Delhi rape

ఢిల్లీ గ్యాంగ్ రేప్: సోనియా హామీ, ఉరిశిక్ష పై ..!

      ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఉదంతంఫై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆందోళనకారులకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. గత రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆమె తన నివాసం నుండి బయటకు వచ్చి, ఆందోళనకారులతో సుమారు అరగంట సేపు మాట్లాడారు. ఈ సంఘటనలో నిందితులఫై ఎలాంటి చర్యలు తీసుకుంటారని వారు సోనియాను ప్రశ్నించారు. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు తానేమీ చెప్పలేనని, అయితే బాధితురాలికి మాత్రం తాను అండగా ఉంటానని అన్నారు.   మరో వైపు ఢిల్లీ లో ఆందోళనకారులు తమ నిరసన ప్రదర్సనలు కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్త్రపతి భవన్, ఇండియా గేట్, విజయ చౌక్ వంటి చోట్ల పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో విద్యార్దులు ఆయా ప్రాంతాల్లో తమ ఆందోళన కార్యక్రమాలను చేస్తున్నారు. ఈ ఆందోళనలతో కేంద్రం దిగి వచ్చినట్లు కనిపిస్తోంది. సోనియా, మన్మోహన్ సింగ్ లతో చర్చిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ నిందితులకు మరణ శిక్ష పడేలా చూస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. క్రిమినల్ లా కు తక్షణ సవరణ చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తామని షిండే అన్నారు.   ఉరి శిక్ష ఫై పార్లమెంట్ ఉభయ సభల్లో ఇప్పటికే చర్చించామని, ఈ విషయంలో మరింత చర్చ అవసరమని మంత్రి వ్యాఖ్యానించారు. రేప్ ఘటనఫై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని, ఇటువంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని షిండే అన్నారు. అయితే, విద్యార్దులఫై లాఠీ చార్జ్ వంటి సంఘటనల పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు.

 Yugantham December 21

యుగాంతం పుకారే

      నిన్న డిసెంబర్ 21 న ప్రపంచం ముగుస్తుందని జరిగిన ప్రచారాలు వట్టి వదంతులేనని తేలిపోయింది. మాయన్ల కాలెండర్ ప్రకారం ఐదు వేల ఏళ్ల యుగం నిన్నటితో ముగుస్తుంది కాబట్టి ఈ రోజు యుగాంతం జరుగుతుందని అనేక పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే.   ప్రపంచంలోని అనేక కోట్ల మంది ప్రజలను భయపెట్టిన ‘యుగాంతం’ వాస్తవం కాదని తేలిపోయింది. కాలెండర్ ఫై 22 వ తేదీ ప్రత్యక్షం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు నిన్నంతా బిక్కుబిక్కు మంటూ గడిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మాత్రం, ఎలాగూ ప్రపంచం అంతం అవుతుంది కాబట్టి సరదాగా పార్టీలు చేసుకున్నారు.   ఈ యుగాంతం సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉంటే, నాశనం అనేది ఉండదని ప్రచారం ఉన్న ఫ్రాన్స్ లోని బుగారచ్, టర్కీ లోని సిరిన్స్, సెర్బియా, బ్రెజిల్ లోని కొన్ని ప్రాంతాల వద్దకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అమెరికా ప్రజలు ఈ కీలక సమయంలో అంత రిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ను నమ్ముకున్నారు.   ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఏమి చేయాలనే విన్నపాలతో నిన్నంతా ‘నాసా’ ఫోన్లు ఫుల్ బిజీ గా ఉండి పోయాయి. భూమి మరో 400 కోట్ల సంవత్సరాల పాటు నిక్షేపం గా ఉంటుందని వారికి ‘నాసా’ శాస్త్రవేత్తలు అభయ హస్తం ఇచ్చారు. ఈ వదంతులను నమ్మవద్దని ‘నాసా’ ప్రజలకు సూచించింది.

Delhi rape medical student

ఢిల్లీ గ్యాంగ్ రేప్ : ఇండియా గేట్ వద్ద ఉద్రిక్తత

      ఓ మెడికల్ స్టూడెంట్ రేప్ కు గురైన సంఘటనతో దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్ననిరసన ప్రదర్శనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ ఘటన ఫై ఆందోళన చేస్తున్న విద్యార్దులు రాష్త్రపతి భవన్ ను ముట్టడించడానికి ప్రయత్నించారు.   ఈ ఉదయం లక్షలాది మంది విద్యార్దులు, ఉద్యోగులు ఇండియా గేట్ వద్ద జరిపిన ప్రదర్శన ఉద్రిక్తతకు దారి తీసింది. అక్కడ నుండి వారు రాష్త్రపతి భవన్ వైపు వెళ్ళే ప్రయత్నం చేయడంతో పోలీసులు భాష్ప వాయువు, వాటర్ కేనాన్స్ ప్రయోగించాల్సి వచ్చింది.     రేప్ సంఘటనను కాంగ్రెస్ అదినేత్రి సోనియా గాంధీ తేలిగ్గా తీసుకున్నారని అరవింద్ కేజ్రివాల్ పార్టీ ‘ఆం ఆద్మీ పార్టీ’ విమర్శించింది. ఈ కారణంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆమె నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ వరుస సంఘటనలతో ఢిల్లీ లోని ప్రముఖుల నివాసాల ముందు అధికారులు భద్రతను పటిష్టం చేశారు.

Narendra modi prime minister

ఢిల్లీ పీఠం పై గురి పెట్టిన నరేంద్ర మోడి...?

