Supreme court mulayam singh yadav

ములాయం, అఖిలేష్ తాట తీయండి...!

      సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ములాయం తో పాటు ఆయన కుమారుడు, ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్ ల ఫై విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీం సిబిఐ ను ఆదేశించింది. ఈ తీర్పును ములాయం స్వాగతించారు. ఈ విచారణతో తనఫై ఉన్న ఆరోపణలు తొలగిపోతాయని వ్యాఖ్యానించారు.   ఈ కేసులో సిబిఐ తనఫై విచారణ చేయడాన్ని సవాల్ చేస్తూ ములాయం గతంలో సుప్రీం ను ఆశ్రయించారు. దీనిఫై విచారణ చేసిన సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తన దర్యాప్తును స్వతంత్రంగా చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సిబిఐ ను ఆదేశించింది. ములాయం మరో కుమారుడు ప్రతీక యాదవ్ ఫై కూడా విచారణ చేయాలని సుప్రీం ఆదేశించింది. అయితే, ఈ కేసునుండి అఖిలేష్ భార్య డింపుల్ కు కోర్టు మినహాయింపును ఇచ్చింది.     2007 మార్చి 1వ తేదీన సుప్రీం ములాయం ఆస్తులఫై విచారణకు ఆదేశించింది. అప్పటినుండి సిబిఐ ఈ విచారణను నిర్వహిస్తోంది. మరోవైపు ములాయం ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తో సమావేశమయ్యారు.

Tdp mla  teneti vanita

జగన్ తో టీడీపీ ఎమ్మెల్యే వనిత ములాఖత్

        వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం తెలుగు దేశం పార్టీ ఎంఎల్ ఏ తేనేటి వనితా చంచల్ గూడ జైలులో జగన్ మోహన్ రెడ్డి ని కలిసారు.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కాపాడడమే తెలుగు దేశం పార్టీ అజెండాగా మారిందని ఆమె ఆరోపించారు. ఎఫ్ డి ఐ ల ఫై ఓటింగ్ సమయంలో ఇది రుజువయిందని ఆమె అన్నారు. ఆ పార్టీ కాంగ్రెస్ తో కుమ్మక్కు అయిన తర్వాతి పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. ఆ ముగ్గురు ఎంపి లఫై చర్య తీసుకోలేని పార్టీ నాయకత్వం తనను మాత్రం అకారణంగా సస్పెండ్ చేసిందని ఆమె అన్నారు. తన ఫై తీసుకున్న చర్యకు పార్టీ ఇంత వరకూ తనకు వివరణ ఇవ్వలేదని ఆమె అన్నారు. పార్టీలో డబ్బున్నవారికి ఒక న్యాయం, లేని వారికి మరొక న్యాయం అమలు జరుగుతోందని ఆమె ఆరోపించారు.   దివంగత వై ఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలు ప్రజల మనసుల్లో చిరకాలంగా ఉండిపోతాయని ఆమె అన్నారు.

Trs harish rao

బాబు, షర్మిలా కబడ్దార్ : హరీష్ రావు

            కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే రాసిన లేఖ ఫై టిఆర్ఎస్ ఘాటుగా స్పందించింది. ఆ పార్టీ నేత హరీష్ రావు మాట్లాడుతూ ఆ సమావేశానికి ముందే అన్ని పార్టీలు తమ వైఖరులను స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.   సమావేశానికి ప్రతి పార్టీ నుండి ఎంత మంది వెళ్ళారన్నది ముఖ్యం కాదని, ఆయా పార్టీలు ప్రత్యెక తెలంగాణా కు అనుకూలంగా మాట్లాడాయా లేదా అనేది ముఖ్యమని హరీష్ అన్నారు. ఇంత వరకు ప్రత్యేక వాదం అవలంభించిన పార్టీలు ఈ సమావేశంలో కూడా అలాగే తమ అభిప్రాయాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వారు తెలంగాణా కు అనుకూలమో, కాదో ఈ సమావేశంలో తేలిపోతుందని ఆయన అన్నారు.   తెలుగు దేశం, వై ఎస్ ఆర్ పార్టీల అగ్ర నేతలు తెలంగాణా లో పాద యాత్ర లు చేస్తూ, తాము తెలంగాణా కు అనుకూలమని ప్రకటనలు చేస్తున్నారని, ఈ రెండు పార్టీలు సమావేశంలో కూడా తెలంగాణా కు అనుకూలంగా తమ అభిప్రాయాన్ని చెప్పక పొతే, వారిని తెలంగాణా పోలిమేరల్లోకి తెలంగాణా ప్రజలు తరిమి కొడతారని హరీష్ హెచ్చరించారు.   కాంగ్రెస్ పార్టీ మరో సారి ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. సమావేశం తేది దగ్గర పడుతుండడంతో, కాంగ్రెస్, టిడిపి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల నేతల ఫై టిఆర్ఎస్ నేతలు వత్తిడి పెంచే ప్రయత్నం మాత్రం చేస్తున్నట్లు అగుపిస్తోంది.

