నిప్పులు చెరిగిన విష్ణువర్థన్ బాబు

  దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణుల్ని కించపరిచే విధంగా కొన్ని సీన్లున్నాయన్న కోణంలో తలెత్తిన వివాదం రోజురోజుకీ ముదురుతోంది. తమని అవమానిస్తే ఎంతకైనా తెగిస్తామంటూ కొందరు మోహన్ బాబు ఇంటిమీద దాడికి దిగడం హైదరాబాద్ లో కలకలం రేపింది. ఇంటిమీదకొచ్చి దాడి చేయడమేంటంటూ మంచు విష్ణువర్ధన్ బాబు తారా స్థాయిలో మండిపడ్డాడు. " నేనింట్లో లేను కాబట్టి సరిపోయింది. లేకుంటే మీ సంగతి తేల్చేవాడిని, ఏమనుకుంటున్నారు మీరు, సిటీలో తిరగాలని లేదా.. సినిమావాళ్ల ఇళ్లమీదకి రావడం ఫ్యాషనైపోయింది" అంటూ విష్ణువర్థన్ సవాల్ విసరడం మరో వివాదానికి తెరలేపింది. "గమ్మునుంటే చాతగానివాళ్లలా కనిపిస్తున్నామా? ఇంటికొచ్చి డోర్లు పగలగొట్టడం, లైట్లు పగలగొట్టడం హీరోయిజం అనుకుంటున్నారా..? బుధవారం సినిమా రిలీజైతే సోమవారం పనిగట్టుకుని ఇంటిమీదికి దాడికి రావడమేంటి. ఎవరో పనిగట్టుకుని వాళ్లని రెచ్చగొడుతున్నారు. సినిమాని సినిమాలాగా చూడాలి. కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో విడుదలైన సినిమాల మీద ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయడంలేదే.. మరిక్కడమాత్రం ఇలాంటివన్నీ ఎందుకొస్తున్నాయ్.." అంటూ విష్ణువర్ధన్ మండిపడ్డాడు.

మోహన్ బాబుపై కేసు నమోదు

  బ్రాహ్మణులను కించపరిచే విధంగా సన్నివేశాలున్న దేనికైనా రెడీ సినిమాపై మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచారని న్యాయవాది శ్రీనివాస్‌యాదవ్ కోర్టు పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు నిర్మాత మోహన్‌బాబు, దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి, నటులు మంచు విష్ణు, బ్రహ్మానందంపై కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేనికైనా రెడీ చిత్రాన్ని నిలిపివేయాలని బ్రాహ్మణులు డిమాండ్ చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని శ్రీమయూరి థియేటర్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన బ్రాహ్మణులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మోహన్ బాబు ఇంటిముందు కొందరు ఆందోళన చేయగా వారు కిరాయి బ్రాహ్మణులని మోహన్ బాబు అన్నారు.

జగన్ ని కలిసిన టిడిపి ఎమ్మెల్యే, సస్పెన్షన్

  చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రవీణ్ ను టిడిపి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గా ఆ పార్టీ ప్రకటించింది. కొంతకాలం క్రితం చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా ప్రధానికి లేఖ రాయడాన్ని ప్రవీణ్ తప్పు పట్టారు. అప్పటి నుండి పార్టీకి దూరంగా ఉంటున్నా తాను పార్టీని వీడనని ప్రకటించారు. తాజాగా జగన్ ను కలవడంతో ఆయన పార్టీని వీడడం ఖాయమని తేలిపోయింది. చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని విమర్శించారు. తెలంగాణపై చంద్రబాబు లేఖ ఇవ్వడాన్ని తప్పు పట్టిన ప్రవీణ్ ఆయనపై నిప్పులు చెరిగారు. తెలంగాణపై బాబు ఇచ్చిన లేఖతో ఇప్పుడు ఇరు ప్రాంతాల నేతలు ఇబ్బంది పడుతున్నారన్నారు. కానీ కొందరు బయటపడటం లేదన్నారు. బాబు లేఖతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అది అందర్నీ కన్ఫూజన్ చేసే విధంగా ఉందన్నారు. తాను అతి త్వరలో మంచి ముహూర్తం చూసుకొని జగన్ పార్టీలో చేరతానని చెప్పారు. ప్రతిపక్షంగా తెలుగుదేశం విఫలమైందన్నారు. అధికార కాంగ్రెసు తప్పులు చేస్తే నిలదీయమని ప్రజలు టిడిపిని ప్రతిపక్షంలో కూర్చుండబెడితే చంద్రబాబు వారి నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం టిడిపి, కాంగ్రెసు ఏకమయ్యాయన్నారు. జగన్ పార్టీలోకి ఇంకా ఎంతమంది వస్తారో తనకు తెలియదన్నారు. యువత జగన్ వెంట ఉందని అన్నారు.

