న్యాయవాదుల హత్య కేసు.. ఆరో నిందితుడు అరెస్ట్ 

రాష్టంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా  సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య కేసు విచారణలో మరో ముందడుగు పడింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రధాన నిందితుడు కుంట శ్రీనుతో సహా మరో ముగ్గురుని    అరెస్ట్ చేసిన రామగుండం పోలీసులు, శుక్రవారం  మరొకరిని అరెస్ట్ చేశారు. హత్య కేసులో ఆరో నిందితుడిగా ఉన్న వెల్ది వసంతరావును అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వసంతరావు గతంలో ప్రభుత్వ ఇంజినీర్‌గా పనిచేశారు. గ్రామంలో కడుతున్న పెద్దమ్మ గుడిని అడ్డుకునేందుకు న్యాయవాద దంపతులు ప్రయత్నం చేస్తున్నారనే కారణంతో నిందితులకు వసంతరావు సహాయం చేసిట్లు ఆరోపణలు వచ్చాయి. న్యాయవాద దంపతులను హత్య చేయడానికి ఏ1 కుంట శ్రీనును వసంతరావు ప్రోత్సహించాడు. గుంజపడుగు గ్రామ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా వసంతరావు ఉన్నారు.   రామగిరి మండలం కల్వచర్ల వద్ద గత నెల 17న న్యాయవాద దంపతులు వామన రావు, నాగమణిలు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీను, శివనందుల చిరంజీవి,  అక్కపాక కుమార్,  ఊదరి లచ్చయ్యలను పోలీసులు ఇంతకూ ముందే అరెస్ట్ చేశారు. దీంతో ఇంతవరకు ఈ  కేసులో  మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.వామన రావు దంపతుల హత్య కేసులో అధికార పార్టీకి చెందిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో, తెరాస నాయకత్వం వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.   న్యాయవాద దంపతుల హత్య రాజకీయంగానూ  ప్రకంపనలు సృష్టించింది. పట్ట పగలు న్యాయవాదులు నడి రోడ్డు మీద హత్యకు గురైన సంఘటనపై  ముఖ్యమంత్రి,అధికార పార్టీ నాయకులు ఎవరూ స్పదించక పోవడాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. అయితే, ఎట్టకేలకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు న్యాయవాద దంపతుల హత్యపై స్పందించారు. ఈ కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని ఇప్పటికే ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారని అన్నారు. అందులో మా పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నారని, ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు.  ఈకేసులో ఎవరున్నా రాజీ లేకుండా విచారణ చేస్తామని, దోషులకు శిక్ష పడేలా చూస్తామని అన్నారు.

మల్లన్నా.. నువ్ తోపన్నా..

వరంగల్, ఖమ్మం, నల్గొండ.. జిల్లా ఏదైనా మల్లన్న తోపు. మాములు తోపు కాదు తోపులకే తోపు. అవును, ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చూస్తుంటే వారెవా మల్లన్న అనకుండా ఉండలేరు ఎవరు. ఫలితాలు అలా వస్తున్నాయి మరి. పార్టీ లేదు, కేడర్ లేదు, గ్రూపులు లేవు, గూడుపుఠానీలు లేవు. ఉన్నదల్లా ఒక్క యూట్యూబ్ ఛానల్ మాత్రమే. కామన్‌మేన్‌లా సింగిల్‌గా వచ్చాడు. సింహంలా గాండ్రించాడు. పులిలా పంజా విసిరాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దుమ్ము రేపుతున్నాడు. ఆయన గెలుపు ఖరారు కాకున్నా.. అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. జాతీయ పార్టీగా విర్రవీగుతున్నా బీజేపీకి గట్టి ఝలక్ ఇచ్చాడు. ఇక, కోదండరాం సార్‌కు సైతం షాక్. ఈ ఒక్క మగాడు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొనగాడిలా నిలిచాడు.  సర్కారును ఎప్పటికప్పుడు చీల్చి చెండాడమే అతని పని. యూట్యూబ్ ఛానెల్‌లో రోజూ అధికార పార్టీని ప్రశ్నించడమే. నేతల తీరును నిప్పులతో కడిగి నిగ్గదీసి అడగడమే. జెండా లేకున్నా ఎజెండా మాత్రం క్లియర్. అది.. కేసీఆర్‌పై దండయాత్ర. రేవంత్‌రెడ్డి తర్వాత ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో కడిగేసే ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్నే. అదే జనాలకు నచ్చింది. ఆ దూకుడే వారిని ఆకట్టుకుంది. ఆ దమ్ము.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దుమ్ము రేపుతోంది.  జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలా బలం, బలగం మెండు. టీఆర్‌ఎస్‌ చేతిలో అధికారం ఫుల్లు. అయితే, ఆ పార్టీలకు సాధ్యంకానిది సామాన్యుడైన మల్లన్నకు సాధ్యమైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 83,290 ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అధికార పార్టీకి చెందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి కంటే జస్ట్ 27,550 ఓట్లు మాత్రమే వెనకంజ. ఉద్యమ కాలం నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్న కోదండరాం సార్ కంటే 13వేల ఆధిక్యం సంపాదించాడు. ఇక, తనంత తోపులు లేరంటూ టెంపర్ మీదున్న బీజేపీ అభ్యర్థి ఏకంగా నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. బీజేపీ కేండిడేట్ ప్రేమేందర్‌రెడ్డి కంటే రెట్టింపు ఓట్లు మల్లన్నకే పడ్డటం మామూలు విషయం కాదు. అటు, కాంగ్రెస్ అభ్యర్ధి ఐదో స్థానానికి పరిమితమయ్యారు. మామూలు మనిషి మల్లన్న.. ఇంతటి హేమాహేమీలను పడగొట్టడం మామూలు విషయం కాదు. ఇది మల్లన్నకే సాధ్యం.  ఎమ్మెల్సీగా మల్లన్న గెలుస్తాడా? లేదా? అనేది ఆసక్తికర విషయం. మల్లన్న గెలిచినా గ్రేటే.. ఓడినా గ్రేటే. సింగిల్‌గా.. సామాన్యుడిగా.. అంత పెద్ద పార్టీలకు.. అంత పెద్ద నేతలకు.. ముచ్చెమటలు పట్టించడం నిజంగా గ్రేటాది గ్రేట్. మల్లన్నా మజాకా...

ఇద్దరు అర్చకులకు కరోనా.. 

కరోనా మహమ్మారి మారోసారి తన పంజా విసురుతుంది. కొన్ని రోజులు నిలకడగా ఉన్న కేసులు మరోసారి పెరుగుతున్నాయి. సంవత్సరం నుండి ప్రపంచాన్ని ఇరుకున పేడేసిన కరోనా కొంత కాలం ఉపశమనం ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ కోరలు చాస్తోంది. గుడిలో ఇద్దరు అర్చకులకు కరోనా రావడం తో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా  నర్సింహులపేట మండల కేంద్రంలోని ఇంద్రకిలాద్రి వెంకటేశ్వర ఆలయంలో కరోనా కలకలం రేగింది. ఇద్దరు అర్చకులకు కరోనా సోకింది. ఇక్కడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం త్వరలో జరుగనున్న నేపథ్యంలో అర్చకులకు కరోనా రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లాలో కూడా ఇప్పటికే పలు స్కూళ్లలో పదుల సంఖ్యలో చిన్నారులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల దేవస్థానం ఈవో శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేటి నుంచి వారం రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నట్లు అధికారుల ప్రకటించారు. ఆలయంలో పని చేస్తున్న మిగిలిన సిబ్బందికి ఇవాళ కరోనా పరీక్షలు నిర్వహిచారు.    

