శ్రీలంకతో భారత్ టి20 మ్యాచ్ నేడు

శ్రీలంకలోనే సెప్టెంబరులో జరిగే టి20 ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడానికి, పరిస్థితులను అర్థం చేసుకోవడానికి భారత జట్టుకు ఇది ఆఖరి అవకాశం. ఐదు వన్డేల సిరీస్‌ను విజయవంతంగా ముగించిన ధోనిసేన పర్యటనలో ఆఖరి మ్యాచ్, ఏకైక టి20లో మంగళవారం శ్రీలంకతో తలపడుతుంది. ప్రపంచకప్‌కు జట్టు ఎంపిక చేయడానికి ముందు భారత్ ఆడే చివరి టి20 కూడా ఇదే. కాబట్టి జట్టులో స్థానం ఆశిస్తున్న కుర్రాళ్లందరూ సత్తా నిరూపించుకోవడానికి ఇది ఆఖరి అవకాశం.


 

గాయం కారణంగా ఆఖరి వన్డేకు దూరమైన సెహ్వాగ్‌తో పాటు జహీర్ ఖాన్ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంలేదు. ఇద్దరూ గాయాల కారణంగా స్వదేశానికి వచ్చారు. ఫామ్ పరంగా భారత్ అన్ని విభాగాల్లోనూ బలంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా కోహ్లి, రైనా, ధోని, గంభీర్ జోరుమీదున్నారు. ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌తో పాటు స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ విభాగంలో కీలకం. అటు శ్రీలంక జట్టుకు సంగక్కర సేవలు అందుబాటులో లేవు. జయవర్ధనే, దిల్షాన్, మాథ్యూస్, పెరీరా కీలక ఆటగాళ్లు.

 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.