అవి జగన్ ఓట్లు కావు.. షర్మిల

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైసీపీ అత్యంత ఘోరమైన, అవమానకరమైన ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో  151 స్థానాలలో ఆ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఐదేళ్ల పాలనా వైభోగాన్ని చూసి ఇక దయచేయండి అని మర్యాద కూడా లేకుండా చెప్పారు. కుల, మత, వర్గ, ప్రాంతీయ బేధాలు లేకుండా రాష్ట్రం మొత్తం ఒకే విధమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు సారాంశం, అధికారానికే కాదు, కనీసం విపక్షంగా కూడా ఉండేందుకు వైసీపీని అంగీకరించం అన్నదే.  ఇంతటి ఘోర ఓటమి తరువాత కూడా వైసీపీ తమకు 39శాతం మంది ప్రజలు మద్దతుగా ఉన్నారంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. కళ్లు మూసి తెరిచేసరికి ఐదేళ్లూ పూర్తవుతాయి, మళ్లీ మనదే అధికారం అంటే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంకా జనాలను, తమ పార్టీ నేతలు, క్యాడర్ ను నమ్మించడానికి చూస్తున్నారు.  ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు పక్క చూపులు చూస్తున్నారు. పార్టీ నుంచి వైదొలగడానికి అవకాశం కోసం చూస్తున్నారు. ఆ విషయాన్ని దాపరింకం లేకుండా బాహాటంగానే చెప్పేస్తున్నారు. అయినా జగన్ మాత్రం 40 శాతం మంది మద్దతు ఉందన్న భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమలన్నీ పటాపంచలైపోయేలా షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలా లేదా అన్న విషయంపైనే జరిగాయనీ, జనం జగన్ ను నిర్ద్వంద్వంగా తిరస్కరించి చంద్రబాబుకు పట్టం కట్టారని షర్మిల చెప్పారు. వైసీపీకి వచ్చిన 39శాతం ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీవేననీ, అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో అవి వైసీపీకి పడ్డాయనీ వివరించారు.  ముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్దు అనుకున్న వారు మాత్రమే  జగన్ కు ఓటేశారు తప్ప వాళ్లెవరూ జగన్ ను నమ్మడం లేదనీ, విశ్వసించడం లేదనీ షర్మిల అన్నారు.  ఇటీవలి ఎన్నికలలో జగన్ పార్టీకి ఓటేసిన వాళ్లంతా  కాంగ్రెస్  నుంచి అటువైపు వెళ్లిన వాళ్లే. వాళ్లంతా మా వాళ్ళు. మా వాళ్లను మేం రాబట్టు రాబట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ పార్టీకి ఓటేసిన 39శాతం మందీ కాంగ్రెస్ వారేనని ఆమె తెలిపారు. అది మా ఓటు బ్యాంకు. 2029లో ఆ విషయం అందరికీ అర్ధమౌతుందని చెప్పారు.  అంటూ షర్మిల వివరించారు.

హీరో  రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ ...సుసైడ్ చేసుకుంటానంటూ ఫోన్ చేసిన లావణ్య

గత వారం రోజులుగా అనేక మలుపులు తిరుగుతున్న హీరో రాజ్ తరుణ్ , లావణ్యల వివాదం గత రాత్రి మరో మలుపు తిరిగింది. రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడని, మాల్వీ మల్హోత్రా మాయలో పడి రాజ్ తరుణ్ తనను కాదని ఎంజాయ్ చేస్తున్నాడని112 పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానని, రాజ్ లేని జీవితాన్నితాను ఊహించలేకపోతున్నానని, సుసైడ్ చేసుకుంటానని లావణ్య పోలీసులకు చెప్పింది. సిస్టం తనకు అండగా నిలిచిందని, కానీ నేను ఫైయిల్ అయ్యానని లావణ్య పేర్కొంది.తన తినడానికి తిండి  కూడా లేదని  కన్నీళ్లు పెట్టుకున్నా రాజ్ కనికరించడం లేదని లావణ్య ఆరోపించింది.  తన చావుకు మాల్వీ మల్హోత్రా పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఈ ఫోన్ కాల్ రాకతో నార్సింగ్ పోలీసులు  అలర్ట్ అయ్యారు. హుటా హటిన లావణ్య నివాసానికి వెళ్లి ఆమెను బయటకు రప్పించి మాట్లాడారు. బలవంతంగా సుసైడ్ చేసుకోవద్దని, న్యాయం చేస్తామని పోలీసులు నచ్చజెప్పారు. 

సీబీఎన్.. 30 రోజులలోనే రాష్ట్ర ముఖచిత్రం మార్పు.. ఆ వేగం అనితర సాధ్యం!