జగన్ ఇన్కం ట్యాక్స్ ఎంతో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేల కోట్ల ఆస్తులున్నాయని విపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. అక్రమాస్తుల కేసులో ఆయనపై ఈడీ, సీబీఐ కేసులు కూడా నమోదయ్యాయి. గతంలో ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చారు. దీంతో జగన్ రెడ్డికి ఎన్ని ఆస్తులు ఉన్నాయన్నదానిపై జనాల్లోనూ చర్చ జరుగుతూ ఉంటుంది. ఆయన ఎంత ఆదాయపన్ను చెల్లిస్తారన్న దానిపై కూడా ప్రజల్లో ఆసక్తి ఉంటుంది.  అయితే 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను జగన్మోహన్ రెడ్డి ఇన్ కమ్ ట్యాక్ ఫైల్ చేయనున్నారు .2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి సీఎం జగన్  ఇన్ కమ్ ట్యాక్స్ సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం జగన్ 2020-21 ఆర్ధిక సంవత్సరానికి ఆదాయపన్నుగా చెల్లించాల్సిన రూ.7,14,924లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణాశాఖ మరియు సమాచార శాఖ మంత్రి మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆదాయ పన్నుగా చెల్లించాల్సిన రూ.2,91,096 కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం, మంత్రికి కలిపి మొత్తం రూ.10,06,020 మంజూరు చేస్తూ జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  సీఎం జగన్మోహన్ రెడ్డి ఏడాదికి చెల్లిస్తున్న ఇన్ కం ట్యాక్స్ కేవలం ఏడు లక్షల 14 వేల రూపాయలుగా ఉండటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బిజినెస్ వ్యవహారాలన్ని అతని భార్య భారతీ రెడ్డి నిర్వహిస్తారు కాబట్టి.. జగన్ కట్టే ఇన్ కం ట్యాక్స్ తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం నెలకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నారు.   

ఎన్నికల ముందు మొదలైన ఐటి దాడులు.. ప్రతిపక్షాల గగ్గోలు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థులపై సిబిఐ, ఐటి, ఇడి వంటి సంస్థలను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న సంగతి తెల్సిందే. ఈ సంస్థలను ప్రయోగించి బీజేపీ ప్రత్యర్థులను గుక్క తిప్పుకోకుండా చేసి అడ్డు తొలగించుకుంటోందని ఆయా పార్టీల ముఖ్య ఆరోపణ. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తన ప్రత్యర్థులపై ఈ సంస్థలను ఉపయోగించి  తమ పార్టీకి, అలాగే తమ పార్టీ కూటమికి లబ్ది చేకూరేలా ఈ సంస్థలను వాడుకుంటోందని బీజేపీ పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.   తాజాగా తమిళనాడులో బీజేపీ చీఫ్ ఎల్‌.మురుగన్‌ పోటీ చేస్తున్న తిరుప్పూరు జిల్లా ధారాపురం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో రెండు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ప్రత్యర్థులు, వారి బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన సోదాలలో రూ.8 కోట్ల నగదు పట్టుబడింది. ఆ నియోజకవర్గంలో డీఎంకే తరఫున  సెల్వరాజ్‌ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా డీపీఐ, ఎండీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆ ప్రాంతంలోని ఎండీఎంకే నేత కవిన్‌ నాగరాజ్‌, ఆయన సోదరుడు మక్కల్‌ నీదిమయ్యం కోశాధికారి చంద్రశేఖర్‌, డీఎంకే నాయకుడు ధనశేఖర్‌ ఇళ్లు, వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు. ఈ తనిఖీలు గురువారం ఉదయం కూడా కొనసాగాయి.   రెండు రోజులుగా జరిపిన సోదాల్లో లెక్క చూపని రూ.8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని,. అదే సమయంలో పన్నుల ఎగవేతకు సంబంధించి కొన్ని కీలకపత్రాలు లభించాయని ఐటీ అధికారులు మీడియాకు తెలిపారు. అయితే తాజా ఐటి రెయిడ్స్ పై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌, టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగిరి తమ తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఎన్నికలలో  ప్రత్యర్థులను భయపెట్టేందుకే బీజేపీ ఈ తనిఖీలు చేయించిందని వారు ఆరోపించారు.ఐటి దాడులు జరిగిన చంద్రశేఖర్‌ కోట్లకు పడగెత్తిన పారిశ్రామికవేత్త అని, ఐటీ అధికారులు కేవలం దురుద్దేశపూర్వకంగా ఈ దాడులు చేస్తున్నారని విమర్శించారు. అయితే, ఐటీ దాడులకు, తమ పార్టీకి ఎటువంటి సంబంధంలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మురుగన్‌ చెప్పారు.  

మేనమామే కోడలిపై

గొర్రె కసాయిని నమ్మినట్లు అమ్మాయి మేనమామను నమ్మింది. తల్లి లేని తనకు మేనమామ సంరక్షకుడిగా ఉంటాడనుకుంది. కానీ మామ మాత్రం కోడలితో  కామ వాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. ఇక అంతే మామ పథకం వేశాడు. నేషినల్ అవార్డు కోసం ట్రే చేసే యాక్టర్ కంటే ఎక్కువ యాక్ట్ చేసి. కోడలిని బలవంతంగా అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైన  చెపితే చెంపేస్తాను అని బెదిరించాడు.   కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో మైనారిటీ వర్గానికి చెందిన బాలిక తల్లితో కలిసి నివాసముండేది. అయితే.. ఇటీవలే ఆ బాలిక తల్లి మృతి చెందడంతో ఆమె బాగోగులు చూసుకునే వారే కరువయ్యారు. తల్లిని కోల్పోయి ఒంటరిగా మిగిలిన ఆ బాలికను వెతుక్కుంటూ మేనమామ వరుసయ్యే ఆసీఫ్ ఆమె ఇంటికొచ్చాడు.  ఒంటరిగా మిగిలిన ఆ బాలిక బాగోగులను ఆసీఫ్ చూసుకునేవాడు. అయితే.. అతనిలో మేలేగా పాడుబుద్ధి పుట్టింకొచ్చింది ఆ బాలికపై ఆసీఫ్ కన్ను పడింది. ఆమెకు తనంటే నమ్మకం కలిగేలా కొన్నిరోజులు నటించాడు. ఆసిఫ్ రానురాను తన నీచబుద్ధి బయటపెట్టసాగాడు. ఓదార్పు నెపంతో ఆమెను అక్కున చేర్చుకుని ఎక్కడెక్కడో తాకేవాడు. ఆ బాలిక మేనమామే కదా తండ్రి లాంటోడనుకుంది. రెండు రోజుల క్రితం గేమ్ ప్లాన్ చేసి కోడల్ని టౌన్‌కు వెళ్దామని నమ్మించిన ఆసిఫ్ కామారెడ్డి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె కోరింది కొనిచ్చాడు. ఆమె ఏం తినాలని కోరుకుందో అన్నీ తీసుకొచ్చి పెట్టాడు. మేనమామ కద అని నమ్మడమే ఆ బాలిక చేసిన పాపమైంది. ఆమె పూర్తిగా నమ్మిన క్రమంలోనే.. ఆసిఫ్‌లోని కరుణ చచ్చిపోయి  కామాంధుడు నిద్రలేచాడు. ఆమెను కామారెడ్డిలోని ఓ రహస్య ప్రదేశానికి ఆమెను తీసుకెళ్లాడు. తన వాంఛ తీర్చాలని ఆమెను కోరాడు. ఆ బాలికకు ఆసిఫ్ దురాలోచన అర్థమైంది. అందుకు ఏమాత్రం ఒప్పుకునేది లేదని ఆమె అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో.. ఆ బాలికను బంధించి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. అత్యాచారం విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అయితే.. బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కామారెడ్డి రూరల్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. సదరు బాలికపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం ఆసిఫ్ ఆమెను గంభిరావుపేటలో వదిలేసి వెళ్లాడని ఆయన తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సిఐ పేర్కొన్నారు. బంధువని నమ్మిన అమ్మాయిని అత్యాచారానికి పాల్పడి ఆమె జీవితాన్ని నాశనం చేసిన ఇలాంటి వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అమ్మాయి బంధువు బాబా డిమాండ్ చేశారు.

