పిల్లకాయలకు ఇస్కూళ్ళు బంద్... మళ్ళీ ఆన్ లైన్ క్లాసులే ..!

లాక్‌డౌన్‌తో గత ఏడాది మార్చి నుంచి దాదాపు 10 నెలల పాటు తెలంగాణలో బడులు మూసి ఉన్న సంగతి తెల్సిందే. మరోపక్క కొన్ని రోజుల క్రితం వరకు కరోనా కేసులు తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ గడచిన నెల ఫిబ్రవరి 1 వ తేదీ నుండి 9, 10 తరగతి విద్యార్థులకు ఆఫ్ లైన్ లోనే  (తరగతి గదిలో) క్లాసులు జరపాలని నిర్ణయించింది. దీంతో అప్పటి నుండి 9 వ తరగతి పైబడిన విద్యార్థులందరూ స్కూళ్లకు వెళుతున్నారు. తరివాత అదే నెల 24వ తేదీ నుండి 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు కూడా ఆఫ్ లైన్ క్లాసులకు సర్కార్ అనుమతి ఇచ్చిన సంగతి తెల్సిందే  అయితే ప్రాథమిక తరగతుల విద్యార్థుల క్లాసులకు మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీంతో స్కూళ్లు, గురుకులాలు ఓపెన్ కావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా బడి బాట పట్టారు.    అయితే కొద్దిరోజులుగా పలు విద్యా సంస్థల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతుండడంతో.. . ఈ ప్రత్యక్ష తరగతులను నిలిపేయాలని తెలంగాణ సర్కార్ పునరాలోచనలో పడింది. మరీ ముఖ్యంగా బడులలో  కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో.. దీనిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజుల్లో పలు విద్యాసంస్థల్లో 150కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోపక్క పొరుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతుండటంతో కేంద్రప్రభుత్వం కూడా దీనిపై హెచ్చరికలు జారీచేసింది. రాష్ట్రాలు పూర్తీ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ బుధవారం జరిగిన సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలను కోరారు. దీంతో 6 నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పాఠశాలలను మూసివేసి మళ్ళీ ఆన్ లైన్ క్లాసులనే కొనసాగించాలని నిర్ణయించినట్టుగా  తెలుస్తోంది. అంతేకాకుండా  ఈ తరగతుల విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని కూడా డిసైడ్ అయినట్లు గా సమాచారం. దీంతో కేవలం 9 , 10వ తరగతి విద్యార్థులకే ప్రత్యక్ష తరగతులు నిర్వహించడానికి అనుమతివ్వాలని భావిస్తోంది. అంతేకాకుండా పదో తరగతి పరీక్షల తేదీలను ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరిన్ని కోవిడ్ జాగ్రత్తల మధ్య వారికి ప్రత్యక్ష బోధన కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది  

పెళ్లి ఒకరితో.. గర్భం ప్రియుడితో.. 

ఒకరిని ప్రేమించింది. మరొకరిని పెళ్లి చేసుకుంది. అయినా ఆమె వక్ర బుడ్డి మానుకోలేదు. పెళ్లి తర్వత కూడా ప్రియుడితో టచ్ లో ఉంది. ఆ విషయం భర్తకు కూడా తెలుసు. తరుచు భర్త ను ప్రియుడితో పోల్చి అవమానించేది. అయినా ఆ భర్త ఓర్చుకున్నాడు. ఆ బాధని తనలోనే దాచుకున్నాడు. ఏ మగాడైనా బరించేంత వరకు భరిస్తాడు. అది అవమానంగా, ఆవేదన అయినా, కానీ తన ప్రియుడి వల్లే నేను గర్భం దాల్చను అని చెపితే ఒక భర్తకు అంత కంటే అవమానం ఏముంటుంది చెప్పండి.  ఎవరు ఎన్ని మాటలు అన్నా, తిట్టినా, అవమానించినా మగాళ్లు తట్టుకోగలరు. కానీ కట్టుకున్న భార్య నుంచే వేధింపులు మొదలైతే మాత్రం భర్త భరించలేడు. ప్రియుడి మోజులో పడి సూటి పోటు మాటలంటూ అవమానిస్తే తట్టుకోలేడు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. జగిత్యాల జిల్లా మల్యాలకుచెందిన అట్టపెల్లి రాజు అనే 30 ఏళ్ల యువకుడికి గొల్లపెల్లి మండలం బొంకూరుకు చెందిన ఓ యువతితో ఏడాది క్రితం పెళ్లయింది. అయితే పెళ్లికి ముందే ఆ యువతి గొల్లపెల్లి మండలంలోని తుంగూరుకు చెందిన సప్ప రాజేందర్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఏ కారణం వల్లనో ఏమో కానీ రాజును పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత కూడా ప్రియుడితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయం రాజుకు తెలిసి తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ భార్య తీరులో మార్పులేదు. అంతేకాకుండా ప్రతీ విషయంలోనూ భర్తను, ప్రియుడిని పోల్చుతూ కామెంట్స్ చేసేది. అవమానించేది. ఇదే క్రమంలో ఆమె ఇటీవల గర్భం దాల్చింది. ఈ గర్భం వచ్చింది నీ వల్ల కాదు. దీనికి కారణం నువ్వు కాదు. నా ప్రియుడి వల్లే నేను గర్భవతిని అయ్యా‘ అంటూ భర్త రాజుతో తేల్చిచెప్పింది. ఆ తర్వాత తల్లిగారింటికి వెళ్లి అబార్షన్ చేయించుకుంది. అంతటితో ఆగకుండా ఆ భార్య వేధింపులను మరింత పెంచింది. ఆమె తన ప్రియుడితో కలిసి రాజును మానసికంగా చిత్రహింసలకు గురిచేసింది. ’నీ బతుకు ఎందుకు. ఎందులోనైనా దూకి చచ్చిపోరాదు. నీదీ ఒక బతుకేనా?’ అంటూ ఫోన్లు చేసి వేధించసాగారు. దీంతో మనో వేధనకు గురైన ఆ భర్త మంగళవారం మల్యాల మండలం నూకపెల్లి శివారులోని వరద కాలువ క్రాస్ రెగ్యులేటర్ గేట్ల వద్ద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య, ఆమె ప్రియుడి గురించి వివరాలు ఆరా తీస్తున్నారు.  

