నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వేడివేడిగా సాగడానికి రంగం సిద్ధమైంది. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థికవ్యవస్థ మొదలుకుని అస్సాం హింసాకాండవరకు అనేక అంశాలపై పాలకపక్షాన్ని ఎండగట్టడానికి విపక్షాలు అస్త్రశస్త్రాలతో తయారయ్యాయి. సామాన్యుడి జీవితాన్ని అధ్వానంగా మార్చిన ఆర్థికరంగం తీరుతెన్నులు, రిటైల్‌రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐలకు) అనుమతి, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దుర్భిక్ష పరిస్థితులు, పవర్‌గ్రిడ్‌ల వైఫల్యంపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని విపక్షాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. నేటి నుంచి సెప్టెంబర్ 7వ తేదీవరకు నెలరోజులపాటు జరిగే సమావేశాల్లో సెలవులు మినహాయిస్తే, ఉభయసభలు 20 రోజులపాటు పనిచేస్తాయి. ఈ 20 రోజుల్ని పూర్తిస్థాయిలో సద్వినియోగపర్చుకుని పెండింగ్ బిల్లులన్నింటికీ ఆమోదం సాధించాలని, కొత్తగా కొన్నింటిని ప్రవేశపెట్టాలని, చివర్లో లోక్‌పాల్ బిల్లును కూడా రాజ్యసభ ఆమోదానికి తేవాలని కేంద్రం నిర్ణయించింది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.