21 నుండి కేఏ పాల్ ఆమరణ దీక్ష...

ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైట్లు ఉద్యమ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా  విశాఖ స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణకు, కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా తన నిరసన తెలుపుతూ నెల 21 నుండి ఢిల్లీలో నిరవధిక ఆమరణ దీక్ష చేయనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ ప్రకటించారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు నాయకులను, రైతులను అయన గురువారం ఢిల్లీలో కలిసి తన సంఘీభావం ప్రకటించారు.   ఆ తరువాత భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్‌ తికాయత్‌తో కలిసి ఢిల్లీలోని ఏపీ భవన్ లో కె ఏ పాల్‌ మీడియాతో మాట్లాడారు. కేంద్రం తక్షణమే సాగుచట్టాలను రద్దు చేయాలని అయన డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తాను ఇప్పటికే  హైకోర్టులో పిల్  దాఖలు చేసినట్లుగా చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మకానికి పెట్టేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రైతులను కూడా అమ్మేస్తోందని  పాల్ ఎద్దేవా చేశారు. మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు బీకేయూ  నేత రాకేష్ తికాయత్‌ తెలిపారు. విశాఖ ఉక్కు కార్మికులకు తాము అండగా నిలుస్తామని అయన అన్నారు. సాగు చట్టాలను కేంద్రం పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తేలేదని తికాయత్‌ ఈ సందర్భంగా  స్పష్టం చేశారు.  

హిందుత్వ పార్టీ శివసేనకు జై కొట్టిన ఎంఐఎం

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎంఐఎం పార్టీకి పూర్తిగా మైనార్టీ ముద్ర ఉంది. మైనార్టీల  కేంద్రంగానే ఆ పార్టీ కార్యక్రమాలు ఉంటాయి. దేశంలో ఎక్కడ ఏం జరిగినా హిందూ సంఘాలను, బీజేపీని టార్గెట్ చేస్తుంటారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. బీజేపీది హిందుత్వ నినాదమే అయినా బీజేపీ కంటే బలంగా హిందుత్వ నినాదం వినిపించేంది శివసేన. బీజేపీ నేతల కంటే శివసేన నేతలే ఈ విషయంలో చాలా దూకుడుగా ఉంటారు. గతంలో ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయి.    అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం సంచలనం సమీకరణలు జరిగాయి. అందిరి అంచనాలు తలకిందులు చేస్తూ శివసేనకు ఎంఐఎం బహిరంగంగానే సపోర్ట్ చేసింది. జలగావ్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో శివసేన అభ్యర్థి జయ్‌శ్రీ మహాజన్ విజయం సాధించారు.ఇక్కడ  బీజేపీకి 75 మంది కార్పొరేటర్లు ఉండగా, శివసేనకు ఉన్నది 15 మందే. అయితే, బీజేపీకి చెందిన 27 మంది ప్లేటు పిరాయించి శివసేనకు ఓటు వేశారు. అలాగే ఎంఐఎంకు చెందిన ముగ్గురు కూడా శివసేనకే ఓటు వేయడంతో ఆ పార్టీకి 45 ఓట్లు పోలయ్యాయి.దీంతో ఎంఐఎం మద్దతుతో జలగావ్ మున్సిపాలిటీని శివసేన గెలుచుకుంది.  మరోవైపు మహారాష్ట్రలో బీజేపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. అత్యధికమంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ రెండు చోట్ల ఆ పార్టీ మేయర్ పదవిని కోల్పోయింది. జలగావ్ లో బీజేపీకి 75 మంది కార్పొరేటర్లు ఉన్నా... ఆ పార్టీ మేయర్  అభ్యర్థి ప్రతిభా కప్సేకు 30 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఫలితంగా జయ్‌శ్రీ మహాజన్ మేయర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ పదవి కూడా ఆ పార్టీకే దక్కింది. ఆ పార్టీ అభ్యర్థి కుల్‌భూషణ్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇక గత నెలలో జరిగిన సంగి మేయర్ ఎన్నికల్లోనూ బీజేపీకి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అక్కడ బీజేపీకి అత్యధికంగా 41 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ  మేయర్ పీఠాన్ని ఎన్సీపీకి కోల్పోయింది.

టీఆర్ఎస్ కు సెకండ్ టెన్షన్.. ఆయనకే గెలుపు అవకాశం?

