heavy tax burden

టెలికా౦లపై రూ. 31 వేల కోట్ల పన్ను

    నిర్దేశిత పరిమితికన్న ఎక్కువ స్పెక్ట్రమ్ కలిగి ఉన్న జీఎస్ఎం టెలికం కంపెనీల నుంచి పన్ను వసూలు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా దాదాపు రూ. 31వేల కోట్లను సమీకరించాలని భావిస్తోంది. కేంద్ర౦ నిర్ణయం ప్రభావం ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా, రిలయన్స్, టాటా వంటీ టెలీ ఆపరేటర్లపై త్రీవ్రంగా ఉండనుంది. ఫలితంగా ఈ కంపెనీలు వినియోగదారులపై భారం మోపుతూ కాల్ ఛార్జ్ లను పెంచే అవకాశం ఉంది.   ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర మంత్రి వర్గం సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకు౦ది. ఈ వివరాలను ఆర్ధకమంత్రి చిదంబరం, టెలీ కమ్యూనికేషన్ల మంత్రి కపిల్ సిబల్ వెల్లడించారు. టెలీకం నియంత్రణ సంస్థ నిర్దేశించిన పరిమితికి మించి స్పెక్ట్రమ్ ను వినేయోగించుకుంటున్న కంపెనీలపై ఎకమోత్తంలో పన్ను విధించాలని సాధికార మంత్రుల బృందం సిపార్సు చేసిందని, కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని చిదంబరం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు జీఎస్ఎమ్ ఆధారిత టెలీకం కంపెనీల్లో 4.4 మెగాహెర్జ్ ను మించి ఉన్న  స్పెక్ట్రమ్ కంపెనీల్లో వేలంపాట ద్వారా ధర నిర్ణయించి ఆ మొత్తాన్ని వసూలు చేస్తాం. 6.2 మెగాహెర్జ్ ను మించి ఉన్న జీఎస్ఎమ్ కంపెనీలపై ఒకేసారి పన్ను విధిస్తాం. జూలై 2008 నుంచి ఈ ఏడాది ఆఖరి వరకూ ఉన్న వ్యవధికి ఈ పన్ను విధింపు వర్తిస్తుందని ఆయన చెప్పారు.

gali janardhan reddy

ఆ ఏడు కోట్లు 'గాలి' సొమ్మేనా?

  రాష్ట్ర పోలీసు ప్రధాన అధికారి డీజీపీ కార్యాలయం ఎదుట ఆటోలో దొరికిన రూ.6.75 కోట్లు కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ గనుల తవ్వకం కేసులో జైలు జీవితం గడుపుతున్న గాలి జనార్ధన్ రెడ్డికి చెందినవా. ఏకంగా ఏడు కోట్ల రూపాయలను ఎలాంటి భద్రత లేకుండా ఎంచక్కా ఆలోచిస్తున్న సదరు వ్యక్తులు పోలీసులు కంటపడగానే పరారు కావడం చర్చానీయాంశంగా మారింది. మొత్తం 1000 రూపాయలు కట్టలు కట్టిన కొత్త నోట్లు. ఇంతటి భారీ మొత్తాన్ని తరలిస్తున్నారంటే ఖచ్చితంగా అది రాజకీయ నాయకులకు చెందినదే అన్న అనుమానాలు వస్తున్నాయి.     కర్నాటకలో రోజు రోజుకూ మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ కార్యకలాపాలకోసమే ఈ డబ్బు తరలిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ డబ్బులు కూడా స్టేట్ బ్యాంక్ మైసూర్ నుండి డ్రా చేసిన నేపథ్యం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేల డబ్బుగా అనుమానిస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరిపితే గాని అసలు విషయం తేలదు.