        గుజరాత్ ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చి, ముఖ్య మంత్రి పదవిని చేపట్టబోతున్న నరేంద్ర మోడి ఇక దేశ ప్రధాన మంత్రి పదవే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ లో జరిగిన పార్టీ విజయోత్సవ సభలో ఆయన హిందీ లో మాట్లాడారు. ఇప్పటి వరకూ అక్కడ జరిగిన ప్రతి సభలోనూ ఆయన గుజరాతీలోనే ప్రసంగించేవారు. అయితే, తన సందేశం దేశమంతా అర్ధం చేసుకొనేలా మోడి హిందీ లో మాట్లాడినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.   దేశమంతా సుపరిపాలన అనే పదాలు కూడా మోడి ఇక్కడ వాడారు. తనను ఎన్నుకొని, గుజరాతీయులు దేశానికి మార్గం చూపారని మోడి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆయనకు ప్రధాని పదవిఫై ఉన్న ఆసక్తిని తెలియజేస్తున్నాయని భావిస్తున్నారు.   పార్టీలోని సీనియర్ నేతలు అద్వాని, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, యశ్వంత్ సిన్హా వంటి నేతలు ఒక్కొక్కరు ప్రధాని పదవి విషయంలో మోడీ కి మద్దతుదారులుగా మారుతున్నారు. అయితే, బిజెపి లోని ఓ వర్గం మోడి ప్రధాని పదవికి గండి కొట్టే పనిలో ఉంది. ఎన్డిఏ లోని కొన్ని పార్టీలు కూడా మోడీకి వ్యతిరేకంగా ఉన్నాయి.   ఇక బీహార్ ముఖ్య మంత్రి నితీష్ కుమార్ గురించి చెప్పనక్కరలేదు. మోడిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తే, ఎన్డిఏ ఫై మతతత్వ ముద్ర పడి తిరిగి అధికారంలోకి రావడం కష్టమవుతుందని నితీష్ వాదిస్తున్నారు. వచ్చే సంవత్సరంలో కర్ణాటక లో జరిగే ఎన్నికల ప్రచారం లో పాల్గొని, అక్కడ పార్టీ అధికారంలోకి రాగలిగితే, మోడి ప్రధాని కావడానికి అడ్డంకులు ఉండకపోవచ్చనేది పరిశీలకుల అంచనా.

Narendra modi prime minister

నరేంద్ర మోడీ ప్రధాని పోస్ట్ కి అర్హుడేనా?

      గుజరాత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి నరేంద్ర మోడీ మరో సారి ముఖ్య మంత్రి పదవిని చేపట్టబోతున్నారు. ఈ దశలో అందరి ఆలోచనలు ఆయన దేశ ప్రధాని పదవికి ఎన్డిఏ అభ్యర్ధిగా బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, అసలు మోడీ ప్రధాని పదవికి అర్హుడా అనే సందేహాలు కాస్తంత ఎక్కువగానే ఉన్నాయి.   ప్రధాని పదవికి కాంగ్రెస్ యువనాయకుడు రాహుల్ గాంధీ కి సరైన ప్రత్యర్ధి మోడీ నే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ముస్లిం వర్గాల్లో ఆయనకు చెడ్డ పేరు ఉండటమే ఆయన ప్రధాని కావడానికి అసలు అడ్డంకి. ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వర్గం జనాభా అధికంగా ఉంది. విజయం సాధించే అభ్యర్దులు కూడా అక్కడ గణనీయంగా ఉన్నారు. ఈ వర్గాన్ని తనవైపుకు తిప్పుకునేందుకు మోడీ గతంలో ప్రయత్నాలు చేయలేదని కాదు. ఈ విషయంలో ఆయన చెయ్యల్సింది చాలా ఉంది.   నాయకత్వ లక్షణాలను బట్టి చూస్తే, నరేంద్ర మోడీ ఎల్.కే. అద్వాని కన్నా ముందు ఉంటారనడంలో సందేహం ఉండక పోవచ్చు. మోడీ అభ్యర్ధిత్వాన్ని బిజెడి, జెడి (యూ), తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు అంగీకరించే అవకాశం ఉండక పోవచ్చు. వి హెచ్ పి లాంటి సంస్థల మద్దతు కూడా ఆయనకు ఇప్పుడు ముఖ్యం.   ఈ పరిస్థితి లో బిజెపికి ఉన్న ప్రత్యామ్నాయం ఒకటే. మోడీ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించేవారు ఉన్నా ఆయననే ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడం. అంత సాహసం పార్టీ చేస్తుందా అనేదే ఇక్కడ అసలు ప్రశ్న.

Sp mp yashvir singh

శృతి మించిన ఎస్పీ ఎంపి ప్రవర్తన

        లోక్ సభ లో కనీ వినీ ఎరగని దారుణం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన కోటా బిల్లును ప్రవేశ పెట్టేందుకు మంత్రి నారాయణ స్వామి లేచి నుంచున్నారు. ఇంతలో, సమాజవాదీ పార్టీ సభ్యుడు యస్వీర్ సింగ్ వెనుక నుండి దూసుకు వచ్చి బిల్లును మంత్రి నుండి విసురుగా లాక్కున్నారు. అనుకోని పరిణామంతో మంత్రి షాక్ తో అలా నిల్చుండి పోవాల్సి వచ్చింది.   దీనికి ఆగ్రహించిన సోనియా గాంధీ ఆ బిల్లును లాక్కునేందుకు ముందు బెంచీల నుండి వేగంగా యస్వీర్ వద్దకు వచ్చారు. దీనితో యస్వీర్ తన వెనుక ఉన్న మరో ఎస్పీ సభ్యుడు నీరజ్ శేఖర్ వద్దకు బిల్లును విసిరేశారు. శేఖర్ దానిని ముక్కలు చేసి, వాటిని వెల్ వద్ద వెదజల్లారు. ఒక దశలో యస్వీర్ తన పిడికిలి బిగించిన తీరును గమనించిన కాంగ్రెస్ సభ్యులు కనుమూరి బాపిరాజు, విలాస్ ముత్తెం వార్ సోనియా చుట్టూ ఆమెకు రక్షణగా నిలబడ్డారు.   ఈ సంఘటన జరుగుతున్న సమయంలో ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సభలోనే ఉన్నారు. ఎస్పీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో, బిల్లును సాధ్యమైనంత త్వరగా ఆమోదించాలని మరో వైపు బిఎస్పీ సభ్యులు పోటీ నినాదాలు చేశారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో హల్ చల్ చేసిన యస్వీర్ సింగ్, ఈ బిల్లు వల్ల లబ్ది పొందే వర్గానికి చెందిన ఓ దళితుడు కావడం కొస మెరుపు.