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా... రెండు రోజులకు నల్గొండ-ఖమ్మం-మహబూబ్ నగర్ స్థానంలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఇక్కడ 3 లక్షల 84 వేల ఓట్లు పోల్ కాగా.. ఏడు రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. తొలి ఓటులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి లీడ్ లో ఉన్నారు.  నల్గొండ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో  TRS అభ్యర్థి పల్లా సాధించిన మొదటి ప్రాధాన్యత  ఓట్లు1,10,840. రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు వచ్చాయి. కోదండరామ్ 70072 ఓట్లలో మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థికి 39 వేల 107 ఓట్లు సాధించారు.  కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ఐదో స్థానంలో ఉన్నారు. వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి ఆరో స్థానంలో రాణి రుద్రమ ఏడో స్థానంతో చెరుకు సుధాకర్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. నల్గొండ స్థానంలో 21 636 ఓట్లు చెల్లకుండా పోయాయి. తొలి ప్రాధాన్యత ఓటులో తన  సమీప అభ్యర్థిమల్లన్న పై....27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు టీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి. నల్గొండ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.రెండో ప్రాధాన్యతలో ఎవరికి మెజార్టీ వస్తుందన్నది కీలకంగా మారింది. మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు పోనూ..మిగితా 98 వేల ఓట్లలో ఎవరికి రెండో ఓటు ఎక్కువగా వస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం పల్లా-మల్లన్నకు 27 550 ఓట్ల తేడా ఉండగా.. పల్లా-కోదండరామ్ కు దాదాపు 40 వేల ఓట్ల తేడా ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్లలో కోదండరామ్ పుంజుకుంటే.. ఆయన తీన్మార్ మల్లన్న కంటే భారీగా ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఎలిమినేషన్ లో బీజేపీ అభ్యర్థి రెండో ఓట్లు లెక్కించే సమయానికి మల్లన్నకు కోదండరామ్ క్రాస్ చేస్తేనే ఆయన రేసులో ఉంటారు. లేదంటే ఆయన ఎలిమినేషన్ లోకి వెళ్లాల్సి వస్తుంది. దీంతో కాంగ్రెస్, బీజేపీలకు తొలి ఓటు వేసిన పట్టభద్రులు.. రెండో ఓటు ఎవరికి వేశారన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.తొలి ప్రాధాన్యత ఓటులో లీడ్ లో ఉన్నా.. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గెలుపుపై ఆందోళన ఉందని తెలుస్తోంది.   

ప్రశ్నిస్తే థర్డ్ డిగ్రీ.. కేసీఆర్ పై షర్మిల ఫైర్ 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల వరుస సమావేశాలతో దూకుడు పెంచారు. తన వాయిస్ లో వాడి పెంచారు.  కరీంనగర్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో  ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన షర్మిల.. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పని తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాగునీటి ప్రాజెక్ట్ లకు భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు 5 లక్షల నష్టపరిహారం ఇస్తామని చెప్పిన హామీ ఏమయిందని ఆమె నిలదీశారు. నేరెళ్ళ లో ప్రశ్నించినందుకు దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. దళితులపై పాలకులకు ఏ మాత్రం ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు షర్మిల. పెద్దపల్లి న్యాయవాదుల హత్య పై అధికార పార్టీ హస్తం ఉండటం దారుణమన్నారు.  తోడు ఉంటే ఎంతటి కొండ ను అయినా ఢీ కొట్టదానికి నేను రెడీగా ఉన్నానంటూ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ కామన్ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తోందన్నారు షర్మిల. యావత్ తెలంగాణ కు కరీంనగర్ అద్దం పడుతుందన్నారు. సిటీ ఆఫ్ ఎనర్జీ మన రామగుండం..సింగరేణి మనకు తలమానికం..అగ్గిపెట్టెలో పట్టే చీర నేచిన నేతన్నలు కనిపిస్తారు అని షర్మిల చెప్పారు.వైఎస్సార్ కి కరీంనగర్ జిల్లాకు విడదీయరాని బంధం ఉందన్నారు షర్మిల. కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని.. కాని ఎల్లంపల్లి, మిడ్ మానేర్ కట్టించిన ఘనత వైఎస్సార్ దేనని అన్నారు.  శాతవాహన యూనివర్సిటీ రాజశేఖర్ రెడ్డి ఇచ్చారన్నారు. రాజీవ్ రహదారి రామగుండం వరకు నిర్మించిన ఘనత వైఎసేదేనని తెలిపారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధి లో వైఎస్సార్ పాత్ర చాలా ఉందన్నారు. కేసీఆర్ పాలనలో బొంబాయి, దుబాయ్ కి వలసలు ఆగిపోలేదని షర్మిల విమర్శించారు. బీడీ కార్మికులకు పట్టించుకోలేదన్నారు. రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడమే తన లక్ష్యమన్నారు షర్మిల.

రాజస్థాన్ లో మృగాడికి మరణ శిక్ష.. మరీ తెలంగాణలో ..

రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ఒక ఐదేళ్ల బాలికపై, ఓ మృగాడు అత్యాచారం చేశాడు. ఈ దారుణం ఫిబ్రవరి 19న జరిగింది.ఇంకా నిండా నెలరోజులు కాలేదు, అయినా, చేసిన ప్రత్యేక పోక్సో కోర్టు  ఆ కామాంధుడికి మరణశిక్ష విధించింది. వివరాలోకి వెళితే  సరిగ్గా 26 రోజుల క్రితం తన ఇంటికి దగ్గరలోని పొలంలో ఆడుకుంటున్న చిన్నారిని, చూసిన ఒక 21 ఏళ్ల యువకుడు ఆ పాపను కిడ్నాప్ చేశాడు. ఆమెపై బలాత్కారం చేశాడు. ఈ దారుణం ఫిబ్రవరి 19న జరిగింది. ఆ తర్వాత అటుగా వచ్చిన కొందరు స్థానికులు తీవ్రంగా గాయపడి ఒక నిర్జన ప్రదేశంలో పడి ఉన్న ఆ పాపను చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసుపై విచారణ చేసిన ప్రత్యేక పోక్సో కోర్టు నిందితుడికి మరణశిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. బంగారు తెలంగాణ వైపు వడి వడిగా అడుగులు వేస్తున్న తెలంగాణలో ... మత కలహాలకు మరు పేరుగా మారిన భైంసాలో .. నాలుగేళ్ళ చిన్నారిపై, తెలంగాణ  మృగాడు అత్యాచారం చేశాడు. ఇది జరిగి వారం రోజుల పైగానే అయింది. అయినా ఇంతవరకు ప్రభుత్వం పెదవి విప్పలేదు. పోలీసులు దర్యాప్తు ఒక కొలిక్కిరాలేదు. కేసు నమోదు చేయడానికే వరం రోజులకు పైగా తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, పూర్తి ఆధారాలు సేకరించామని, దోషికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు, చెపుతూనే ఉన్నారు. కానీ, కదలిక లేదు.  ప్రభుత్వ స్పందన కోసం బీజేపీ గురువారం ధర్నా చేసింది. ఈ ధర్నాలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చిన్నారిపై లైంగిక దాడి చేస్తే ప్రభుత్వం నోరు మూగపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటివరకూ స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. తమ బిడ్డపై అఘాయిత్యం జరిగిందని ఆ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు పోతే...ఇక్కడ గొడవలు ఉన్నాయని పోలీసులు బాధితుల నోరు మూయించడం దారుణమని డీకే అరుణ పేర్కొన్నారు.  అక్కడ రాజస్థాన్’లో మృగాళ్ల కు నెల రోజుల్లో శిక్ష పడుతుంది .. ఇక్కడ రోజులు గడుస్తాయి అయిన కేసులు కదలవు.  అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ బంగారు తెలంగాణ కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న తెరాస ప్రభుత్వం ఉంది..అదే అక్కడికీ ఇక్కడికీ ఉన్న తేడా..

ఆలా చేస్తే ఆర్కేకు దళితరత్న బిరుదు..

