13న శ్రీలక్ష్మి బెయిల్ కేసు విచారణ
posted on Aug 7, 2012 @ 3:47PM
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసులో అరెస్టైన శ్రీలక్ష్మి తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. దీనిని కోర్టు స్వీకరించింది. తదుపరి వాదనలను ఈ నెల 13వ తేదికి వాయిదా వేసింది. ఇప్పటికే ఆమె నాంపల్లిలోని సిబిఐ కోర్టు, హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికి ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత సుప్రీంను ఆశ్రయించినా ఫలితం కనిపించలేదు. కింది కోర్టులోనే వాదనలు వినిపించాలని సుప్రీం సూచించడంతో ఆమె మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.