Girl child stabbed

స్కూల్లోకి చొరబడి చిన్నారి హత్య

  క్లాస్ రూమ్ లో మాస్టారు లేరు. పిల్లలు అల్లరి చేస్తున్నారు. కోలాహలంగా ఉంది. ఉన్నట్టుండి ఓ రాక్షసుడు నేరుగా స్కూల్లోకి, క్లాస్ రూమ్ లోకి చొరబడ్డాడు. తాను తెచ్చిన పదునైన కత్తితో ఓ బాలికను పొడిచేశాడు. నిర్దాక్షిణ్యంగా మరో బాలిక గొంతు కోశాడు. పిల్లల అల్లరిని భరించలేక తానీపని చేశానని ఆ దుర్మార్గుడు చెబుతున్నాడు. మదన్ గోపీ అనే ఓ రోజుకూలీ ఈ దారుణానికి తెగబడ్డాడు.   జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్ భీమ్ లో ఈ దారుణం జరిగింది. చేసిన పనికి ఏమాత్రం పశ్చాత్తాపం లేని నిందితుడు తనకు వీలైతే క్లాస్ లో ఉన్న పిల్లలందర్నీ ఇలాగే చంపేస్తానంటున్నాడు. చాలా రోజులుగా పిల్లల గోల భరించలేకుండా ఉన్నానని, అందుకే కసితీరా పొడిచేశానని చెబుతున్నాడు. గ్రామస్తులంతా కలిసి మదన్ గోపీని చావచితక్కొట్టి పోలీసులకు అప్పగించారు.

German Woman Raped

ముంబైలో స్పానిష్ యువతిపై అత్యాచారం

    ముంబై నగరంలోని బాంద్రాలో ఓ అపార్ట్ మెంట్ లో స్పానిష్ యువతిమీద అత్యాచారం జరిగింది. పైప్ లైన్ పట్టుకుని పైకి ఎగబాకి అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిన దుండగుడు కత్తి చూపించి బెదిరించి తాపీగా రెండుసార్లు అత్యాచారం జరిపాక నగలు దోచుకుని మరీ పారిపోయాడు.   బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా ముంబైపోలీసులు నిందితుడి స్కెచ్ ని రూపొందించారు. ఆమె ఆ రూపాన్ని పోల్చుకుందికూడా.. స్కెచ్ ని పాతఫోటోలు, రికార్డులతో పోల్చిచూసిన పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టింది ఓ లోకల్ దొంగని తేల్చారు. నిందితుడిపై గతంలో చాలా దొంగతనం కేసులున్నాయని చెబుతున్నారు.   వచ్చినపని పూర్తయ్యాకకూడా యువతి అపార్ట్ మెంట్ లోనే దాదాపు గంటసేపటివరకూ ఉన్న నిందితుడు తనకి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు ఏవీ దొరక్కుండా జాగ్రత్త తీసుకునిమరీ పరారయ్యాడు. బాధితురాలి బట్టలన్నీ తీసుకెళ్లడం, ఇల్లాంతా నీళ్లు చల్లడం లాంటి ట్రిక్కుల్ని ప్లే చేశాడు. బాధితురాలికి వైద్య పరీక్షలు జరిపిన డాక్టర్లు ఆమెపై రెండుసార్లు అత్యాచారం జరిగినట్టు ధృవీకరించారు.  

KTR congress

ర్యాలీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు: కేటీఆర్

  సీఎం కిరణ్‌కు, మంత్రులకు పార్టీ పనులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని టీఆర్ఎస్ శాసనసభ్యుడు కె. తారక రామారావు విమర్శించారు. నీలం తుపాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిని దిక్కుతోచని స్థితిలో రైతులు ఉంటే వారిని ఆదుకోకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఢిల్లీలో ర్యాలీకి పరుగులు తీసిన ప్రభుత్వం అన్నదాతలు అష్టకష్టాల్లో ఉంటే నిద్రపోతోందని ఆరోపించారు. కిరణ్ సర్కార్ రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిని కాపాడటానికి కొందరు ఎమ్మెల్యేలు లాబియింగ్ చేయటం దురదృష్టకరమన్నారు. కరీంనగర్లో రేపటినుంచి రెండు రోజుల పాటు టీఆర్ఎస్ మేధోమథనం జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంపై ఈ సమావేశంలో డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. అన్ని అంశాలపై కేసీఆర్ స్పష్టత ఇస్తారని కేటీఆర్ తెలిపారు.

