ముసలాయన... ముద్దు పెట్టేసేవాడే!

అమెరికాలోని వైట్‌హౌస్ సందడి సందడిగా వుంది. ఆల్రెడీ అమెరికా ప్రెసిడెంట్‌గా చాలా ‘‘ఉత్సాహంగా’’ పరిపాలిస్తున్న జో బైడెన్ చుట్టూ చాలామంది లేడీసూ, జెంటిల్‌మన్సూ వున్నారు. వాళ్ళలో బ్లూ డ్రస్ వేసుకున్న ఒక లేడీ బైడెన్‌కి చాలా దగ్గరగా నిల్చుని మాట్లాడుతోంది. బైడెన్ కూడా ఆమెతో చాలా ఆసక్తిగా మాట్లాడుతున్నాడు. అలా ఆసక్తిగా మాట్లాడుతూ వుండగానే, బైడెన్ తలకాయ్, ఆమె తలకాయ్ కొంచెం దగ్గర అయ్యాయి. ఇద్దరి తలకాయల మధ్య దూరం ఒక జానెడు కూడా లేని పరిస్థితి. మన ముసలాయన బైడెనూ, ఆయన ఎదురుగా వున్న మహిళామణి ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు తదేకంగా చూసుకుంటున్నారు. చుట్టూ జనం హడావిడి వున్నప్పటికీ, వీళ్ళిద్దరూ ఏదో లోకంలో వున్నట్టుగా ఒకరి కళ్ళలోకి ఒకరు గుచ్చిగుచ్చి చూసుకుంటున్నారు. ఇంతలో బైడెన్ తన పెదాలను సున్నాలాగా చుట్టాడు. చాలా తమకంగా ఎక్స్.ప్రెషన్ ఇస్తూ తన మూతిని ఆమె మూతి వైపు క్రమంగా మళ్ళించాడు.. ఇంకో అరక్షణం లేటయినట్టయితే, ఎదురుగా వున్న మహిళామణి బైడెన్ నుంచి గోల్డ్ లాంటి ఓల్డు ముద్దు సొంతం చేసుకునేదే. కానీ, ఆ ప్రమాదం జరక్కుండా బైడెన్ భార్యామణి జిల్ బైడెన్ అడ్డుపడింది. ఎక్కడ నుంచి వచ్చిందోగానీ, గబగబా అక్కడకి వచ్చేసింది. బైడెన్‌కి, ఆ మహిళకి మధ్యలోకి దూరిపోయింది. ‘‘ఏంటీపని?’’ అన్నట్టుగా బైడెన్‌ని పక్కకి జరిపింది. బైడెన్ ఈ లోకంలోకి వచ్చినట్టుగా నాలుక కరుచుకుని పక్కకి తప్పుకున్నాడు. అప్పుడు బైడెన్ భద్రతా సిబ్బంది బైడెన్ ఇవ్వబోయిన కరెంట్ షాక్ లాంటి ముద్దు నుంచి తప్పించుకున్న సదరు మహిళామణిని అక్కడి నుంచి పక్కకి తప్పించారు. కొత్తదో, పాతదో తెలియదుగానీ, ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.  సరే, ముద్దు సంగతి అలా వుంచితే, బైడెన్‌కి 81 సంవత్సరాలు వచ్చేశాయి. మనిషి ఎప్పుడు చూసినా అయోమయం జగన్నాథం మాదిరిగా పనులు చేస్తున్నాడు. లేటెస్ట్.గా బయటకి వచ్చిన ముద్దు సీను మాదిరిగానే, గతంలో ఇలాంటి అయోమయం పనులు చాలానే చేశాడు. ఇలాంటి ముసలాయన మళ్ళీ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచాడు. ఈయనేమో  అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో వుంటే, ఈయన మీద పోటీ చేయబోతున్న 78 ఏళ్ళ డోనాల్డ్ ట్రంప్ మాత్రం చిచ్చరపిడుగులా చెలరేగిపోతున్నాడు. ఇటీవల ఒక బుల్లెట్ దూసుకొచ్చి ట్రంప్ చెవిని కొరికినప్పటికీ, ‘తగ్గేదేలా’ అన్నట్టుగా దూసుకెళ్తున్నాడు. అదే సమయానికి మన బైడెన్ మరోసారి కరోనా బారిన పడి, క్వారంటైన్‌లో వున్నాడు. అటుపక్క ట్రంప్ రెడ్‌బుల్‌లా వుంటే, ఇటుపక్క బైడెన్ బుల్‌డోజర్ మాదిరిగా తయారయ్యాడు. అందుకే డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు అమెరికా అధ్యక్ష బరిలో నుంచి తప్పుకోవాలంటూ బైడెన్‌ని డిమాండ్ చేస్తున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇదే మాట అన్నాడు. కరోనా క్వారెంటైన్ పూర్తయిన తర్వాత బైడెన్ ఈ విషయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా, 81 ఏళ్ళు వచ్చేసిన బైడెన్ ఇప్పటికే చీకేసిన తాటికాయలాగా అయిపోయాడు. పొరపాటున ఈయనగనుక మళ్ళీ అధ్యక్షుడు అయితే ఇంకెన్ని అయోమయం పనులు చేస్తాడో ఏంటో! అందువల్ల, ఈ పెద్దాయన పద్ధతిగా తప్పుకుని, ట్రంప్‌ని ఎదుర్కొనే గట్టి పిండానికి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బడ్జెట్ జగన్నాథం!

సొంత సొమ్ము సోమవారం ఒంటి పొద్దులుంటారు.. మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు అన్నట్లుగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన జగన్ ఇటీవలి ఎన్నికలలో పరాజయం పాలై అధికారం కోల్పోయారు. అయితే ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లలో కొద్ది పాటి దూరం ప్రయాణానికి కూడా ప్రత్యేక విమానాలు, చాపర్లనే ఉపయోగించారు. రోడ్డు మార్గంలో ప్రయాణం అన్న మాటే లేకుండా విమానయానాలు చేశారు. విదేశాలకు వెళ్లాలన్నా, ఢిల్లీ వెళ్లాలన్నా ఆయన చార్టర్డ్ ఫ్లైట్స్ నే ఉపయోగించారు. మళ్లీ అలాంటిలాంటివి కాకు అత్యంత లగ్జూరియస్ విమానాలనే ఉపయోగించారు. అటువంటి జగన్ అధికారం కోల్పోయిన తరువాత బెంగళూరు నుంచి గన్నవరానికి సాధారణ విమానంలో సతీమణితో కలిసి వచ్చారు.  సొంత సొమ్ము ఖర్చు చేయాల్సి వచ్చే సరికి ఆయనకు పొదుపు గుర్తుకు వచ్చినట్లుందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. జగన్ హయాంలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వోద్యోగులకు వేతనాలు చెల్లించడానికీ, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సొమ్ము బదలాయించడానికీ కూడా ప్రభుత్వం అప్పుల మీదే ఆధారపడింది. అప్పు చేయకుండా ప్రభుత్వానికి రోజు గడవని పరిస్థితి ఉంది. అంతటి ఆర్థిక సంక్షోభంలో కూడా జగన్ స్పెషల్ ఫ్లేట్లు ఆడంబరాలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడానికి ఇసుమంతైనా వెనుకాడలేదు. అంతెందుకు తన సొంత తాడేపల్లి ప్యాలెస్ ను క్యాంప్ ఆఫీసుగా మార్చేసుకుని ప్యాలస్ నిర్వహణ ఖర్చులు కూడా ప్రభుత్వ ఖజానాయే భరించేలా చూసుకున్నారు.  పోనీ జగన్ ఏమైనా సామాన్యుడా అంటే... దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎంగా గుర్తింపు పొందిన వ్యక్తి. అటువంటి సంపన్న జగన్ సొంత సొమ్ము ఖర్చు చేయాలనే సరికి అహా నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావులా పిసినారిగా మారిపోయారు. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ జగన్ ను నెటిజనులు ఓ ఆటాడేసుకుంటున్నారు. ముందు ముందు జగన్   సాధారణ విమనాలలో మరిన్ని పర్యటనలు చేస్తారని అంటున్నారు. ముందు ముందు ఆయన ప్రతి శుక్రవారం అక్రమాస్తుల కేసుల విచారణ కోసం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆయన హైదరాబాద్ లో ఉంటే ఫరవాలేదు కానీ, తాడేపల్లిలోనో, బెంగళూరులోనో ఉంటే మాత్రం కోర్టుకు హాజరయ్యేందుకు ఒక విమానం ఎక్కక తప్పదనీ, సొంత సొమ్ముతో చేయాల్సిన ప్రయాణాలు కనుక సాధారణ కమర్షియల్ ఫ్లైట్స్ నే ఆశ్రయిస్తారని చెబుతున్నారు. మొత్తం మీద సొంత సొమ్ము ఖర్చు చేయాలంటే జగన్ కు చేతులు రావడం లేదు.. అదే జనం సొమ్ముతో దర్జాగా ప్రత్యేక విమానాలలో విహారయాత్రలుగా  అధికార పర్యటనలు సాగించారనీ విమర్శలు గుప్పిస్తున్నారు. 