నిమ్మగడ్డని పరామర్శించిన జగపతిబాబు

  వాన్ పిక్ కుంభకోణంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటూ చంచల్ గూడ జైల్లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ ని హీరో జగపతి బాబు పరామర్శించారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, తప్పకుండా న్యాయం జరుగుతుందని.. జగపతి.. నిమ్మగడ్డ ప్రసాద్ కి ధైర్యం చెప్పినట్టు సమాచారం.   నిమ్మగడ్డకి అత్యంత ఆప్తుడైన హీరో నాగార్జునకూడా చాలాసార్లు చంచల్ గూడ జైలుకొచ్చిన తనతో మాట్లాడివెళ్లారు. ప్రసాద్ తనకి చాలా ఆప్తుడని, ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని ఊహించలేదని నాగార్జున బాధపడ్డారుకూడా. సినీ పరిశ్రమలో చాలామందితో నిమ్మగడ్డ ప్రసాద్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయ్.   బ్యాట్మిండన్ కోచ్ పుల్లెల గోపీచంద్, చాముండేశ్వరీ నాథ్ కూడా గతంలో నిమ్మగడ్డని చంచల్ గూడ జైల్లో కలిశారు. సినీ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు నిమ్మగడ్డని పరామర్శించేందుకు చంచల్ గూడ జైలు దగ్గరికి వస్తుండడంతో వాళ్లని చూసేందుకు సామాన్య జనం ఎగబడుతున్నారు. విఐపిల రాక కారణంగా జైలుపరిసరాల్లో జనం బాగా పెరిగిపోతున్నారని అధికారులు చెబుతున్నారు.

కిరణ్ కి కళ్లు తిరిగాయ్..

  కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మార్క్ మచ్చుకైనా కనిపించలేదు. అసలు ఆయన అభిప్రాయాన్ని అడగడంకానీ, కనీసం పట్టించుకోవడంగానీ కూడా అధిష్ఠానం చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. కారణం.. కిరణ్ మీద అధిష్ఠానానికి అంతగా నమ్మకం లేకపోవడమేనని సీనియర్ల ఉవాచ. ఏరికోరి కిరణ్ కి ముఖ్యమంత్రి కుర్చీ అప్పజెప్పినప్పుడు డైనమిక్ గా వ్యవహరించాలన్న , వ్యవహరిస్తారన్న నమ్మకం ఎక్కడో ఓ మూలన్నా అధిష్ఠానానికి ఉండుంటుంది. కానీ.. కిరణ్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారన్న భావన కాంగ్రెస్ అధినేత్ర దృష్టిలో బలంగా పడిపోయిందని చాలామంది నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.   కేంద్రమంత్రివర్గ విస్తరణ విషయంలో పిసిసి చీఫ్ బొత్సని, చిరంజీవిని సంప్రదించి జాబితాని రూపొందించుకున్న అధిష్ఠానం కేవలం మొక్కుబడిగానే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చెవిన వేసింది తప్ప, ఆయనకు ఎలాంటి ప్రాథాన్యతా ఇవ్వలేదుగాక ఇవ్వలేదన్న విషయం ఏపీలో కిందిస్థాయి కార్యకర్తలకు కూడా తేటతెల్లమయ్యిందంటూ కిరణ్ వ్యతిరేకవర్గాలు పండగ చేసుకుంటున్నట్టు సమాచారం. అధిష్ఠానం అండ తనకుందన్న మితిమీరిన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డికి అదనుచూసి సరైన సమయంలో సోనియా ఝలక్ ఇచ్చారంటూ పార్టీలోని కొందరు నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారటకూడా.. మొత్తానికి అన్ని రోజులూ ఒకేలా ఉండవన్న విషయం. కిరణ్ కుమార్ రెడ్డికి ఈ పాటికే అర్ధమయ్యుంటుందేమో..