జగన్  ఐదేళ్ల పాలనలో పొరుగు రాష్ట్రాలకు హేళనలకు గురైన ఆంధ్రప్రదేశ్ ను తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నెల రోజులలోనూ అభివృద్ధికి ఆనవాలుగా మార్చేశారు చంద్రబాబు. అరకొర సంక్షేమం వినా, అభివృద్ధి ఊసే లేకుండా అద్వానంగా మారిన రాష్ట్రాన్ని తాను అధికారపగ్గాలు చేపట్టిన 30 రోజుల వ్యవధిలో అడుగడుగునా అభివృద్ధి ఆనవాలు కనిపించేలా మార్చేశారు చంద్రబాబు.   రాజకీయ పరిశీలకులు సైతం చంద్రబాబు వేగం అనితర సాధ్యం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచీ ఎన్నికల వాగ్దానాల అమలుతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఐదేళ్ల విధ్వంస పాలన కారణంగా ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను సాధ్యమైనంత త్వరగా కడతేర్చాలన్న లక్ష్యంతో పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. జనం ఆయన వేగం అనితర సాధ్యం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన  నెల రోజులలో ఆయన ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా, రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించేలా మొత్తం 30 కార్యక్రమాలను చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 15, 347 టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు పెంచిన వృద్ధాప్య, వితంతు పింఛన్లను అరియర్స్ తో ఒకటో తేదీనే అందజేశారు. అదే విధంగా దివ్యాంగ పించన్ ను రెట్టింపు చేసి అంటే గతంలో 3000 ఉన్న పించన్ ను 6000కు పెంచి అందజేశారు.  వృద్ధాప్య పించన్లను ప్రభుత్వోద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పంపిణీ చేశారు. ఇక రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకు కారణమై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. గతంలో బంగారం కంటే ప్రియంగా మారిన ఇసుక ఇప్పుడు లోడింగ్, రవాణా చార్జీలు చెల్లించి ఉచితంగా పొందవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఇక గంజాయి, డ్రగ్స్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపారు. రాజధాని అమరావతి పనులను పరుగులెత్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పున: ప్రారంభించారు. స్కిల్ సైన్సెస్ పై కసరత్తు ఆరంభమైంది.  తల్లికి వందనం పథకం కింద ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే వారందరినీ ఆర్థిక దన్ను అందించే కార్యక్రమానికి మార్గదర్శకాలు విడుదల చేశారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణలోకి మళ్లించి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేశారు.   జగన్ బొమ్మతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాల స్థానంలో రాజముంద్రతో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు.  మహిళల భద్రతకు పెద్ద పీట వేశారు. అత్యాచార నిందితులకు కఠిన చర్యలు తప్పవన్న స్పష్టమైన హచ్చరిక చేశారు.   రెండేళ్లల్లో అంటే 2026 నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేయాలని సంకల్పించడమే కాకుండా అందుకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహననాయుడిచే 2026 నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి అవుతుందన్న ప్రకటన చేయించారు.  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో గత ఐదేళ్ల కాలంలో భ్రష్టుపట్టిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు తిరుమలలో ప్రక్షాళన కార్యక్రమం ఆరంభమైంది. కేంద్రం నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుమతి మంజూరయ్యిందంటే అందుకు చంద్రబాబు ఒత్తిడే కారణమనడంలో సందేహం లేదు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందించారు.  జగన్ హయాంలో పారిశ్రామికంగా ఒక్కటంటే ఒక్క అడుగు పడలేదు సరికదా, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పొరుగురాష్ట్రాలకు తరలిపోయాయి. అటువంటిది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 30 రోజులలోనే రాష్ట్రానికి 70వేల కోట్ల పెట్టుబడితో బీపీసీఎస్ సంస్థ ముందుకు వచ్చింది. అలాగే అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఎల్ విద్యాసంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చింది.   ఇక ఇరిగేషన్ రంగంలో కూడా ప్రగతి, పురోగతి స్పష్టంగా కనిపిస్తోంది. ఐదేళ్ల తరువాత తొలి సారిగా పలాసకు సాగునీరు అందింది. అలాగే ఐదేళ్ల తరువాత పురుషోత్తపట్నం నీళ్లు పిఠాపురానికి అందాయి. ఒకే ఒక్క వాట్సప్ కాల్ తో పాతిక మంది దివ్యాంగ విద్యార్థులకు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో జారిపోయాయనుకున్న సీట్లు తిరిగి వచ్చాయి.  ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందాయి.  విజయవాడ తూర్పు బైపాస్ కు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. తెలంగాణతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారినికి ముందడుగు పడింది. ఇక సామాన్యుడికి భారంగా మారిన నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు ప్రారంభమయ్యాయి. రైతు బజార్లలో కందిపప్పును చౌక ధరకు విక్రయిస్తున్నారు.  రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలను పరుగులు పెట్టిస్తూనే.. కేంద్రం నుంచి సహకారం విషయంలో కూడా చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం హోదాలో రెండు రోజుల పాటు హస్తినలో పర్యటించిన ఆయన ప్రధాని, హోంమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.  