శాంతి భర్త  విదేశాలకు వెళ్లడానికి కారణమిదే

ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశమైన ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వివాదం రోజుకో ట్విస్ట్ చేరుకుంటుంది. తన బిడ్డకు అడ్వకేట్ సుభాష్ రెడ్డి తండ్రి అని చెబుతున్న శాంతి స్టేట్ మెంట్ పై అనేక అనుమానాలున్నాయి. శాంతి భర్త మదన్ మోహన్  ఇప్పటికే రాష్ట్ర హోం మంత్రి అనితను కల్సితనకు న్యాయం చేయాలన్నారు. శాంతికి పుట్టిన కొడుకు తన బిడ్డ కాదని మొదట్నుంచి  మదన్ మోహన్ చెబుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శాంతికొడుకుకు తండ్రి  అని ఆయన వాదిస్తున్నారు.  తన బిడ్డకు సుభాష్ రెడ్డి   తండ్రి అని శాంతి  పదే పదే చెబుతున్నిరు. ఎరుకుల కులంలో జన్మించిన శాంతి  విడాకులు చెల్లవు. కులాచారం ప్రకారం విడాకులు తీసుకున్నట్లు  శాంతి పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కులాచారం ప్రకారం విడాకులు చెల్లవు. శాంతి ప్రెస్ మీట్ లో  కన్నీరు మున్నీరు కావడం పలువురిని కలచి వేసినప్పటికీ చట్ట ప్రకారం ఈ విడాకులు చెల్లవు. న్యాయవాదిగా పనిచేసిన శాంతికి ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. ఓవర్ సీస్ స్కీం క్రింద  ఎస్ టి కులానికి చెందిన  శాంతి కి విదేశాలు వెళ్లడానికి అవకాశ మొచ్చింది. అప్పట్లో నిరుద్యోగి అయిన శాంతి  విదేశాలకు వెళ్లాల్సి ఉంటే  ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త మదన్ మోహన్  విదేశాలకు  ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. నిరుద్యోగి అయిన శాంతి కూడా ఈ స్కీంలో అర్హత ఉన్నప్పటికీ మదన్ మోహన్ విదేశాలకు వెళ్లారు. భర్త మదన్ మోహన్ ను విదేశాలకు వెళ్లడానికి శాంతితో వైకాపా నేత  అక్రమ సంబంధమే  అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త అయిన మదన్ మోహన్ ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఓవర్సీస్ స్కీం వర్తించదు. దారిద్యరేఖకు దిగువ ఉన్న వారికి ఈ స్కీం వర్తిస్తుంది. భార్యను  మదన్ మోహన్ ను  విదేశాలకు వెళ్లడానికి  వైకాపా నేత విజయసాయి రెడ్డి  ప్రోద్బలమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

‘ఏరా’ విజయసాయిరెడ్డికి మెంటలంట!

‘శాంతి’కాముకుడు, ఊరకుక్కలకు గురువు, బూతుల ఫ్యాక్టరీ ఓనరు ‘ఏరా’ విజయసాయిరెడ్డికి మెంటలెక్కింది. రామరామా.. ఈ ‘మెంటల్’ అనే మాట మాత్రం మేం అనడం లేదండీ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, ఎక్సయిజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అంటున్నారు. మొన్నీమధ్య ‘ఏరా’ విజయసాయిరెడ్డి వైజాగ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి, వైజాగ్ ఆస్పత్రి నుంచి పారిపోయి వచ్చిన రేంజ్‌లో ఇష్టమొచ్చినట్టు మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఏరా’ విజయసాయిరెడ్డి ‘వ్యవహారం’ మీద మంత్రిగారు రియాక్ట్ అయ్యారు. ‘‘ఈ ‘ఏరా’ విజయసాయిరెడ్డి తన మీద వచ్చిన ఆరోపణలకు సరైన సమాధానం చెప్పలేక, జర్నలిస్టులను ‘ఏరా, ఒరేయ్’ అనడం సిగ్గుచేటు. చేసిన పాపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా, తాను బాధ్యతల ఎంపీ హోదాలో వున్నాననే విషయం కూడా మరచిపోయి ‘ఏరా’ విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారు. దుర్మార్గంగా, బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు. మీడియా సంస్థల యజమానులు, జర్నలిస్టుల మీద ‘ఏరా’ విజయసాయిరెడ్డి విమర్శలు చేయడం సిగ్గుచేటు. దీనికి భవిష్యత్తులో ఆయన తప్పక మూల్యం చెల్లించుకుంటారు. ‘ఏరా’ విజయసాయిరెడ్డి కామంతో, పేర్ని నాని డబ్బు మదంతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారు. పేర్ని నాని అక్రమ ఆస్తుల చిట్టాలన్నీ మా దగ్గర వున్నాయి. వాటిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, అన్ని లెక్కలనూ త్వరలోనే తేల్చుతాం. ఒకవైపు ‘ఏరా’ విజయసాయిరెడ్డి, మరోవైపు పేర్ని నాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది’’ అని మినిస్టర్ కొల్లు రవీంద్ర అన్నారు.

జగన్ హయాంలో ఏపీ ఐటీ అధోగతి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ ఐదేళ్ల పాలన అన్ని విధాలుగానూ అధోగతి పాలు చేసింది. విభజిత రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం విభజిత రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు వేసిన ప్రగతి బాటలను ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీకి సైబరాబాద్ నిర్మాణం ద్వారా చంద్రబాబు బలమైన పునాది వేశారు. దాంతో  ఐటీ రంగంలో  లక్షలాదిమందికి ఉద్యోగాలు లభించాయి.  ఐ‌టి రంగంలో తెలుగు యువత అల్లుకుపోయి ప్రపంచ వ్యాప్తంగా దానిని  శాశించే స్థాయికి ఎదిగింది.   చంద్రబాబు వేసిన పునాదిపైనే హైదరాబాద్ అభివృద్ధిని  ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు విస్తరిం చాయి. ఇప్పటికీ హైదరాబాద్ అభివృద్ధి గురించిన ప్రస్తావన వస్తే ముందుగా ఎవరైనా చంద్రబాబు పేరే చెబుతారు. అంత మాత్రాన చంద్రబాబు తరువాత అధికారం చేపట్టిన పార్టీలు, ముఖ్యమంత్రులు హైదరాబాద్ ను నిర్వీర్యం చేసి అభివృద్ధి ఆనవాలును తుడిచేయడానికి ప్రయత్నించలేదు. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్ కోసం అమరావతి రాజధానిగా  చంద్రబాబు వేసిన పునాదులను జగన్ సర్కార్ విధ్వంసం చేసింది.  కేవలం చంద్రబాబుకు గుర్తింపు వస్తుంది. పేరు వస్తుంది. ఆయన కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్న దుగ్ధతోనే ఏపీని నో డెవలప్ మెంట్ స్టేట్ గా మార్చేశారు. జగన్‌ నిర్వాకం వలన గత  5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలోనూ చివరి నుంచి మొదటి స్థానంలోనిలిచింది. రాజధాని అమరావతిని పూర్తి చేస్తే చంద్రబాబుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు మరింత పెరుగుతుందని మూడు రాజధానుల నాటకానికి తెరలేపి దానిని నిర్వీర్యం చేసింది జగన్ సర్కార్. అలాగే పోలవరం ప్రాజెక్టు పురోగతిని కూడా నిలిపివేసింది.  అదే విధంగా యువతకు అపార ఉపాధి అవకాశాలను కల్పించే ఐటీ రంగాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది జగన్ సర్కార్.  చంద్రబాబు 2014 నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. అనేక కంపెనీలు రాష్ట్రానికి తరలి వచ్చాయి.  అయితే జగన్ నిర్వాకంతో గత ఐదేళ్లలో ఏపీ ఐటీ రంగంలో అధమ స్థానానికి పడిపోయింది.   విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రంలో  ఐటీ పరిశ్రమ అభివృద్ధికి బాటలు పరిచారు. విశాఖపట్నం, మంగళగిరిలు ఐటీ హబ్ లుగా అవతరించాయి. రాష్ట్రంలో స్టార్టప్ లు వెల్లువెత్తాయి. అయితే ఇదంతా మూడున్నరేళ్ల కిందటి మాట. రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటొక్కటిగా రాష్ట్రం నుంచి తరలిపోయాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ కుదేలైంది.    అవును  జగన్‌ నిర్వాకం వలన ఐ‌టి ఎగుమతులలో దేశంలో అట్టడుగు స్థాయికి  ఆంధ్రప్రదేశ్ పడిపోయింది.  2021-2022 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ నుంచి రూ.11.59 లక్షల కోట్ల విలువల ఐ‌టి ఎగుమతులు జరిగితే వాటిలో ఆంధ్రప్రదేశ్‌ వంతు కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే!   బిహార్‌  ఏపీ కంటే మిన్నగా రూ.2,000 కోట్లు విలువల ఐ‌టి ఎగుమతులు చేసింది. అంటే బీహార్ కంటే దిగువన ఆంధ్రప్రదేశ్ నిలిచింది.  రాజస్థాన్, మద్యప్రదేశ్ రాష్ట్రాలు రూ.3,000 కోట్లు, వెనుకబడిన అస్సాం 24,000 కోట్లు, మేఘాలయ రూ. 35,000 కోట్లు, ఝార్ఖండ్ రూ.43,000 కోట్లు, హర్యాన రూ.52,000 కోట్లు, ఉత్తరప్రదేశ్ రూ.55,000 కోట్లుచేశాయి.  గోవా రూ.1,57,000 కోట్లు, తమిళనాడు రూ.1,58,000 కోట్లు, తెలంగాణ రూ.1,81,000 కోట్లు, మహారాష్ట్ర రూ.2,37,000 కోట్లు, అత్యధికంగా కర్ణాటక రూ.3,96,000 కోట్లు విలువల ఐ‌టి ఎగుమతులు చేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో మేలు చేశానని నిసిగ్గుగా చెప్పుకుంటున్న జగన్‌ పాలనలో కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే కావడం సిగ్గుచేటు కాదా?  2021-22 ఆర్థిక సంవత్సరంలో కర్నాటక ఆగ్రస్థానంలోనూ, మహారాష్ట్ర రెండో స్థానంలోనూ నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది.  2021-21 ఆర్ధిక సంవత్సరంలో సాఫ్ట్ వేర్ ఉత్పత్తులలో కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తొలి ఐదు స్థానాలలో నిలిచాయి. మొత్తం ఉత్పత్తుల్లో ఈ ఐదు రాష్ట్రాల వాటా 88.57శాతం అయితే.. మిగిలిన రాష్ట్రాలన్నిటి వాటా 11.43శాతం.  ఇందులో ఏపీ వాటా 0.111 శాతం  మాత్రమే.   