వీరవిధేయులకే వరాలిచ్చిన సోనియామాత!

  ఈసారి మంత్రివర్గ విస్తరణలో సోనియా ఆచితూచి అడుగేశారు. రాహుల్ వర్గానికి పెద్దపీట వేస్తూనే ఉద్యమాలబాటలో ఉలికిపడ్డ నేతల్ని దూరంగా ఉంచారు. మధుయాష్కీ.. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా పేరుపడ్డ ఎంపీ.. కానీ తెలంగాణ ఉద్యమంలో అధిష్ఠానాన్ని రూల్ చేసే రీతిలో మాట్లాడిన పాపానికి ఆయనకు ఛాన్స్ దక్కలేదు. నోరెత్తినవాళ్లకి పదవులు దక్కవన్న విషయాన్ని చెప్పకనే చెప్పేందుకు అధిష్ఠానం ఈ స్థాయిలో కసరత్తు చేసిందని వినికిడి.   కాంగ్రెస్ అధిష్ఠానాన్ని పల్లెత్తు మాట అనకుండా ఉద్యమం చేశామంటే చేశామని.. హడావుడి చేసి కామ్ గా ఊరుకున్నవాళ్లని మాత్రం నెత్తినపెట్టుకున్నారు. తెలంగాణ ప్రాంతంనుంచి సర్వేకి, బలరాం నాయక్ కి రెండు విధాలుగానూ లాభం జరిగింది. అటు తెలంగాణ ప్రజలు.. వీళ్లు మాకోసం తెగపాకులాడుతున్నారన్న అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. ఇటు.. అధిష్ఠానంకూడా తమని ధిక్కరించే సాహసం చేయలేదన్న ఆలోచనకు వచ్చింది కాబట్టే ఛాన్స్ కొట్టగలిగారు.   వ్యాపారవర్గాలకు కూడా ఈ విస్తరణలో తీవ్రస్థాయి నిరాశే దక్కింది. రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి దీనికి మంచి ఉదాహరణ. రాయపాటికీ, కావూరికీ సమైక్యవాదాన్ని నెత్తినేసుకోవడంవల్లే మంత్రిపదవి దక్కలేదన్న ప్రచారం జోరుగా సాగుతోందికానీ.. బిజినెస్ పీపుల్ ని దూరంగా పెట్టాలన్న నియమం ప్రకారమే వాళ్లకి ఛాన్స్ దక్కలేదని విశ్వసనీయవర్గాల సమాచారం.

జైపాల్ కి అంత సింపతీ అవసరమా?