తిరుమల కిటకిట.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. తిరుమలేశుని దర్శనానికి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. శనివారం (జులై 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కాంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. ఇక శుక్రవారం (జులై 12) శ్రీవారిని మొత్తం 63వేల 493 మంది దర్శించుకున్నారు. వారిలో 31 వేల 676 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హండీ ఆదాయం 4 కోట్ల 69లక్షల రూపాయలు వచ్చింద. వారంతం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఆదివారం (జులై 14)కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. 

అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు.. కేసీఆర్ దారి ఇదేనా?

బీఆర్ఎస్ రోజు రోజుకూ బ‌ల‌హీన‌ప‌డుతోందా, ఆ పార్టీ అస్థిత్వమే ప్రమాదంలో పడిందా?   ఆ పార్టీకి రాజ‌కీయ భ‌విష్య‌త్తు శూన్యమేనా? అంటే తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో  అవున‌నే స‌మాధానం రాజ‌కీయ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. ప‌దేళ్లు తెలంగాణ రాజ‌కీయాల‌ను శాసించిన కేసీఆర్‌.. కేంద్రంలోనూ చ‌క్రం తిప్పేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీని టార్గెట్ చేసుకొని దేశ రాజ‌కీయాల్లో కీ రోల్ పోషించాల‌ని ఉవ్విళ్లూరారు. కానీ, రాజ‌కీయాల్లో అన్నిరోజులు మ‌న‌కు అనుకూలంగా ఉండ‌వ‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. తెలంగాణ ప్ర‌జ‌లు ఇచ్చిన షాక్ కు అధికారం కోల్పోయిన కేసీఆర్,  ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం నుంచి ఎదుర‌వుతున్న ముప్పేట దాడిని ఎలా ఎదుర్కోవాలో తెలియ‌క దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయారు. ఒక‌వైపు మద్యం కుంభకోణం కేసులో కూతురు క‌విత కొన్ని నెల‌లుగా జైల్లోనే ఉంటున్నారు. ఆమెను బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు కోర్టుల ద్వారా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ ఫలితం క‌నిపించ‌డం లేదు. మ‌రో వైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేజారిపోతున్నారు. వారిని కాపాడుకొనేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌వుతున్నాయి. అన్ని వైపుల నుంచి ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాలంటే ఓ అడుగు వెన‌క్కు వేయాల‌ని కేసీఆర్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది‌. ఈ క్ర‌మంలోనే కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో రాజీ మార్గాన్ని అన్వేషిస్తున్న‌ట్లు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  ఉద్య‌మ స‌మ‌యంలో బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్)  తెలంగాణ‌లో తిరుగులేని శ‌క్తిగాఉంది. ప్ర‌త్యేక తెలంగాణ అవతరణ అనంత‌రం జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేసీఆర్ స్వ‌ల్ప ఆధిక్యంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ స‌మ‌యంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి అనేక మంది ఎమ్మెల్యేల‌ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. 2018లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ మ‌రోసారి బీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు చాలా చేశాం.. ఇక దేశ ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న భావ‌న‌కువ‌చ్చిన కేసీఆర్‌.. కేంద్ర రాజ‌కీయాల‌పై దృష్టి కేంద్రీక‌రించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని టార్గెట్ గా చేసుకొని కేంద్రంలో ఎన్డీయే, కాంగ్రెస్ వ్య‌తిరేక పార్టీల‌ను క‌లుపుకొని చ‌క్రం తిప్పాల‌ని కేసీఆర్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. ఒకానొక సంద‌ర్భంలో కాబోయే ప్ర‌ధాన మంత్రిని నేనే అంటూ కేసీఆర్ చెప్ప‌డం దేశ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. కానీ, సీన్ క‌ట్‌చేస్తే.. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ ప్ర‌జ‌లు కేసీఆర్ కు బిగ్ షాకిచ్చారు. బీఆర్ఎస్ పార్టీని గ‌ద్దె దింపి కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టం క‌ట్టారు. అయితే, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధిస్తే మ‌ళ్లీ రాజ‌కీయంగా పుంజుకోవ‌చ్చ‌ని భావించిన కేసీఆర్ కు తెలంగాణ ప్ర‌జ‌లు మ‌రో  బిగ్ షాకిచ్చారు. ఒక్క ఎంపీ స్థానంలోనూ ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌లేక పోయారు.  తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌టం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో కేసీఆర్ కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. తెలంగాణ‌లో ప‌దేళ్ల కాలంలో కేసీఆర్ ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌పై రేవంత్ రెడ్డి గురిపెట్టారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై దృష్టిసారించిన‌ రేవంత్ స‌ర్కార్‌.. కేసీఆర్ ను క‌ట‌క‌టాలపాలు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇదే స‌మ‌యంలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి విజ‌యం సాధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్ప‌టికే కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, ప్రకాష్ గౌడ్ లాంటి నేత‌లు కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. మ‌రో ప‌ది మంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. వీరిని క‌ట్ట‌డి చేసేందుకు కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎక్క‌డా ఫ‌లితాన్ని ఇవ్వ‌డం లేదు. దీంతో బీఆర్ఎస్  శ్రేణుల్లో రోజురోజుకు ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.   ద్వితీయ శ్రేణి నేత‌లు సైతం భారీ సంఖ్య‌లో కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. తాజా ప‌రిణామాల‌తో క్షేత్ర‌ స్థాయిలో బీఆర్ఎస్ బ‌ల‌హీన ప‌డుతోంది. పార్టీ క్యాడ‌ర్ ను కాపాడుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కాక‌పోగా.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి ఎదుర‌య్యే ఇబ్బందులు త‌ట్టుకోవటం కేసీఆర్ కు క‌ష్టంగా మారింది. దీంతో పార్టీ భ‌విష్య‌త్ ను ప‌క్క‌న‌ పెట్టిన కేసీఆర్‌.. ప్ర‌స్తుతం ఎదుర‌వుతున్న ఇబ్బందుల నుంచి త‌ప్పించుకునేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో రాజీ మార్గాన్ని ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది.  బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో  ఏనిమిది మంది కాంగ్రెస్  తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ కు విప‌క్ష హోదా లేకుండా చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కంక‌ణం క‌ట్టుకున్న‌ట్లు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఆగ్ర‌హానికి అడ్డుక‌ట్ట వేసేందుకు.. త‌న‌కు అనుకూల‌మైన కొంద‌రు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల‌ను కేసీఆర్‌ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల‌ని సూచించిన‌ట్లు తెలుస్తోంది. వారి ద్వారా కాంగ్రెస్   పెద్ద‌ల‌తో రాజీ కుదుర్చుకొని ప‌లు కేసుల్లో విచార‌ణ‌ నుంచి బయటపడేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రో వైపు కేంద్రంలోని బీజేపీని శాంతింప‌జేసేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం అయ్యేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు స‌మాచారం. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది‌. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీఫ్ ధన్ ఖడ్ తో సమావేశం అయ్యారనీ, ఆ సమావేశంలో విలీన అంశంపై చర్చలు జరిపారని ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. రాజ్యసభలో బీజేపీకి బలం అవసరం. పూర్తి మెజార్టీ లేదు. అందుకే రాజ్యసభ ఎంపీలను విలీనం చేసుకోవాలన్న ఆలోచనకు కేంద్ర‌ బీజేపీ పెద్ద‌లు వచ్చినట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. త‌ద్వారా క‌విత‌ను జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకురావ‌డంతోపాటు, కేంద్రం నుంచి ఎదుర‌య్యే ఇబ్బందుల నుంచి బ‌య‌ట ప‌డొచ్చ‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ని అంటున్నారు‌. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల టార్గెట్ నుంచి కేసీఆర్, ఆయ‌న ఫ్యామిలి కాస్త బ‌య‌ట‌ప‌డిన‌ట్లేన‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