kiran kumar reddy

కిరణ్ మార్పుపై చర్చించడం లేదు: వాయలార్ రవి

  2014 వరకు సీఎం మార్పు ఉండదని, కిరణే సీఎం అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వాయలార్ రవి స్పష్టం చేశారు. సీఎం మార్పుపై అధిష్టానం ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన తెలిపారు. తెలంగాణపై ఎవరి అభిప్రాయాలు వారు చెపుతున్నారని, అందరి అభిప్రాయాలను సోనియాకు చేరవేస్తున్నానని ఆయన అన్నారు. తుది నిర్ణయం సోనియానే తీసుకోవాలని వాయలార్‌రవి పేర్కొన్నారు.   ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డిని మార్చి ఆయన స్థానంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు.. మర్రి శశిధర్ రెడ్డి, కుందూరు జానా రెడ్డి లేదా డి.శ్రీనివాస్‌ను కూర్చుండబెడతారనే వార్తలు వచ్చాయి. నవంబర్ 9వ తేది లోగా కిరణ్ మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాయలార్ రవి మంగళవారం స్పందిస్తూ.. మార్పు కేవలం ఊహాగానాలే అని కొట్టి పారేశారు. రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెసు ప్రజా సభకు వెళ్లిన రాష్ట్ర నేతలు పలువురు ఆ సభ ముగిసిన తర్వాత కూడా అక్కడే మకాం వేశారు. సోమవారం సోనియా గాంధీ సహా పలువురు పార్టీ పెద్దలను కలిసి తెలంగాణపై తేల్చాలని, ముఖ్యమంత్రి మార్పు అవసరం లేదని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

Himachal elections

హిమాచల్ ఎన్నికలు ప్రశాంతం

  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. రికార్డ్ స్ధాయిలో ఈ సారి 74.62 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 68 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మందకొడిగా మొదలైన పోలింగ్ రోజు గడిచినకొద్దీ ఊపందుకుంది. చాంబా జిల్లాలోని చురాహ్ నియోజకవర్గంలో అత్యథికంగా 78శాతం పోలింగ్ నమోదయ్యింది.   షిమ్లా నియోజకవర్గంలో అత్యల్పంగా 49శాతంమంది ఓటుహక్కుని వినియోగించుకున్నారు. కిన్నౌర్ లోని కా పోలింగ్ కేంద్రంలో 100 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న 18మంది ఓటర్లు తమ ఓటుహక్కుని వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.

 student gang raped

కారులో కాలేజ్ స్టూడెంట్ గ్యాంగ్ రేప్

    రాజస్థాన్ లోని జైపూర్ లో ఓ కాలేజ్ విద్యార్దినిని తోటి విద్యార్ధులు అమానుషంగా రేప్ చేశారు. కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పుతూ చెరిచారు. కళ్లకి గంతలుకట్టి ఎక్కడికో తెలియని చోటుకి తీసుకెళ్లి ఒకరితర్వాత ఒకరుగా అత్యాచారం చేస్తూ సెల్ ఫోన్ లో దాన్ని చిత్రీకరించారు. ఈ సంగతి ఎక్కడైనా చెబితే మానభంగం దృశ్యాల్ని ఇంటర్ నెట్ లో పెట్టేస్తామని బెదిరించారుకూడా. కానీ.. తోటి విద్యార్ధిని నమ్మి దారుణంగా మోసపోయిన బాధితురాలుమాత్రం నేరుగా పోలీస్టేషన్ కెళ్లి ఫిర్యాదు చేసింది. మార్క్స్ లిస్ట్ ని పోగొట్టుకున్న బాధితురాలు దాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలా అని ఆరా తీస్తున్నప్పుడు నిందితులు కనిపెట్టారు. తాను చెప్పిన చోటికివస్తే డూప్లికేట్ మార్క్ లిస్ట్ ని ఇప్పించే వ్యక్తిని పరిచయం చేస్తానని చెప్పిన నిందితులు బాధితురాలిని బలవంతంగా కారులో ఎక్కించుకుని దురాగతానికి పాల్పడ్డారు. బాధితురాలు నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న విషయాన్ని తెలుసుకున్న నిందితులు పరారయ్యారు. ప్రత్యేక బృందాలు వాళ్లకోసం గాలిస్తున్నాయ్.