గుంటూరు టీచర్ ఎమ్మెల్సీగా కల్పలత

గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా కల్పలత విజయం సాధించారు. ఈ స్థానం నుంచి మొత్తం 19 మంది పోటీ చేశారు. 12,554 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం  ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా చెల్లని ఓట్లను తీసేసిన అనంతరం అభ్యర్థి విజయానికి 6,153 ఓట్లు అవసరమని అధికారులు నిర్ణయించారు. తొలి ప్రాధాన్య ఓట్లలో ఏ అభ్యర్థికి 50 శాతానికిపైగా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో కల్పలత 6,153 ఓట్లు సాధించిన వెంటనే సమీప అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావుపై ఆమె విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు. విజయం సాధించిన అనంతరం కల్పలత మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. తన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.

ఎమ్మెల్సీ కౌంటింగ్.. టీఆర్ఎస్ అభ్యర్థుల లీడ్

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల వరకు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానంలో రెండు రౌండ్లు పూర్తి కాగా.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో ఒక రౌండ్ ముగిసింది. నల్గొండ స్థానంలో రెండో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 7 వేల871 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండు రౌండ్లలో కలిపి లక్షా 12 వేల ఓట్లు లెక్కింపు పూర్తైంది. ఇందులో దాదాపు 6 వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. మిగిలిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు 31987 , తీన్మార్ మల్లన్నకు  24116, కోదండరామ్ కు 18528, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 13284 ఓట్లు వచ్చాయి.  తొలి రౌండ్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి  16 130, తీన్మార్ మల్లన్నకు 12046, కోదండరామ్ కు 9080, బీజేపీకి  6615, కాంగ్రెస్ కు 4354 ఓట్లు వచ్చాయి. దీంతో తొలి రౌండ్ లో పల్లాకు తీన్మార్ మల్లన్న కంటే 4084 ఓట్లు ఎక్కువ వచ్చాయి. రెండో రౌండ్ లో పల్లాకు 15857, తీన్మార్ కు 12070, కోదండరామ్ కు 9448, బీజేపీకి  6669, కాంగ్రెస్ కు 3244 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 3 వేల 780 ఓట్ల ఆధిక్యం వచ్చింది.  ఇక హైదరాబాద్ సీటులో తొలి రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవీ స్వల్ప ఆధిక్యం సాధించారు. తొలి రౌండ్ లో 56 వేల ఓట్లను లెక్కించగా.. 3 వేల ఓట్లు చెల్లించకుండా పోయాయి. మిగిలిన 53 వేల ఓట్లలో  సురభి వాణిదేవీకి 17 429, బీజేపీ అభ్యర్థి రాంచంద్రరాావుకు 16 385, ఇండిపెండెంట్ అభ్యర్థి నాగేశ్వర్ కు 8357, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డితి 5501 ఓట్లు వచ్చాయి, తొలి రౌండ్ లో వాణిేదేవీకి 1044 ఓట్ల ఆధిక్యం వచ్చింది.

లీడ్ ఉన్నా టీఆర్ఎస్ గెలుపు కష్టమే!

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల వరకు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానంలో రెండు రౌండ్లు పూర్తి కాగా.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో ఒక రౌండ్ ముగిసింది.నల్గొండ స్థానంలో రెండో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 7 వేల 871 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హైదరాబాద్ సీటులో తొలి రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవీకి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కంటే వెయ్యి 44 ఓట్ల స్వల్ప ఆధిక్యం వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులకు లీడ్ వచ్చినా... వాళ్ల అభ్యర్థులు విజయం సాధించడం కష్టమేనన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ భిన్నంగా ఉంటుంది. తొలి ప్రాధాన్యత ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధిస్తేనే గెలిచినట్లు. లేదంటే రెండో ప్రాధాన్యత.. అందులోనూ తేలకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లలో వెనకబడిన అభ్యర్థులు కూడా రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందిన సందర్భాలున్నాయి.  నల్గొండ స్థానంలో రెండు రౌండ్లలో కలిపి ఇప్పటివరకు లక్షా 12 వేల ఓట్లు లెక్కింపు పూర్తైంది. ఇందులో దాదాపు 6 వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. మిగిలిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు 31 987 , తీన్మార్ మల్లన్నకు  24116, కోదండరామ్ కు 18528, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 13284 ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన తొలి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ కు 50 శాతం ఓట్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓటే కీలకంగా మారనుంది.  ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో లీడ్ లో ఉన్నా పల్లా రాజేశ్వర్ రెడ్డికి వచ్చిన ఓట్లు కేవలం 31శాతమే. అంటే ఇప్పుడొస్తున్న ట్రెండ్స్ ప్రకారమే మిగితా రౌండ్లలో పల్లాకు లీడ్ వచ్చినా... రెండో ప్రాధాన్యత ఓట్లలో ఆయనకు మరో 20 శాతం ఓట్లు రావాల్సి ఉంది. హైదరాబాద్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవీకి 33 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆమెకు కూడా రెండో ప్రాధాన్యత ఓట్లలో భారీగా ఓట్లు రావాల్సి ఉంది. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ ను కలవరపరుస్తోంది.  ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పరిశీలించిన రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం అధికార టీఆర్ఎస్ పార్టీకి రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎక్కువ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. అందుకే తొలి ప్రాధాన్యత ఓట్లపైనే గులాబీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ప్రచారంలోనూ టీఆర్ఎస్ నేతలు తొలి ప్రాధాన్యత గురించే ప్రచారం చేశారు. అయితే లెక్కింపులో వాళ్లకు తొలి ప్రాధాన్యత ఓటు కేవలం 30 శాతంగానే ఉండటంతో... గెలుపుపై నమ్మకం కోల్పోతున్నారని తెలుస్తోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి దాదాపు 40 శాతం ఓట్లు సాధిస్తే తప్ప.. టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదని చెబుతున్నారు. 

