రఘురాజు అక్రమాల చిట్టా ... ఈడీ
posted on Apr 2, 2013 7:45AM
రఘురాజు కెవిపి రామచంద్ర రావు వియ్యంకుడు. ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇండ్ భారత్ ఇన్ ఫరా లిమిటెడ్ కంపెనీలకు రఘురాజు అధిపతి. 800కోట్ల రూపాయల పెట్టుబడులలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ ఆరోపణ. 2007-08లో ఇండ్ భారత ఇన్ ఫరా లిమిటెడ్ లోకి 600 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు, ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 200 కోట్ల రూపాయలు 2011లో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఇండ్ భారత్ సన్ ఎనర్జీలోకి వచ్చిన విదేశీపట్టుబడులలో నిబంధనల ఉల్లంఘనకు రఘురాజు పాల్పడినట్టుగా తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొంటుంది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్.ఐ.పి.బి.)అనుమతి లేకుండానే ఈ ఇన్వెస్ట్ మెంట్ ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ స్వీకరించింది. విద్యుత్ ప్రాజెక్టుల్లో మాత్రమే విదేశీ పట్టుబడులను అనుమతిస్తారు.ఇండ్ భారత్ సన్ ఎనర్జీ కేవలం ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ మాత్రమే. ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలు, ట్రేడింగ్ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులు రావాలంటే ఎఫ్.ఐ.పి.బి. అనుమతి తప్పనిసరి. ఈ విషయాలపై ప్రశ్నించేందుకు ఈడీ రఘురాజుకు సమన్లు జారీ చేసింది.