  కేంద్రమంత్రి జైపాల్ రెడ్డికి వద్దంటే సింపతీ వెల్లువెత్తుతోంది. పెట్రోలియం శాఖ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఆయన్ని మార్చడం డిమోట్ చేయడమేనని చాలామంది అనుకుంటున్నారు. రిలయన్స్ సంస్థతో జైపాల్ రెడ్డి పెట్టుకున్న పంచాయతీ కారణంగానే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందని ఊరూవాడా కోడై కూస్తోంది. వాస్తవానికి పెట్రోలియం శాఖ మంత్రిగా జైపాల్ రెడ్డి దేశానికి చాలా మేలుచేశారన్న అభిప్రాయం జనసామాన్యంలోకూడా గట్టిగానే ఉంది. కానీ.. అదే సమయంలో రిలయెన్స్ సంస్థకి నష్టం వాటిల్లిన కారణంగా ఆయన కుర్చీని వదులుకోవాల్సొచ్చింది. ఇదంతా జనంలో ఉన్న సిపంతీవేవ్.. కానీ నిజంగా జైపాల్ కి అంత సీనుందా.. అని కొందరు గట్టిగానే అడుగుతున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపుల విషయంలో జైపాల్ రెడ్డి చూసీ చూడనట్టు ఊరుకున్నారు.ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేసరికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కల్పించుకుని ప్రథానితో గట్టిగా మాట్లాడాల్సొచ్చింది. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ కేటాయింపులు జరిగాయి."నేను జాతీయవాదిని, ఓ రాష్ట్రం ప్రయోజనాలగురించి ఆలోచించేవాడిని కాదు.." అంటూ జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాతగానితనాన్ని బైటపెట్టడమేకాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రమంత్రిగా వెళ్లిన ఆయనకు మన రాష్ట్రంమీద ఎంత మక్కువ ఉందో చెప్పకనే చెప్పాయి. ఏపీనుంచి ఢిల్లీకి వెళ్లి మంత్రి పదవులు చేపట్టినవాళ్లు మనరాష్ట్రాన్ని చులకనచేయడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలోకూడా ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ప్రథానిగా పనిచేసిన పి.వి.నరసింహారావువల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. ఇప్పుడూ అదే జరుగుతోంది. రైల్వేశాఖ మిగతా ఏరాష్ట్రానికి దక్కినా వరాలజల్లుకురుస్తుంది. కానీ.. ఏపీకి దక్కినప్పుడు మాత్రం ఉత్తచేతులు ఊపుకుంటూ రావడంతప్ప మన మంత్రులు సాధించగలిగేదికూడా ఏదీ లేదన్న విషయం మొత్తం రాష్ట్రానికి తెలిసిన విషయమే. ఏంటో మన మంత్రులకు మన రాష్ట్రానికి మేలు చేయాలన్న ఆలోచన ఎప్పటికి కలుగుతుందో ఏమో..

సుబ్బిరామిరెడ్డి బిజినెస్ లాజిక్

  నెల్లూరులో సీటు కచ్చితంగా పోతుందని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. తెలిసితెలిసీ అధిష్ఠానం పరువును నిలబెట్టడానికే అన్నట్టుగా తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి బరిలోకి దిగారు. అనధికారికి లెక్కలప్రకారం ఆయనకు ఎలక్షన్ పుణ్యమా అని రమారమీ.. ఓ వందకోట్లకి బొక్కపడ్డట్టు సమాచారం. దానివల్ల ఒరిగిందికూడా ఏమీ లేదు. కనీసం తన త్యాగాన్ని దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానం కేంద్రమంత్రిపదవినో లేక టిటిడి చైర్మన్ గిరీనో లేక కనీసం తన భార్యకైనా టిటిడి కుర్చీనో ఇస్తారని ఆశించిన సుబ్బిరామిరెడ్డికి ఆశలు అడియాసలే అయ్యాయి. డబ్బూపోయే శనీ పట్టె అన్న సామెత ఆయన విషయంలో రుజువయ్యిందని రాజకీయవర్గాలు బాహాటంగానే అనుకుంటున్నాయ్. సుబ్బిరామి రెడ్డి మాత్రం పెదవి కదపడం లేదు. ఎందుకంటే రాజకీయపరమైన లబ్ధిని చేకూర్చలేకపోయిన అధిష్ఠానం వ్యాపారపరంగా మంచి లాభసాటి బేరాల్ని అప్పజెప్పాలన్న నిర్ణయానికి వచ్చిందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. అందుకే తిక్కవరపు తన అసంతృప్తిని ఎక్కడా వెళ్లగక్కలేదనేది రాజకీయ పండితుల మాటల సారాంశం.