నిమ్మగడ్డ, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తయితే బాగుండేది. ఎన్నికల నిర్వహణలో జాప్యంపై గవర్నర్, హైకోర్టుకు నివేదించాలి. ఇవి ఏపీ సీఎం జగన్‌రెడ్డి స్టేట్‌మెంట్స్. ఒక్క నెలలో ఎంత తేడా? ఎంత మార్పు?. మొన్నటి దాకా ఎన్నికలకు ససేమిరా అన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఎలక్షన్‌ జరిపేదే లేదంటూ భీస్మించుకు కూర్చున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అన్నిచోట్లా చేతులు కాల్చుకున్నాక.. ఎన్నికలు జరిపారు. విజయఢంకా మోగడంతో మొనగాడిలా.. మిగిలిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలంటూ పట్టుబడుతున్నారు సీఎం జగన్.  ఇటీవలే మంత్రి పెద్దిరెడ్డి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రిటైర్ అయ్యేలోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి సైతం నిమ్మగడ్డపై తమకు ఎలాంటి వ్యక్తిగత ధ్వేషం లేదంటూ వ్యాఖ్యానించారు. సీఎం, మంత్రి, చీఫ్ విప్.. ఇలా నేతల వరుస ప్రకటనలు చూస్తుంటే.. నిమ్మగడ్డతో వైసీపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ జరుగుతున్న ప్రచారం నిజమేననే అభిప్రాయం కలుగుతోంది. కొత్తగా ఏర్పడిన ఏ ప్రభుత్వానికైనా రెండున్నర ఏళ్ల పాటు హనీమూన్ పీరియడ్ ఉంటుందని అంటారు. పాలనలో మొదటి సగ భాగం అంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాతే ప్రభుత్వంపై అసలైన అభిప్రాయం ఏర్పడుతుంది. మొదటి రెండేళ్లు సంక్షేమ పథకాలతో జనాలను మభ్యపెడుతున్న జగన్ సర్కారుపై ఎలాగూ సదభిప్రాయమే ఉంటుంది. ఆ తర్వాతే అభివృద్ధి, పరిశ్రమలు, ఆదాయంలాంటి అసలైన అంశాలు చర్చకు వస్తాయి. ఏపీలో ఇప్పుడు అలాంటి అభివృద్ధి ఛాయలేవీ లేవనే నిజాన్ని ప్రజలు కాస్త ఆలస్యంగానైనా తెలుసుకుంటారు. ఆ సమయంలో కనుక ఎన్నికలు జరిగితే.. ప్రజా వ్యతిరేకత బయటపడేది. హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం అధికార పార్టీకి అనుకూలంగా మారింది. వైసీపీకి, ఎస్ఈసీ లోపాయికార ఒప్పందం జరిగిందని.. బయటకు మాత్రం నిమ్మగడ్డ చంద్రబాబు మనిషంటూ ప్రచారం చేశారని.. ఇదంతా అధికార పార్టీ మైండ్ గేమ్‌లో భాగమని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. పరిస్థితి చూస్తుంటే ఆ విషయం వాస్తవమే అనిపిస్తోంది. ఏడాదిగా కరోనా కారణంతో ప్రతిపక్షం పెద్దగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లలేకపోయింది. అధికార పార్టీ దూకుడుగా ఉండి.. విపక్షం ఉదాసీనంగా ఉన్న సమయంలో.. ప్రభుత్వానికి హానీమూన్ పిరియడ్ నడుస్తున్న టైమ్‌లో కావాలనే హడావుడిగా స్థానిక ఎన్నికలు జరిపారని కొందరు అంటున్నారు. ఇదంతా.. సర్కారు, ఎస్ఈసీ కలిసి చేసిన కుట్ర అంటూ ఓ వర్గం ఆరోపిస్తోంది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు.. నిమ్మగడ్డ, చంద్రబాబును ఒకే కులం గాటున కట్టేసి.. ఆయన ఆయన మనిషేనంటూ ముద్రేసి.. సర్కారు స్వకార్యం సైలెంట్‌గా పూర్తి చేసుకుందని అనుమానిస్తున్నారు.  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలంటూ సీఎం జగన్ అభిప్రాయపడటం.. ఆ ఎలక్షన్ కూడా కంప్లీట్ చేసి రిటైర్ కావాలంటూ మంత్రి పెద్దిరెడ్డి కోరడం.. నిమ్మగడ్డపై ఎలాంటి వ్యక్తిగత ధ్వేషం లేదంటూ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి చెప్పడం.. ఇవన్నీ అంతా ఆ తాను ముక్కలే అనడానికి నిదర్శణమంటున్నాయి విపక్షాలు. 

మళ్ళీ లాక్ డౌన్ తప్పదా ?

మూడు నాలుగు నెలలుగా  ప్రపంచంలో చాలా దేశాల్లో కొవిడ్ సెకండ్ వేవ్, డిఫరెంట్ వరిఎంట్ ప్రభావం కనిపిస్తోంది. ఫస్ట్ వేవ్లో అత్యంత వేగంగా, అత్యధికంగా కేసులు నమోదైన్   జర్మనీ, ఫ్రాన్స్ సహా మరి కొన్ని దేశాలు కొడ్ కట్టడికి లాక్ డౌన్ విధించాయి. అయితే కొత్తగ నమోదవుతున్న కేసుల సంఖ్య,మరణాల సంఖ్యా గణనీయంగా తగ్గడంతో పాటు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో మన దేశంలో ఆ పరిస్థితి రాదన్న భరోసా ఏర్పడింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం, దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండటంపై ఆందోళన వ్యక్తంచేశారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆయా రాష్రాలలో పరిస్థితిని,కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై చర్చించారు. కరోనా సెకండ్ వేవ్ నిరోధానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్నిటినీ మించి కరోనాపై పోరాటం ద్వారా మన దేశం సాధించిన ఆత్మవిశ్వాసం, అతివిశ్వాసానికి,నిర్లక్ష్యానికి దారితీయరాదన్నారు.కరోనా కొత్త  కేసుల సంఖ్యా పెరుగుతున్నరాష్ట్రాలతో పాటుగా ఇరపగు పొరుగు దేశాలు ఇప్పుడే అడ్డుకట్ట వేయకపోతేమహమ్మారి మరోమారు దేశాన్ని చుట్టేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  వైరస్‌ కట్టడికి భారీగా పరీక్షలు నిర్వహించంతో పాటు కొవిడ్‌ నిబంధనల్ని మరింత కఠినంగా అమలుచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.  గత కొన్ని వారాలుగా మహారాష్ట్ర, కేరళ, మధ్య ప్రదేశ్, కర్ణాటక, సహా పలు  రాష్ట్రాలలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. వైరస్‌ కట్టడికి ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో పలు నగరాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తుండగా, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పంజాబ్‌ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. కొవిడ్‌-19 ఫస్ట్ వేవ్ తోనే ఉక్కిరిబిక్కిరైన మహారాష్ట్ర,లో సెకండ్ వేవ్ మొదలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకుంటున్న మహారాష్ట్ర ప్రభుత్వం, అమరావతి, నాగ్‌పూర్‌ నగరాల్లో పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. ఇక పుణె, నాసిక్‌, ఔరంగాబాద్‌ నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌, గుజరాత్ రాష్ట్రాలు  కూడా అప్రమత్తమయ్యాయ్యి. మధ్యప్రదేశ్  పలు నగరాల, పట్టణాలలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. అంతేకాకుండా మరోకొని చోట్ల మార్కెట్లను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న జిల్లాల్లోనూ ఆంక్షలు విధిస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం పేర్కొంది.గుజరాత్ లోనూ అదే పరిస్థితి. కొవిడ్ ఉదృతి పెరగడానికి వ్యాక్సిన్‌ వచ్చిందన్న ధైర్యంతో ప్రజలు కొవిడ్‌ నిబంధనల పాటించక పోవడం కూడా ఒక ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.  ముఖ్యంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందనే ధైర్యంతో ఉన్న కొందరు, మాస్కులు, భౌతికదూరాన్ని పాటించకపోవడం వల్లే వైరస్‌ వ్యాప్తి పెరుగుతోందని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే  కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్ కూడా నిర్లక్ష్యంగా ఉండడంతోనే దేశంలో వైరస్‌ తీవ్రత ఎక్కువవుతోందని అన్నారు. ఈ పరిస్థితులలో దేశంలో మరో మారు లాక్ డౌన్ విధించే అవకాశాలను పూర్తిగా కొట్టివేయలేమని, అయితే అయితే, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా పూర్తిలాక్‌డౌన్‌ పరిష్కారం కాదని, స్థానికంగా జిల్లా స్థాయిల్లో ఆంక్షలతో దీన్ని కట్టడి చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా మహామ్మారే  కాదు .. లాక్ డౌన్ ముప్పు కూడా ఇంకా తొలిగి పోలేదు.