BJP Yeddyurappa

కర్ణాటక బిజెపికి షాక్

  కర్ణాటకలో బిజెపికి ప్రభుత్వానీకి మాజీ సీఎం యడ్యూరప్ప వర్గానికి చెందిన 11 మంది మంత్రులు షాక్ ఇచ్చారు. యడ్యూరప్ప డిసెంబర్ 10న బిజెపికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయనున్న సమయంలోనే తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. పార్టీ పెద్దలు అదే పనిగా యడ్యూరప్ప ను అవమానిస్తున్నారని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు.   ఈ పరిణామాలతో కంగుతిన్న బిజెపి అధిష్టానం యడ్యూరప్ప సహా వారందరినీ చర్చల నిమిత్తం ఢిల్లీకి ఆహ్వానించినా అందుకు ససేమిరా అన్నారు. కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పాటు దిశగా సాగుతున్న యడ్యూరప్ప వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.   యడ్యూరప్పను బుజ్జగించే బాధ్యతను అధిష్టాన౦ నరేంద్ర మోడికి అప్పగించారు. నరేంద్ర మోడి యడ్యూరప్ప కు ఫోన్ చేసి బిజెపి లోనే కొనసాగాలని, కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. మోడి అభ్యర్ధనను యడ్యూరప్ప సున్నితంగా తిరస్కరించారు.

Kavuri congress

పావులు కదుపుతున్న కావూరి

  మంత్రి పదవిదక్కలేదన్న అసంతృప్తిని కావూరి సాంబశివరావ్ అంచెలంచెలుగా వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానంపై ఒత్తిడిని తీసుకొచ్చేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.ఓ పక్క పార్టీపట్ల విధేయతని చాటుకుంటూనే మరోపక్క ఒత్తిడిని తీవ్రతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కావూరికి దగ్గరైనవాళ్లు భావిస్తున్నారు. కిందటిసారే తనకి కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్డ కావూరి ఈ సారి చాలా గట్టి ఆశలే పెట్టుకున్నారు. వీలైనంతవరకూ పదవి చేజారి పోయేందుకు ఛాన్స్ లేకుండా ఢిల్లీ స్థాయిలో గట్టిగా లాబీయింగ్ కూడా చేశారు. కానీ.. సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించి అధిష్ఠానం మీద ఒత్తిడి తీసుకురావాలనుకున్న ఆయన వ్యూహం తీవ్రస్థాయిలో బెడిసికొట్టింది. అటు తెలంగాణ వాదాన్ని భుజానికెత్తుకున్న వాళ్లని కానీ, ఇటు సమైక్యాంధ్ర వాదాన్ని గట్టిగా వినిపించినవాళ్లకి కానీ పదవులు దక్కకపోవడం ఎవరూ ఊహించని విషయం. సోనియా పూర్తిగా వీరవిధేయులకీ, నోరెత్తి మాట్లాడని వాళ్లకీ, భవిష్యత్తులో రాహుల్ ప్రథాని పీఠాన్ని అధిష్ఠించడానికి సహకరిస్తారనుకున్నవాళ్లకి మాత్రమే ఛాన్స్ ఇచ్చారని పార్టీ వర్గాలు గట్టిగానే చెప్పుకుంటున్నాయ్. గతంలో చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇస్తారనుకున్నప్పుడుకూడా కావూరి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. జూనియర్లకి పెద్దపీట వేస్తే సీనియర్లకు ఏం దక్కుతుందంటూ అసహనాన్ని ప్రదర్శించారు. అప్పట్లో కామ్ గా విని ఊరుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం, ఇప్పుడు కాస్త గట్టిగానే స్పందించినట్టు కనిపిస్తోంది. వీర విధేయులకు మాత్రమే చోటివ్వడంద్వారా కామ్ గా ఉండేవాళ్లకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పకనే చెప్పినట్టయ్యింది.

