కిరణ్ కుమార్ కు అధిష్ఠానం అక్షింతలు
కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ సంక్షోభం, ఈఆర్సీ కి సర్ ఛార్జి వసూలుకు అనుమతి ఇవ్వడంపై స్వపక్షంలోనే ఎదురుగాలులు వీస్తున్నాయి. కిరణ్ నిర్ణయంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లోనే అసంతృప్తి నెలకొని వుంది. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి, సీనియర్ నేత హనుమంతరావు, జానారెడ్డి, షబ్బీర్ ఆలీ, డి.ఎల్.రవీంద్రా రెడ్డి, సి. రామచంద్రయ్య, యాదవరెడ్డి మరికొందరు మరి కొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్నందున చార్జీల పెంపు సరైన నిర్ణయం కాదని రుసరుసలాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ పెంచిన ఛార్జీలను తగ్గించాలంటూ సూచించారు. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ పెంపు సరైనది కాదని, కాంగ్రెస్ లో పరుగుతున్న అసంతృప్తి మంచిది కాదని ఆజాద్ అభిప్రాయపడినట్లు తెలిసింది.