Narendra Modi PM

నరేంద్ర మోడీ టార్గెట్ ప్రధాని చైర్...?

      కేంద్రంలో 2014 ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చిన పక్షంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడినే ఆ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా దాదాపు ఖరారయ్యింది. మోడి గత దశాబ్ద కాలంగా గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఆ రాష్ట్ర ప్రజల గుండెల లోతుకి తీసుకువెళ్ళగలిగారు. ఎన్నో వివాదాలు మరెన్నో విమర్శలు వచ్చిన ఆయన తనదైన శైలిలో గుజరాత్ రాష్ట్రంలో బిజేపేని అత్యంత పటిష్టస్థితికి చేర్చగలిగారు. మరొక రెండు దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో మరి ఏ ఇతర ప్రాంతీయ, జాతీయ పార్టీలు కాని కాలు మోపలేనంత పటిష్టస్థితికి బిజెపిని చేర్చగలిగారు. హిందూ పక్షపాతిగా ముస్లీంల వ్యతిరేకిగా దేశంలోని రాజకీయ పార్టీలన్నీ నరేంద్రమోడిని చిత్రీకరించడానికి విశ్వప్రయత్నాలు చేశాయి. ప్రారంభంలో ఆ మాటలు నమ్మిన ముస్లీం వర్గాలు మోడికి మద్దతును ఇవ్వలేదు. కాని రానురానూ గుజరాత్ రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న ఎనలేని కృషిని గుర్తించిన మైనార్టీ వార్తాలు మెల్లగా మోడివైపు మొగ్గుచూపడం మొదలుపెట్టారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా బిజెపిని మతతత్వ పార్టీ అంటూ మైనార్టీలు బహిరంగంగానే విమర్శిస్తూ ఉంటారు. అలాగే కాంగ్రెస్, సిపిఎం, సిపీఐ, సమాజ్ వాది, బహుజన్ సమాజ్ వాది పార్టీలు కూడా మైనార్టీ ఓట్లను బిజెపిని మతతత్వ పార్టీ అనే బూచిని చూపించి ప్రయోజనం పొందుతున్నది జగమెరిగిన సత్యం. ఆ మేరకు బిజెపి కూడా మైనార్టీ ఓట్లపై తన ఆశలను ఎప్పుడో వదిలేసుకుంది. బిజెపి తన జాతీయ నాయకుల జాబితాలో పేరుకి ఒకరో ఇద్దరో తప్ప మైనార్టీ వర్గానికి చెందినా జాతీయ నేతలు ఎవరూ లేరు. అలాంటి ముస్లీం వ్యతిరేక పార్టీగా ముద్రపడిన బిజెపిని క్రమంగా మైనార్టీ వర్గాలకు దగ్గర తీసుకెళ్ళిన ఘనత కూడా నరెంద్రేమోడీకే దక్కింది. మోడి కేవలం తన అభివృద్ధి సంక్షేమ పతకాలతో గుజరాత్ ప్రజల మనసును గెల్చుకోగాలిగారు. అదే సమయంలో మతతత్వ పార్టీ బిజెపి అనే ముద్రను కూడా చెరిపివేయగలిగారు. ఆశ్చర్యంగా గుజరాత్ ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానానికి కూడా ఆయన మైనార్టీ వర్గాలకు టిక్కెట్లను కేటాయించలేదు. అయినా మైనార్టీలు ఈ సారి మోడీకే మద్ధతునే తెలిపాయి. ఈ విషయమై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ కూడా జరిగింది. ఇదిలా ఉండగా 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన పక్షంలో నరేంద్రమోడినే తమ ప్రధాని అభ్యర్థి అని ఇప్పటికే ఆ పార్టీ ఓక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కేవలం గుజరాత్ ఎన్నికల దృష్ట్యానే ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. ఒకవేళ ఎన్నికలకు ముందే ఈ విషయాన్ని ప్రకటించిన పక్షంలో ప్రజలు మోడి పరోక్షాన్ని ఆమోదించలేరని అందువల్లే ఈ విషయాన్ని ఇప్పటివరకు దాచి పెట్టామని బిజెపి నేతలు చెబుతున్నారు. ఈ మేరకు ఓక సంవత్సరం క్రితమే నిర్ణయం తీసుకున్న బిజెపి కేంద్రనాయకత్వం గుజరాత్ ఎన్నికల దృష్ట్యా ఈ విషయాన్ని ఇంతకాలం బహిర్గతం చేయలేదు. 2013  మార్చి నెల నుంచి గతంలో ఆ పార్టీ సీనియర్ నేత ఎల్,కె. అద్వాని చేపట్టిన రథయాత్ర తరహాలోనే నరేంద్రమోడీ కూడా రథయాత్ర ద్వారా దేశవ్యాప్తంగా పర్యటించి కేంద్రంలో 2014 ఎన్నికలకు బిజెపిని అధికారం దిశగా సమాయత్త పరిచే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు ఆయన అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుత అధ్యక్షుడు నితిన్ గడ్కారీని కూడా తొలగించి ఆయన స్థానంలో జాతీయ అధ్యక్షుడిగా నరేంద్రమోడిని నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేవలం గడ్కారిపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనని కొంతకాలం అధ్యక్షునిగా కొనసాగించి పరిస్థితి సద్దుమణిగాక ఆయనను తొలగించి ఆ స్తానలో నరేంద్రమోడిని జాతీయ అధ్యక్షుణ్ణి చేయాలని కేంద్ర నాయకత్వం ఈపాటికే నిర్ణయించుకుంది. గడిచిన మూడు దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీలో వాజ్ పాయ్ మితవాదిగానూ, అద్వాని అతివాదిగానూ ఉంటూ రెండు గ్రూపులుగా పార్టీ నడిచేది. వాజ్ పాయ్ వర్గం మితవాదం వైపు పార్టీని మళ్ళించగా అద్వాని అతివాదం వైపు నడిపించేవారు. రెండు భిన్న విధానాలతో ఆ పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురయ్యేవారు. ఒక