పిన్నెల్లికి బెయిలెందుకు రాలేదో తెలుసా?

ఈవీఎం విధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిలు ఎందుకు రాలేదన్న విషయంలపై న్యాయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తున్న సంఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై కేసు బుక్కైంది. ముందస్తు బెయిలుపై కొన్ని రోజులు పిన్నెల్లి అరెస్టు నుంచి తప్పించుకున్నారు. అయితే  ముందస్తు బెయిలు గడువు ముగియడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో నెల్లూరు జైలుకు ఆయనను తరలించారు.  వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆయనను పరామర్శించేందుకు నెల్లూరు జైలుకు వెళ్లారు. పరామర్శ తరవాత జైలు బయట విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అక్కడ చేసిన ప్రసంగంలో జగన్ పిన్నెల్లిని అడ్డంగా బుక్ చేసేశారు. ఔను పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశారు. నిజమే. అందులో తప్పేముంది అంటూ ఆవేశంగా మాట్లాడారు. పాల్వాయిగేట్ పోలింగ్ బూత్ లో రిగ్గింగు జరుగుతుండటంతో ఆవేశం ఆపుకోలేక  పిన్నెల్లిఈవీఎంను ధ్వంసం చేశారు అంటూ కమిట్ అయిపోయిన జగన్ పిన్నెల్లిని అడ్డంగా బుక్ చేసేశారు.  పిన్నెల్లేమో కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసి తానా రోజు అసలు పాల్వాయ్ గేట్  పోలింగ్ బూత్ కే వెళ్లలేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఆయన బెయిలు పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఎందుకంటే ఆయనకు బెయిలు ఇవ్వవద్దంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదనలో ప్రధానంగా నెల్లూరు జెయిలు బయట పిన్నిల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారంటూ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. పిన్నెల్లి అబద్ధం చెబుతున్నారనీ, ఆయన పార్టీ అధినేతే ఈవీఎం ధ్వసం చేసింది పిన్నేల్లే అని స్పష్టంగా చెప్పారంటూ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కోర్టు పిన్నెల్లికి బెయిలు నిరాకరించింది.  దీంతో పిన్నెల్లి నమ్మకున్నందుకు నిండా ముంచావు కదా జగనన్నా అంటూ తలబాదుకుంటున్నారు.  

మనసున్న కుటుంబానికి సెల్యూట్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి సెక్రటేరియట్‌కి తన కాన్వాయ్‌లో బయల్దేరారు. కాన్వాయ్ కదిలింది. కొంతదూరం వెళ్ళింది. కొంతమంది వ్యక్తులు రోడ్డు పక్కన నిల్చుని వున్నారు. యథాలాపంగా వాళ్ళవైపు చూసిన చంద్రబాబుకు, వాళ్ళలో తన కుమారుడితో దీనంగా నిల్చుని వున్న ఒక మహిళ కనిపించింది. చంద్రబాబు ఆ మహిళను గుర్తుపట్టారు. వెంటనే కాన్వాయ్ ఆపారు. కారులోంచి దిగి ఆ మహిళ దగ్గరకి వెళ్ళారు. ‘ఎలా వున్నావమ్మా’ అని పలకరించారు. చంద్రబాబు కారు దిగి తనను పలకరించడంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేవు. ఆ మహిళ మరెవరో కాదు.. గతంలో మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ భార్య. ఆమె చంద్రబాబుకు తన పరిస్థితిని వివరించింది. తన కుమారుడి చదువు గురించి చెప్పింది. చంద్రబాబు ఆమె కుమారుడి చదువు బాధ్యత తాను తీసుకుంటానని, ఉన్నత చదువులకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు ఆ తల్లీ కొడుకుల కళ్ళలో ఆనందాన్ని చూడటానికి వెయ్యికళ్ళు కావాలి. ఐఐటీ, ఎన్ఐటీలలో 25 మంది దివ్యాంగులు ర్యాంకులు సంపాదించుకున్నారు. కానీ, ఆ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చేరడానికి సబ్జెక్టులకు సంబంధించిన తిరకాసు ఒకటి ఏర్పడింది. ఆయా సంస్థల్లో చేరడానికి సదరు దివ్యాంగులకు ఒక సబ్జెక్టు తగ్గింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో పద్ధతులు వేరు. కేంద్ర విద్యాసంస్థల రూల్స్ వేరు. దాంతో ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగులకు సీట్లు వచ్చినట్లే వచ్చి చేజారిపోయే పరిస్థితి ఏర్పడింది. రెండ్రోజుల్లో పని జరగాలి. లేకపోతే సీటు మీద ఆశలు వదిలేసుకోవడమే. అలాంటి సమయంలో ఒక విద్యార్థికి నారా లోకేష్‌కి వాట్సప్ మెసేజ్ పెట్టాలని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాడు. ఆ మెసేజ్ అందుకున్న నారా లోకేష్ పరిస్థితి తీవ్రతను, ఆ సమస్యను వేగంగా పరిష్కరించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకున్నారు. చకచకా పావులు కదిపారు. రాష్ట్రానికి చెందిన దివ్యాంగులు కేంద్ర విద్యా సంస్థల్లో సీట్లు పొందడానికి అడ్డంకిగి నిలిచిన అంశాన్ని సవరిస్తూ వెంటనే జీవో జారీ చేయించారు. కేంద్ర విద్యాసంస్థలతో కూడా సమన్వయం చేసుకున్నారు. ఒక మంచి పని ఫలితాన్ని ఇచ్చింది. పాతికమంది ప్రతిభావంతులైన దివ్యాంగులకు కేంద్ర విద్యా సంస్థల్లో సీట్లు వచ్చాయి. ఆ పిల్లలందరూ తమ ఆనందాన్ని పంచుకోవడానికి లోకేష్ దగ్గరకి వచ్చినప్పుడు, వారికి లాప్‌టాప్‌లు బహుమతిగా అందించి లోకేష్ కూడా తన ఆనందాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆ పిల్లలు, వారి తల్లిందండ్రులు కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడిన మాటలు వింటే.... కఠిన హృదయాలైనా సరే కరిగిపోయి, కళ్ళలో కనిపిస్తాయి. చింతపర్తి గ్రామానికి చెందిన శివది రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబం. ఇంటికి దీపం లాంటి ఇల్లాలు, బంగారు బొమ్మల్లాంటి ఇద్దరు ఆడపిల్లలు. వీళ్ళని చూసుకుంటూ, తన పేదరికాన్ని కూడా మరచిపోతూ వుండేవాడు శివ. అయితే పెరుగుతున్న పిల్లలను చూసి శివ మనసులో తన బాధ్యత గుర్తొచ్చింది. తాను ఇలాగే పేదరికంలో కొనసాగితే తన పిల్లలు కూడా పేదవాళ్ళుగానే మిగిలిపోతారు. అందుకే, గల్ఫ్ దేశాలకు వెళ్ళి కష్టపడి పనిచేయాలి. తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి... తాను కొవ్వొత్తిలా కరిగిపోయినా పర్లేదు.. తన కుటుంబం ఆ వెలుగులో సంతోషంగా వుండాలి. ఇదే ఆలోచనతో శివ కువైట్ బాటపట్టాడు. అయితే, ఇక్కడి ఏజెంట్ శివకి చెప్పిందొకటి, కువైట్‌కి వెళ్ళిన తర్వాత శివకి ఎదురైన పరిస్థితి మరొకటి. కువైట్ ఎడారిలో కోళ్ళు, గొర్రెలు, పావురాలు, బాతుల్ని మేపే పనిలో శివ చేరాల్సి వచ్చింది. చుట్టూ నరమానవుడు కనిపించని ఎడారిలో జీవించాల్సి వచ్చింది. యజమానులు పట్టించుకోకపోవడం, కనీసం ఆహారం కూడా అందించకపోవడంతో శివ మానసికంగా క్రుంగిపోయాడు.  ఇక్కడే ఇంకో రెండ్రోజులు వుంటే తాను చనిపోవడం ఖాయమని శివకి అర్థమైపోయింది. తన భార్యాపిల్లలు కళ్ళముందు కదిలారు. తాను లేకపోతే తన కుటుంబం ఏమైపోతుందో కూడా కళ్ళముందు కదిలింది. అంతే, తన చివరి ప్రయత్నంగా ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ దారుణమైన ఎడారిలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నానని, ఏజెంట్ తనకు చెప్పిన పని ఒకటి, ఇక్కడ చేస్తోంది ఒకటి అని,  ఎండ తీవ్రతకు ఆరోగ్యం దెబ్బతిందని, ఇంకో రెండ్రోజులు ఇక్కడుంటే చనిపోతానని, తనను రక్షించాలని శివ కన్నీటిపర్యంతం అవుతూ చెబుతూ వీడియో చేసి ఆన్‌లైన్‌లో పెట్టాడు.  శివ చేసిన ఆ వీడియో వైరల్ అయింది. నారా లోకేష్ దగ్గరకి చేరింది. దాంతో శివను క్షేమంగా స్వగ్రామానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని అధికారులు, టీడీపీ ఎన్నారై విభాగాన్నిలోకేష్ ఆదేశించారు. నారా లోకేష్ ఆదేశాల మేరకు ఎన్నారై టీడీపీ ప్రతినిధులు శివ కోసం కువైట్‌లో తీవ్రంగా గాలించారు. అయితే సదరు వీడియోలో ఎడారి ప్రదేశం మాత్రమే కనిపిస్తోంది. తాను ఎక్కడున్నాననేది శివ అందులో  వెల్లడించలేదు. దీంతో అతని ఆచూకీ కనుక్కోవడం చాలా కష్టమైంది. అయినప్పటికీ రెండు రోజుల పాటు కువైట్‌లో గాలించి ఎట్టకేలకు శివ ఆచూకీని కనుగొన్నారు. శివ కువైట్ నుంచి భారతదేశానికి వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. దాంతో శివ మొన్న బుధవారం ఉదయం కువైట్ నుంచి తన స్వగ్రామం చింతపర్తికి చేరుకున్నాడు ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ, లోకేష్ చొరవతోనే తాను బతికి బయటపడ్డానని ఆనందాన్ని వ్యక్తం చేశాడు తాను స్వగ్రామానికి రావడానికి లోకేష్ చేసిన కృషి మరవలేనిదని, తమ కుటుంబం జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటుందని శివ ఆనందబాష్పాలతో చెప్పాడు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో ప్రయాణిస్తున్న శశిధర్ అనే వ్యక్తికి ఆకస్మాత్తుగా అనారోగ్య సమస్య తలెత్తింది. శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిపడుతున్నాడు. విమానం తిరుపతికి వెళ్ళాలి. వెంటనే వైద్య సహాయం అందాలి.. అది ఎంతవరకు సాధ్యం అనే ఆలోచన విమానంలో వున్నవారిలో ఏర్పడింది. అదే విమానంలో ప్రయాణిస్తున్న నారా భువనేశ్వరి పరిస్థితిని అర్థం చేసుకున్నారు. వెంటనే ఆమె ఈ విషయాన్నిఏపీ సీఎంఓ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. దాంతో తిరుపతి ఎయిర్‌ పోర్టులో విమానం వద్దకే డాక్టర్లను, అంబులెన్స్‌ను తీసుకొచ్చారు. డాక్టర్లు సకాలంలో చికిత్స అందించడంతో ప్రయాణికుడు శశిధర్‌ ఊపిరి నిలిచింది.  సేవాభావం అనేది ఎవరో చెబితే వచ్చేది కాదు. మనసులోంచి పుట్టాలి. మనసు నిండా సేవ నిండిన మనుషులు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్. అధికారానికి అతీతమైన సేవాభావం వీరి మనసులలో వుంది కాబట్టే, ఆ మనసుల పరిమళం నిరంతరం అవసరం వున్నవారికి చేరుతూనే వుంది. బంగారానికి తావి అబ్బినట్టుగా, మంచి మనసులకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు కూడా లభించాయి. ఈ మనసులు మరింత పరిమళించాలి.. ఆ పరిమళం మరెన్నో మనసులకు స్ఫూర్తినివ్వాలి..!