సారంగ దరియాపై కూలైన కోమలి  

లవ్ స్టోరి చిత్రంలో  సారంగ దరియా పాట విషయంలో వివాదం ముగిసింది. ఈ పాట సేకరణ చేసిన జానపద గాయని కోమలి సారంగ దరియా పాటను సినిమాలో ఉపయోగించడంపై ఇకపై తనకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. దర్శకుడు శేఖర్ కమ్ములను కలిసిన అనంతరం కోమలి ప్రకటన చేసింది.  సారంగ దరియా పాట లవ్ స్టోరి సినిమాలో నాతో పాడించలేదనే బాధ ఇన్ని రోజులు ఉండేదని చెప్పింది కోమలి. అదే ఆరాటాన్ని కొన్ని మీడియాల ద్వారా వ్యక్తం చేశానని తెలిపింది. రేలారె రేలా ద్వారా సారంగ దరియా పాటను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ సురేష్ గారి చొరవతో దర్శకుడు శేఖర్ కమ్ముల కలిశానాని.. తనకు సంతోషంగా ఉందంది. తన రాబోయో సినిమాల్లో అవకాశం ఉంటే నాతో తప్పకుండా పాట పాడిస్తానని శేఖర్ కమ్మల మాటిచ్చారని వెల్లడించింది. అలాగే 'లవ్ స్టోరి' సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో స్టేజీ మీద 'సారంగ దరియా' పాట నాతోనే పాడిస్తానన్నారని కోమలి తెలిపింది. చాలా సంతోషంగా ఉంది. ఇక సారంగ దరియా పాట విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ప్రకటించింది గాయని కోమలి.  ఇన్ని రోజులు కమ్యునికేషన్ సమస్య వల్ల గాయని కోమలి గారిని కలవలేకపోయానని చెప్పారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆమెకు మాటిచ్చినట్లు భవిష్యత్ లో తన సినిమాలో జానపద పాట పాడించే అవకాశం ఇస్తానన్నారు.  సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రామిస్ లను నిలబెట్టుకుంటానని చెప్పారు. కోమలి  హ్యాపీగా ఫీలయ్యారు.. ఇంతటితో ఈ వివాదం ముగిసిందని భావిస్తున్నానని శేఖర్ కమ్మల చెప్పారు. 

సాగర్ బరిలో కోమటిరెడ్డి.. పువ్వు గుర్తుపై పోటీ!

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. అంగ బలం, అర్థ బలం దండిగా ఉన్న నేత. నల్గొండలో మంచి పట్టున్న నాయకుడు. ఆయనకు ఎప్పటి నుంచో బీజేపీ గాలం వేస్తోంది. కోమటిరెడ్డి సైతం కాషాయ కండువా కప్పుకునేందకు ఆరాటపడుతున్నారు. అందుకు సరైన సమయం కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. నీ అవసరం వచ్చేసిందని..  సమయం లేదు మిత్రమా అంటూ.. కమలనాథులు కోమటిరెడ్డిని పార్టీలోకి రా..రామ్మని పిలుస్తున్నారట. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేయమని అడుగుతున్నారట. ఈ మాట ఎవరో అంటున్నది కాదు. సాక్షాత్తూ.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డినే ఈ విషయం స్పష్టం చేశారు.  తాను నాగార్జునసాగర్‌ నుంచి పోటీ చేయాలని, కొన్నిరోజులుగా బీజేపీ నేతలు అడుగుతున్నారని రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు ఆయన సైతం సై అన్నట్టు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను గద్దె దించాలంటే బీజేపీతోనే సాధ్యమని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తాను బీజేపీ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ నేత జానారెడ్డి మూడో స్థానానికి పరిమితమవుతారని జోస్యం చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి పోటీ చేస్తే నాగార్జున సాగర్ ఉప పోరు మరింత రంజుగా సాగడం ఖాయం. ముక్కోణపు పోరు పక్కా. కాంగ్రెస్ తరఫున జానారెడ్డి బరిలో నిలవడం.. టీఆర్ఎస్ పార్టీ బలమైన అభ్యర్థి కోసం వెతుకుతుండటం.. ఈ సమయంలో కోమటిరెడ్డిపై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించడంతో నల్గొండ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. మరి, సాగర మధనంలో ఎలాంటి ఫలితాలు వస్తాయో....

