాధునిక పరికరాలతో కాపీయింగ్ కూ పాల్పడుతూ చండీగఢ్ లో పలు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు వైద్య విద్యార్ధినులు పట్టుబడ్డారు. వీరిలో తెలుగువారు కూడా ఉన్నారు. పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఇందులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పీజీఐఎంఈఆర్ లో ఎండీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో కాపీ జరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని సీబీఐ డిఐజీ మహేష్ అగర్వాల్ తెలిపారు. ఇక్కడి నాలుగు పరీక్షా కేంద్రాల్లో బ్లూటూత్ సహా అత్యాధునిక పరికరాలతో కాపీయింగ్ కు పాల్పడుతున్న ఏడుగురు విద్యార్ధినులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఓ విద్యార్ధిని చెవిలో సూక్ష్మ పరికరాన్ని అమర్చుకొందని, ఆమెకు శస్త్రచికిత్స చేసి దానిని బయటకు తీయాల్సి ఉందని వివరించారు. ఇందుకు పీజీఐఎంఈఆర్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. నిందుతులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ కుంభకోణానికి సంబందించి హైదరాబాద్, పాట్నా నగరాలలో పలువురును అరెస్ట్ చేసినట్లు తెలిపారు.   

వైవాహికేతర సంబంధం: సిఐఎ చీఫ్ రాజీనామా

  వైవాహికేతర సంబంధంపై సిఐఎ డైరెక్టర్ డేవిడ్ పెట్రాయెస్ రాజీనామా చేశారు. తన ప్రవర్తన అంగీకారయోగ్యం కాదంటూ ఆయన రాజీనామా చేశారు. అత్యున్నత నిఘా సంస్థ చీఫ్ పెట్రాయెస్ తన రాజీనామాను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు శుక్రవారం సమర్పించారు. వివాహమైన 37 ఏళ్ల తర్వాత తాను వైవాహికేతర సంబంధం పెట్టుకోవడమనేది సరి కాదని అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు.   ఒక భర్తగా, సంస్థ అధిపతిగా తన ప్రవర్తన సరైంది కాదని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. పెట్రాయెస్ రాజీనామాను బరాక్ ఒబామా అంగీకరించి, పెట్రాయెస్ చేసిన సేవలను ప్రశంసించినట్లు తెలుస్తోంది. పెట్రాయెస్ వైవాహికేతర సంబంధం గురించి ఎఫ్‌బిఐ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. పెట్రాయెస్ రాజీనామా నిఘా, రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పెట్రాయెస్ సేవలను ఒబామా ప్రశంసించారు. దశాబ్దాల పాటు పెట్రాయెస్ అసాధారణమైన సేవలు అందించారని, అమెరికా రక్షణకు, పటిష్టతకు సేవలు అందించారని అన్నారు. సిఐఎ డిప్యూటీ డైరెక్టర్ మైఖెల్ మోరెల్ యాక్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తారని చెప్పారు. సిఐఎ తన కృషిని కొనసాగించడంలో ముందుంటుందని ఆశిస్తున్నట్లు ఒబామా అన్నారు.

జనం సొమ్ము నేరుగా ఖాతాల్లోకే

    ఇకపై రేషన్ షాపు డీలర్ మీ దగ్గర కిల్ చక్కెరకు రెండునుంచి ఐదు రూపాయల కమిషన్ కొట్టలేడు. గోధుమలిచ్చేటప్పుడు చిల్లరలేదని ఎగ్గొట్టడానికి వీల్లేదు. ప్రజాపంపిణీ వ్యవస్థద్వారా నిత్యావసర సరుకుల్ని తీసుకుంటున్నవాళ్లకి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఇక నేరుగా సబ్సిడీ సొమ్ముని బ్యాంక్ అకౌంట్లలోకి మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.   సబ్సీడీని నేరుగా అకౌంట్లలో వేసే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ముందుగా ఆధార్ కార్డుల్ని పక్కాగా ఇష్యూచేసే ప్రక్రియని ప్రభుత్వం సీరియస్ గా టేకప్ చేసింది. ఆధార్ కార్డులున్న వాళ్లందరికీ రేషన్ సబ్సిడీని  నేరుగా అకౌంట్లలోకి జమచేసేందుకు ఆగమేఘాలమీద ఏర్పాట్లు జరుగుతున్నాయ్. 2103 ఏప్రియల్ నాటికి ఈ పథకాన్ని 18 రాష్ట్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014కల్లా మరో 16 రాష్ట్రాలకు విస్తరిస్తారు.  

కింగ్ ఫిషర్ అకౌంటింగ్ స్కామ్

  సత్యం కంప్యూటర్స్ తరహాలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కూడా భారీ స్థాయిలో అకౌంటింగి స్కామ్ కి పాల్పడిందని ఆడిటర్లు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి చూపించాల్సిన లెక్కలు చూపించి ఉంటే నష్టం ఇంకా భారీ స్థాయిలో ఉండేదని, కాకి లెక్కలతో జనాన్ని మోసం చేశారని ఆడిటర్లు భావిస్తున్నారు.   కంపెనీ ప్రకటించిన క్యూ2 నష్టం 754 కోట్లు రూపాయలుకాగా.. ఆమోదనీయమైన అకౌంటింగ్ పద్ధతిని అనుసరించి ఉంటే ఈ నష్టం దాదాపు ఒకవెయ్యీ ముఫ్పై రెండు కోట్ల రూపాయలు ఉండేదని ఆడిటర్లు భావిస్తున్నారు. దీంతో ఖాతాల్లో అవకతవకలు భారీ స్థాయిలో జరిగుండొచ్చన్న అనుమానాలు గట్టిగా వ్యక్తమౌతున్నాయ్.   సత్యం కంప్యూటర్స్ స్కామ్ కీ, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ స్కామ్ కీ చాలా దగ్గరి పోలికలున్నాయని ఆడిటర్లు భావిస్తున్నారు. సత్యం కంప్యూటర్స్ తన లాభాల్ని భారీ స్థాయిలో పెంచి చూపిస్తే, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నష్టాల్ని భారీగా తగ్గించి చూపించిందని చెబుతున్నారు. ఈ చిన్న వ్యత్యాసం తప్ప రెండు కంపెనీల ఫ్రాడ్ లో పెద్దగా తేడాలేదని అభిప్రాయపడుతున్నారు.   లిక్కల్ కింగ్ విజయ్ మాల్యాకి చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వరసగా 23 వ క్వార్టర్ లోనూ భారీ నష్టాల్ని చవిచూసింది. సెప్టెంబర్ చివరి నాటికి కంపెనీ నష్టాలు దాదాపు 9 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయ్. క్యూ2 ఆదాయం 87 శాతం పడిపోయి 200 కోట్ల రూపాయలకు చేరింది. ఇప్పటికే ఈ కంపెనీకి 7000 కోట్ల రూపాయలకు పైగా రుణాలిచ్చిన బ్యాంకులు ఇకపై ఏగానీ కూడా ఇవ్వలేమని చేతులెత్తేశాయ్.