గంజాయి ఖేల్ ఖతం.. డ్రగ్స్ దుకాణం బంద్!

జగన్ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిపోయింది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని తేలింది. ఉపాధి ఉద్యోగ అవకాశాలు మృగ్యమై, పనుల లేక యువత గంజాయి మత్తుకు అలవాటుపడేలా ప్రభుత్వ విధానం సాగింది. ఇప్పుడు ఆ మహమ్మారిని సమూలంగా పెకలించివేయడానికి ఏపీలో కొలువుదీరిన చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో గురువారం ( జులై 18) జరిగిన నార్కో కో ఆర్డినేషన్ సెంటర్ అపెక్స్ లెవల్ సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలపై వివరించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ పరివర్తన పేరిట గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దుల్లో గిరిజనులు గంజాయి సాగు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.నియంత్రణకు సంబంధించి ప్రత్యేక టాస్కు ఫోర్సును ఏర్పాటు చేయడంతో పాటు పెద్దఎత్తున చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని  వివరించారు. గంజాయి,ఇతర మత్తు పదార్ధాల   నిషేధానికి సంబంధించి వివిధ పాఠశాలలు, కళాశాలల ప్రాంగ ణాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్ధుల్లో ప్రవర్తనలో మార్పు తీసుకు వచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా గంజాయి,ఇతర మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారిపై గట్టి నిఘా ఉంచడం జరిగిందని ఇందుకై ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశామనినీరబ్ కుమార్ ప్రసాద్ వివరించారు. గిరిజన మారుమూల ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూముల్లో గిరిజనులు గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నయ జీవనోపాధి కల్పించే పంటలు పండించే విధంగా చైతన్యం తీసుకురావడంతో పాటు కాఫీ,రాగి, నిమ్మ,నారింజ వంటి విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు.గంజాయి,ఇతర మత్తు మందుల నియంత్రణను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన రాష్ట్ర,జిల్లా స్థాయి నార్కో-కో ఆర్డినేషన్  కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గంజాయి,ఇతర మత్తు పదార్ధాల సేవనం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన తీసుకువచ్చేందుకు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా పాఠశాలలు,కళాశాలల్లో పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వివరించారు.  

శాంతి హయాంలో అవకతవకలపై విచారణ 

ఎపి దేవాదాయ శాఖలో సహాయ కమిషనర్‌ కె. శాంతి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. 2020 ఏప్రిల్ 24 నుంచి 2022 జూన్ 30 వరకూ ఆమె సహాయకమిషనర్‌గా పని చేశారు. ఆమెకు మొదటి పోస్టింగ్ విశాఖ జిల్లాలోనే ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలోని దేవాదాయ శాఖలో జరిగిన అవకతవకలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా లీజుల కేటాయింపు, అనర్హులను పాలకమండలి సభ్యులుగా నియమించడం వంటివి జరిగాయి. దీంతో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నాటి అవకతవకలపై నివేదిక పంపించారు. ఇందులో వివిధ అంశాలు పొందుపరిచారు. నాటి ఉల్లంఘనలపై దేవాదాయ శాఖ కమిషనర్ కు జిల్లా శాఖ నుంచి నివేదిక పంపించారు., ఉమ్మడి జిల్లాలో కొందరు దుకాణదారులకు అనుచితంగా లీజు పొడిగించడం, దుకాణాలను కేటాయించడం చేశారని, నిబంధనలు పాటించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు.  విశాఖ జిల్లా ధారపాలెం ధారమల్లేశ్వరి స్వామి ఆలయానికి చెందిన దుకాణాలను ఎటువంటి వేలం లేకుండా కేటాయించేశారు. అనకాపల్లి మెయిన్ రోడ్డులో సిద్దేశ్వర స్వామి ఆలయం, చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం, చోడవరంలోని హార్డింగ్ రెస్ట్ హౌస్, పాయకరావుపేటలో పాండురంగ స్వామి ఆలయాలకు చెందిన దుకాణాలకు ఎటువంటి వేలం నిర్వహించకుండా నచ్చినవారికి కట్టబెట్టారు.  సహాయ కమిషనర్‌గా ఉన్న శాంతి అప్పటి ఉప కమిషనర్ పుష్పవర్ధన్‌పై దురుసుగా ప్రవర్తించారు. అతడి మీద ఇసుక చల్లిన తీరు చర్చనీయాంశమైంది. లంకెలపాలెం వద్ద దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తులకు అప్పగించేశారు. అంతేకాకుండా సదరు నిర్వాహకుడు ఆ తరువాత సింహాచలం దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. దేవాదాయశాఖ నిబంధనల ప్రకారం లీజుదారులు, ఆలయాల వద్ద వ్యాపారాలు చేసే వారిని పాలకమండలి సభ్యులుగా నియమించకూడదు. ఇందుకు విరుద్ధంగా అక్కడ జరిగింది. నగరంలోని పలు దేవాలయాలకున్న లీజు దుకాణదారుల మీద అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి పలు పనులు చేయించుకున్నారన్న విమర్శలున్నాయి.గతంలో అశీల్‌మెట్ట సంపత్ వినాయగర్ ఆలయం హుండీ ఆదాయం లెక్కింపులో ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరాజును నియమించడం వివాదాస్పదమైంది. అప్పటికే ఎర్నిమాంబ ఆలయం హుండీల లెక్కింపు వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో, లెక్కింపు ప్రక్రియలో ఆయన పాల్గొనకూడదనే ఆదేశాలు ఉన్నా వాటిని బేఖాతరు చేస్తూ అప్పటి సహాయ కమిషనర్‌గా ఉన్న శాంతి అతన్ని నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఆ తరువాత జరిపిన విచారణలో ఇది నిజమని తేల్చారు.

