పెళ్లి సందడిలో.. మహిళపై 7 మంది గ్యాంగ్ రేప్..
posted on May 27, 2021 @ 2:37PM
ఓపెన్ చేస్తే.. ఒక ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. బంధువులు అందరు వచ్చారు. ఎవరి పనుల్లో వార్లు ఉన్నారు. ఇల్లు అంత సందడి సందడి.. అనుకున్నట్లుగానే పెళ్లి కూడా జారిపోయింది. పెళ్లి పనులు చేసి అందరు అలిసి పడకుండిపోయారు.. అందులో ఒక మహిళ ఎందుకో తెలియదుగాని ఆ రాత్రిపూట బయటికి వెళ్ళింది. ఇక అంతే..
కట్ చేస్తే.. కొంత మంది ఆమెను ఫాలో అయ్యారు. ఆమె ముఖంపై ముసుగు వేసి, చేతులు కట్టేసి 300 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లారు. అంత నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, తీవ్రంగా గాయపరిచారు. మండపాలలో వినియోగించే వస్త్రాలతో ఆమెను స్తంభానికి కట్టేసినట్టు వివరించారు. బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళను అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడి చిత్రహింసలకు గురిచేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడి, వివస్త్రగా ఉన్న బాధితురాలిని రోడ్డు పక్కన ఓ స్తంభానికి వేలాడదీశారు. కదల్లేక, మాట్లాడలేక ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్ పరోహి గ్రామానికి చెందిన ఏడుగుర్ని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని బాధితురాలు గుర్తించినట్టు తెలిపారు. బాధితురాలి (30) ఆడపడుచు వివాహం సోమవారం రాత్రి జరగడంతో అందుకు నిందితులు సప్లయర్స్ సామాన్లు తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. వివాహం జరిగిన తర్వాత మంగళవారం తెల్లవారుజామున ఆమె ఒంటిరిగా బయటకు వెళ్లడం గమనించిన నిందితులు వెంబడించి ఎత్తుకెళ్లారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా హింసించడంతో శరీరంపై గాయాలయ్యాయి.
బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారని, ప్రస్తుతం ఆమె సమస్తీపూర్ సాదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆ జిల్లా ఎస్పీ మానవ్జీత్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. పరువు పోతుందనే భయంతో బాధిత మహిళ తనపై అత్యాచారం జరగలేదని చెప్పిందన్నారు. కానీ, ఆమెపై అత్యాచారం జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోందని, వైద్యుల నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. బాధితురాలిని కుటుంబసభ్యులు మంగళవారం సాయంత్రం దలాసింగ్సరాయ్ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులకు అక్కడ వైద్యులు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగుచూసింది. దారుణమైన ఘటన బిహార్లో సమస్తీపూర్ జిల్లా బిభూత్పూర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని చఖాబిబ్ రుధియా గ్రామంలో మంగళవారం జరిగింది.