chiranjeevi tourisim minister

టూరిజం కొత్త బ్రాండ్ అంబాసిడర్ చిరు

  కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతల్ని స్వీకరించిన చిరంజీవి చకచకా పని మొదలుపెట్టారు. బాధ్యతలు తీసుకున్న తొలిరోజే కాకతీయ ఉత్సవాలమీద తొలిసంతకం పెట్టారు. పర్యాటక శాఖకి కొత్త బ్రాండ్ అంబాసిడర్ వచ్చారంటూ దగ్గరివాళ్లు చిరంజీవిపై ఆత్మీయంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చిరంజీవికి ఉన్న మెగా ఇమేజ్ కి టూరిజం శాఖ మంత్రి పదవి సరైనదని, చిరు ఇమేజ్ వల్ల టూరిజం శాఖకి లాభం కలుగుతుందని చాలామంది అనుకుంటున్నారు. ఉద్యోగుల్లోకూడా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.   ఇంక్రెడిబుల్ ఇండియా కాన్సెప్ట్ విదేశాల్లో బాగా చొచ్చుకెళ్లేందుకు చిరంజీవి ప్రయత్నిస్తారని, విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు అవసరమైన గట్టి ప్రణాళికలు తయారు చేస్తారని చిరంజీవిపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయ్. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు పదవీ బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అత్మీయులంతా ఆశిస్తున్నారు. తనకి అప్పగించిన బాధ్యతల్ని సమర్ధంగా నిర్వహించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని చిరంజీవి చెబుతున్నారు.

New Front

ఫ్రంట్‌కే దేశం మద్దతు? బిజెపిపై బాబు గరం గరం!

  జాతీయస్థాయిలో కమ్యూనిస్టులతో కూడిన కొత్తఫ్రంట్‌కే తెలుగుదేశం పార్టీ ఈసారి మద్దతు పలుకుతుంది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన పాదయాత్ర తరువాత పూర్తిస్థాయి కార్యాచరణలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్‌డిఎ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం ఈసారి ముందుగానే మేల్కొని తన నిర్ణయం మార్చుకుంది. అయితే బిజెపిపై దేశం పార్టీ నేతలకు కొంత సాఫ్ట్‌కార్నర్‌ ఉండేది. అదికాస్తా ఇప్పుడు పోయినట్లుంది. ఎందుకంటే చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే మహబూబ్‌నగర్‌ జిల్లాలో బిజెపి నల్లజెండాలతో నిరసన తెలిపింది. అంతేకాకుండా బిజెపి జాతీయస్థాయి నాయకుడు లాల్‌కృష్ణ అద్వానీ కూడా మీడియాతో మాట్లాడుతూ తాము ఎన్నో చిన్న రాష్ట్రాలు ఇచ్చాం కానీ, చంద్రబాబు సహకరించనందున తెలంగాణా ఇవ్వలేదని ప్రకటించారు. తాము అధికారం కోసం లొంగామన్న విషయాన్ని ఆయన ప్రకటించకుండా నెపమంతా తమపై నెట్టారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఫ్రంట్‌కే మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ ఎంపిలు చంద్రబాబుపై ఒత్తిడి చేసేందుకూ సిద్ధంగా ఉన్నారు.  పాదయాత్ర తరువాత దీనిపై బాబు పూర్తిస్థాయి నిర్ణయం ప్రకటిస్తారని దేశం నేతలు మీడియాకు స్పష్టం చేస్తున్నారు. ఏమైనా బిజెపి నిరసన తెలుగుదేశం పార్టీ జాతీయస్థాయి కార్యాచరణలో తుదినిర్ణయానికి దోహదపడిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