ఏపీకి కేంద్రం సహకారంపై అప్పుడే అనుమానాలు? మోడీ ఏం చేయబోతున్నారు!

ప్రధాని నరేంద్రమోడీ ఏపీ విషయంలో సానుకూలంగా ఉంటారా? అన్న విషయంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2014లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలో పర్యటించిన సందర్భంగా మోడీ రాష్ట్రానికి పలు వాగ్దానాలు చేశారు. అయితే ఆ తరువాత వాటిపై సీతకన్నేశారు. ఏ హామీనీ పూర్తిగా అమలు చేయలేదు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్ ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా.. ఏపీకి సహకారం అందించే విషయంలో అప్పటి మోడీ సర్కార్ ముందుకు రాలేదు. ప్రత్యేక హోదా ముగిసిన అంశమని చెబుతూ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని తెరపైకి తీసుకువచ్చింది. దానికీ పలు కొర్రీలు వేసింది. అప్పట్లో మోడీ సర్కార్ తీరు వల్లే తెలుగుదేశం ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిందనడంలో సందే హం లేదు. ఆ విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అప్పట్లోనే పలు మార్లు స్పష్టత ఇచ్చారు. మోడీ సర్కార్ విధానాలతో కాదు, ఏపీ ప్రయోజనాల పట్ల ఆ ప్రభుత్వ తీరుతోనే తమ పేచీ అని పలు సందర్భాలలో చెప్పారు. సరే 2019 నుంచి 2024 వరకూ అంటే ఏపీలో జగన్ సర్కార్ అధికారంలో ఉన్న కాలంలో కేంద్ర ప్రభుత్వానికి అసలు ఏపీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు ఏపీ అభివృద్ధి పట్ల ఎలాంటి పట్టింపూ లేకపోవడమే. ఎంత సేపూ నిబంధనలతో పని లేకుండా అప్పులకు అనుమతి, ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులు విచారణ వేగం పుంజుకోకుండా ఉండేలా కేంద్రం సహకారం అందితే చాలన్నట్లుగానే జగన్ ఐదేళ్ల పాలన సాగింది.  సరే 2024 ఎన్నికలలో జగన్ సర్కార్ గద్దెదిగింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు పరిస్థితి మళ్లీ 2014లగే మారింది. అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా. అప్పట్లో కేంద్రంలో బీజేపీకి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతుతో సంబంధం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం ఉంది. ఇప్పుడది లేదు. అంతే కాకుండా బీజేపీ తరువాత ఎన్డీయే కూటమిలో సంఖ్యాబలం ఎక్కువ ఉన్న పార్టీ తెలుగుదేశం. దీంతో చంద్రబాబు మాటకు మోడీ అనివార్యంగా విలువనివ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే మోడీ నైజం తెలిసిన వారెవరూ ఆయన ఆ కారణంతో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇస్తారని విశ్వసించడం లేదు. గతంలో చెప్పిన సాకులతోనే ఈ సారి కూడా రాష్ట్రానికి మొండి చేయి చూపించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.  ఎన్డీఏలో ఏపీలోని కూటమి ప్రభుత్వం కూడా భాగస్వాపక్షమే అయినా  ఏపీ అభివృద్ధికి సహకారం విష యంలో మోడీ ఏమంత చొరవగా వ్యవహరించరన్న భావనే రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నది.    అమరావతి,పోలవరం పూర్తి చేయాలని చంద్రబాబు కల. కాని ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం వాటిని పూర్తి చేయడానికి కావలసిన నిధులు ఇస్తుందా అనేది అనుమానమే. ఇప్పటికే చంద్రబాబు రెండుసార్లు ఢిల్లీ వెళ్లి పీఎం, మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని కూలంకషంగా వివరించారు.ఆర్ధిక సాయం అందించాలని, బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక వరాలు కల్పించాలని ఆర్ధిక మంత్రికి విన్నవించారు. రెండోసారి ఢిల్లీ వెళ్లినప్పుడు బాబు అమిత్ షా ను మాత్రమే కలసివచ్చారు.ఆయనతో ఆర్ధిక విషయాలను చర్చిం చారని వార్తలు వచ్చాయి.  బీహార్లో ప్రతిపక్షం ఆర్జేడీ హోదాపై ఒత్తిడి చేస్తున్నది. ఏపీలో జగన్ ఒకసారి ప్రస్తావించారు గాని పెద్దగా ఒత్తిడిలేదు.వామపక్షాలు,కాంగ్రెస్ ఒత్తిడి ఉందిగాని వారికి బలం లేదు కావున పట్టించుకోవడం లేదు.నీతిఅయోగ్ హోదా ఇవ్వవద్దని సిఫార్స్ చేసిందని గతంలో బీజేపీ నాయకులు చెప్పారు.  ఏదిఏమైనా అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలనే సామెత ప్రకారం హోదా లేదా భారీగా నిధులు ఇస్తారా లేదా అనే విషయం కేంద్రంతో తేల్చుకోవడమే బెటరని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. అలాగే  బీజేపీతో,మోడీతో సత్సంబంధాలు ఉన్న  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిధులు రాబట్టడానికి తన వంతు కృషి చేయాల్సి ఉంది. బాబు ఎంపీలతో పార్లమెంట్లో కూడా అవకాశం వచ్చినప్పుడల్లా రాష్ట్ర పరిస్థితి ప్రస్తావిస్తూ నిధులు వచ్చేలా చూడాలని సూచించారు. మొత్తం మీద ఏపీ విషయంలో బీజేపీ కర్రా విరగొద్దు.. పామూ చావొద్దన్న చందంగా వ్యవహరిస్తున్నదని అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలూ చూస్తుంటే ఏపీ సహకారం విషయంలో కేంద్రం నుంచి పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి అవకాశం లేదన్న చందంగా ఉంటున్నాయి. ఇప్పటికే ఓ కేంద్ర మంత్రి ఏపీకి ప్రత్యేక హోదా అంశం అసలు కేంద్రం పరిశీలనలోనే లేదని చెప్పారు. తెలుగుదేశం గ్యారంటీలతో కేంద్రానికి కానీ బీజేపీకి కానీ సంబంధం లేదని బీజేపీ ఏపీ నాయకులు అంటున్నారు. దీంతో  కేంద్రం నుంచి ఏపీకి సహకారం విషయంలో అప్పడే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

రాజీనామాపై హరీష్ యూటర్నేనా?