Anna hazare arvind kejriwal

కేజ్రివాల్ కు మద్దతు ప్రసక్తే లేదు: హజారే

              తన నుండి విడిపోయి ‘ఆం ఆద్మీ పార్టీ’ పెట్టుకోన్న అరవింద్ కేజ్రివాల్ కు ఎట్టి పరిస్తితుల్లోను మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నా హజారే స్పష్టం చేశారు. కేజ్రివాల్ పట్ల మారిన తన వైఖరిని అన్నా సమర్ధించుకొన్నారు.   గతంలో ఒక సమయంలో మాట్లాడుతూ ’ఆం ఆద్మీ పార్టీ’ లోని సత్ప్రవర్తన కలిగిన వారికి తాను మద్దతు ఇస్తానని అన్నారు. అయితే, ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ, కేజ్రివాల్ పదవీ వ్యామోహంతో ఉన్నారని ఆయన పార్టీకి తాను ఓటు కూడా వేయనని అన్నారు. మారిన ఈ వైఖరికి తాను సమయం వచ్చినప్పుడు కారణం చెపుతానని అన్నా వెల్లడించారు. మారిన వైఖరికి ఈ సమయంలో సమదానమిస్తే, కొన్ని సమస్యలు వస్తాయని, అందువల్ల తరువాత ఈ అంశం గురుంచి ఓ ప్రకటన చేస్తానని అయన అన్నారు.   తాను సరి అయిన మార్గంలోనే వెళుతున్నానని అన్నా భావించినప్పుడు తనకు అన్నా మద్దతు ఇస్తాడని కేజ్రివాల్ చేసిన ప్రకటనను గుర్తు చేయగా, కేజ్రివాల్ పగటి కలలు కంటున్నట్లుగా ఉన్నారని అన్నా సమాధానమిచ్చారు.   పార్లమెంట్ ను రద్దు చేయాల్సిన సమయం వచ్చిందని అన్నా అభిప్రాయం వెల్లడించారు. జనవరి 30 నుండి పాట్నా నుండి అవినీతికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తానని హజారే వెల్లడించారు.

 Bharat ratna Ravi sankar death

‘భారత రత్న’ రవి శంకర్ ఇకలేరు

              ప్రముఖ సితార్ విద్వాంసుడు, ‘భారత రత్న’ పండిట్ రవి శంకర్ ఈ ఉదయం అమెరికాలోని సాన్ డియాగో లో కన్ను మూశారు. 92 సంవత్సరాల రవి శంకర్ గత కొంత కాలంగా శ్వాస సంభందిత వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన లా జోల్లాలోని స్క్రిప్స్ మెమోరియల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.   సంగీత కారునిగా, కంపోసర్ గా ఆయనకు మంచి పేరు ఉంది. సంగీత ప్రపంచంలో భిన్నమైన స్టయిల్ ను ఆయన కొన సాగించారు. మన సంగీతానికి విదేశాల్లో మంచి గుర్తింపు రావడానికి రవి శంకర్ చేసిన కృషి మరవలేనిది. ఆయన యూరోప్, అమెరికాల్లో కూడా హిందుస్తానీ క్లాసిక్ సంగీత ప్రదర్సనలు ఇచ్చారు. బోధన, ప్రదర్శనల ద్వారా ఆయన ఈ తరహా సంగీతానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపును తీసుకు వచ్చారు.   1920 ఏప్రిల్ 7న ఆయన వారణాసిలో జన్మించారు. 1999లో కేంద్ర ప్రభుత్వం రవి శంకర్ ను‘భారత రత్న’ తో సత్కరించింది. 1986 నుండి 1992 వరకు ఆయన రాజ్య సభ సభ్యునిగా కూడా ఉన్నారు. మూడు సార్లు గ్రామీ అవార్డులను అందుకున్న ఘనత ఆయనదే.   ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఆయనను జాతీయ సంపదగా కొనియాడారు. ఆయన మృతితో ఓ శకం ముగిసిందని ప్రధాని అన్నారు.