ఏపీ రాజధాని అమరావతిలో దళితుల అస్సైన్డ్ భూములను అప్పటి టీడీపీ ప్రభుత్వం బలవంతంగా లాక్కుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేయగా టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడి నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. దీంతో ఈ వ్యవహారంపై ఏపీలో తీవ్ర రాజకీయ రచ్చ నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ నేత మాజీ  మంత్రి కెఎస్ జవహర్ స్పందిస్తూ... ఏపీలో చట్టం ఫ్యాక్షన్ పాలకుల చేతిలో బందీ అయిందని... దళిత హక్కులు ప్రస్తుతం దళారుల చేతిల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు.     ఎమ్మెల్యే ఆర్కేకు దళితులపై నిజంగా ప్రేమ వుంటే వైఎస్ఆర్ కుటుంబం.. ఇడుపులపాయలో ఆక్రమించిన అసైన్డ్ భూములు నిరుపేదలకే తిరిగి ఇప్పించాలని.. అదేవిధంగా శిరోముండనం ఘటనపై ఆళ్ళ కేసు వేస్తే ఆయనకు దళిత రత్న బిరుదు ప్రదానం చేస్తామని అన్నారు. అయితే ఇలా చేయడం ఎమ్మెల్యే ఆళ్ల వల్ల కాదని.. ఎందుకంటే ఆయన జగన్ ఆడుతున్న ఆటలో అరటి పండు మాత్రమేనని ఎద్దేవా చేశారు. అస్సైన్డ్ భూముల వ్యవహారంపై విచారణ పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వేదింపులకు తెర తీస్తున్నారని అన్నారు. చంద్రబాబుపై కక్షతోనే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటి కేసులు పెట్టారని..  ఈ తప్పుడు కేసులపై న్యాయపోరాటానికి దిగిన బాబుకు టిడిపి నాయకులు కార్యకర్తలేకాక రాష్ట్ర ప్రజలు కూడా అండగా ఉంటారని అయన పేర్కొన్నారు   అంతేకాకుండా సీఎం జగన్ ఎన్ని ఎత్తులు వేసినా.. చంద్రబాబును ఎదుర్కొలేరని జవహర్‌ స్పష్టం చేసారు. వైసీపీ నేతలు తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే తాము చూస్తు ఊరుకోమని జవహర్ హెచ్చరించారు.  

బంగారు కాదు కంగారు తెలంగాణ!

తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పని తీరుపై రిటైర్డ్ ఐపీఎస్ వీకే సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని వీకే సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణలో మంచి పోలీస్ అధికారులకు విలువ లేదన్నారు. బంగారు తెలంగాణలో పనిచేసే సీనియర్లకు స్థానం లేదన్నారు. రిటైర్డ్  అయిన వారికి మంచి పదవులు కట్టబెడుతున్నారని, చాలామంది సీనియర్లు పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. చాలా మంది నిజాయితీ అధికారులు మౌనంగా ఉన్నారన్నారు. సేవచేయడానికి పోలీసు శాఖలోకి వచ్చానని‌ తెలిపారు. తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తోందని వీకే సింగ్‌ మండిపడ్డారు. బంగారు తెలంగాణ కేసీఆర్ పాలనలో కంగారు తెలంగాణ గా మారిందన్నారు.  ప్రస్తుతం పోలీస్ విభాగంలో ఉన్న మార్పులు మెదక్ లో తానే  మొదటగా మొదలుపెట్టానని చెప్పారు వీకే సింగ్. పోలీస్ ట్రైనింగ్ లో సమూల మార్పులు కావాలని కోరుకున్నానని తెలిపారు. తన వీఆర్ఎస్ ను క్యాన్సిల్ చేసిన కేసీఆర్ సర్కార్ తనకు  ఛార్జ్ మెమోరీ ఇచ్చిందన్నారు. సర్కార్ తనను వేధిస్తుందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడుతానని వీకే సింగ్ చెప్పారు. కీలకశాఖలకు అధికారులు లేరని..  తెలంగాణ ఆర్టీసీ మునిగిపోతుందన్నారు. తెలంగాణలోనే ఉండి ప్రజల తరపున పోరాడుతానని తెలిపారు. డబుల్ బెడ్ రూం స్కీం ఎక్కడ పోయిందని వీకే సింగ్ ప్రశ్నించారు. సెక్రెటేరీయట్ పడగొట్టి కొత్తది కట్టడం అప్రస్తుతమన్నారు. తెలంగాణ కొంతమంది నాయకుల కోసం రాలేదన్నారు వీకే సింగ్.  తెలంగాణ లో అధికారులపై కులం, మతం, డబ్బు ప్రభావం, రాజకీయ ఒత్తిడి ఉంటుందని చెప్పారు రిటైర్డ్ ఐపీఎస్ వీకే సింగ్‌. పదిహేను రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదన్నారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లా పదవుల్లేకుండా పని చేస్తానన్నారు. తెలంగాణలో ఊరూరు తిరిన కేసీఆర్ సర్కార్ పై పోరాటం చేస్తానని తెలిపారు వీకే సింగ్.  

టోల్‌గేట్లు తొలగింపు.. ఫాస్టాగ్‌పై పోలీస్ కేసు..

ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలు తొలగింపు. ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ చెల్లించని వాహనదారులపై పోలీసుల దర్యాప్తు. ఈ విషయం స్వయంగా కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో ప్రకటించారు. మరి, టోల్‌ప్లాజాలు తీసేస్తే వాహనదారులు ఉచితంగా జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చా? అంటే ఆ ఛాన్స్ లేదంటున్నారు కేంద్ర మంత్రి. టోల్‌ప్లాజాలు తీసేస్తాం కానీ టోల్ వసూలు మాత్రం యధావిధిగా కొనసాగిస్తామన్నారు. అది ఎలాగంటే.. టోల్‌గేట్లు తీసేసి జీపీఎస్ సిస్టమ్‌తో టోల్ వసూలు చేస్తామని ప్రకటించారు నితిన్ గడ్కరీ.  ‘‘ఏడాది కల్లా దేశంలోని అన్ని టోల్‌బూత్‌లను తొలగిస్తామని సభా వేదికగా హామీ ఇస్తున్నా. అంటే ఇకపై జీపీఎప్‌ ఆధారంగా టోల్‌ వసూళ్లు చేపట్టనున్నాం. వాహనానికి ఉన్న జీపీఎస్‌ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాం’’ అని గడ్కరీ వివరించారు.    అన్ని వాహనాల్లో వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్ వస్తున్నందున.. టోల్‌ వసూలుకు జీపీఎస్‌ సాంకేతికతను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టోల్‌గేట్ల దగ్గర ఆగాల్సిన పనిలేకుండా జీపీఎస్‌ ఆధారంగా టోల్‌ చెల్లించే సదుపాయాన్ని తీసుకొస్తోంది. జీపీఎస్‌ ఆధారంగా... వెహికిల్ కదలికలను బట్టి వాహనదారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకొనే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు గడ్కరీ వెల్లడించారు. నూతన విధానం అమల్లోకి వస్తే.. వాహనదారులు జాతీయ రహదారిపై ఎంత దూరం ప్రయాణిస్తే.. అంత దూరానికి మాత్రమే టోల్‌ ఛార్జీలు పడతాయి. ఇది కాస్త ఊరడనిచ్చే విషయమే.  దేశవ్యాప్తంగా 93 శాతం వాహనదారులు ఫాస్టాగ్‌ ద్వారానే టోల్‌ చెల్లిస్తున్నారని కేంద్రమంత్రి తెలిపారు. మిగతా 7శాతం మంది ఫాస్టాగ్ వాడకుండా రెట్టింపు టోల్‌ కడుతున్నారని చెప్పారు. ఫాస్టాగ్‌తో టోల్‌ చెల్లించని వాహనదారులపై పోలీసుల దర్యాప్తునకు ఆదేశించినట్టు కేంద్రమంత్రి చెప్పారు. 

