తెలుగు తల్లిని దేయ్యమంటున్న కేసిఆర్

సీమాంధ్రులపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సభలోఆయన ప్రసంగించారు. తెలుగుతల్లి మా పాలిట దెయ్యమని, తెలుగుతల్లి మాకెలా తల్లి అవుతుందని అన్నారు. మా తెలంగాణ తల్లి మాకుందని అన్నారు. నన్నయ్య ఆదికవి కానేకాదని తేల్చిచెప్పారు. 'నన్నయ్య కవిత్వం రాయలేదు. సంస్కృతం లో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. ఆయన అనువాద కవి మాత్రమే. బసవ పురాణం రాసిన పాల్కురికి సోమనాథుడే ఆదికవి అని చెప్పారు.


 

జిల్లాలు, జనాభా ఎక్కువగా ఉన్న ఆంధ్రా ప్రాంతం కన్నా తెలంగాణ నుంచి ఎక్కువ ఆదాయం రావడం ఏమిటని నేను ప్రశ్నించాను. దీన్ని పరిశోధించమని చెప్పాను. చివరికి తేలింది ఏమంటే ఆంధ్రాలో పన్నుల ఎగవేత ఎక్కువ. వాళ్లు చట్టాలను ఉల్లంఘిస్తారు. అదే తెలంగాణ వాళ్లు నిజాయతీగా పన్నులు చెల్లిస్తారు. చట్టాలను గౌరవిస్తారు. తక్కువ జనాభా ఉన్నా తెలంగాణ నుంచే ఆదాయం ఎక్కువ అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.