 Justice Katju sued

ఇండియన్స్ ఇడియట్ప్...కట్జూ క్షమాపణ చెప్పాలి

    ఇండియన్స్ ను ఇడియట్ప్ అని అంటారా ? ఇది భారతీయులను అవమానించేలా ఉంది. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పండి అని ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు జస్డిస్ మార్కండేయ కట్జూకు లక్నోకు చెందిన ఇద్దరు యువకులు తాన్యా ఠాకూర్, ఆదిత్య ఠాకూర్ లు నోటీసులు పంపించారు. భారతీయుల్లో 90 శాతం మంది ఇడియట్స్ అని కట్జూ అన్నారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు అందాయి. నోటీసులు అందుకున్న కట్జూ తన బ్లాగులో వివరణ ఇచ్చుకున్నారు. నిద్రావస్థలో ఉన్న సమాజాన్ని తట్టి లేపేందుకే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరిని కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నారు.  తొంభై శాతం మంది భారతీయులు ఇడియట్స్ అని, వారికి మెదళ్లు లేవని తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినో నొప్పించేందుకు కాదని పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల భారతదేశం వెనకబడి పోతుందని ఆ ఉద్దేశంతోనే అలాంటి వ్యాఖ్యలు చేశానని తెలిపారు.

 Chidambaram prime ministerial candidate

కాబోయే ప్రధాని చిదంబరం ?

                వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి ప్రస్తుత ఆర్ధిక మంత్రి పి. చిదంబరం తన ప్రయత్నాలను తాను చేస్తున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానాన్నే ఇస్తోంది లండన్ కు చెందిన ‘ద ఎకనామిస్ట్’ పత్రిక కధనం. కాంగ్రెస్ వర్గాల్లో కలవరం రేపిన ఈ కధనం వివరాల్లోకి వెళ్తే............   వచ్చే ఎన్నికల నాటికి మన్మోహన్ సింగ్ కు 80 సంవత్సరాలు నిండుతాయని, ప్రధాని పదవి చేపట్టడానికి రాహుల్ గాంధీకి తగిన అనుభవం రాలేదని, ఈ పరిస్థితిలో ప్రధాని పదవి చేపట్టే అర్హత పార్టీలో కేవలం చిదంబరంకు మాత్రమే ఉందనేది ఆ కధనం సారాంశం. పార్టీలో తన చిరకాల ప్రత్యర్ధి ప్రణబ్ ముఖర్జీ రాష్త్రపతి భవన్ కు వెళ్ళడంతో ఇక చిదంబరంకు ప్రధాని పదవి చేపట్టే అవకాశాలు మెరుగయ్యాయనేది ‘ద ఎకనామిస్ట్’ కధనం సారాంశం.   వచ్చే ఎన్నికల్లో బిజెపి గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడిని ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దించితే, ఆయనను ఎదుర్కొనే సత్తా రాహుల్ కు లేదని, ఆ సత్తా చిదంబరం కు మాత్రమే ఉందని ఈ పత్రిక అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘ఎఫ్ డి ఐ లఫై పార్లమెంట్లో పార్టీని గట్టేన్కించడానికి చిదంబరం బలంగా ప్రయత్నం చేశారు. సోనియా విశ్వసిస్తే, చిదంబరం ప్రధాని పదవికి తగిన వాడు’ అని ఈ అంతర్జాతీయ పత్రిక వెల్లడించింది.   ఈ కధనం ప్రచురణ వెనుక చిదంబరం హస్తం ఉందని, పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014 లో రాహుల్ గాంధీనే తమ ప్రధాని అభ్యర్ధి అని పార్టీ నేతలు అహ్మద్ పటేల్, షిండే వంటి నేతలు ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ ఈ పత్రిక కధనం కాంగ్రెస్ పార్టీలో అయోమయానికి కారణంగా నిలిచిన్దనేది కాదనలేని వాస్తవం.

 Srikakulam yerram naidu

ఎర్రం నాయుడు కుమారుడుకి పెద్ద బాధ్యత ?