రాజకీయాలలో సవాళ్లు, ప్రతి సవాళ్లు అన్నవి ప్రహసనంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రాజీనామా అంటూ సవాల్ చేసి ఆ తరువాత మాట మార్చడం పొలిటికల్ లీడర్లకు రివాజుగా మారిపోయింది. ఆగస్టు 15 లోగా రుణమాఫీని అమలు చేస్తే రాజీనామా చేస్తానంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు గతంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సవాల్ ను స్వీకరించిన రేవంత్ ప్రభుత్వం రుణమాఫీని ఆగస్టు మొదటి వారంలోనే పూర్తి చేయడానికి సర్వం సిద్ధం చేసింది. తొలి విడతగా జులై 18నే లక్ష రూపాయల వరకూ రుణమాఫీని పూర్తి చేసింది. ఈ నెలాఖరుకు లక్షన్నర వరకూ, ఆగస్టులో రెండు లక్షల వరకూ రుణమాఫీ చేయడానికి షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దీంతో హరీష్ రావు తన రాజీనామా విషయంలో మాట మార్చారు. రాజీనామా చేస్తానంటూనే ప్రభుత్వానికి కొన్ని షరతులు విధిస్తున్నారు అవేమంటే.. రుణమాఫీ ఆగస్టు 15లోగా పూర్తిచేసి, ఆరు గ్యారెంటీలనూ అమలు చేయాలంటున్నారు. అప్పుడే  ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేస్తానని నాలుక మడతేశారు.   అయితే  గతంలో హరీష్ రావు  కాంగ్రెస్ ప్రభుత్వం 48వేల కోట్ల రుణమాఫీ అమలు చేయలేదని భావించి, ఆగస్టు 15లోగా రుణమాఫీ  చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.  తమకు రాజీనామాలు కొత్తకాదని, ప్రజలకు మేలు జరుగుతుందంటే పదవులు వదులుకోవడానికి సిద్ధమని కూడా చెప్పారు.  తొలుత రుణమాఫీ కింద 48వేలకోట్లు అవసరమవుతాయని   అంచనా వేశారు. కాని ప్రభుత్వం లక్ష రూపాయలు జీతం వస్తున్న వారు, ఉన్నతోద్యోగులు,  ఎమ్మెల్యే లు, మంత్రులు తదితరులను రుణమాఫీ పరిధి నుంచి తప్పించింది. ఆ  ప్రకారం రుణమాఫీకి అర్హులైన వారు 70లక్షలమందిగా తేలారు.  వారిలో  కార్డ్ లేనివారు ఉన్నారు. రుణమాఫీకి  పీఎం కిసాన్ సన్మాన్ పథకం మార్గదర్శకాలు పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య తగ్గింది.  దీంతో రుణమాఫీకి డబ్బు 48 వేల కోట్లు కాకుండా నుంచి 31వేల కోట్లు అవసరమౌతాయి.  ఆ మేరకు రేవంత్ సర్కార్  ఆర్ధిక సంస్థలను సంప్రదించి రుణాలకు లైన్ క్లియర్ చేసుకుంది. రేవంత్ సర్కార్ రుణమాఫీ  వాగ్దానాన్ని నిర్దిష్టగడువు కంటే ముందుగానే అమలు చేయడానికి రెడీ అయిపోయారు.  దీంతో హరీష్ రావు రాజీనామా సవాల్ తెరపైకి వచ్చింది. రుణ మాఫీని ప్రభుత్వం అమలు చేస్తే రాజీనామా చేయాల్సి వస్తుందన్న భావనతో దానిలో లోపాలు వెతకడానికి మాజీ మంత్రి హరీష్ రావు భూతద్దం కోసం వెతుకుతున్నారు.  షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ఆయన చేస్తున్న డిమాండ్ లో అర్ధం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావుకు ఏ ప్రభుత్వ పథకమూ కూడా షరతులు లేకుండా అమలు చేయడం సాధ్యం కాదని తెలియనిది కాదు.   రేవంత్ ఆగస్టు మొదటివారంలోనే రుణమాఫీని  పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో హరీష్ రావు రాజీనామాపై యూటర్న్ తీసుకున్నారు. గతంలో రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన హరీష్ రావు ఇప్పుడు మాట మార్చి రుణమాఫీతో పాటు  ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేస్తేనే  రాజీనామా చేస్తానని మెలిక  పెడుతున్నారు. మొత్తం మీద రేవంత్ సర్కార్ రుణమాఫీ అమలు విషయంలో ప్రజా మన్ననలు పొందుతుంటే.. రాజీనామా సవాల్ పై వెనకడుగు వేసి రేవంత్ రెడ్డి ప్రజలలో పలుచన అయ్యారు. 

తిరుమలలో అరాచకాలకు చెల్లు చీటీ!

వైసీపీ హయాంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో జరిగిన అరాచకాలు, అపచారాలు అన్నీ ఇన్నీ కావు. కలియుగ వైకుంఠనాథుడు కొలువైన తిరుమ‌ల‌కు నిత్యం వేలాది మంది భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చి స్వామివారిని ద‌ర్శించుకుంటారు.   గ‌త ఐదేళ్ల వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలోజరిగిన అవినీతి అక్ర‌మాలకు లెక్కే లేదు. హిందూ ధర్మానికి విరుద్ధంగా తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరిగింది. అడ్డగోలు దొపిడీ అడ్డూ అదుపూ లేకుండా సాగింది.  చివరికి స్వామి వారి ప్రసాదం ల‌డ్డూ నాణ్య‌త, అన్నప్రసాదం, ప‌రిశుభ్ర‌త‌, భ‌క్తుల సౌక‌ర్యాలనూ జగన్ సర్కార్ పట్టించుకోలేదు. అనేక అంశాల్లో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో తిరుమ‌ల‌కు వెళ్లిన అనేక మంది భ‌క్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏపీలో  తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో సీఎం చంద్ర‌బాబు నాయుడు తిరుమ‌ల‌పై ప్ర‌త్యేక దృష్టిసారించారు. సీఎం బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న చంద్ర‌బాబు.. తిరుమ‌ల వ‌చ్చే భ‌క్తుల‌కు ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అంతేకాక వైసీపీ ప్ర‌భుత్వంలో తిరుమ‌ల కొండ‌పై జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల‌పైన‌ దృష్టిసారించి, బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తానని చెప్పారు.  తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ధ‌ర్మారెడ్డి స్థానంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం నూత‌న ఈవోగా ఐఏఎస్ అధికారి జె. శ్యామ‌ల‌రావును ప్రభుత్వం నియ‌మించింది. శ్యామ‌ల‌రావు బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి వ‌రుస ఆక‌స్మిక త‌నిఖీలు చేస్తూ టీటీడీలో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అధికారులతో స‌మీక్ష స‌మావేశాలు నిర్వ‌హిస్తూ ప‌లు విభాగాల్లో ప్ర‌క్షాళ‌న దిశ‌గా అడుగులు వేస్తున్నారు. శ్రీ‌వారి క్యూలైన్ల‌లో వేచి ఉండే భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం, భ‌క్తుల‌కు నాణ్య‌మైన అన్న‌ప్ర‌సాదాలు అందేవిధంగా, శ్రీ‌వారి ల‌డ్డూ నాణ్య‌త ప్ర‌మాణాలు పెంచేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట వేస్తోంది. వరుస తనిఖీల క్రమంలో గురువారం తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్‌ను ఫుడ్ సేఫ్టీ విభాగం (ఎఫ్‌ఎస్‌డి) అధికారుల బృందంతో కలిసి ఈవో శ్యామ‌ల‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎఫ్‌ఎస్‌డీ డైరెక్టర్ పూర్ణచంద్రరావుతో కలిసి హోటల్‌లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, ముడి సరుకుల నిల్వ, శుభ్రపరచడం తదితర పద్ధతులను పరిశీలించారు. బంగాళదుంపలు, కాలీఫ్లవర్, కొన్ని కిరాణా సామగ్రితో సహా కూరగాయలు కుళ్లి పోయినట్లు గుర్తించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్య చర్యలుకూడా నాసిరకంగా ఉన్నాయని గుర్తించారు. హోటల్‌లోని తినుబండారాల తయారీలో నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు.   నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించడమే కాకుండా లైసెన్స్ ఫీజు కూడా చెల్లించని బాలాజీ భవన్ హోటల్  లైసెన్సును రద్దు చేశారు. హోటల్ ను సీజ్ చేశారు.  మ‌రోవైపు వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో టీటీడీ చైర్మ‌న్లుగా వ్య‌వ‌హ‌రించిన వై.వి. సుబ్బారెడ్డి, క‌రుణాక‌ర్ రెడ్డిలు అన్నీ తామై పాల‌న సాగించారు. పాల‌క మండ‌లి నిర్ణ‌యాలు, వాటిలోని స్వ‌ప్ర‌యోజ‌నాలు, అవినీతి అక్ర‌మాల‌తోపాటు ధ‌ర్మారెడ్డి కార్య‌నిర్వ‌హ‌ణాధికారిగా ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన లోటుపాట్ల‌పై విజ‌లెన్స్ విభాగం ప్ర‌త్యేకంగా త‌నిఖీలు చేస్తుంది. వీటితోపాటు టీటీడీలోని ఉద్యోగులు ఏ విభాగంలో ఎంత‌కాలంగా ప‌నిచేస్తున్నార‌నే అంశంపైనా విజిలెన్స్ విభాగం దృష్టిసారించింది. మ‌రో వైపు టీటీడీ చ‌రిత్ర‌లో ఏ అధికారీ చేయ‌ని రీతిలో ధ‌ర్మారెడ్డి అధికారం చెలాయించార‌నే విమ‌ర్శ‌లున్నాయి. అప్ప‌ట్లో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స‌న్నిహితుడ‌నే కార‌ణంగా అధికార పార్టీలోనూ అతికొద్ది మంది ముఖ్య‌ నేత‌ల‌ను మిన‌హా మిగిలిన వారిని ధ‌ర్మారెడ్డి ఖాత‌రు చేయ‌లేదు. వైసీపీ ముఖ్యుల‌కు, పాల‌క‌మండ‌లి ముఖ్యుల‌కు ల‌బ్ధిక‌లిగించేలా నిధులు కేటాయింపులు జ‌రిపి ఆర్థికప‌ర‌మైన త‌ప్పిదాల‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లు ధ‌ర్మారెడ్డిపై ఉన్నాయి. తిరుమ‌ల కొండ‌పై ఈవో హోదాలో ధ‌ర్మారెడ్డి అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆధారాల‌తో స‌హా సేక‌రించే ప‌నిలో విజిలెన్స్ విభాగం అధికారులు లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌లో ధ‌ర్మారెడ్డిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోద‌య్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.  తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు నాణ్య‌మైన సేవ‌లు అందించేలా  తెలుగుదేశం ప్ర‌భుత్వం కంకణం కట్టుకుని చర్యలు తీసుకుంటోంది.  టీటీడీకీ ఈవోతోపాటు తిరుమ‌ల‌కు ఒక‌రు, తిరుప‌తికి ఒక‌రు చొప్పున ఇద్ద‌రు జేఈవోలుంటారు. కానీ, గ‌త వైసీపీ ప్ర‌భుత్వం ఇద్ద‌రు జేఈవోల‌నూ తిరుప‌తికే ప‌రిమితం చేసి తిరుమ‌ల‌లో  ఈవోగా ధ‌ర్మారెడ్డిని  మాత్ర‌మే కొన‌సాగించింది.  ప్ర‌స్తుత తెలుగుదేశం ప్ర‌భుత్వం ఈ విధానాన్ని రద్దు చేసి పాత ప‌ద్ద‌తిని అమ‌ల్లోకి తీసుకొచ్చింది. ఈవోతో పాటు తిరుమ‌ల‌కు జేఈవోను య‌ధావిధిగా కొన‌సాగించేందుకు నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే టీటీడీ జేఈవోగా సీహెచ్ వెంక‌య్య చౌద‌రిని ప్ర‌భుత్వం నియ‌మించింది. స‌మ‌ర్థ‌వంత‌మైన అధికారిగా పేరున్న వెంక‌య్య చౌద‌రి నియామ‌కంతో టీటీడీని పూర్తిస్థాయిలో ప్ర‌క్షాళ‌న చేసి స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూసేందుకు ప్ర‌భుత్వం దృష్టిసారించింది. తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి టీటీడీలో మార్పుల ప‌ట్ల భ‌క్తులు సంతోషం వ్య‌క్తం చేశారు. గ‌త వైసీపీ హ‌యాంలో ప‌లు ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని, ప్ర‌స్తుతం టీటీడీకీ మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం వ‌చ్చింద‌ని ప‌లువురు భ‌క్తులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