చంద్రబాబు.. కాన్వాయ్ ఆపి మరీ ప్రజల చెంతకు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల పట్ల తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. తన నివాసం నుంచి చంద్రబాబు సచివాలయానికి వెళ్తుండగా తనకు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను చూసి రోడ్డుపై కాన్వాయ్ ఆపించారు. కొన్ని సంవత్సరాల క్రితం మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబసభ్యులు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సోమా భార్య ఇచ్చావతి యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. సోమ కుమారుడిని చదివించే బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మరికొందరు తమ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వగా పరిష్కరిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

మజ్లిస్ తో పొత్తు వల్లే బిజెపి బలపడింది: కురియన్ కమిటీ ముందు ఫిరోజ్ ఖాన్ 

తెలంగాణలో జరిగినపార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ బలపడకపోవడానికి కురియన్ కమిటీ రెండో రోజు పోస్ట్ మార్టం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం  తెలంగాణలో ఎనిమిది స్థానాలను  మాత్రమే గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఎన్నికల ప్రచారంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం వల్ల హిందూ ఓటర్లు బిజెపి వైపు వెళ్లారని అన్నారు. పార్లమెంటు ఎన్నికలలో  తెలంగాణపై ఎక్కువ ఆవలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం మిగిల్చింది. బిజెపి అభ్యర్థి మాధవిలత వర్సెస్ మజ్లిస్ అభ్యర్థి  అసదుద్దీన్ ఓవైసీ మధ్య పోటీ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఓడిపోయారు. బలహీన అభ్యర్థిని హైదరాబాద్ నియోజకవర్గం నుంచి నిలబెట్టడం వల్ల కాంగ్రెస్ ఓడిపోయిందని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుండబద్దలు కొట్టారు.  ఆయన గతంలో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఫిరోజ్ ఖాన్ స్టేట్ మెంట్ ను కురియన్ కమిటీ పరిగణలోకి తీసుకునే అవకాశాలున్నాయి. 