దశలో బిజెపి తాము అధికారంలోకి వచ్చిన పక్షంలో దేశంలో కామన్ సివిల్ కోడ్ ను తీసుకొస్తామని, అలాగే రామజన్మభూమిలో రామమందిరాన్ని నిర్మిస్తామని, భారత దేశాన్ని తన సార్వభౌమత్వాన్ని కాపాడే విధంగా తీర్చిదిద్ది అవినీతి రహిత దేశంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పడంతో అప్పట్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలనపట్ల విసుగుచెంది బిజెపి నాయకత్వంలోని ఎన్డీయేకు పట్టం కట్టారు. సుదీర్ఘ పోరాటం తరువాత మొదటిసారి అధికారం చేపట్టిన బిజెపి నాయకత్వం ఎన్నికల సందర్భంలో తాము ప్రజలకు చేసిన వాగ్దానాలను పూర్తిగా నిలుపుకోలేక పోయింది. ఆ మాటకు వస్తే బిజెపి దేశప్రజలకు చేసిన వాగ్దానాల్లో సగానికి పైగా అమలుకు నోచుకోఎల్డు. ఏ హామీలు ఇచ్చి బిజెపి అధికారంలోకి వచ్చిందో వాటిని అమలు చేయలేకపోయిన కారణంగానే తిరిగి బిజెపి అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. ఆ తరువాత ఆ పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వాని చేపట్టిన రథయాత్రలు కూడా ప్రజాదరణ పొందలేకపోయాయి. దాంతో బిజెపి ఆశించిన ఆదరణ లభించలేదు. 'కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు'. ప్రతి మనిషి జీవితంలోనూ ఎత్తుపల్లాలు ఉన్నట్లే అధికారం కోల్పోయి ఎంతో సంక్షోభానికి గురైన కేంద్రనాయకత్వానికి నరేంద్ర మోడి రూపంలో ఒక చిన్న ఆశ చిగురించింది. ఆ ఆశే పెరిగి పెద్దదవుతూ తిరిగి బిజెపిని కేంద్రంలో అధికారం సంపాదించి పెట్టే విధంగా తయారైంది. ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే మోడి లాంటి పటిష్ట నాయకత్వ లక్షణాలు గల వ్యక్తి భారత దేశంలో ఉన్నాడని దేశ విదేశ పత్రికలూ సైతం కొనియాడుతున్నాయి. ఇప్పుడు దేశానికి నిజాయితీగా నమ్మకంగా ప్రజల సమస్యలను తీర్చుతూ వారికి ఉపాధి అవకాశాలు కల్పించే నాయకుడు కావాలని ఎదురుచూస్తున్నారు. ఆ తరుణంలో గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికే తానేమిటో నిరూపించుకున్న నరేంద్రమోడి దేశానికి కూడా నాయకత్వ పటిమను లక్షణాలను జాతీయ, అంతర్జాతీయ మీడియా కూడా బయటి ప్రపంచానికి తెలియజేసింది. మోడీ దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించగల నాయకుడిగా చిత్రీకరించాయి. ప్రస్తుతం మోడి పేరు తారక మంత్రంగా వినిపిస్తోంది. మూడోసారి కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడినే పగ్గాలు చేపడుతారంటూ అన్ని సర్వేసంస్థలు తమ సర్వేలు ప్రకటించేశాయి. ఇక ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించడమే మిగిలిఉంది. ఇంకా బిజెపిలో కొనసాగుతున్న ఇరువర్గాలు ఇటు వాజ్ పాయ్, అటు అద్వాని వర్గం రెండూ కూడా నరెంద్రేమోడీనే ప్రధాని అభ్యర్థిగా అంగీకరిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షమైన జేడీయు నేత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఎన్డీయే తరపున ప్రధాని అభ్యర్థిని నిర్ణయించాల్సింది బిజెపియేనని తేల్చేశారు. మిగిలిన భాగస్వామ్య పక్షాలు కూడా నరేంద్రమోడీ వైపే మొగ్గుచూపిస్తున్నాయి. అందువల్ల ఎన్డీయే అధికారంలోకి వచ్చిన పక్షంలో నరేంద్రమోడీనే భావిభారత ప్రధాని అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇప్పటికే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన యూపిఏ ప్రభుత్వానికి సమర్థవంత నాయకత్వం కూడా లోపించిందన్న పెద్దఎత్తున విమర్శ ఉంది. ఇప్పటికే నిజాయితీపరుడిగానూ, సమర్థవంతంగా గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్ళిన వ్యక్తిగానూ నిరూపించుకున్న నరేంద్రమోడి దేశవ్యాప్తంగా పర్యటించి తాను ఏ విధంగా దేశాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్ళగలనో ప్రజలకు వివరించగలిగిన రోజున  నిస్సందేహంగా ప్రహాలు మోడీవైపు మొగ్గుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందిరాగాంధి తరువాత దేశంలో ధృడచిత్తం గల నేతగా నరేంద్ర మోడీ గుర్తింపబడ్డారు. ఇక ఆంధ్రప్రదేస్ రాష్ట్ర విషయానికొస్తే టి.ఆర్.ఎస్. పార్టీ ఇప్పటికే ఏ పార్టీ అయితే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుందో ఆ పార్టీతోటే కలిసి పని చేయడానికి తాను సిద్ధమే అని చెప్పడం జరిగింది. కాబట్టి టి.ఆర్.ఎస్. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేసే అవకాశం ఉంది. ఇదే క్రమంలో టిడిపిలో కొంతమంది నాయకులు కూడా ఇప్పటికే బిజెపిలోని కొందరి ప్రముఖులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