వినుకొండలో వాలబోతున్న ‘రాబందు’ జగన్!

రక్తం... రక్తం.. శవం.. శవం... ఎక్కడ? ఎక్కడ? అర్జెంటుగా రక్తం కనిపించాలి... అర్జెంటుగా శవం దొరకాలి? ఎలా.. ఎలా? ఒకసారి రక్తం, శవం అధికారాన్ని తెచ్చాయి.. రెండోసారి రక్తం గట్టెంకించలేదు.. ఎందుకంటే, అప్పుడు రక్తంతోపాటు శవం దొరకలేదు.. మొదట్లో తండ్రి శవాన్ని పక్కన పెట్టుకునే రాజకీయం నడిపాడు... ఆ తర్వాత శవాలు అయిపోయిన వారిని, తన తండ్రి చావు వల్ల హర్టయి చనిపోయినట్లు కలరింగ్ ఇచ్చేసి , వాళ్ళ కుటుంబాలను ఓదార్చుతున్నట్టు బిల్డప్ ఇచ్చి రాజకీయ లబ్ధి పొందాడు.. ఆ తర్వాత ఐదేళ్ళపాటు అధికారం చెలాయించినప్పుడు ఈయన అండ్ ఈయన దండుపాళ్యం బ్యాచ్, ఎంత రక్తం పారించారో.. ఎంతమందిని శవాలను చేశారో... ఎన్నిశవాలను డోర్ డెలివరీ చేశారో....! ఈ రాజకీయ రాబందు జగన్‌కి రక్తమన్నా.. శవాలన్నా చెప్పలేనంత ప్రీతి. రాబందు ఎలాగైతే శవాల కోసం నిరంతరం వెతుకుతూ వుంటుందో, ఆ శవాన్ని పీక్కుతిని, ఎలా తన పబ్బం గడుపుకోవాలని అనుకుంటుందో... ఇప్పుడు జగన్ కూడా శవాల కోసం అన్వేషిస్తున్నాడు. జగన్ అన్వేషణ ఫలించింది.. ఒక శవం దొరికింది. ఆ శవం పేరు రషీద్.. లొకేషన్ వినుకొండ... జగన్ శవ రాజకీయం ప్రారంభమైపోయింది.. జగన్ అనే రాజకీయ రాబందు వినుకొండలో వాలబోతోంది. వినుకొండలో జిలానీ, రషీద్ అనే ఇద్దరు వ్యక్తులు ఎప్పటి నుంచో స్నేహితులు. ఇద్దరూ ఒక పేరుమోసిన రౌడీకి అనుచరులు. ఇద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇద్దరూ కలసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఏఏ విషయాలు వున్నాయోగానీ, ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. అవి ముదిరాయి. బద్ధ శత్రవులుగా మార్చాయి. ప్రాణాలు తీసేంతవరకు వెళ్ళాయి. బుధవారం నాడు రషీద్ మీద జిలానీ కొడవలితో దాడి చేశాడు. దారుణంగా నరికి చంపాడు. ఆహా... పాపం ఆ రషీద్ శవమైపోయాడుగానీ, జగన్‌లో ఉత్సాహాన్ని బతికించాడు. జగన్ రంగంలోకి దిగేలా చేశాడు. అలా రషీద్ హత్యకు గురయ్యాడో లేదో.. ఇలా పిల్ల సజ్జల నాయకత్వంలోని వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ రంగంలోకి దిగింది. తమ పార్టీ కార్యకర్త రషీద్‌ని టీడీపీ కార్యకర్త జిలానీ నరికి చంపాడంటూ రాద్దాంతం మొదలుపెట్టేసింది. బెంగళూరులో రెస్టు తీసుకుంటున్న జగన్ రాబందు  కూడా వేగంగా ఎగురుకుంటూ వినుకొండకి బయల్దేరింది. శుక్రవారం నాడు రషీద్ ఇంటి దగ్గర వాలబోతోంది. ఇలాంటి రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక శాపంలా తగిలాడు. ఇతడిని ఇలా ఇంకెంతకాలం భరించాలో ఏంటో!

ఇక ఇప్పుడు హరీష్ రావు వంతు!

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసల ప్రవాహం ఆగడం లేదు. వలసల నిరోధం విషయంలో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతులెత్తేసి సైలెంట్ అయిపోయారు. జరిగేది జరుగుతుంది. చూస్తూ ఉండటమే బెటర్ అన్నట్లుగా కేసీఆర్ తీరు ఉంది. ఇక ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైతే  వలసల నిరోధానికి చేసిన ప్రయత్నమేదీ కనిపించదు. ఆయనను కలిసేందుకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.   ఎమ్మెల్యేల వలసలతో పార్టీ క్యాడర్ లో విశ్వాసం సన్నగిల్లడమే కాదు, తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన సైతం వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేలే కాదు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా బీఆర్ఎస్ కు దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోందని పరిశీలకులు అంటున్నారు. ప్రత్యర్థి పార్టీలైతే నీవు నేర్పిన విద్యయే అంటూ బీఆర్ఎస్ అధినేతను ఎద్దేవా చేస్తున్నారు. మేం విలీనం చేసుకున్నా, ఎమ్మెల్యేలను చేర్చుకోలేదంటూ కొత్త లాజిక్ చెప్పి కేటీఆర్ నవ్వుల పాలయ్యారు. దీంతో ఎమ్మెల్యేలతో పాటు తామూ కారు దిగేయడమే మంచిదన్న ఉద్దేశంలో క్యాడర్ ఉంది.  గతంలో  బీఆర్ఎస్ కష్టపడి అతి ప్రయత్నం మీద ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించింది. అందుకు భిన్నంగా ఇప్పుడు  బీఆర్ఎస్ నేతలు ఎవరి ప్రమేయం లేకుండా కాంగ్రెస్ గూటికి స్వచ్ఛందంగా చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది.  పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ విపక్షం అయిన రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ నుంచి  వలసలు మొదలవ్వడం, పార్టీ నాయకత్వంపై విశ్వాసలేమిని సూచిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి  అధికారం ఉన్న పార్టీలో ఉంటేనే రాజకీయ మనుగడ అన్న అభిప్రాయం   తెలంగాణ రాజకీయాలలో ఏర్పడటానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహరించిన తీరే కారణం. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను బెదరించో, బుజ్జగించో కారెక్కించుకున్నారు. అలా ఎక్కిన వారికి పార్టీలో మొదటి నుంచీ ఉన్నవారి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు అయితే తాము కారెక్కడానికి కారణం నగరంలో ఉన్న తమ ఆస్తుల రక్షణ కోసమేనని మీడియా ముందే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలను ఖాళీ చేయడానికి ఏ స్థాయిలో ప్రయత్నాలు చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి ఒత్తిడులు, ప్రయత్నాలూ అవసరం లేకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా కాంగ్రెస్ చేయి అందుకోవడానికి క్యూకడుతున్నారు.  కేసీఆర్, కేటీఆర్ లు చేతులెత్తేయడంతో ఇప్పుడు వలసల నిరోధం, క్యాడర్ లో ధైర్యం నింపడం కోసం మాజీ మంత్రి, బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హరీష్ రావు నడుంబిగించారు. ఆయన ఎమ్మెల్యేల వలసల నిరోధం కంటే.. క్యాడర్ లో ధైర్యం నింపి, పార్టీ పటిష్టంగా ఉందన్న భరోసా ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పోయేది పొల్లు పట్టించుకోవద్దు, త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయి.. అప్పుడు విజయం మనదే అంటూ క్యాడర్ కు చెబుతున్నారు. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. తద్వారా ఉప ఎన్నికలు వస్తాయి అని హరీష్ రావు క్యాడర్ ను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఉప ఎన్నికలు ఎందకు రాలేదో హరీష్ చెప్పగలరా అని పార్టీ క్యాడర్ చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో తుది నిర్ణయం స్పీకర్ దే. శాసన వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అవకాశాలు లేవు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసల జోరు చూస్తుంటే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోగానే బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం ఖాయంగా కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో  హరీష్ రావు మాటలు క్యాడర్ లో భరోసా నింపగలవా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు

విజయసాయి వర్సెస్ వైసీపీ.. ఏం జరుగుతోంది?