తెలంగాణ బడ్జెట్ బరువు పెరిగింది

అనుకున్నట్లుగానే, అన్నట్లుగానే తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు, 2021-22 ఆర్థిక సంవత్సరానికి, రూ.2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో రాష్ట్ర  బడ్జెట్’ ను శాసన సభలో  ప్రవేశ పెట్టారు.గత బడ్జెట్’ కంటే  ప్రస్తుత బడ్జెట్, రూ. 48వేల కోట్ల మేర బరువు పెరిగింది. ఇందులో రెవెన్యూ వ్యయం లక్షా 69 వేల, 383.44 కోట్ల  రూపాయలుగా,  క్యాపిటల్ వ్యయం 29 వేల 46.77 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. రెవెన్యూ మిగులు 6 వేల 743 కోట్ల రూపాయలుగా.... అలాగే ఆర్ధిక లోటును 45 వేల 509 కోట్ల రూపాయలుగా ఆర్ధికమంత్రి అంచనా వేశారు.  ఆర్థిక లోటురూ. 45,509.60కోట్లుగా చూపించారు. అదే విధంగా బడ్జెట్’లో  కరోనా కోతలు ఉండవని, సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను ఆర్థిక మంత్రి నిలబెట్టారు. వివిధ పద్దుల క్రింద సంక్షేమానికి భారీగానే నిధులు కేటాయించారు, ఆసరా పించన్లకు రూ.11,728కోట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి రూ.2, 75౦ కోట్లు, ఎస్సీల ప్రత్యేక ప్రగతి కోసం రూ.12,304 కోట్లు, బీసీల సంక్షేమానికి 5,522 కోట్లు ఇలా వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి ఆర్థిక మంత్రి లేదనకుండా, కాదన కుండా నిధులను ప్రతిపాదించారు. అలాగే, వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమలు చేయని  రైతు రుణమాఫీకి రూ.౫,225 కోట్లు, రైతు బందుకు రూ.14,800 కోట్లు, అలాగే ఇతర వ్యవసాయ పద్దుల కింద ప్రాధాన్యతా క్రమంలో నిధులు ప్రతిపాదించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి రాష్ట్రం గత ఆరున్నరేళ్లుగా సాధించిన ప్రగతిని వివరించారు. సకల జనుల సంక్షేమం ప్రాతిపదికగా చేపట్టిన పలు చర్యలు విజయవంతం అయ్యాయని పేర్కొంటూ.... అట్టడుగు స్దాయిలో, ఆఖరి వ్యక్తి వరకు,  ప్రగతి ఫలాలను అందించేలా ఈ బడ్జెట్ లో చర్యలను ప్రతిపాదించినట్లు  మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో, ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలుతున్న నేపథ్యంలో కూడా రాష్ట్రం వృద్ధిని సాధించగలిగిందని, సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందని  చెప్పారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దుకోగలమని, బలమైన విశ్వాసం కలిగినట్లు మంత్రి పేర్కొన్నారు. కాగా వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో ముఖ్యమంత్రి దళిత సాధికార కార్యక్రమాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా ఉన్నతీకరించేందుకు 4 వేల కోట్ల రూపాయలతో సరికొత్త విద్యా పథకాన్ని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. వచ్చే రెండేళ్ళలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపడతామని, ఫర్నిచర్, టాయిలెట్ల వంటి వసతులు కల్పిస్తామని, ఆధునిక సాంకేతిక విజ్నానంతో తరగతి గదులను అనుసంధానిస్తామని వివరించారు. పాఠశాల విద్యకు 11 వేల 735 కోట్ల రూపాయలు, ఉన్నత విద్యా రంగానికి 1873 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ రంగానికి  25 వేల కోట్ల రూపాయలను ఆర్ధిక మంత్రి వచ్చే ఏడాది ఖర్చు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందులో వ్యవసాయ యాంత్రీకరణకు 15 వందల కోట్లు, రైతుబంధ పథకానికి 14 వేల 800 కోట్లు, రైతు రుణమాఫీకి 5 వేల 225 కోట్లు, రైతుబీమాకు 1200 కోట్ల రూపాయలను  మంత్రి ప్రతిపాదించారు. వచ్చే ఏడాది కొత్త లిఫ్టుల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వీటి ప్రాజెక్టు నివేదికలు త్వరలో సిద్ధమవుతాయని చెప్పారు. సాగునీటి రంగానికి 16 వందల 931 కోట్లు, సామాజిక పింఛన్లకు 11 వేల 728 కోట్ల రూపాయలను  ప్రతిపాదించారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలు కోసం 2 వేల 750 కోట్లు, ప్రతిపాదించారు. శాసనసభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద 5 కోట్ల రూపాయలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలో వీటికి మార్గదర్శకాలు విడుదలవుతాయని చెప్పారు. ఇందుకోసం 800 కోట్ల రూపాయలను కేటాయించారు. షెడ్యుల్డు కులాల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 21 వేల 306 కోట్ల రూపాయలు, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి కోసం 12 వేల 304 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం 5 వేల 522 కోట్ల రూపాయలను కేటాయించారు.   మైనారిటీ సంక్షేమానికి 1606 కోట్ల రూపాయల కేటాయింపుల్ని మంత్రి ప్రకటించారు. మహిళా శిశు సంక్షేమం కోసం 1702 కోట్ల రూపాయలను, రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం పథకం కోసం 11 వేల కోట్ల రూపాయలను, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల కింద 15 వేల 30 కోట్ల రూపాయల కేటాయింపులను ప్రతిపాదించారు. కాగా కరోనా కట్టడికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని చెబుతూ వైద్య ఆరోగ్య శాఖకు 6 వేల 295 కోట్ల రూపాయలను కేటాయించారు. విద్యుత్ రంగానికి 11 వేల 46 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన ఆర్ధిక మంత్రి రోడ్డు రవాణా సంస్థకు ప్రభుత్వం అండదండలు అందిస్తోందని చెబుతూ వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 3 వేల కోట్ల రూపాయల నిధులను ఆర్టీసీకి సమకూర్చనున్నట్లు చెప్పారు. అటవీశాఖకు 1276 కోట్ల రూపాయలు, నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి 610 కోట్ల రూపాయలు కేటాయించారు. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు అవసరమైన భూసేకరణకు 750 కోట్లు, రాష్ట్రంలో పలుచోట్ల ఎయిర్ స్ట్రిప్పుల నిర్మాణానికి 100 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఆహార భద్రతకు 2 వేల 363 కోట్ల రూపాయలు, సాంస్కృతిక పర్యాటక రంగాలకు 726 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి ప్రకటించారు

అసలు ఇవి గ్రాడ్యుయేట్లు వేసిన వోట్లేనా...?