              ఇటీవల మృతి చెందిన శ్రీకాకుళం మాజీ ఎం పి ఎర్రం నాయుడు స్థానంలో ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడుని వచ్చే ఎన్నికల్లో ఆయన తండ్రి స్థానం నుండి పోటీ చేయించాలని తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు నిర్ణయించారు.   అయితే, ఆయన రాజకీయ పరిపక్వత ఫై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. రామ్మోహన్ నాయుడు ఇంత వరకూ రాజకీయాల్లో లేరు. ఆయన వయసు కూడా తక్కువే. అలాంటి వ్యక్తికి ఇంత పెద్ద బాధ్యతా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాంటి నేతను ఏకంగా పార్లమెంట్ కు కాకుండా, ముందుగా అసెంబ్లీకి పోటీ చేయిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఎర్రం నాయుడు కుటుంబంఫై ఉన్న సానుభూతిని సొమ్ము చేసుకోదలిస్తే, మూడు సార్లు ఎల్ఎల్ఏ గా గెలిచిన ఆయన సోదరుడు ఎలాగూ ఉన్నారు. ఆయనను కూడా కాదని రామ్మోహన్ నాయుడుకు బాధ్యతలు అప్పగించడం ఏమిటనే చర్చ జరుగుతోంది.   ఎర్రం నాయుడు వారసుని విషయం లో సస్పెన్స్ తొలగిపోయిందని పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరో వైపు రామ్మోహన్ నాయుడును శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్చార్జ్ గా నియమించడంతో జిల్లాలోని ఇతర సీనియర్ నేతలు కిమిడి కళావెంకటరావు, తమ్మినేని సీతారాం, కావలి ప్రతిభా భారతి గుర్రుగా ఉన్నట్లు సమాచారం. వయసులో చిన్న వాడయిన రామ్మోహన్ నాయుడుకు ఈ బాధ్యత అప్పగించే విషయంలో ఈ నేతలు మొదటి నుండి అందుకు విముఖత చూపిస్తూ వచ్చారు. కళావెంకటరావు అయితే, ఈ నియామకం విషయంలో అప్పుడే తుది నిర్ణయం తీసుకోవద్దని స్వయంగా చంద్ర బాబు ను కూడా కలిసి విన్నవించుకున్నారు.   ఇంత మంది సీనియర్ లు ఉండగా, రాజకీయాల్లో ఓనమాలు కూడా ఇంకా దిద్దని రామ్మోహన్ నాయుడుకు ఈ బాధ్యత అప్పగించడం ఏమిటని పార్టీ వర్గాల్లో చర్చ మొదలయింది. ఇలాంటి నిర్ణయాలు పార్టీ పతనానికి కారణం అవుతాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నిర్ణయం ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని పార్టీ వర్గాల్లో చర్చ మొదలయింది.

Aishwarya Rai lauds Gujarat

గుజరాత్‌ సక్సెస్ కు సెల్యూట్ : ఐశ్వర్యారాయ్

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఆరోపణలు, ప్రత్యారోపణల్లో తలమునకలుగా ఉన్న ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై అనుకోని విధంగా అరుదైన ప్రశంసలు జల్లు కురిసింది. ఆయన సర్కారును బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ ప్రశంసలతో ముంచెత్తారు. మోడీ పేరును ప్రస్తావించకుండా ఆయన ప్రభుత్వ పనితీరును తెగ మెచ్చుకున్నారు. ‘గుజరాత్ విజయగాథకు సెల్యూట్ చేస్తున్నా. ఆ గాథ నాకు బాగా తెలుసు. గుజరాత్‌లో ఉంటే నా ఇంట్లో ఉన్నట్లే ఉంది. ఈ రాష్ట్రం రోజురోజుకూ బలోపేతమవుతోంది’ అని ఆమె ఆదివారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. ఐశ్వర్య మామ, నటుడు అమితాబ్ బచ్చన్ గుజరాత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండడం తెలిసిందే.

 FDI to bring new technology in agriculture

ఎఫ్డీఐల వల్ల రైతులకు మేలు : ప్రధానమంత్రి మన్మోహన్

  లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ స్వర్ణోత్సవానికి హాజరైన ప్రధానమంత్రి మన్మోహన్ భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనేలా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి పంజాబ్‌లోని రైతు సంఘాలు బలంగా మద్దతు తెలిపాయని అన్నారు. లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ స్వర్ణోత్సవానికి హాజరైన ప్రధానమంత్రి మన్మోహన్ భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనేలా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి పంజాబ్‌లోని రైతు సంఘాలు బలంగా మద్దతు తెలిపాయని అన్నారు. 

BS Yeddyurappa Karnatka Janata Party

కర్ణాటక జనతా పార్టీ ఆవిర్భావం

      మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కర్నాటక జనతా పార్టీనీ లాంఛనంగా ప్రారంభించారు. హవేరీ పట్టణంలో భారీ బహిరంగ సభను లక్షలాది మంది అభిమానుల మధ్య నిర్వహించారు. తన మాతృ పార్టీ భారతీయ జనతా పార్టీకి సవాల్ విసిరారు. బిజెపికి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి జనంలోకి రావాలని ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలో జగదీష్ శెట్టార్ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు. తన మద్దతుదారుల వల్లనే బిజెపి రాష్ట్రంలో మనుగడ సాగిస్తోందన్నారు. తనపై బిజెపి అధిష్టానం వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తన మద్దతుదారులు ఎవరూ పార్టీ నుండి ఇప్పుడు బయటకు రారన్నారు. వారిని వైదొలగాలని తాను ఎలాంటి ఒత్తిళ్లు చేయడం లేదన్నారు. తన కారణంగానే ప్రభుత్వం నిలబడిందన్నారు. బిజెపికి దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా యడ్యూరప్ప హవేరీలో బహిరంగ సభను ఏర్పాటు చేసి బిజెపికి తన బలాన్ని చూపించారు. యడ్యూరప్ప సభలో వేదికపై అధికార పార్టీకి చెందిన దాదాపు పదిమంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఆయనకు మద్దతుగా అక్కడే ఉన్నప్పటికీ వేదిక పైకి రానట్లుగా చెబుతున్నారు. యడ్యూరప్ప బయటకు వెళ్లి పోవడంతో ప్రభుత్వాన్ని రక్షించుకునేందికి బిజెపి ప్రయత్నాలు సాగిస్తోంది.