ఎన్నికల్లో  ఘోర పరాజయంతో వైసీపీ కష్టాలు ద్విగుణీకృతమయ్యాయి. అసలా పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి.  తొలుత పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందంటూ విజయసాయిరెడ్డే రోడ్డెక్కారు. అయితే నేరుగా ఎవరి పేరూ ఆయన బయట పెట్టకపోయినా.. ఆయన ఆరోపణల టార్గెట్ వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా చక్రం తిప్పిన సజ్జలేనని ఎవరికైనా తేలిగ్గానే అర్ధం అవుతుంది.  ఒక సమయంలో వైసీపీలో అత్యంత కీలకంగా, ఇంకా చెప్పాలంటే నంబర్ 2గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి  ఇప్పుడు మాత్రం పార్టీలోనూ, విపక్షాల నుంచీ కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తినా సొంత పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు మద్దతుగా బయటకు వచ్చి ఆయన ఆరోపణలను ఖండించలేదు. ఒకరకంగా పార్టీ మౌనం విజయసాయిరెడ్డిపై ఆరోపణలను నిజమేనన్న భావన సామాన్య జనంలో కూడా కలిగేలా చేశాయి.   ఈ నేపథ్యంలోనే తనపై ఈ ఆరోపణలు రావడం వెనుక ఉన్నది సొంత పార్టీ నేతలే అన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలో వైసీపీ లో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతోంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై విశాఖ వేదికగా విజయసాయిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసినా,  ఆయన పార్టీలో కీలక నేత అయినా విశాఖకు చెందిన వైసీపీ నేతలెవరూ ఆయనకు స్వాగతం పలకలేదు. మీడియా సమావేశంలో ఆయన పక్కన కనిపించడానికి కూడా ఇష్టపడలేదు.  దీనిని బట్టే హై కమాండ్ కూడా ఆయన పట్ల ఏ మాత్రం సానుకూలంగా లేదన్న విషయం అర్ధమౌతుంది.  ఇందుకు కారణం నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయసాయి.. అక్కడ విజయం కోసం ఏ మాత్రం ప్రయత్నించలేదనీ, నామినేషన్ దాఖలు చేసిన క్షణం నుంచే తన ఓటమిని అంగీకరించేసినట్లుగా వ్యవహరించారనీ పార్టీ శ్రేణుల నుంచే ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే విషయాన్ని నెల్లూరు వైసీపీ నేతలు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జగన్ ఆయన పట్ల కినుకగా సుబ్బారెడ్డిని నియమించారని అంటున్నారు.     ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి సొంత చానెల్ ప్రకటన చేశారు. విశాఖ వేదికగానే ఆయనీ ప్రకటన చేశారు. గతంలో కూడా ఆయన సొంత చానల్ మాట ఎత్తారు కానీ, ఆ తరువాత ఆ విషయంపై ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం తాను ప్రారంభించబోయే సొంత చానల్ తాను ఏ పార్టీలో ఉన్నానన్నదానితో సంబంధం లేకుండా న్యూట్రల్ గా వ్యవహరిస్తుందని చెప్పారు. అలా చెప్పడం ద్వారా ఆయన తాను ఇంత కాలం కొన్ని పత్రికలపై చేస్తున్న విమర్శలను పునరుద్ఘాటించడమే కాకుండా, వైసీపీ సొంత మీడియాపై కూడా విమర్శలు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఇక విజయసాయిరెడ్డికి వైసీపీలో కొనసాగే పరిస్థితి ఉండకపోవచ్చని కూడా అంటున్నారు. విజయసాయి కూడా ఇప్పటికే ఆ భావనకు వచ్చేశారనీ, రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో తనకున్న పరిచయాలను ఆధారం చేసుకుని కమలం గూటికి చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించేశారనీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.  అంతే కాదు తాను ఒక్కడిగా కాకుండా మొత్తంగా వైసీపీ రాజ్యసభ సభ్యులందరినీ కమలం గూటికి చేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. 

‘ఏరా’ విజయసాయిరెడ్డి!

‘శాంతి’కాముకుడు, విజయసాయిరెడ్డి, దగ్గర దగ్గర 70 ఏళ్ళ వయసుకు చేరుకున్న విజయసాయిరెడ్డి.. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి... ఇలాంటి పెద్దమనిషిని ‘ఏరా’ అన్నామని అనుకోవద్దు.. ఎవర్ని పడితే వాళ్ళని ‘ఏరా’ అని పిలిచే కుసంస్కారం వున్నది విజయసాయిరెడ్డికే. మొన్నామధ్య ప్రెస్‌మీట్ పెట్టి ప్రశ్నలు అడుగుతున్న జర్నలిస్టులను ‘ఏరా’ అని విజయసాయిరెడ్డి పిలవటం ఏపీ వ్యాప్తంగా జర్నలిస్టులకు ఆగ్రహావేశాలను కలిగించింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టు సంఘాలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తన హోదాను వయసును మరచి మీడియా సంస్థలపై, జర్నలిస్టులపైనోరు పారేసుకోవటాన్ని  గురువారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని ధర్నా చౌక్‌లో జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదిలా వుంటే, జర్నలిస్టులను ‘ఏరా’ అని పిలుస్తున్న విజయసాయిరెడ్డికి బుద్ధి రావాలంటే, ఆయనకు సంబంధించిన వార్త రాసినా, చదివినా ఆయన పేరు ముందు ‘ఏరా’ అనే విశేషణాన్ని చేర్చాలన్న అభిప్రాయాన్ని పలువురు జర్నలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు.. ఎక్కడ విజయసాయిరెడ్డి పేరును ఉదహరించాలన్నా, ఆ పేరును ‘ఏరా’ విజయసాయిరెడ్డి అని పేర్కొనాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ‘ఏరా’ విజయసాయిరెడ్డిని దారిలో పెట్టి కరెక్ట్ ‘గాంధీగిరి’ అవుతుందని అంటున్నారు. ‘ఏరా’ విజయసాయిరెడ్డి దిగివచ్చి క్షమాపణలు చెప్పేవరకూ ఈ ‘ఏరా’ గాంధీగిరిని కొనసాగించాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

‘మిథున్‌రెడ్డి గోబ్యాక్’... ప్రతిధ్వనించిన పుంగనూరు!

పుంగనూరులో తండ్రికి జరిగిన సత్కారమే కొడుక్కి కూడా జరిగింది. మొన్నటి ఎన్నికల ఫలితాల వరకు పుంగనూరులో నిరంకుశ రాజ్యాన్ని నడిపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు పుంగనూరులో అడుగు పెట్టే పరిస్థితి కూడా లేక ఎక్కడెక్కడో తల దాచుకుంటున్నారు. ఆయన పుంగనూరులో ఎప్పుడు అడుగు పెట్టాలని ప్రయత్నించినా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దాంతో ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకుని వెనుదిరుగుతున్నారు.  ఇప్పుడు జనం సెగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి కూడా తగిలింది. పుంగనూరుకు మిథున్ రెడ్డి రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మిథున్‌రెడ్డి తమ వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి గురువారం నాడు వెళ్ళారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మిథున్‌రెడ్డి తమను వేధింపులకు గురిచేశారంటూ ఎన్డీయే కార్యకర్తలు రెడ్డప్ప ఇంటికి వెళ్ళారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ఎన్డీయే కార్యకర్తల మీద రాళ్ళదాడి చేశారు. ఎన్డీయే కార్యకర్తలు తిరిగి రాళ్ళదాడి చేశారు. ‘మిథున్ రెడ్డి గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఎంపీ మిథున్ రెడ్డిని గృహ నిర్బంధంలో వుంచారు.

పోలీసుల అదుపులో కొడాలి నాని?

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారా? ఆయనను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారా? అంటే రాజకీయవర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దారుణాలతో ఇష్టారీతిగా చెలరేగిన నాని.. ఇప్పుడు వాటన్నిటికీ సంబంధించి పలు కేసులు ఎదుర్కొంటున్నారు. తాజాగా గుడివాడలోని శరత్ థియేటర్ ను అక్రమంగా అధీనంలోకి తీసుకుని పార్టీ కార్యాలయాన్ని నడిపిన అంశంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. గుడివాడ ఎమ్మెల్యే ఆ థియోటర్ కు నాని చెరనుంచి విముక్తి కలిగించి సొంత దారులకు అప్పగించారు. అలాగూ కొడాలి నానిపై పలు ఫిర్యాదులు ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం (జులై 17) అర్థరాత్రి దాటిన తరువాత గుడ్లవల్లేరు సమీపంలో అదుపులోనికి తీసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆయన అరెస్టును ధృవీకరించడం లేదు.