 Delhi bus rape

ఢిల్లీ గ్యాంగ్ రేప్....నన్ను ఉరి తీయండి

        ఢిల్లీ లో ఓ మెడికల్ స్టూడెంట్ ను బస్సులో రేప్ చేయడం, ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో, ఇక నియమాలను తీవ్రతరం చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఇలాంటివి ఇక ముందెప్పుడూ జరగకుండా చూస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు.   ఇక రాజధానిలోని బస్సుల్లో నల్ల అద్దాలు ఉండకూడదు. అలా ఉంటే, ఆ బస్సులను స్వాదీనపరచుకొంటారు. ఢిల్లీ లో రాత్రి పూట నడిచే బస్సుల్లో లైట్ లు వేసి ఉంచాలి. వాటికి ఫిల్మ్ అంటిన్చిఉంటే దానిని వెంటనే తొలగించాలి. బస్సులను వాటి యజమానుల వద్ద ఉంచాలే తప్ప, డ్రైవర్ ల వద్ద ఉంచకూడదు.   మరో వైపు ఈ కేసును ఢిల్లీ హై కోర్టు సుమోటో గా తీసుకొంది. అ ఘటన జరిగిన బస్సు 40 నిమిషాలపాటు రోడ్డు ఫై తిరుగుతున్నా పోలీసుల కన్నేందుకు పడలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బస్సు ఐదు చెక్ పోస్టుల నుండి వెళ్ళిందని, అయినా పోలీసుల కళ్ళు ఈ బస్సు ఫై పడలేదని హై కోర్టు వ్యాఖ్యానించింది.   ఈ ఘటనలో పట్టు బడిన ఓ నిందితుడు తాను తీవ్రమైన తప్పు చేస్సానని తనను ఉరి తీయాలని అన్నారు. ఏది ఎలా ఉన్నా, పోలీసులు ఏ స్థాయిలో చర్యలు తీసుకొంటున్నా, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉండటం విచారకరం.

chidambaram

చిదంబర ఉవాచ: ఓడినా గెలుపు మాదే స్మీ!

  గుజరాత్ ఎన్నికలలో ఓడిపోతున్న కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు బాటపట్టడం పండగ చేసుకొనేందుకు ఒకింత అవకశం కల్పించి ఊరట కలిగించిందని చెప్పవచ్చును. అక్కడ కూడా ఓడినట్లయితే పార్టీ పరువు పోయుండేది గానీ, అదృష్ట వశాత్తు అక్కడ కాంగ్రెస్ హస్తవాసి బాగానే ఉందిపుడు. ఆర్దిక శాఖామాత్యులు చిదంబరంగారు డిల్లీలో మీడియా వాళ్ళతో మాట్లాడుతూ “నిజానికి మేమే రెండు చోట్లా గెలిచాము. హిమాచల్లో ఎలాగు గెలుపు మాదేనని మాకు తెలుసు. గానీ, గుజరాత్ లో కూడా మాదే గెలుపు అని చెప్పవచ్చును. ఈ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసేస్తానని గొప్పలుపోయిన నరేంద్రమోడీని కట్టడిచేయడంలో మేము సఫలం అయ్యేము గనుక, అక్కడా మాదే నైతిక విజయంగా చెప్పవచ్చును.”

Delhi gang rape

బస్సులో గ్యాంగ్ రేప్ : నిందితులు అరెస్ట్

      ఢిల్లీ లో మెడికల్ స్టూడెంట్ పై జరిగిన హత్యాచారం కేసుకు సంబంధించి కీలక నిందుతుడిగా భావించిన బస్సు డ్రైవర్ రామ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. రామ్ సింగ్ చెప్పిన సమాచారం ప్రకారం, బస్సులో ఆతను స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా...అతని సోదరుడు ముఖేష్ బస్సును డ్రైవ్ చేస్తున్నాడు. బస్సు సిగ్నల్ వద్ద ఆగగానే మెడికోలు బస్సు ఎక్కారు. తాగిన మైకంలో ఉన్న రామ్ సింగ్ అతని స్నేహితులు మెడికోలను ఇబ్బంది పెట్టారు. ఆ తరువాత విద్యార్ధిని పై రెండు సార్లు హత్యాచారం చేసి, విద్యార్ధిని బాయ్ ఫ్రెండ్ ని రాడ్ తో కొట్టి బస్సులో నుంచి బయటకు తోసివేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో చెప్పాడు. రామ్ సింగ్ ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు అతని సోదరుడు ముకేష్ తో పాటు మరో ఆరుగురు నిందుతులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మెడికో పరిస్థితి విషమంగానే ఉంది. వెంటిలేటర్ పైనే ఆమెకు చికిత్స అందిస్తున్నారు.                  