జూన్ 25 ఇక నుంచి ‘రాజ్యాంగ హత్య దినం’

దాదాపు 50 సంవత్సరాల క్రితం దేశంలో ఎమర్జెన్సీని విధించిన జూన్ 25వ తేదీని ‘రాజ్యాంగ హత్య దినం’ (సంవిధాన్ హత్యా దివస్)గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకే కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ప్రజలు అనుభవించిన హింసను జూన్ 25న గుర్తుచేసుకుంటామని పేర్కొన్నారు. ‘‘1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు. ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైళ్ళలో పెట్టారు. మీడియా గొంతును నొక్కేశారు. ఆ చీకటి రోజులకు నిరసనగా జూన్ 25ని ‘సంవిధాన్ హత్యా దివస్’గా నిర్వహించాలని నిర్ణయించాం. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తు చేసుకుందాం’’ అని అమిత్ షా ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

ఇప్పుడు జగన్‌‌‌ని ఇలా చేస్తే ఎలా వుంటుంది?

అధికారంలో వున్నప్పుడు విర్రవీగిన జగన్, ఆయన తాలూకు దండుపాళ్యం బ్యాచ్ చేయని అక్రమాలు లేవు. ఐదేళ్ళపాటు జగన్ ప్రభుత్వం లెక్కపెట్టడానికి కూడా వీల్లేనన్ని అన్యాయాలు, అక్రమాలు, దారుణాలు చేసింది. అవన్నీ ఇప్పుడు ఒక్కటొక్కటే బయటపడుతూ కళ్ళు తిరిగేలా చేస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గుడినా మనం ఐదేళ్ళు భరించింది అని జనం అనుకునేలా అవన్నీ వున్నాయి. సరే, వీటిని అలా వుంచితే, తనను వ్యతిరేకించే వాళ్ళను శారీరకంగా హింసించి ఆనందించే ‘సైకో’తనం జగన్‌లో పుష్కలంగా వుంది. అందుకే పార్లమెంట్ సభ్యుడు రఘురామరాజుని, చంద్రబాబు నాయుడిని అన్యాయంగా అరెస్టు చేసి వేధించాడు. ఇలా చాలామందిని అరెస్టు చేయించి పోలీసుల చేత చిత్రహింసలకు గురించేయించాడు. ఈ పాపాలన్నిటికీ జనం తగిన శిక్ష విధించారు. జగన్‌ని అధికార పీఠం మీద నుంచి కిందకి లాగి పక్కకి విసిరేశారు. ఇప్పుడు జగన్ తాను చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సిన సమయం వచ్చింది. జగన్ ప్రభుత్వం అధికారంలో వున్న సమయంలో తనను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని టీడీపీ ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో హింసకు ప్రేరేపించిన జగన్ మీద, దగ్గరుండి హింసించిన పోలీసు అధికారుల మీద కేసు నమోదైంది. ఈ కేసులో జగన్‌ని అరెస్టు చేసి, పోలీసులు చిత్ర హింసలకు గురిచేస్తే ఎలా వుంటుంది? దోమలు కుట్టే సెల్‌లో పడేసి చావగొడితే ఎలా వుంటుంది? వంతులవారీగా పోలీసులను పంపి, బూతులు తిట్టిస్తే ఎలా వుంటుంది? పోలీసులు లాఠీతో కుళ్ళబొడిస్తే ఎలా వుంటుంది? అలా కుళ్ళబొడవటాన్ని ఎవరికైనా లైవ్‌లో చూపిస్తే ఎలా వుంటుంది? అదేంటి? మా జగన్ని చిత్రహింసలకు గురిచేస్తారా... దారుణం.. అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని అరిచేవాళ్ళు చప్పుడు చేయకుండా ఓ పక్కన కూర్చోండి. ఇలాంటి హింసలనే పార్లెమెంటు సభ్యుడు రఘురామరాజుని సాక్షాత్తూ ఇదే జగన్ గురిచేశాడు. జగన్ పాటించిన పద్ధతిని ఆయన మీదే ప్రయోగిస్తే తప్పేముంది? సర్లే, భయపడకండి.. ఇప్పుడున్నది జగన్ లాంటి దుర్మార్గపు పరిపాలన కాదు.. చంద్రబాబు నాయుడి పరిపాలన. ఏది జరిగినా చట్టబద్ధంగానే జరుగుతుంది. అందువల్ల జగన్‌ని లాఠీలతో కుమ్మడం వుండదు!

బిఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూశారు: దానం నాగేందర్ 

బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో జరిగిన అవినీతికి  ప్రజలు బలయ్యారు. అదే సమయంలో ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ అహంకారానికి బానిసలయ్యారు.బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. కేసీఆర్ ను కలవడానికి ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ కూడా దొరికేది కాదని... ఒకవేళ దొరికినా గంటల తరబడి వెయిట్ చేయించేవారని విమర్శించారు. విలువ లేని చోట ఉండలేకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ ఒక కార్పొరేట్ సంస్థ మాదిరి నడిపారని దుయ్యబట్టారు. రెండు రోజుల్లో మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని... 15 రోజుల్లో బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పై ఎమ్మెల్యేలకు నమ్మకం లేదని అన్నారు.  బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారని దానం ఆరోపించారు. కేటీఆర్ బినామీలు కూడా వేల కోట్లు దోచేశారని చెప్పారు. వీటికి సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయట పెడతానని తెలిపారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నారని చెప్పారు. కవిత జైల్లో ఉంటే ఆమెను బయటకు తీసుకురాకుండా... రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ లో చివరకు నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు.