ఫాంహౌజ్ లో కేసీఆర్ చేసేది ఇదే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడానికి ప్రతిపక్షాలు ఎక్కువగా వాడుకునేది ఫాంహౌజ్. కేసీఆర్ ను ఫాంహౌజ్ ముఖ్యమంత్రి అని విపక్ష నేతలు ఆరోపణలు చేస్తుంటారు. కేసీఆర్ ఎక్కువగా ప్రజల్లోకి తిరగరనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. ఉంటే ప్రగతి భవన్ లేదంటే ఫాంహౌజ్ లోనే ఆయన ఎక్కువగా ఉంటుంటారు. కొన్ని సార్లు రెండు, మూడు వారాల పాటు ఫాంహౌజ్ లోనే ఉంటారు కేసీఆర్. కరోనా సమయంలోనూ ఆయన ఎక్కువగా అక్కడే ఉన్నారు. అందుకే విపక్ష నేతలు ఆయనను టార్గెట్ చేయడానికి ఫాంహౌజ్ ను ఉపయోగించుకుంటూ ఉంటారు.  అయితే వారాల తరబడి ఫాంహౌజ్ లో ఉండే కేసీఆర్.. అక్కడ ఏం చేస్తారని చాలా మందికి డౌట్. రెస్ట్ తీసుకుంటారని కొందరు చెబితే.. వ్యవసాయ పనులు చూసుకుంటారని మరికొందరు చెబుతారు. తాజాగా  తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. కేసీఆర్ ఫాంహౌజ్ స్టోరీ చెప్పారు. అక్కడే కేసీఆర్ ఏం చేస్తారో వివరించారు. సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపడానికి రంగం సిద్ధం చేస్తున్నామని అన్నారు. తాను జైలుకు పోతానని గ్రహించిన కేసీఆర్‌ ఇప్పటికే ఫామ్‌హౌస్‌లో జైలు జీవితం ప్రాక్టీస్‌ చేస్తున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కేసీఆర్ స్పందించడం లేదన్నారు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ గుర్రంబోడు తండా ఘనటలో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన 20 మంది బీజేపీ నాయకులను బండి సంజయ్ సన్మానించారు. ఈసందర్భంగా సంజయ్ ‌మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలకు కేసులు కొత్త కాదని, అలాగే జైలుకు పోవడం కూడా కొత్తకాదని సంజయ్‌ అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. అన్నింటికీ సిద్ధమయ్యే వచ్చాం, . గుర్రం పోడుతండా ఘటనపై పోలీసుల తీరు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదుచేస్తామని చెప్పారు.  గుర్రంపోడు తండాలో బిజెపి కార్యకర్తలపై తగిలిన లాఠీదెబ్బలకు నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో బుద్ది చెబుతామని అన్నారు బండి సంజయ్.

ఆధారాలిస్తా.... బాబుకు ఇచ్చిన నోటీసులే సీఎంకు కూడా ఇవ్వండి

ఏపీలో అమరావతి అస్సైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సిఐడి నోటీసులు ఇవ్వడంపై రచ్చ జరుగుతున్న సంగతి తెల్సిందే. రాష్ట్రంలోని జగన్ సర్కార్ ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని టీడీపీ విరుచుకుపడుతోంది. మరోపక్క వైసిపి నేతలు మాత్రం బాబు సిఐడి విచారణకు హాజరై తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని చెపుతున్నారు.   ఇది ఇలా ఉండగా అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇచ్చిన నోటీసులే సీఎం జగన్‌కు కూడా ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం  జగన్ ఇళ్ళ స్థలాల పంపిణీ పేరుతో పేదలైన దళితుల నుండి అతికిరాతకంగా, బలవంతంగా అసైన్డ్ భూములు లాక్కున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూముల విషయంలో సీఐడీ అధికారులు చంద్రబాబుపై పెట్టిన సెక్షన్లను జగన్‌తో పాటు రెవిన్యూ మంత్రి, ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌ల పైనా పెట్టి నోటీసులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు.దళితుల నుండి సీఎం అసైన్డ్ భూములను లాక్కున్న వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో తాను సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. ఒకవేళ సీఐడీ అధికారులు జగన్‌పై కనుక కేసులు పెట్టకపోతే సీఐడీ అధికారులపై హైకోర్టులో ఫిర్యాదు చేస్తానని హర్షకుమార్ హెచ్చరించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్, రాజశేఖర్‌ రెడ్డిలు గతంలో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోను సీఎం జగన్ బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం కోసం దళితులను బలిపశువులుగా చేసిన జగన్‌కు జోహార్లు అంటూ హర్షకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

చిరిగిన జీన్స్.. యువతిపై సీఎం షాకింగ్ కామెంట్స్

యువతులు చిరిగిన జీన్స్ వేసుకోవడం తప్పా? ముమ్మాటికీ తప్పే. అవి లై*గిక వేధింపుల వైపు మళ్లే ప్రమాదం ఉంది. ఈ మాట అన్నది ఎవరో సాధారణ వ్యక్తి కానే కాదు. సాక్షాత్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేశారు. మోకాళ్లను చూపుతూ ఉండే జీన్స్ ధరించడం పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే అన్నారు. పాశ్చాత్యులు మనల్ని అనుసరిస్తూ యోగా చేస్తూ, పూర్తిగా శరీరాన్ని కప్పేసే వస్త్రాలను వేసుకుంటుంటే.. మనం మాత్రం నగ్నత్వం వైపు పరుగులు తీస్తున్నామని ఉత్తరాఖండ్ సీఎం తీరథ్‌సింగ్ రావత్ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది.  యువతుల వస్త్రధారణ విషయంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓ ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి షాకయ్యా. ఆ వేషధారణతో ఎన్జీవో విషయమై ప్రజలను కలవడానికి వెళితే.. సమాజానికి ఏం సంకేతాలిస్తున్నట్లు? మన పిల్లలకు ఏం సంకేతాలిస్తున్నట్లు? ఇదంతా ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. మనం ఏం చేస్తామో పిల్లులూ అదే చేస్తారు. మనం దేనిని ఫాలో అవుతామో... పిల్లలూ అదే ఫాలో అవుతారు. ఇళ్లలో సంస్కృతి మూలాలను నేర్పించినట్లైతే, ఎంత ఆధునికంగా ఉన్నా పర్లేదు. జీవితంలో ఎన్నడూ వైఫల్యం చెందరు.’’ అని సీఎం తీరథ్ రావత్ అన్నారు. ఈ పోకడలు లైంగిక వేధింపులు వైపు మళ్లే ప్రమాదం ఉందన్నారు. యువతులు చిరిగిన జీన్స్ వేసుకోవడం తప్పు అన్నట్టు సీఎం చేసిన కామెంట్లపై మహిళా లోకం భగ్గుమంటోంది. 

కుక్కలపై.. ఛీ పాడు.. చండాలం.. 