gujarat exit poll survey reports

మోడీ హ్యాట్రిక్ ఖాయమంటున్న సర్వేలు

  నేడు జరిగిన గుజరాత్ రెండవదశ పోలింగులో ఇంతవరకు కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 70% ఓటింగు పోలయినట్లు సమాచారం. కొద్దిసేపటి క్రితమే ఓటింగ్ పూర్తవడంతో వివిధ సర్వేసంస్థలు రంగంలోకి దూకి గుజరాత్ ప్రజల నాడిని పట్టుకొనే ప్రయత్నoచేసాయి. ఐదు ప్రముఖ సర్వేసంస్థలు చేప్పటిన సర్వేలో ప్రస్తుత గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడికీ శాసనసభలో 182 సీట్లలో కనీసం 120 సీట్లకి తక్కువ కాకుండా విజయం సాదించబోతున్నాడని స్పష్టం చేసాయి.   ఒకనొక దశలో మోడీ విజయవకాశాలకు గండికొట్టగల సమర్దుడని చెప్పబడ్డ కేషు భాయిపటేల్ ప్రభావం గుజరాత్ ఎన్నికలలో పెద్దగా ఉండబోదని సర్వే రిపోర్టులు అన్నీ స్పష్టం చేస్తున్నాయి. వరుసగా మూడవసారి గుజరాత్ ముఖ్యమంత్రి కాబోతున్ననరేంద్రమోడీ ఈ విజయంతో ‘హ్యాట్-ట్రిక్’ సాదించబోతుండగా, అతని ప్రియమయిన ప్రత్యర్ది రాహుల్ గాంధీకూడా ఇదే ఎన్నికల ద్వారా ‘హ్యాట్రిక్’ సాధించబోతున్నాడు. ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో పార్టీని తనసారద్యంలో ఓటమిపాలు చేసిన రాహుల్ గాంధీ గుజరాత్ లో కూడా ఓడించిపెట్టడంతో ఈ ‘హ్యాట్రిక్’ సాదించగలిగేడు. హ్యాట్రిక్ సాదించిన ఇద్దరికీ శుభాకాంక్షలు                          వివిధ సర్వే సంస్థల రిపోర్టులు:     BJP Congress Others CNN/IBN 124    56   Nelsons 126    50 6         Chanakya 120    54 4 Times Now 120     58 - NTV 120    58 - Aaj Tak 118-128     40 -        

 Delhi rape medical student

బస్సులో గ్యాంగ్ రేప్..దుస్తులు విప్పేసి తోసేసిన కిరాతకులు

      దేశ రాజధాని లో మహిళలకు భద్రత లేదని వరుసగా జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. తాజాగా, గత అర్ధ రాత్రి నగరం నది బొడ్డున ఓ మెడికల్ స్టూడెంట్ అత్యాచారానికి గురి అయింది.   దక్షిణ ఢిల్లీ లోని వసంత విహార్ లో గత రాత్రి ఓ మెడికల్ స్టూడెంట్, ఆమె బాయ్ ఫ్రెండ్ ఓ ప్రైవేటు బస్సు ఎక్కారు. ఆ బస్సులో ఆమె బాయ్ ఫ్రెండ్ ను ఓ మూల కూర్చో బెట్టి, ఆమె ఫై కొంతమంది ఆకతాయిలు రేప్ చేసినట్లు సమాచారం. అనంతరం ఇద్దరినీ బస్సులోనుంది తోసివేశారు. సఫ్తార్ జంగ్ ఆసుపత్రిలో వీరిద్దరికీ ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు. వీరిలో ఆమె పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.   కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఢిల్లీ నగరంలో మహిళలకు ఎంత మాత్రం భద్రత లేదని ఇటీవల జరిగిన అనేక సర్వేలు వెల్లడిస్తున్నా పోలీసులు తీసుకొంటున్న చర్యలు మాత్రం నామ మాత్రం గానే ఉంటున్నాయి.

Rocket attacks on Peshawar airport

పెషావర్ ఎయిర్ పోర్ట్ పై రాకెట్ దాడి: 7గురు మృతి

      పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉన్న అంత ర్జాతీయ విమానాశ్రయంపై శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన రాకెట్ల దాడిలో ముగ్గురు పౌరులు, ఐదుగురు మిలిటెంట్లు మరణించారు. ఆయుధాలు ధరించి ఆత్మాహుతి దాడి జరిపేందుకు వచ్చిన మిలిటెంట్లను ఎయిర్‌పోర్ట్‌లోని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని అధికారులు వెల్లడించారు. మిలిటెంట్లు జరిపిన దాడితో మూడు రాకెట్లు విమానాశ్రయంలో పేలినా, భారీ ఆస్తి నష్టం మాత్రం జరగలేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడి తమ ఆస్పత్రిలో చేరిన వారిలో సుమారు 40 మంది వరకు తీవ్రంగా గాయాలపాలై ఉన్నారని ఖైబర్ టీచింగ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాధితుల్లో చిన్నారులతో పాటు మహిళలు, వృదులు కూడా ఉన్నారన్నారు. కాగా, ఈ దాడి పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినా తమ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని పాక్ రక్షణ మంత్రి నవీద్ ఖమర్ అన్నారు. ఈ ఘటనకు తెహ్రిక్ ఈ తాలిబన్ సంస్థ బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించింది.