తప్పతాగి డ్రైవింగ్ చేస్తున్న 55 మందికి జైలు శిక్ష

తప్పతాగి డ్రైవింగ్ చేస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మద్యం తాగి వాహనాలను నడుపుతున్న మందుబాబులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహిస్తూ... మందుబాబులకు మత్తు దించుతున్నారు. తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జూలై 1 నుంచి 10 వరకు డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ 55 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది.  సిటీ ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ 10 రోజుల్లో 1,614 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 992 కేసుల్లో ఛార్జ్ షీట్లు నమోదు చేసి, కోర్టులో సమర్పించామని... 55 మందికి కోర్టు జైలు శిక్ష విధించిందని చెప్పారు. ఒక రోజు నుంచి 15 రోజుల వరకు జైలు శిక్ష విధించినట్టు తెలిపారు. శిక్ష పడిన వారిలో 8 మంది డ్రైవింగ్ లైసెన్స్ లను 2 నుంచి 6 నెలల పాటు రద్దు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. మిగిలిన వారి నుంచి ఫైన్ల రూపంలో రూ. 21.36 లక్షలు జమ అయిందని వెల్లడించారు.

హైద్రాబాద్ లో కాల్పుల కలకలం ఒకరి పరిస్థితి విషమం 

గ్రేటర్ హైద్రాబాద్ లో కాల్పుల కలకలం  మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల రాచకొండ పోలీసులు నల్గొండ హైవేపై పార్థీ గ్యాంగ్ పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. నాంపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ముఠా గూర్చి పోలీసులకు సమాచారం అందింది. వారిని అదుపులో తీసుకునే క్రమంలో అక్కడికి వెళ్లిన పోలీసులపై  వాళ్లు రాళ్లు, కత్తులతో దాడులు చేశారు. ఆత్మరక్షణ కోసం  పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ   గ్యాంగ్ నుంచి పోలీసులు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.     కొంత కాలంగా హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ చేసే ముఠాలు ఎక్కువగా తిరుగుతున్నాయి. దొంగల మీద కాల్పులు జరపడం అరుదుగా జరుగుతుంది. కానీ ఇటీవల హైదరాబాద్ లో దొంగలపై కాల్పులు జరపడం ఆనవాయితీగా మారింది. ఉత్తర భారత దేశానికి చెందిన పార్థీ గ్యాంగ్ నగరంలో చైన్ స్నాచింగ్ ముఠా దొంగతనాలకు పాల్పడుతుంది. గతంలో చిలకలగూడలో దొంగతనాలు చేస్తున్న ముఠాపై కూడా పోలీసులు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. 

రఘురామ ఫిర్యాదు.. జగన్ మీద హత్యాయత్నం కేసు!

నర్సాపురం పార్లమెంట్  మాజీ సభ్యుడు, ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదు మేరకు వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ మీద గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సునీల్ కుమార్ సీఐడీ డీజీగా పనిచేశారు. ఆ సమయంలో తనను కస్టడీలోకి తీసుకుని కొట్టడమే కాకుండా, తన మీద హత్యాయత్నం కూడా చేశారని రఘురామ కృష్ణంరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు సునీల్ కుమార్‌తోపాటు సీఐడీ మాజీ ఐజీ సునీల్ నాయక్, మాజీ డీఎస్పీ పాల్ మీద కూడా పొలీసులు కేసు నమోదు చేశారు.

కేజ్రీవాల్‌కి సుప్రీం కోర్టు బెయిలు.. అయినా జైల్లోనే!

ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్డు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే, ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ లభించినప్పటికీ, ఆయన సీబీఐ కేసులో కూడా అరెస్టు అయినందున తీహార్ జైల్లోనే వుండనున్నారు.  మద్యం కుంభకోణం కేసులు ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 9న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈడీ, కేజ్రీవాల్ వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం మే 17న తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం ‘‘ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి కేజ్రీవాల్ వైదొలగే విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో వున్నారు. అరెస్టు చేశారు కాబట్టి ముఖ్యమంత్రి పదవిలో వుండాలా, దిగిపోవాలా అనే నిర్ణయం ఆయనదే’’ అని వ్యాఖ్యానించింది.  కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో ఈడీకి వున్న అధికారాలు, పాలసీలపై కోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. ఆ తర్వాత సీఎం పిటిషన్‌పై విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.

కంగన కొత్త వివాదం... ఆధార్!

