ముఖ్యమంత్రి కోసం వాటర్ బాటిల్.. అందులో పాముపిల్ల

 

చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి రమణ్ సింగ్, ఆయనతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈసందర్భంగా వారికి తాగడానికి వాటర్ బాటిల్స్ సిద్దం చేశారు. అయితే ముఖ్యమంత్రిగారు తాగాల్సిన బాటిల్ నీటిలో పాము పిల్ల కనిపించింది. ఇది అక్కడ ఉన్న ఓ మహిళా డాక్టర్ గుర్తించడంతో అది ఆయనకు అందకుండా చూశారు. లేదంటే అలానే పాము ఉన్న బాటిల్ ను ముఖ్యమంత్రిగారి ముందు పెట్టేవారే. కానీ మామూలు అధికారులకు చేసే ఏర్పాట్లే సరిగా ఉన్నాయా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తారు.. అలాంటిది ముఖ్యమంత్రికి చేసే ఏర్పాట్లలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి.. కాని అలా కాకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.

Teluguone gnews banner