 Kavuri sambasiva rao congress plenary

సదస్సుకు కావూరి డుమ్మా

        రేపు హైదరాబాద్ లో జరగనున్న కాంగ్రెస్ సదస్సుకు తాను హాజరు కానని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివ రావు ప్రకటించారు.   పార్లమెంట్ సభ్యత్వంతో పాటు, పార్టీకి సంభందించిన ఇలాంటి సభ్యత్వాలన్నిటికీ తాను ఎప్పుడో రాజీనామా చేసానని ఆయన వివరించారు. కాబట్టి ఈ సదస్సుకు హాజరు కాలేనని ఆయన అన్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం నుండి తన రాజీనామా అమల్లోకి వస్తుందని కావూరి ప్రకటించడం వల్ల ఈ సదస్సుకు హాజరుకావాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున ఆహ్వానం పంపించామని ముఖ్య నేత ఒకరు మీడియా కు వెల్లడించారు.   తన రాజీనామాను ఆమోదించకపోయినా, ఈ సదస్సుకు తనకు హాజరు కావాలని లేదని కావూరి అంటున్నారు. దీనితో, ఆయన సదస్సుకు హాజరవుతారా, లేదా అని పార్టీ వర్గాల్లో నడుస్తున్న సస్పెన్స్ కు ఇంతటితో తెర పడింది. సమావేశానికి హాజరు కావాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ కావూరిని స్వయంగా ఆహ్వానించినట్లు సమాచారం.   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, తన రాజకీయ భవిష్యత్తు ఫై జనవరి ఒకటి తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.

Railway platform fine Rs.500

ప్లాట్ ఫాం ఫై చెత్తేసారా, 500 ఫైన్

        అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి రైల్వే అధికారులు రోజుకొక విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇటీవలే, స్లీపర్ క్లాస్ తరగతుల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా ఏదేని గుర్తింపు కార్డు కలిగిఉండాలనే నిభందన ప్రవేశపెట్టిన అధికారులు ప్రస్తుతం మరో నిభందన ప్రవేశపెట్టారు.   ఇక నుండి ఫ్లాట్ ఫాం ఫై కాగితాలు పారేసినా, చెత్త వేసినా రూ. 500 జరిమానా కట్టాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్లలో పరిశుభ్రతను కాపాడేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు రైల్వే బోర్డు ఓ ప్రకటనలో తెలియచేసింది. ఇప్పటి వరకూ చెత్త వేసినా వెంటనే రైల్వే సిబ్బంది వచ్చి పరిశుభ్రం చేసేవారు. ఇక నుండి ఫ్లాట్ ఫాం ఫై బట్టలు ఉతికినా, స్నానాలు చేసినా, వంట వండుకున్నా, రైల్వే స్టేషన్లో వ్యాపార ప్రకటనలు అంటించినా మీరు రూ. 500 ఫైన్ కట్టాల్సిందే. రైల్వే స్టేషన్ మాస్టర్, టిటిఈ లకు ఈ జరిమానా వసూలు చేసే అధికారాన్ని అప్పగించారు.   మొదటగా, తత్కాల్ టికెట్ తీసుకున్న వారికి మాత్రమే గుర్తింపు కార్డు నిభందన ఉండేది. ఆ తర్వాత ఎసి తరగతుల్లో ప్రయాణించేవారికి కూడా ఈ గుర్తింపు కార్డు నిభందనను వర్తింపచేశారు. ఇలా, రైల్వే అధికారులు అదనపు ఆదాయానికి తహతహలాడుతున్నట్లు అగుపిస్తోంది.

జగన్ బెయిల్ ఫై సోమవారం సిబిఐ వాదనలు

        బెయిల్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పెట్టుకొన్న పిటీషన్ ఫై ఆయన వాదనలు పూర్తి అయ్యాయి. కాగా, సిబిఐ తన వాదనను సోమవారం వినిపించనుంది.   అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన జగన్ ప్రస్తుతం జుడీషియల్ రిమాండ్లో చంచల్ గూడా జైలులో ఉన్నారు. ఆయన కోర్టులో దాఖలు చేసిన స్టాట్యూటారీ బెయిల్ పిటీషన్ ఫై జగన్ తరపు న్యాయవాది వాదనలను పూర్తి చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 167 (2) ప్రకారం అరెస్టు చేసిన 90 రోజుల్లోపు సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేయనందున జగన్ కు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోర్టు ను కోరారు. సిబిఐ వాదనల్లో కొత్త ఏమీ లేదని, ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని ప్రతి సారీ కోర్టుకు చెపుతూ వస్తోందని అందువల్ల జగన్ కు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది పద్మనాభ రెడ్డి కోర్టును కోరారు.   జగన్ పెట్టుకొన్న మరో పిటీషన్ ఫై కూడా సిబిఐ గురువారం కౌంటర్లు దాఖలు చేసింది. ఈ పిటీషన్ కు సంభందించి సిబిఐ సోమవారం తన అభ్యంతరాలను కోర్టులో చెప్పనుంది.

‘సదస్సు’ లో తెలంగాణా ఉంటుందా ?