సినీ నటిగా ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన కంగనా రనౌత్ ఇప్పుడు బీజేపీ ఎంపీగా కూడా వివాదాల బాటలో పయనిస్తున్నారు. కంగన తన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం ప్రజల ముందు వుంచిన డిమాండ్ మీద ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. తన నియోజకవర్గం ప్రజలు తనను కలవటానికి వచ్చినప్పుడు ఆధార్ కార్డును తప్పనిసరిగా తెచ్చుకోవాలని కంగన డిమాండ్ చేస్తున్నారు. ‘‘నన్ను కలవటానికి వచ్చే నా నియోజకవర్గ ప్రజలు తమ దగ్గర ఆధార్ కార్డు తప్పనిసరిగా వుంచుకోవాలి. అలాగే, నన్ను ఎందుకు కలవాలని అనుకుంటున్నారో ఆ అంశాన్ని ఒక కాగితం మీద రాసి ఇవ్వాలి. దాని వల్ల ఎలాంటి అసౌకర్యానికి తావు వుండదు’’ అని కంగన సూచించారు. దీని మీద కాంగ్రెస్ నాయకుడు, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘మనం ప్రజా ప్రతినిధులం. రాష్ట్రంలో ప్రతి వర్గానికి చెందిన ప్రజలని కలవాల్సిన బాధ్యత మనమీద వుంది. మనల్ని కలవటానికి ప్రజలు ఆధార్ కార్డు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల్ని కంగన అలా డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. విక్రమాదిత్య సింగ్ మీదే మండి నియోజకవర్గం నుంచి కంగన విజయం సాధించారు.

తెలంగాణ ఆర్టీసీ బస్సులలో డిజిటల్ పేమెంట్లు!

ఇక తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ‘చిల్లర ఇవ్వండి’, ‘చిల్లర లేదు’... అనే మాటల వినిపించవు. ఎందుకంటే, తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో త్వరలో డిజిటల్ పేమెంట్ విధానం అందుబాటులోకి రాబోతోంది. ఆగస్టు నాటికి హైదరాబాద్ నగరంలో, సెప్టెంబర్ నాటికి తెలంగాణ రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు కండక్టర్లకు కొత్త టిక్కెట్ ఇష్యూయింగ్ మిషన్లు (టిమ్)లు అందించడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త టిమ్‌లలో టిక్కెట్ ధరకు క్యూఆర్ కోడ్ క్రియేట్ అవుతుంది. ప్రయాణికులు ఫోన్ ద్వారా పేమెంట్ చేసేయవచ్చు.  తెలంగాణ ఆర్టీసీలో తొమ్మిది వేలకు పైగా బస్సులు వున్నాయి. ఈ బస్సులు ప్రతి రోజూ 55 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. కొత్తగా జారీ చేయబోతున్న టిమ్‌లతో డెబిట్ కార్డు, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ‘మహాలక్ష్మి’ పథకం పెట్టిన తర్వాత బస్సులలో ఎక్కే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. త్వరలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేయబోతున్నారు. వాటిని స్వైప్ చేసి ‘జీరో’ టిక్కెట్ పొందాల్సి వుంటుంది. బయటకి వెళ్ళిన బస్సులు సాయంత్రం తిరిగి వచ్చే వరకు ఏ బస్సులో ఎంత ఆదాయం వుంది, ఏ బస్సు ఎక్కడ వుంది అనే విషయం డిపో అధికారులకు తెలిసే అవకాశం ఇప్పటి వరకు లేదు. కొత్త టిమ్‌ల ద్వారా బస్సు ఎక్కడ వుంది, సిబ్బంది పనితీరు, ఎంత ఆదాయం వచ్చింది.. అనే పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు డిపో అధికారులు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడానికి డిపో నుంచే కండక్లర్లకు సూచనలు ఇచ్చే వీలు కూడా వుంది. హైదరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ డిపోలలోని 74 బస్సులకు కొత్త టిమ్స్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు వెళ్ళే కొన్ని బస్సులో కూడా టిమ్స్ వాడకం ప్రారంభమైంది.

విరిగిపడ్డ కొండచరియలు... 65 మంది గల్లంతు!

నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుఝామున ఘోర ప్రమాదం జరిగింది. నారాయణ్‌ ఘాట్ - ముగ్‌లింగ్ జాతీయ రహదారి మీద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇవి రోడ్డు మీద దాదాపు 65 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులపై పడ్డాయి. దాంతో ఆ రెండు బస్సులు పక్కనే ఉన్న త్రిశూన్ నదిలో పడ్డాయి. బస్సులలో వున్నవాళ్ళలో ముగ్గురు తప్ప అందరూ గల్లంతు అయ్యారు. గల్లంతైన వారిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే మరో బస్సుపై కొండచరియలు విరిగిపడటంతో డ్రైవర్ మృతి చెందాడు. నదిలో పడిపోయిన రెండు బస్సులలో ఒక బస్సు 24 మంది ప్రయాణికులతో కాఠ్మాండూ వెళుతోంది. మరో బస్సులో 41 మంది వున్నారు. ఒక బస్సు నుంచి ముగ్గురు ప్రయాణికులు బయటకి దూకి తప్పించుకున్నారు. ఈ ఘటనపై నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ విచారం వ్యక్తంచేశారు. నేపాల్ సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాటలకు అర్థాలు వేరులే!

‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే...’ అనే పాటని ఇప్పుడు కాస్తంత మార్చుకుని.. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాటలకు అర్థాలు వేరులే...’ అని రాగాలు తీయాల్సిన పరిస్థ్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ త్వరలో ఖాళీ అవబోతోంది. కేసీఆర్ కుటుంబం, ఆ కుటుంబానికి వీర విధేయుల్లా వుండే ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా ఎమ్మెల్యేలందరూ త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా వున్నారు. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ప్రశాంతంగా వున్నారు. కాకపోతే వెరైటీ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో చేరినవారందరూ గతంలో ‘‘మేం బీఆర్ఎస్‌ని వదిలిపెట్టం.. మా కంఠంలో ప్రాణం వున్నంతవరకూ బీఆర్ఎస్‌లోనే వుంటాం’’ అని స్టేట్‌మెంట్లు ఇచ్చిన వాళ్ళే. ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా మీడియా ముందుకు వచ్చి, నేను బీఆర్ఎస్‌లోనే వుంటా... నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని పుకార్లు క్రియేట్ చేసే వాళ్ళ మీద కేసు పెడతా’ అని స్టేట్‌మెంట్ గనుక ఇచ్చారంటే, త్వరలో వారు బీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న విషయాన్ని జనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, ఆ తర్వాత సదరు నాయకులు ఎలాగూ కాంగ్రెస్‌లోకి జంప్ అవుతారు. అప్పుడు షాక్ అవకుండా వుండొచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, హైదరాబాద్ నగరంలో వున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు... పలువురు అనే మాటకంటే, దాదాపు అందరూ అనడం బెస్ట్.. అవును.. దాదాపు అందరూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ బాటలో వున్నారు. ఆల్రెడీ ఇద్దరు జాయిన్ అయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా పార్టీ మారబోతున్నారని వార్తలు వచ్చాయి. దాంతో ఆయన చాలా సీరియస్ అయిపోయారు. నేనేంటి, కాంగ్రెస్ పార్టీలో చేరేదేంటి? నీతి, నిజాయితీలకు ప్యాంటూ చొక్కా వేస్తే నాలాగే వుంటుంది అన్నంత రేంజ్‌లో మాట్లాడారు. తన పార్టీ మార్పు వార్తలని తీవ్రంగా ఖండించారు. మీడియా ముందు ఆయన ఆవేశం చూసి చాలామంది అయ్యో.. నిజమేనేమో అనుకున్నారు. అలా రెండ్రోజులు గడిచాయో లేదు.. ఆయనే స్వయంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని ప్రకటించారు. ఇలా వుంటాయి రాజకీయ నాయకుల వ్యవహారాలు. తన పార్టీ ఖాళీ అయిపోతోందని అర్థం చేసుకున్న కేసీఆర్, ఆమధ్య తన ఎమ్మెల్యేలందర్నీ పిలిపించుకుని, పార్టీ మారొద్దని హితవు పలికారు. అప్పుడు ఎమ్మెల్యేలందరూ ‘‘ఛ.. ఛ.. అలాంటిదేమీ లేదు దొరా’’ అని పెద్దాయనకి హామీ ఇచ్చి వచ్చారు. అలా హామీ ఇచ్చి వచ్చిన వారిలో ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్‌లో చేరారు. మిగతావాళ్ళు మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు.

స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. 16 మందికి గాయాలు!

స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగిన 16 మందికి కరెంట్ షాక్ కొట్టి గాయాలయ్యాయి. గాయాలైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. హైదరాబాద్ శివార్లలో వున్న జల్‌పల్లిలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌లో్ని ఆగాపురలో నివాసం వుండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది జల్‌పల్లిలోని ఒక ఫామ్‌హౌస్‌కి వెళ్ళారు. సాయంత్రం సమయంలో ఫామ్‌హౌస్‌లో వున్న స్విమ్మింగ్ పూల్‌లో 16 మంది దిగారు. అందరూ ఈత కొడుతూ వుండగా నీటిలోకి  ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అయింది. దాంతో పూల్ చివరి భాగంలో వున్న ఆరుగురు మహిళలు, ఐదుగురు పిల్లలు, ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. కొలను మధ్యలోనే వున్న పర్వేజ్ (19), ఇంతియాజ్ (22) రెండు నిమిషాలపాటు కరెంట్ షాక్‌కి గురయ్యారు. దాంతో వీరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిద్దరి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. స్విమ్మింగ్ పూల్ లోపల లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన వైరింగ్ తెగిపోవడం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.