తెలంగాణాలో నిన్న ఉదయం మొదలైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌంటింగ్ చాలా నెమ్మదిగా సాగుతోంది. జంబో బ్యాలెట్ వల్ల ఒక్కో రౌండ్ ఫ‌లితాల ప్ర‌క‌ట‌న ఆల‌స్యం అవుతోంది..మరోపక్క మొదటి ప్రాధాన్యత ఓట్ల‌తో ఎవ‌రూ గెలిచే అవ‌కాశం కనిపించడం లేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా పూర్తైతే కానీ..  ఇందులో ఎవరు నెగ్గుతారు అనే విషయంపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. . ఇది ఇలా ఉండగా న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్-ఖ‌మ్మం ఎమ్మెల్సీ సీటు లో ఇప్పటివరకు మొద‌టి మూడు రౌండ్ల లెక్కింపు పూర్తైంది. దీనిలో భగంగా లక్ష యాభై వేల‌కు పైగా ఓట్ల లెక్కింపు జరగగా … అందులో 9252 ఓట్లు చెల్లవని అధికారులు ప్ర‌క‌టించారు. దాదాపు ప్ర‌తి రౌండ్ లోనూ 3వేలకు పైగా ఓట్లు చెల్లని పరిస్థితి నెలకొంది .ఇక ఇటు హైద‌రాబాద్-మ‌హ‌బూబ్ న‌గ‌ర్-రంగారెడ్డి గ్రాడ్యుయేట్ స్థానం లో ఇప్పటివరకు రెండు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ఇక్కడ ఒక లక్ష ఇరవై వేల ఓట్లు లెక్కించగా.. అందులో 6400కు పైగా ఓట్లు చెల్లకుండా పోయాయి. అంటే ప్ర‌తి రౌండ్ లో ఇక్క‌డ కూడా 3వేల‌కు పైగానే ఓట్లు చెల్లకుండా పోయాయి.   ఈ ఓట్లను కనుక పరిశీలిస్తే .. ఈ చెల్లని ఓట్లు ఒక అభ్యర్థికి వచ్చే ఓట్ల కంటే కూడా ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ఈ చెల్లని ఓట్లు వేసిన వారిపై స‌హ‌జంగానే ప్రజలలో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం అవుతుంది. పట్టభద్రులైన వారికి కూడా సరిగా ఓట్లు వేయడం రాకపోతే ఎలా అంటూ జనం మండిపడుతున్నారు. వీరికంటే  అక్షరజ్ఞానం  లేనివారే నయం.. వాళ్ళైతే అభ్యర్థుల పేర్లతో  సంబంధం  లేకుండా తమకు నచ్చిన అభ్యర్థి గుర్తుపై పక్కాగా ఓటు వేసి వస్తారని పేర్కొంటున్నారు. మరోపక్క అస‌లు ఓటు వేసినవారు నిజంగా డిగ్రీ చ‌దువుకున్న వారేనా…అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ గ్రాడ్యుయేట్లకు జాబ్ నోటిఫికేష‌న్లు ఇవ్వడం కంటే నిరుద్యోగ భృతి ఇవ్వడమే బెటర్ అని తాజాగా సోష‌ల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.  

వామ్మో .. ఇదేం ప్రమాణం 

ఆంధ్రప్రదేశ్ లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కొత్త పాలకమండళ్లు కొలువు దీరాయి. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణా స్వీకారాలు అట్టహాసంగా జరిగాయి. అయితే తిరుపతి కార్పొరేషన్  లో మాత్రం నవ్వులపాలయ్యే ఘటన జరిగింది. 29వ డివిజన్ నుంచి గెలిచిన ఆదిలక్ష్మి ప్రమాణం పెద్ద ప్రహాసనంలా మారింది. అధికారి చెబుతుండగా ప్రమాణం చదవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఆదిలక్ష్మి. వరుసగా ఆమె అన్ని తప్పులే చెప్పారు.  అధికారి చెబుతున్న ప్రతి వాక్యాన్ని తప్పుగానే చదివారు ఆదిలక్ష్మి. భారత్, పాలన వంటి చిన్న చిన్న పదాలను కూడా ఆమె సక్రమంగా చెప్పలేకపోయారు. తప్పులు మీద తప్పులు చదువుతూ తెలుగును  ఖూనీ చేశారు. ఒక దశలో అదికారులు చెప్పినదానికి ఆమె మాట్లాడినదానికి పొంతనలేకుండాపోయింది. ఆదిలక్ష్మి తీరుతో  ఆమెతో ప్రమాణం చేయించిన అధికారి కూడా తప్పులే చదవాల్సి  వచ్చింది.  ఆమె ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాకపోవడంతో .. చివరికి అధికారులు మమా అనిపించేలా ఆమెతో ప్రమాణస్వీకారం పూర్తి చేయించారు. తిరుపతి కార్పొరేటర్ ఆదిలక్ష్మి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఆదిలక్ష్మి తీరుపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వారు ప్రజలకేం సేవ చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేటర్ తో పాటు అధికారి తప్పులు చదవడంపైనా నెటిజన్లు మండిపడుతున్నారు. జగనన్న రాజ్యంలో ఇలాంటివి కామనే అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.  

వైసీపీలోకి జేసీ బ్రదర్స్! జగన్‌కు జై కొట్టిన ప్రభాకర్‌రెడ్డి..