మనిషి మెదడు భయంకరమైన ఆలోచలనాలకు అడ్డాగా మారుతుంది. తన కా,మ వాంఛలు తీర్చుకోవడానికి ఎంతకైనా తెగపడుతున్నాడు.  తన వాంఛ తీర్చుకోవడానికి ఒక వ్యక్తి రూటు మార్చడు.. మహిళలపై దాడి చేస్తే కేసులు, శిక్షలు అనుకున్నాడేమో.. వీధి కుక్కలతో తన వాంఛ తీర్చుకున్నాడు ఓ  కామాంధుడు . వీధి కుక్కలకు ఆహారంతో గాలం వేసి.. వాటికి బంధించి. వాటిపై లై*గిక దాడి చేశాడు. ఈ ఘటన  ముంబైలో జరిగింది. మనిషి  ఆలోచనలు దిగజారుతున్నాయనే దానికి ఇలాంటి  ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా 30 వీధి కుక్కలను లై*గికంగా హింసించాడు. ఆహారం ఆశచూపి వాటిని దగ్గరికి తీసి.. ఆ తర్వాత లై*గికంగా దాడి చేసి వేధించాడు.  ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని కూరగాయలు అమ్ముకునే 60 ఏళ్ల అహ్మద్ షాహిగా గుర్తించారు.  అతడు దాదాపు 30 కుక్కలపై లైంగికంగా వేధింపులకు పాల్పడినట్టు తేల్చారు. అంధేరి పశ్చిమ ప్రాంతంలో అహ్మద్ వీధి కుక్కకు ఆహారం ఆశ చూపి అత్యాచారానికి పాల్పడుతున్న దృశ్యాలను బాంబే యానిమల్ రైట్స్‌ అనే స్వచ్చంద సంస్థకు చెందిన ఓ వాలంటీర్ సీక్రెట్‌గా రికార్డు చేశాడు. ఈ వీడియోలను పోలీసులకు అందజేశాడు. దీంతో పోలీసులు ఆ వీడియో ఆధారంగా విచారణ ప్రారంభించారు. నిందితుడు అహ్మద్‌పై సెక్షన్స్ 377, 422 కింద కేసు నమోదు చేశారు. అలాగే జంగతు సంరక్షణ చట్టాల్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక, అతన్ని స్థానిక కోర్టులో హాజరుపరుచగా.. న్యాయస్థానం రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో జంతు ప్రేమికులు, నెటిజన్లు ట్విట్టర్‌లో ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వీధి కుక్కలకు రక్షణ కల్పించాలని అధికారులకు పిర్యాదు చేశారు.       

జేసీ కేసీఆర్ కోవర్ట్! 

జేసీ దివాకర్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరే పెద్ద బ్రాండ్. ఏపీ మాజీ మంత్రి, అనంతపురం మాజీ ఎంపీ జేసీ..  ఏం చేసినా.. ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన మీడియా ముందుకు వస్తున్నారంటేనే ఏదో మసాలా ఉన్నట్లే. తాను ఏది అనుకుంటే అది మాట్లాడేయటం జేసీ స్పెషల్. తనకు ఇబ్బంది అవుతుందని తెలిసినా ఆయన వెనక్కి తగ్గరు. కొన్ని సార్లు సొంత మనుషులనే టార్గెట్ చేస్తారు.. సొంత పార్టీపైనా తాను తప్పు అనుకుంటే వెంటనే చెప్పేస్తారు.  2019 ఎన్నికల్లో వైసీపీ విజయం తర్వాత జేసీ ఫ్యామిలీ ఇక్కట్లు పడుతోంది. అయినా తన తీరు మార్చుకోవడం లేదు జేసీ దివాకర్ రెడ్డి. ఏపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో పంచ్ లు విసురుతూనే ఉన్నారు. మా వాడు అంటూనే జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.  ఏపీలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లోనూ ఇప్పుడు కాక రేపుతున్నారు జేసీ దివాకర్ రెడ్డి. మంగళవారం తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన జేసీ.. సీఎల్పీ కార్యాలయంలో చాలా సేపు ఉన్నారు. టీకాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్, కేసీఆర్, సోనియా, రాహుల్  గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు జేసీ. ఇవే ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైరవుతున్నారు.  జేసీ దివాకర్ రెడ్డిపై మాజీ రాజ్యసభ సభ్యడు వి. హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎల్పీలో కూర్చుని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ పై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ తన రాజకీయాలు ఆంధ్రాలో చూసుకోవాలని తెలంగాణాలో కాదని ఆయన విమర్శించారు. సాగర్‌ ఉప ఎన్నికలలో జానారెడ్డి ఓడిపోతాడు అని చెప్పడానికి జేసీ ఎవడని ఆయన ప్రశ్నించారు. జేసీ జ్యోతిష్యాలు చెప్పడం మానుకోవాలని వీహెచ్ మండిపడ్డారు. ఇలాంటి మాటలు మాట్లాడితే కార్యకర్తలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన కేసీఆర్ కోవర్ట్ అని అర్థమవుతోందని  వీహెచ్ అభిప్రాయపడ్డారు. జేసీ తన రాజకీయ బలాన్ని జగన్ పైన చూపుకోవాలని  సూచించారు. జేసీ దమ్మున్న లీడర్ అయితే అనంతపూర్‌లో లేదా రాయలసీమలో తన బలాన్ని చూపించుకోవాలని వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు. సీఎల్పీ నేత మళ్లు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి‌పై అధిష్టానానికి కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. సీఎల్పీలో కూర్చుని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ పై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాయి.  సోనియా, రాహుల్‌ను జేసీ తిట్టిపోసినా ఈ నేతలు అడ్డుకోలేదని విమర్శించారు. జానారెడ్డి ఓడిపోతాడని జేసీ చెప్పినా స్పందించరా అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  "తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ పెద్ద తప్పు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. వేరే దారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ అక్కడా ఇక్కడా లేకుండా పోయింది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి కాలం చెల్లింది. సాగర్‌లో జానారెడ్డి గెలువలేడు" అని జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం కామెంట్ చేశారు. 

రెండు రోజుల్లో పీఆర్సీ.. పెంపు ఎంతంటే...

పీఆర్సీ కోసం చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్న తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్. మరో రెండు, మూడు రోజుల్లోనే పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. ఉద్యోగుల మీద త‌మ‌కెంత ప్రేమ ఉందో గ‌త పీఆర్సీతోనే చూపించామ‌న్నారు. మా ఉద్యోగులు కాల‌ర్ ఎత్తుకుని ఇండియాలో తాము అత్య‌ధిక‌ జీతాలు పొందుతామ‌ని చెప్పుకునే విధంగా జీతాలు ఇస్తామ‌ని చెప్పాం.. దాన్ని అమ‌లు చేస్తున్నాం.. తాను ప్ర‌క‌టించిన త‌ర్వాత ఉద్యోగులు త‌ప్ప‌కుండా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ముగిసిన నేప‌థ్యంలో పీఆర్సీ ప్ర‌క‌టిస్తామ‌న్నారు. అయితే.. పీఆర్సీ పెంపు ఎంత ఉంటుందో సీఎం సభలో చెప్పలేదు. గౌరవ ప్రదమైన పీఆర్సీ ఇస్తామని మాత్రమే అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో పీఆర్సీ ఎంత ఉంటుందోననే ఆసక్తి పెరిగింది. గౌరవ ప్రదమైన పీఆర్సీ అన్నారు కాబట్టి.. ఎంతో కొంత ఇచ్చి సరిపెడతారని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  అటు.. నిరుద్యోగ భ‌ృతిపైనా ఆలోచన చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. అయితే, ముందు నిరుద్యోగులు అంటే నిర్వచనం తేల్చాలన్నారు. నిరుద్యోగ భృతి విధివిధానాలు ఖరారు చేసే సమయంలో కరోనా వచ్చిందని చెప్పారు. 

