ఎఫ్డీఐలపై ఓటింగ్ : యూపీఏ భవిష్యత్తుపై ఉత్కంఠ..!
ఎఫ్డిఐ లఫై పార్లమెంట్ లో ఈ రోజు చర్చ జరుగునున్న సమయంలో, అందరి కళ్ళు కేంద్రంలోని మన్మోహన్ సర్కారు భవితవ్యం ఫై ఉన్నాయి. కాగా, రేపు ఓటింగ్ జరుగుతుంది. ఇన్ని రోజులు మమత బెనర్జీ పార్టీ అండతో నెట్టుకు వస్తున్న కేంద్ర ప్రభుత్వం రేపు జరిగే ఓటింగ్ లో గట్టెక్కాలంటే ఎస్పి, బిఎస్పి ల్లో ఏదో ఒక పార్టీ మద్దతు పొందటం అవసరం.
ప్రస్తుతం యుపిఏ ప్రభుత్వానికి 265 మంది సభ్యులు ఉన్నారు. బిఎస్పి కి లోక్ సభ లో ప్రస్తుతం 21 మంది, రాజ్యసభ లో 15 మంది ఎంపి లు ఉన్నారు. ఎస్పి కి లోక్ సభ లో 22 మంది, రాజ్య సభ లో ఐదుగురు ఎంపిలు ఉన్నారు. ములాయం, మాయావతి లిద్దరూ ప్రభుత్వానికి మద్దతిస్తే, యుపిఏ సంఖ్యా బలం 300 దాటుతుంది.
యుపిఏ ప్రభుత్వం గట్టెక్కాలంటే,ఈ రెండింటిలో ఏ ఒక్క పార్టీ మద్దతిచ్చినా సరిపోతుంది. అయితే, ఈ ఇద్దరు నేతలు ఇంతవరకూ తమ వైఖరిని స్పష్టంగా చెప్పక పోవడమే అసలు సమస్యకు కారణం. ఈ రెండు పార్టీల నేతలు ఎఫ్డిఐ లను వ్యతిరేకిస్తామని చెప్పినప్పటికీ, చివరకు ఓటు ఎటు వైపు వేస్తామనేది మాత్రం ఇంత వరకూ స్పష్టం చేయలేదు.
ఈ అంశం ఫై రాజ్య సభ లో ఓటింగ్ జరిగితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఓ సమాజ్ వాదీ పార్టీ ఎంపి స్పష్టం చేశారు. అయితే, లోక్సభ లో ఓటింగ్ విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. మాయావతి కూడా తమ నిర్ణయాన్ని ఓటింగ్ జరిగే రోజు వెల్లడిస్తామని చెప్పడంతో, సర్కారు భవితవ్యం ఫై అంతటా సస్పెన్స్ నెలకొనిఉంది.
ఎస్సీ, ఎస్టీ లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించే విషయంలో మాయావతి, ములాయంలకు విభేదాలు ఉన్నాయి. ఈ అంశం ఫై పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ ప్రవేశ పెడతామని హామీ ఇవ్వడం ద్వారా మాయావతి ని మచ్చిక చేసుకొనే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉంది. అంతిమంగా, మన్మోహన్ సర్కారు భవిత్యం తేలాలంటే వేచి చూడాల్సిందే.