FDI voting

ఎట్టకేలకు ‘ఎఫ్ డి ఐ’ లో యూపిఏ విజయం

        చిల్లర వాణిజ్యంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పార్లమెంట్లో గ్రీన్ సిగ్నల్ లభించింది. నిన్న రాజ్య సభలో జరిగిన ఓటింగ్లో 123-102 ఓట్ల తేడాతో ఈ అంశానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ఓటింగ్ లో గెలుపొందడానికి యూపిఏ నేతలు తెర వెనుక రాజకీయాలు బాగానే చేయాల్సి వచ్చింది.   ములాయం, మాయావతి ప్రభుత్వానికి సహకరించడం, 21 ఓట్ల తేడాతో గెలుపొందడంతో అధికార పక్ష నేతలు ఊపిరిపీల్చుకున్నారు. దీనితో ఎఫ్ డి ఐ లకు వ్యతిరేకంగా అన్నాడిఎంకే ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయినట్లయింది. మొత్తం 19 మంది సభ్యులు ఈ ఓటింగ్ లో పాల్గొనలేదు.   ములాయం పార్టీ సభ్యులు ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ముగ్గురు తెలుగు దేశం పార్టీ సభ్యులు కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. సభ లో యూపిఏ కు 94 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఓటింగ్ కు 19 మంది సభ్యులు హాజరు కాలేదు. 17 మంది సభ్యులు కలిగి ఉన్న మాయావతి పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న నేదురుమల్లి జనార్ధన రెడ్డి, స్త్రేచేర్ ఫై వచ్చి ఓటు వేసారు.   నిన్న రాజ్య సభలో ఎఫ్ డి ఐ ఓట్ల లెక్కింపు సమయంలో కాస్త గందరగోళం చోటుచేసుకొంది. రాజ్య సభ అధికారులు ఓట్ల లెక్కింపును సరిగా చేయక పోవడమే ఇందుకు కారణం. ఈ తీర్మానానికి అనుకూలంగా 109 ఓట్లు, వ్యతిరేకంగా 123 ఓట్లు వచ్చినట్లు ప్రకటించారు. ఈ గణాంకాలను సభ లో ఉన్న సభ్యుల సంఖ్యతో పోల్చిచూస్తే, లెక్క సరిగా లేనట్లు గుర్తించారు. దీనితో, రెండో సారి లెక్కింపును చేపట్టాల్సి వచ్చింది. ఈ దఫా లెక్కింపులో ప్రభుత్వానికి అనుకూలంగా 123 ఓట్లు, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చినట్లు తేల్చారు. దీనితో ప్రభుత్వం గట్టెక్కింది.

 sonia gandi

సోనియాతో తెలంగాణా కాంగ్రెస్ ఎంపిల భేటీ

    కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తో తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపిలు ఈ ఉదయం సమావేశం అయ్యారు. ఈ సమావేశం దాదాపు 45 నిమిషాల పాటు జరిగినట్లు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం విషయం ఫై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. ఈ అంశం ఫై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎంపిలు సోనియాను కోరినట్లు సమాచారం.   తెలంగాణా ప్రాంతంలో ఉన్న సమస్యలను కూడా వారు తమ నాయకురాలికి వివరించారు. అయితే, సోనియాతో తాము జరిపిన చర్చల వివరాలను మీడియా కు చెప్పమని ఎంపి లు అన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ అజాద్, అహ్మద్ పటేల్ లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అఖిల పక్షం సమావేశం తర్వాత తెలంగాణా ఫై స్పష్టత వస్తుందని ఎంపిలు అన్నారు. ఆ సమయంలోనే తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అసలు రంగు కూడా బయట పడుతుందని వారన్నారు.  

sonia gandhi

సోనియమ్మ దయతలిచెన్... అపాయంట్మెంట్ ఇచ్చెన్...