తమ్ముడి కోసం అక్క చేసిన పని.. 

ఆడ పిల్ల పుట్టిందంటే అరిష్టంగా భావించే ఈ రోజుల్లో.. తమ్ముడికి అన్నీ తానై  సాగుతుంది ఓ అక్క. అయిదేళ్ల క్రితం నాన్న మరణించాడు. మూడేళ్లకు తల్లి మృతి చెందింది. అప్పటి నుండి అక్కే తమ్ముడికి అమ్మ నాన్నగా మారింది. తమ్ముడు ఆర్థిక ఇబ్బందుల మధ్య పదో తరగతి పూర్తి చేసిన చేశాడు. అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తులు లేవు. చలివేసిన, వర్షం వచ్చిన వళ్ళు  తడిచే రేకుల ఇల్లే వాళ్ళ పిట్టా గూడు మాత్రమే ఉంది.  అమ్మానాన్నలు ఉన్నారనే దైర్యం లేదు . చేతిలో చిల్లిగవ్వ లేదు. ఈ స్థితిలో పైచదువుల ఆలోచన విరమించుకొని కుట్టుపని నేర్చుకొని తమ్ముడిని చదివిస్తోంది ఒక సోదరి. అమ్మా నాన్న లేని లోటును తీర్చేలా అన్నీ తానే అయ్యి తమ్ముడిని సాకుతోంది. అయ్యో.. ఆడపిల్ల అని జాలిపడిన చుట్టుపక్కల వాళ్లు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడదామని ప్రయత్నించారు. కానీ తన దారి తాను చూసుకుంటే తమ్ముడిని ఆదుకొనే వారు ఎవరూ ఉండరనే  భయంతో మూడుముళ్ల బంధానికీ తాత్కాలికంగా దూరమైంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలంలోని బస్వాపూర్‌కి చెందిన శ్రీలత (20) కథ ఇది. తల్లిదండ్రులు మల్లేశం, సుగుణ అనారోగ్య కారణాలతో మృతిచెందగా... శ్రీలత, ఆమె సోదరుడు ప్రశాంత్‌ దిక్కులేనివారయ్యారు. ఇరుకిరుకుగా ఉన్న రేకుల షెడ్డులోనే నివసిస్తున్నారు. తల్లి మరణించిన తర్వాత శ్రీలత కుట్టుపని నేర్చుకుంది. ఇంటి నిర్వహణతో పాటుగా తమ్ముడి బాధ్యతను తీసుకుంది. ప్రశాంత్‌ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్‌తో చదవడం ఆపేసిన తాను.. తమ్ముడిని   జీవితంలో స్థిరపడే వరకు చదివిస్తానంటోంది.    అమ్మానాన్నల వైద్య చికిత్స కోసం ఉన్న భూమిని  అమ్మేశాం. చివరకు అప్పులే మిగిలాయి. నేను పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోతే తమ్ముడిని చూసుకునే వారే ఉండరు. ఒంటరిగా ఎన్నో కష్టాలు పడతాడు. ప్రశాంత్‌కి ఏదైనా ఉపాధి దొరికే వరకు అండగా ఉండాలని పెద్దలు తెచ్చిన పెళ్లి ప్రస్తావనను తిరస్కరించాను’ అంటోంది శ్రీలత. పల్లెటూరు కావడంతో కుట్టుపని ద్వారా అరకొరగా డబ్బులు వస్తుండటంతో ఆచితూచి ఖర్చు పెడుతూ జీవనం సాగిస్తున్నారీ అక్కా తమ్ముడు. అగ్గిపెట్టెలాంటి రేకుల షెడ్డులో ఎండవేడిమికి అల్లాడిపోతున్నారు. కొన్నిసార్లు మూడు పూటలా తినడమే కష్టంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్క కష్టం వృథా పోకుండా బాగా చదివి ప్రయోజకుడిని అవుతానని ప్రశాంత్‌ చెబుతున్నారు. మంచి ఉద్యోగం తెచ్చుకొని తానే పెళ్లి పెద్దగా మారి అక్క పెళ్లి జరిపిస్తానంటున్నాడు.       

ఓటరు కార్డుకు ఆధార్ లింక్

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆధార్ తో ఓటర్ ఐడీని అనుసంధానం చేస్తున్నట్టు పార్లమెంటులో ప్రకటించింది. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వేసిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిస్తూ.... ఓటర్ ఐడీకి ఆధార్ నంబరును అనుసంధానం చేస్తామని చెప్పారు. దీనివల్ల ఓటు హక్కు పరిరక్షణకు వీలవుతుందని అన్నారు. ఎవరు ఓటు వేశారో, ఎవరు వేయలేదో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. ఓటర్ ఐడీకి ఆధార్ ను అనుసంధానం చేయాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినపడుతున్నాయి. ప్రస్తుతం చాలా బోగస్ ఓట్లు ఉన్నాయి. చాలా మందికి రెండు, మూడు ప్రాంతాల్లో ఓట్లు ఉన్నాయి. ఎన్నికల సమయంలో భారీగా దొంగ ఓట్లను ఎన్ రోల్ చేయిస్తున్నారు. దీంతో ఆధార్ తో అనుసంధానిస్తే నకిలీ ఓట్లు తొలగిపోతాయని కేంద్ర ఎన్నికల సంఘం కూడా అభిప్రాయపడింది. ఓటర్ ఐడీని ఆధార్ తో అనుసంధానం చేస్తే... నకిలీ ఓట్లను సులభంగా తొలగించవచ్చు. ఒక్కొక్కరు కేవలం ఒక ఓటుకు మాత్రమే పరిమితమవుతారు. రెండు, మూడు చోట్ల ఓటరుగా నమోదు చేసుకోవడం కుదరదు.

భైంసా అల్లర్లు.. నిజం ఏంటి ? 