 BJP Only Party

బిజెపి తెలంగాణ జపం

    ప్రత్యేక తెలంగాణ డిమాండ్ ని నెత్తినేసుకుని ఊరేగిన జాతీయ పార్టీ బీజేపీ.. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన పార్టీ జాతీయ సమావేశాల్లో ఈ మాటని స్పష్టంగా ప్రకటించారుకూడా.. తర్వాత కాలం కలిసిరాక బిజెపి ప్రాభవం కాస్తా జారిపోయింది. ప్రాంతీయపార్టీల స్థాయికి చేరింది. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ మాట ఎందుకు గుర్తు రాలేదు స్వామీ అని అద్వానీని నిలదీస్తే, అప్పట్లో బాబు కలిసిరాలేదుగానీ లేకపోతే ఈపాటికి తెలంగాణ వచ్చుండేదని సమాధానమిచ్చారు. నెపాన్ని పూర్తిగా బాబు మీదికి తోసేశారు.   అప్పట్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణకి పూర్తిగా వ్యతిరేకం. ప్రస్తుతం ట్రెండ్ మారింది కాబట్టి అటూఇటూ తలఊపక తప్పని పరిస్థితి. బిజెపి మాత్రం ఇప్పటికీ ఆదే జపాన్ని కంటిన్యూ చేస్తోంది. కేంద్రంలో ఈసారి తాము అధికారంలోకొస్తే తెలంగాణ ఇచ్చి తీరతామని గట్టిగానే చెబుతున్నా ఆ పార్టీకి ఓట్లేసేవాళ్లే కరువైపోయారు.

Union Territory

మల్లాడి రాజీనామాపై పుదుచ్చేరి ప్రభుత్వం మౌనం?

  కేంద్రపాలిత ప్రాంతమైన యానాం అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడు మల్లాడి కృష్ణారావు చేసిన రాజీనామాపై ఇంకా పుదుచ్చేరి రాష్ట్రఅసెంబ్లీ నేతలు ఒక నిర్ణయానికి రాలేదు. పైగా దీని గురించి మౌనంగా ఉన్నారు. తన రాజీనామా ఆమోదించరని ముందుగా తెలిసే కృష్ణారావు రాజీనామా చేశారని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. యానాం అభివృద్ధి విషయంలో మల్లాడి కృష్ణారావు ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారని అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎంతో చిన్నదైన ఈ ప్రాంతం నేడు అభివృద్ధిలో తూర్పుగోదావరి జిల్లాలోని కీలకనగరాలతో పోటీపడుతోంది. దీనికి కారణం మల్లాడి చేసిన కృషి మాత్రమే.   అంతకు ముందు ఉన్న నేతలందరూ నామమాత్రంగా పని చేస్తే మల్లాడి మాత్రం సీరియస్‌గా వచ్చే ప్రతీ నిధిని యానాం తీరుతెన్నులు మార్చేలా ఊపయోగించారు. తాను టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణారావు రేవు ఒడ్డున తమిళనాడులోని కన్యాకుమారి తరహాలోనూ విగ్రహాలు పెట్టించటం వంటి పనులు చేశారు. రాజమండ్రి పుష్కరఘాట్‌లో ఆకర్షిస్తున్న శివంబాత్‌ను కూడా యానాంలో ఆయన నిర్మించారు. ఇంత సీరియస్‌గా అభివృద్ధి గురించి కృషి చేస్తున్న తనకు ప్రభుత్వసహకారం లోపించిందని కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాజీనామా చేశానన్నారు. అయితే ప్రభుత్వం మౌనం వహించటం మాత్రం యానాం ప్రజల్లో టెన్షన్‌ పెంచుతోంది.