  గత అనేక నెలలుగా తెలంగాణా యం.పీ.లు, నేతలు అమ్మ సోనియమ్మ దర్శనం కోసం ఎంత ప్రాదేయపడినా ఒప్పుకోనీ ఆమె, ఈ రోజు వారు ఆడిగిందే తడువు వారికి అపాయంట్మెంట్ ఇవ్వడమే గాక వారితో దాదాపు గంటసేపు మాట్లాడటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారు అంత పొంగిపోతారని ముందే తెలుసుంటే, ఆమె ఆపని ఎప్పుడో చేసిదేమో! అప్పుడప్పుడు ఇలాగే వారికి దర్శనం గ్రాంట్ చేస్తుంటే వారుకూడా తే.రా.సా. వైపు చూడడం మానుకోనేవారేమో పాపం. ఎవరేవిదంగా కమ్మలుకడితేనేమి, మొత్తం మీద కధ సుఖాంతమయింది అదే పదివేలు అని హుషారుగా బయటకి వచ్చేరు తెలంగాణా యం.పీ.లు.   సోనియమ్మ యఫ్.డి.ఐ., రాబర్ట్ వాద్రా గొడవల్లోపడి తమ తెలంగాణా సంగతి మరిచిపోయిఉండవచ్చుననే ఆలోచనతో వారు మళ్లీ ఆమెకు ‘తెలంగాణా ఇవ్వడం ఎంత అవసరమో, ఇవ్వకపోతే ఏ అనర్దాలు జరుగవచ్చో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ లాగ సవివరంగా గుర్తు చేసారు..ట! త్వరలో నిర్వహింపదలచిన అఖిల పార్టీ సమావేశం గురించి కూడా వారు చర్చినట్లు వార్త. ‘అఖిల పార్టీ సమావేశం’ ఈ సంవత్సరానికే ఒక గొప్ప పొలిటికల్ జోకు అని తే.రా.సా. నాయకులు, బి.జే.పి. నేతలు  జోకులు పేలుస్తున్నా ‘ఇది చారిత్రాత్మక సంఘటన’ అని తెలంగాణా యం.పీ.లు అని గర్వంగా చెప్పుకొస్తున్నారు. అయితే, “ఇది మాపార్టీని దెబ్బతీసేందుకే కాంగ్రేసు మొదలుబెట్టిన కొత్త నాటకం” అని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతూనే “దానిని ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు” అని తనకి తానూ దైర్యం చెప్పుకొంటూ, మనకూడా సవినయమగా తెలియజేసారు.

telangana

తెలంగాణ ఫై 28 న అఖిల పక్షం

  తెలంగాణా అంశంపై ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపి లు మొత్తానికి అనుకున్నది సాధించారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత ఈ నెల 28 న తెలంగాణా విషయం ఫై అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తమకు చెప్పారని ఎంపి లు మధు యాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్ లు వెల్లడించారు.దీనితో తెలంగాణ విషయం లో కేంద్రంలో కదలిక వచ్చినట్లు భావించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ కాంగ్రెస్ ఎంపి లు నేడు ఎఫ్ డి ఐ ల ఫై జరిగే ఓటింగ్ లో పాల్గొనున్నారు.ఈ రోజు ఈ ఎంపిలంతా హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తో పలు దఫాలుగా జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయి. వీరు తెలంగాణ విషయంలో పట్టుబట్టి ఉండడంతో, కాంగ్రెస్ అధిష్టానం దిగిరాక తప్పలేదు.  

తలాక్ కే బాద్ క్యా?