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే మార్గాలను చర్చించడానికి, పార్టీని బలోపేతం చేసే విధానాలను ఖరారు చేయడానికి ఈ నెల 16 న హైదరాబాద్ లో జరుప తలపెట్టిన కాంగ్రెస్ సదస్సులో తెలంగాణా అంశాన్ని ప్రస్తావించక తప్పదని ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.   మరో వైపు, ఈ సదస్సులో తెలంగాణా పేరు రాకుండా చూసేందుకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణా నేతలను ఒప్పించే పనిలో ఆయన బిజీగా ఉన్నారు.   ప్రత్యెక రాష్ట్ర అంశం తమకు అత్యంత ముఖ్యమని, ఈ అంశాన్ని అన్ని కీలక వేదికల ఫైన లేవనెత్తుతామని తెలంగాణా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ విషయంలో బొత్స ఆంక్షలు సరి కాదని వారు అంటున్నారు. ఈ విషయం ఫై చర్చ జరపడానికి ఎం పి లు పాల్వాయి, మంద జగన్నాధం, వివేక్, పొన్నం ప్రభాకర్, మధు యాష్కి, ఆనంద భాస్కర్ నిన్న సమావేశమయ్యారు.   ఈ అంశంపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేవలం బొత్స చెప్పినంత మాత్రాన నేతలు తెలంగాణా అంశాన్ని ప్రస్తావించకుండా ఉంటారా అనే ప్రశ్న తలెత్తుతోంది. వారిని బొత్స అడ్డుకోగలరా? దీనికి సమాధానం చెప్పడం మాత్రం అంత తేలిక కాదు.

గుజరాత్ లో రికార్డ్ స్థాయి పోలింగ్: మోడి హాట్రిక్ ఖాయమా?

    గుజరాత్ లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి విడత పోలింగ్ లో ఓటర్లు రికార్డ్ స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో గుజరాత్ లో మొత్తం మీద 59 శాతమే పోలింగ్ నమోదు కాగా, ఈ సారి రికార్డ్ స్థాయిలో తొలి విడతలోనే 68 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో వరుసగా మూడోసారి మోడి హాట్రిక్ సాధించడం ఖాయమని అన్ని సర్వేలు చెప్తున్నప్పటికి, ఆయన ప్రాభవానికి గండికొట్టేందుకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో పాటు, మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ స్థాపించిన గుజరాత్ పరివర్తన్ పార్టీ సౌరాష్టల్రోని అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నాయి. సౌరాష్ట్ర ప్రాంతంపై మోడి పట్టు కోల్పోవచ్చనే అంచనాలు ఆయన విజయోత్సాహంపై నీళ్లు చల్లుతోంది. గురువారం పోలింగ్ జరిగిన 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 52 స్థానాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. 2007 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో మోడీ నేతృత్వంలోని బిజెపికి 38 స్థానాలు లభించాయి. అయితే ఈసారి ఎన్నికల్లో అదే స్థాయిలో విజయం సాధించే అవకాశాలు కనిపించడం లేదు. కేశుభాయ్ పటేల్ స్థాపించిన గుజరాత్ పరివర్తన్ పార్టీ సౌరాష్టల్రోని తొలి విడత పోలింగ్ లో అధిక స్థానాలు గెలుచుకుంటామని ధీమాగా ఉంది. సౌరాష్ట్ర రీజన్ లో మెజార్టీ స్థానాలు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేశుభాయ్ పటేల్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో బిజెపి కి నూకలు చేల్లినట్లేనని ఆయన ఎద్దేవా చేశారు. అయితే కేశుభాయ్ పటేల్ తన కమ్యూనిటీ ఓట్లను ఎంత వరకూ ఆకట్టు కుంటారనేది అంతిమ ఫలితాలలో తేలనుంది.   

గుజరాత్ లో తొలి దశ పోలింగ్

       గుజరాత్ లో నేడు తొలి దశ పోలింగ్ ప్రారంభమయింది. మొత్తం 182 స్థానాలకు గాను, 12 జిల్లాల్లోని 87 స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది.   సుమారు 1.81 కోట్ల మంది ఓటర్లు 846 అభ్యర్దుల భవితవ్యాన్ని నేడు తేల్చనున్నారు. అధికార బిజెపి నుండి 40 మంది, కాంగ్రెస్ నుండి 16 మంది సిట్టింగ్ ఎంఎల్ఏ లు నేడు జరిగే పోలింగ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగెస్ నుండి ముగ్గురు సిట్టింగ్ ఎంపి లు బరిలోకి దిగారు.   అయితే, ప్రీ పోల్ సర్వే ఫలితాలు ముఖ్య మంత్రి నరేంద్ర మోడి కి అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, అందులో బిజెపి కి 122 స్థానాలు వస్తాయని ఓ సర్వే వెల్లడించింది. ఓట్ల శాతం పెరిగితే, ఈ సంఖ్య 130 కి చేరవచ్చని కూడా ఆ సర్వే వివరించింది. దీనితో, మూడింట రెండొంతుల మెజారిటీతో నరేంద్ర మోడి తిరిగి అధికారంలోకి రావడం ఖాయం. గత ఎన్నికల్లో బిజెపి 117 సీట్లు మాత్రమే సాధించగలిగింది.   అందులో కాంగ్రెస్ కు 53 సీట్లు, కేశూభాయ్ పటేల్ కు చెందిన గుజరాత్ పరివర్తన్ పార్టీకి ఒక్క సీటు వస్తాయని ఆ సర్వే వెల్లడించింది. బిజెపి కి 46 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 36 శాతం ఓట్లు, కేశూభాయ్ పటేల్ పార్టీకి ఆరు శాతం ఓట్లు వస్తాయని అ సర్వే పేర్కొంది. ఆరు స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్దులు, చిన్న పార్టీలకు గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.   మణి నగర్ నియోజక వర్గంలో నరేంద్ర మోడి కి ప్రత్యర్ధిగా, సస్పెండ్ అయిన ఐపిఎస్ అధికారి భార్య శ్వేత బట్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఆమె పోటీ చేస్తున్నారు. ముస్లిం ఓట్ల ఫై కూడా గురి పెట్టిన నరేంద్ర మోడి, వారిని ఆకట్టుకొనేందుకు క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్ సేవలను వినియోగించుకొంటున్నారు.   ఈ నెల 17 వ తేదీన రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 20 వ తేదీన జరుగుతుంది.