అక్కడ ఏమి జరుగుతోంది ? ఇది ఎదో ఒక సారి కాదు.. పదే పదే వినిపించే ప్రశ్న. నిర్మల్ జిల్లా భైంసాలో గడచిన మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మత ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అక్కడ ఏమి జరుగుతోంది అనేది ఎవరికీ తెలియని రహస్యంగానే ఉండి పోతుంది. ఇదొక మిస్టరీ. పోలీసులదీ అదే పరిస్థితి.  భైంసాలో మతఘర్షణలు జరిగిన ప్రతిసారీ పోలీసుల విశ్వసనీయత ప్రశ్నార్ధకంగానే మారుతోంది. ప్రభుత్వంతో పాటుగా పోలీసు యంత్రాంగం ఒక వర్గానికి కొమ్ముకాస్తోందనే ఆరోపణలు అన్ని సందర్భాలలోనూ వినిపిస్తూనే ఉన్నాయి. అయినా అటు ప్రభుత్వం కానీ, ఇటు పోలీసులు కానీ ‘మచ్చా మంచిదే’ అనుకుంటున్నారో ఏమో కానీ, నిక్ష్పక్షపాత విచారణకు ఆదేశించి, నిజాన్ని నిక్కుతీయడంతో పాటుగా, తమ విశ్వసనీయతను నిరూపించుకునే ప్రయత్నం చేయడం లేదు. అందుకే పోలీసులు బోనులో నిలవవలసి వస్తోంది.  తాజాగా గతవారం జరిగిన మత ఘర్షణలకు సంబంధించి కూడా పోలీసుల కథనం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉందనే ఆరోపణలు వినవస్తున్నాయి. భైంసాలో జరిగిన జరిగిన అల్లర్లలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అంటూనే  నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి అల్లరకు ప్రధాన కారణం హిందూవాహిని కార్యకర్తలే అని, ఇందులో ఇంకెవరి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ఇలా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకోవలసి వచ్చిందంటేనే, ‘దాల్ మే కుచ్ కాలా హై’ అన్న అనుమానం వస్తుంది. అదీకాక  పోలీసులు కానీ మరో వ్యవస్థ కానీ, నిష్పక్షపాతంగా వ్యవహరించడమే కాదు, వ్యవహరిస్తున్నట్లు  కనిపించాలని, న్యాయ నిపుణులు అంటారు. ఈ విషయంలో అయితే పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.   సరే ఐజీ చెప్పినట్లుగా అల్లర్లను ప్రేరేపించింది, హిందూవాహిని కార్యకర్తలే అనుకున్నారోజుల తరబడి అల్లర్లు కొనసాగడానికి, ఇంకా ఇప్పటికీ  అక్కడ కర్ఫ్యూ కొనసాగడానికి కారణం ఏమిటి? మత ఘర్షణలు జరిగిన ప్రతి సారీ, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెపుతున్న పోలీసు బాసులు,ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారు?  అంటే సమాధానం లేదు. సమాధానం లేదంటే చిత్తశుద్ధి లేదని అనుకోవచ్చునేమో.   ఈ అల్లర్లలో పోలీసుల లెక్క ప్రకారమే  ఇద్దరు జర్నలిస్టులతో పాటుగా మొత్తం 12 మదికి గాయలయ్యాయి.13 షాపులు, 4 ఇళ్లు, 4 ఆటోలు, 6 ఫోర్‌వీలర్లు, 5 టూవీలర్లను దహనమయ్యాయి. ఇందుకు సంబదించి 26 కేసులు పెట్టి 42 మందిని అరెస్ట్ చేశారు, బాగుంది. ఇంత జరుగుతుంటే, ఒకే వర్గానికి చెందినవారు ఈ దాడులకు పాల్పడుతుంటే ప్రత్యర్ధి వర్గం ‘మూడు కోతుల బొమ్మల్లా’ ఉండి పోయారా? ఇలాంటి నమ్మశక్యం  కాని  కథలు చెప్పడం వల్లనే పోలీసులు విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది.  ఇక ఇప్పటికైనా ప్రభుత్వం మూలాలలోకి వెళ్లి సమగ్ర విచారణ జరిపించి, న్యాయం జరిపిస్తే పడిన  మచ్చపోతుంది. కాదంటే అల్లరులు ఆగవు, అనుమానాలు తీరవు.. 

కుప్పకూలిన మిగ్‌ 21 .. పైలట్ మృతి..

భారతీయ వాయుసేనకు చెందిన మిగ్‌-21 బైసన్‌ విమానం బుధవారం మధ్యాహ్నం కుప్పకూలిపోయింది. గ్వాలియర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. యుద్ధ విన్యాసాల శిక్షణ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో భారత వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్‌ ఎ.గుప్తా మృతి చెందారు. ఈ విషయాన్ని వాయుసేన అధికారికంగా ప్రకటించింది. దీనిపై వాయుసేన కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీని ప్రారంభించింది. గత 18 నెలల్లో మిగ్‌-21 శ్రేణి విమానాలు ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి. 2019 సెప్టెంబర్లో ఇదే ఎయిర్‌ బేస్‌లో మిగ్‌21 ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదాల్లో భారత్‌ విమానాలను నష్టపోవడంతోపాటు అత్యంత విలువైన ఫైటర్‌ పైలట్లను కూడా కోల్పోతోంది.  పైలట్‌ శిక్షణ అంత తేలిగ్గా ఉండదు. మూడు దశల్లో 285 గంటల కఠిన శిక్షణ పూర్తి చెయ్యాలి. ప్రతి అంశంలో 100శాతం ప్రదర్శన చేస్తేనే ముందుకు వెళతారు. పైలట్‌ శిక్షణ ఖర్చు బహిర్గతం చేయకపోయినా.. కోట్లల్లోనే ఉంటుంది. ఒక సారి శిక్షణ విమానం గాల్లోకి ఎగరాలంటే చాలా సపోర్టింగ్‌ టీమ్‌లు‌‌ పనిచేయాల్సి ఉంటుంది. రాడార్లు, వాటి నిర్వహణ, ఏటీసీ నిర్వహణ, అత్యంత నిపుణులైన శిక్షకులను ఏర్పాటు చేయడం, రన్‌వేను సిద్ధం చేయడం, లోకల్‌ ఫ్లైయింగ్‌ ఏరియా, సిమ్యూలేటర్లు ఇలా ప్రతి ఒక్కటి అత్యంత ఖర్చుతో కూడుకున్నవి. అన్ని టెక్నాలజీలను సొంతంగా తయారు చేసుకొనే అమెరికా వంటి దేశాల్లోనే ఎఫ్‌-22 రాప్టర్‌ పైలట్‌ శిక్షణ ఖర్చు 10.90 మిలియన్‌ డాలర్లు(ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం). సీ130జే రవాణా విమాన పైలట్‌ శిక్షణ ఖర్చు 2.47 మిలియన్‌ డాలర్లు. భారత్‌ సీ-130 రకం విమానాలను వినియోగిస్తుంది. ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్‌ పైలట్‌ శిక్షణ ఖర్చు 5.62 మిలియన్‌ డాలర్లు. భారత్‌లో కూడా శిక్షణకు 2015 లెక్కల ప్రకారం రూ.13 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పుడు ఆ విలువ ఇంకా పెరిగి ఉంటుంది.