    నిన్న మొన్నటి వరకు ‘భాయి భాయి’ అని భుజాలు పూసుకు తిరిగిన కాంగ్రెస్ యం.ఐ.యం. పార్టీలు అఫీషియల్ గా ‘తలాక్’ చెప్పేసుకొన్నాక మొన్నజరిగిన శాశనసభ సమావేశాలలో ఒకరి మీద మరొకరు తల్వార్లు దూసుకొన్నారు. శంఖంలో పోస్తే గాని నీరు తీర్దం గానట్లు, సభలో మిగిలిన ఆ ముచ్చటకూడా పూర్తీచేసేసారు గనుక ఇక బహిరంగంగానే నిర్బయంగా తిట్టేసుకోవచ్చు. నోరార విమర్శలు చేసుకోవచ్చు. అయితే, ఇంతకాలం కాంగ్రెసుతో అంటకాగిన యం.ఐ.యం.కి హట్టాత్తుగా కాంగ్రెస్ అంటే ఎందుకు వెగటు పుట్టుకోచ్చింది? స్వయంగా మతతత్వపార్టీ అయ్యుండి, తన ముద్రని కాంగ్రేసుకి ఎందుకు అంటగట్టింది? కాంగ్రెసుతో విడాకులు తీసేసుకోన్నాక కిరణ్ కన్నా జగన్ మంచోడు అని ఓ మాటనేసిమరీ బయటకొచ్చిన అసదుద్దీన్ అక్కడనుండి నేరుగా చంచలగూడలో ఉన్న జగన్ ఆఫీసుకి వెళ్ళాకపోవడంతో ఆతను ఇంకా కొన్ని సస్పెన్స్ సీన్స్ చూపించబోతునట్లు అర్ధమవుతోంది. అయితే, మొన్న ఆ సస్పెన్స్ కీ తెరదించుతూ ఈ నెల అంటే డిసెంబర్ లో నిజామాబాదులో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు తెలియజేసాడు. అయితే, త్వరలో రాష్ట్రమంతా పర్యటించి కిరణ్ కుమార్ కి వ్యతిరేఖంగా ప్రచారం చేస్తానని అంతే గాకుండా రాబోయే ఎన్నికలలో వీలయినన్ని స్థానాలకి పోటిచేస్తామని ముందే చెప్పిన సంగతి గుర్తుకు తెచ్చుకొంటే, యం.ఐ.యం. కూడా వీలయినన్ని సీట్లు సంపాదించుకొని, మిగిలిన రాజకీయ పార్టీల మాదిరిగానే కేంద్రంలో, రాష్ట్రంలో చక్రం తిప్పేయాలని తహతహలాడుతునట్లు అర్ధమవుతుంది.  కాంగ్రేసుకి చిరకాలం తోక పార్టీగా మిగిలి పోవడంకంటే,  రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉన్నఈ తరుణంలోనే  ఒక ట్రయల్ వేసి అదృష్టం పరీక్షించుకోవడం మంచిదని భావించినట్లు అర్ధమవుతోంది. అందుకే యం.ఐ.యం. కాంగ్రెసుతో పూర్తిగా తెగ తెంపులు చేసేసుకొని మరీ బయటకి వచ్చేసింది. అయితే, ఎన్నికల ముందో లేక తరువాతనో అవసరాని బట్టి మళ్లీ కలవడం పెద్ద కష్టమూ కాదు నేరము కాదు గనుక, ప్రస్తుతానికి యం.ఐ.యం. ఇలాగ నిర్ణయం తీసేసుకొని ఉండవచ్చును.

తెలంగాణా ఎంపిలు ఇక కాంగ్రెస్ కు దూరం ?

    ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం విషయం ఫై పట్టుదలతో ఉన్న తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపి లు ఇక కాంగ్రెస్ కు దూరమయినట్లే భావిస్తున్నారు. ఎఫ్డిఐల విషయం ఫై పార్లమెంట్లో ఓటింగ్ జరగనుండటంతో ఈ ఎంపి లతో చర్చలు జరపాలని పార్టీ అధిష్టానం మంత్రులు కమల నాధ్, సుశీల్ కుమార్ షిండేలను ఆదేశించింది. అయితే, ఎంపి లు ఈ సమావేశానికి డుమ్మా కొట్టి టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో చర్చలు జరపడం చర్చనీయాంసంగా మారింది. కేంద్ర మంత్రులు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఎంపి లు పొన్నం ప్రభాకర్, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాజయ్య, మంద జగన్నాధం లు హాజరు కాలేదు. పార్టీ అధిష్టానం కూడా వీరి తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.నేడు పార్లమెంట్లో ఓటింగ్ జరగనుండడంతో, ‘తెలంగాణా’ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ ఎంపి లు డిమాండ్ చేస్తున్నట్లు తెలంగాణ విషయం ఫై అఖిల పక్షం ఏర్పాటు విషయంలో ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.ఓటింగ్ విషయం లో పార్టీని ఇరుకున పెట్టి, తద్వారా తెలంగాణా విషయంలో ఓ అడుగు ముందుకు వేద్దామని భావిస్తున్న వీరికి, ఓటింగ్ లో పార్టీ గట్టేక్కితే తమ పరిస్థితి ఏమిటన్నది అంతుపట్టడం లేదు.  

ఎఫ్డీఐలపై ఓటింగ్ : యూపీఏ భవిష్యత్తుపై ఉత్కంఠ..!