జేసీ బ్రదర్స్. నిప్పులాంటి నాయకులు. ఎవరికీ తలొంచరు. మాటలు తూటాల్లా వదులుతారు. కడుపులో ఉన్నది ఉన్నట్టు బయటకు అనేస్తారు. వారి నోటి నుంచి ఒక మాటొస్తే.. అది వారి మనసు నుంచి వచ్చినట్టే. తాడిపత్రిలో తిరుగులేని నేతలు. లేటెస్ట్‌గా మున్సిపల్ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికై తాడిపత్రిలో తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఛైర్మన్ అయిన వెంటనే జగన్‌కు జై కొట్టి మరింత సంచలనంగా నిలిచారు. జేసీ బ్రదర్స్ అంత ఈజీగా మరొకరికి జై కొట్టరు. వాళ్లు నిజంగా అభిమానిస్తేనే.. అతను తమ వాడని అనుకుంటేనే.. బయటకు ప్రకటిస్తారు. తాడిపత్రిలో అదే జరిగిందంటున్నారు. తాను మున్సిపల్ ఛైర్మన్ కావడానికి జగన్ హెల్ప్ చేశాడని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జగన్ తలుచుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను మున్సిపల్ ఛైర్మన్ అయ్యే పరిస్థితి లేదన్నారు. తాడిపత్రి అభివృద్ధి కోసం సీఎం జగన్‌, మంత్రి బొత్స సత్యనారాయణను కలుస్తానని తెలిపారు. ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే పెద్దారెడ్డికి లేఖలు రాస్తానని అన్నారు. తాడిపత్రిలో రౌడీయిజం, గుండాయిజం ఇక ఉండదన్నారు.  నిన్నటి దాకా జగన్ అంటే ఒంటి కాలిపై లేచిన జేసీ ప్రభాకర్‌రెడ్డి సడెన్‌గా సీఎం జగన్‌ను పొగడటం ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ కేసులు మీద కేసులు ఎదుర్కొని, జైలుకూ వెళ్లొచ్చి.. జగన్‌ను ఢీకొట్టి తాడిపత్రి మున్సిపాలిటీ దక్కించుకొని.. కొదమసింహంలా నిలిచిన జేసీ ప్రభాకర్‌రెడ్డిలో సడెన్‌గా ఈ మార్పు ఏంటని అంతా చర్చించుకుంటున్నారు.  సీఎం జగన్ నైతిక విలువలు ఉన్న వ్యక్తి అంటూ ప్రశంసించారు జేసీ. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగానే.. ఆయనలో కూడా విలువలు ఉన్నాయన్నారు. ఆ విషయాన్ని తాను ఈరోజు స్పష్టంగా గమనించాన్నారు. త్వరలో సీఎం జగన్‌ని కలుస్తానని, తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య తో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఛైర్మన్ అయిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి స్వరం మార్చడం వెనుక వేరే కారణాలు ఉన్నాయి అంటున్నారు. జేసీ సోదరులను కేసులు వెంటాడుతున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా.. ఎన్నికలు ఏవైనా వైసీపీ ప్రభంజనం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో టీడీపీ నుంచి అండ ఉన్నా లాభం లేదని జేసీ బ్రదర్స్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జగన్ కు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాడి.. కష్టాలు తెచ్చుకోవడం కంటే.. సర్దుకుపోవడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారంటున్నారు.  ఇక తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డికి, జేసీ ఫ్యామిలీకి ఇటీవలే పెద్ద ఎత్తున చిన్నపాటి యుద్ధమే జరిగింది. జేసీ ఇంటికొచ్చి మరీ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు పెద్దారెడ్డి. అలాంటి పెద్దారెడ్డితో సయోథ్యకు సైతం సై అంటున్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఆత్మాభిమానానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి జేసీ బ్రదర్స్‌లో ఒక్కసారిగా ఇలాంటి మార్పు రావడం వారు పార్టీ మారుతున్నారనటానికి సంకేతం అంటున్నారు. మరోవైపు, రాష్ట్రమంతా గెలిచాం కదా ఒక్క తాడిపత్రి పోతే ఏంటి అన్నట్టు మాట్లాడారు మంత్రి బొత్స. అంటే, వైసీపీ నుంచి సైతం వీరికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనని అంటున్నారు. సీఎం జగనే తన గెలుపునకు సహకరించారని స్వయంగా జేసీ ప్రభాకర్‌రెడ్డే చెబుతుంటే.. ఇక ఇంతకంటే వేరే ఆధారం ఇంకేం కావాలంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు, జేసీ ప్రభాకర్‌రెడ్డి మాటలు చూస్తుంటే.. త్వరలోనే జేసీ బ్రదర్స్ టీడీపీ వీడి వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 

స్టూడెంట్ తో శోభనం.. లేడీ టీచర్ దారుణం.. 

రాజకీయాల్లో రాజయోగం దక్కాలంటే 13  ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని  ఓ వ్యక్తి చెప్పిన మాటలను నమ్మి ఆ వృద్ధ రాజకీయ నాయకుడు 13  ఏళ్ళ బాలికను పెళ్లి చేసుకునే సీను రంగం సినిమాలో చూసే ఉంటారు. మూఢ నమ్మకాలను నమ్మేవాళ్లున్నంత కాలం ఇలాంటి తప్పులకు తలుపులు తెరుచుకుంటాయి.  అక్షరం రాని వాళ్లు మాత్రమే కాదు చదువుకున్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు బుద్ది గడ్డి తింటుంది. అలాగే  విద్యాబుద్ధులు నేర్పే  ఓ ట్యూషన్ టీచర్ బుద్ధి కూడా  గడ్డి తిన్నది. జన్మకుండలిలో దోషం తొలగిపోతుందనే నమ్మకంతో 13 ఏళ్ల బాలుడిని ఓ టీచరమ్మ పెళ్లి చేసుకుంది. పంజాబ్‌లోని జలంధర్‌లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జలంధర్‌లోని బస్తీ భవ ఖేల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇంట్లోనే ట్యూషన్ చెప్పుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆ యువతికి ఎన్ని పెళ్లి సంబంధాలు వస్తున్నా ఒక్కటి కూడా కుదరడం లేదు. దీంతో.. ఆమె కుటుంబం కూతురుకి పెళ్లి కావడం లేదన్న బెంగతో ఓ పూజారిని కలిసింది. ఆ యువతి జాతకాన్ని పరిశీలించిన పూజారి.. మీ అమ్మాయి జన్మకుండలిలో దోషం ఉందని, ఆ దోషం తొలగిపోవాలంటే ఓ బాలుడితో పెళ్లి తంతు జరిపించాలని సూచించాడు. సదరు యువతి ఇలాంటివన్నీ నమ్మొద్దని తల్లిదండ్రులకు నచ్చజెప్పాల్సింది పోయి ఆమె కూడా పూజారి చెప్పినట్టుగానే చేసింది. ఆమె ట్యూషన్‌కు వచ్చే ఓ 13 ఏళ్ల బాలుడిని ఈ ఉత్తుత్తి పెళ్లికి వరుడిగా ఎంపిక చేసుకుంది. వారం రోజుల పాటు మీ అబ్బాయి మా ఇంట్లోనే ఉండాలని.. క్లాసులు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆ బాలుడి తల్లిదండ్రులకు ఈ టీచరమ్మ చెప్పింది. అనుకున్నట్టుగానే.. ఆ బాలుడిని వరుడిగా కూర్చోబెట్టి అతనితో ఈ టీచరమ్మ మూడు ముళ్లు వేయించుకుంది. అయితే.. ఈ పెళ్లి గురించి అంతా రహస్యంగా ఉంచడంతో ఎవరికీ తెలియలేదు. ఆ బాలుడికి కూడా ఎవరికీ చెప్పొద్దని చెప్పి ఇంటికి వారం రోజుల తర్వాత ఇంటికి పంపారు. ఆ బాలుడు ఇంటికెళ్లి జరిగిన బాగోతమంతా కుటుంబ సభ్యులకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు బస్తీ భవ ఖేల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఉత్తుత్తి పెళ్లయినప్పటికీ పెళ్లిలో జరిగే హల్దీ-మెహిందీ వేడుక, పెళ్లి తర్వాత శోభనం రాత్రి తంతు కూడా పూర్తి చేశారని తేలింది. ఆ తర్వాత.. ఆ టీచర్ గాజులు పగులగొట్టి ఆమెను విధవగా ప్రకటించారని తెలిసింది. ఇలా చేస్తే.. దోషం తొలగిపోయి ఆమెకు పెళ్లి కుదురుతుందని ఆ పూజారి చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. తొలుత.. బాలుడి తల్లిదండ్రులు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. టీచరమ్మ ఒత్తిడితో తర్వాత కేసు ఉపసంహరించుకున్నారు.