    ఎఫ్డిఐ లఫై పార్లమెంట్ లో ఈ రోజు చర్చ జరుగునున్న సమయంలో, అందరి కళ్ళు కేంద్రంలోని మన్మోహన్ సర్కారు భవితవ్యం ఫై ఉన్నాయి. కాగా, రేపు ఓటింగ్ జరుగుతుంది. ఇన్ని రోజులు మమత బెనర్జీ పార్టీ అండతో నెట్టుకు వస్తున్న కేంద్ర ప్రభుత్వం రేపు జరిగే ఓటింగ్ లో గట్టెక్కాలంటే ఎస్పి, బిఎస్పి ల్లో ఏదో ఒక పార్టీ మద్దతు పొందటం అవసరం. ప్రస్తుతం యుపిఏ ప్రభుత్వానికి 265 మంది సభ్యులు ఉన్నారు. బిఎస్పి కి లోక్ సభ లో ప్రస్తుతం 21 మంది, రాజ్యసభ లో 15 మంది ఎంపి లు ఉన్నారు. ఎస్పి కి లోక్ సభ లో 22 మంది, రాజ్య సభ లో ఐదుగురు ఎంపిలు ఉన్నారు. ములాయం, మాయావతి లిద్దరూ ప్రభుత్వానికి మద్దతిస్తే, యుపిఏ సంఖ్యా బలం 300 దాటుతుంది. యుపిఏ ప్రభుత్వం గట్టెక్కాలంటే,ఈ రెండింటిలో ఏ ఒక్క పార్టీ మద్దతిచ్చినా సరిపోతుంది. అయితే, ఈ ఇద్దరు నేతలు ఇంతవరకూ తమ వైఖరిని స్పష్టంగా చెప్పక పోవడమే అసలు సమస్యకు కారణం. ఈ రెండు పార్టీల నేతలు ఎఫ్డిఐ లను వ్యతిరేకిస్తామని చెప్పినప్పటికీ, చివరకు ఓటు ఎటు వైపు వేస్తామనేది మాత్రం ఇంత వరకూ స్పష్టం చేయలేదు. ఈ అంశం ఫై రాజ్య సభ లో ఓటింగ్ జరిగితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఓ సమాజ్ వాదీ పార్టీ ఎంపి స్పష్టం చేశారు. అయితే, లోక్సభ లో ఓటింగ్ విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. మాయావతి కూడా తమ నిర్ణయాన్ని ఓటింగ్ జరిగే రోజు వెల్లడిస్తామని చెప్పడంతో, సర్కారు భవితవ్యం ఫై అంతటా సస్పెన్స్ నెలకొనిఉంది. ఎస్సీ, ఎస్టీ లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించే విషయంలో మాయావతి, ములాయంలకు విభేదాలు ఉన్నాయి. ఈ అంశం ఫై పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ ప్రవేశ పెడతామని హామీ ఇవ్వడం ద్వారా మాయావతి ని మచ్చిక చేసుకొనే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉంది. అంతిమంగా, మన్మోహన్ సర్కారు భవిత్యం తేలాలంటే వేచి చూడాల్సిందే.

తెలంగాణా సిట్టింగ్ ఎంపిలకు మళ్ళీ అవకాశం లేదా ?

    రాష్ట్రంలోని అనేక మంది తెలంగాణా కాంగ్రెస్ సిట్టింగ్ ఎం పి లకు 2014 లో తిరిగి పోటీ చేసే అవకాశం లభించదా ? ప్రస్తుతం జరుతున్న పరిణామాలను పరిశీలిస్తే, ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే లభిస్తోంది. పరిస్థితులెలా ఉన్న, తెలంగాణ ఫై నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ హై కమాండ్ కు అంత తేలిక కాదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మనుగడకు అవసరమైన ఎక్కువ మంది ఎంపిలను అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయినప్పటికీ, వచ్చే ఎన్నికల్లో ఇంత మంది ఎంపి స్థానాలను రాష్ట్రం నుండి తిరిగి పొందలేక పోయినా పరవాలేదు కానీ, తెలంగాణా రాష్ట్రాన్ని మాత్రం ఇచ్చేది లేదని సోనియా గాంధీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యెక తెలంగాణా విషయంలో పట్టుదలతో ఉన్న కేశవ రావు వంటి సీనియర్ నాయకులను పార్టీ అధిష్టానం పక్కన పెట్టడం వంటి విషయాలను పరిశీలిస్తే తెలంగాణ ఫై పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ నాయకులు తమ పట్టు సడలించుకోవాలని అధిష్టానం సూచిస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ దూతలు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున ఎం పి స్థానాలకు పోటీ చేసే అభ్యర్దుల విజయావకాశాలఫై ప్రస్తుతం సర్వే చేస్తున్నారు. కేవలం సిట్టింగ్ ఎం పి లకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంటే, ఇంత సర్వే చేయాల్సిన అవసరం లేదని రాహుల్ దూత హైదరాబాద్ లో వ్యాఖ్యానించినట్లు సమాచారం.  ఈ పరిణామాలను పరిశీలిస్తే, 2014 లో రాష్ట్రంలో ఎంత మంది సిట్టింగ్ ఎం పి లు తిరిగి టికెట్లు పొందుతారనే దాని ఫై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.