రాయలసీమకి తీరని నష్టం

  కేంద్రమంత్రివర్గంలో రాష్ట్రానికి పది అంకెలు దక్కాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శుభపరిణామమే ఇది. అందరికీ సంతోషంగానే ఉంది. ఒక్క రాయలసీమ వాసులకు తప్ప. ఎందుకంటే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ, తెలంగాణ జిల్లాలనుంచి ప్రాతినిధ్యాన్ని లెక్కలోకి తీసుకుంటే అటు కోస్తాకీ, ఇటు తెలంగాణకీ గట్టి న్యాయమే జరిగినట్టు లెక్క. రాయలసీమకి మాత్రం నామమాత్రపు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది.   కోస్తా ప్రాంతంనుంచి పురంధేశ్వరి, కిషోర్ చంద్రదేవ్, కిల్లి కృపారాణి అవకాశం దక్కించుకున్నారు. ఉత్తరాంధ్రలో చిరంజీవికి, పనబాకలక్ష్మికి, పళ్లంరాజుకీ బెర్తులు దక్కాయి. తెలంగాణ ప్రాంతంనుంచి జైపాల్ రెడ్డి, సర్వేసత్యనారాయణ, బలరాం నాయక్.. కాంగ్రెస్ కంచుకోటలో పాగావేశారు. రాయలసీమనుంచి మాత్రం ఒక్క కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి మాత్రమే ఛాన్స్ దక్కింది. అదికూడా యాంటీ జగన్ వర్గం కాబట్టి.   భవిష్యత్తులో జగన్ కి చెక్ పెట్టాల్సొస్తే ముందునుంచీ వై.ఎస్ వర్గానికి వ్యతిరేకంగా ఉన్న కోట్ల వర్గమే కరెక్టని అధిష్ఠానం లెక్కలేసుకునిమరీ కోట్లకి సీటిచ్చారుతప్ప ప్రాంతాలవారీ న్యాయప్రాతిపదిక కన్నుపొడుచుకున్నా కనిపించని పరిస్థితి. అయినా దీనిగురించి మాట్లాడడానికి ఎవరూ సాహసించడంలేదు.. ఎందుకంటే వీర విధేయులకు మాత్రమే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించిన అధిష్ఠానం.. కామ్ గా ఉండే వాళ్లకే ప్రాథాన్యమిస్తామన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది కనక పల్లెత్తు మాట అనడానిక్కూడా ఎవరూ సాహసించరన్న విషయం అందరికీ తెలిసిందే..

కామసూత్రలో రెచ్చిపోనున్న షెర్లిన్ చోప్రా

  ప్లేబాయ్ మ్యాగజైన్ కోసం నగ్నంగా పోజులిచ్చిన సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా, వెండితెరపై రెచ్చిపోనుంది. రూపేష్ పాల్ దర్శకత్వంలో కామసూత్ర 3Dమూవీ లో షెర్లిన్ చో లీడింగ్ లేడిగా నటిస్తుంది. తను అనుకన్న కథకి షెర్లిన్ చోప్రా మత్రమే న్యాయం చేయగలదని రూపేష్ పాల్ అన్నారు. ఇక షెర్లిన్ చెప్రా మాట్లాడుతూ, కామ సూత్ర వల్గారిటీకి క్లోజ్‌గా ఉంటుంది. కానీ నగ్నంగా నటించడం వల్గర్ కాదు. నగ్నంగా నటించడం అనేది ఒక ఆర్ట్. నేను చాలా బోల్డ్ గా ఉండటం వల్ల నన్ను సంప్రదిస్తున్నారు అంటోంది. ఆమె మాటలు చూస్తుంటే తాను కోరినట్లు మార్పులు చేస్తే నగ్నంగా రెచ్చిపోవడానికి ఒప్పుకునేట్లే ఉంది.

వైకాపాలోకి క్యూకట్టిన నేతలు

  రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు జగన్ పార్టీలోకి క్యూకట్టారు. చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ (కాంగ్రెస్) వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. పార్టీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయనీ ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ కు, పార్టీకి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.   విశాఖ జిల్లా పాయకరావుపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. చెంగల వెంకట్రావుకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చెంగల వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతానని రెండు నెలల క్రితమే ప్రకటించారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత కృష్ణ బాబు, టీడీపీని వీడతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. నల్గొండ జిల్లా భువనగిరిలో భారీ బహిరంగ సభ ద్వారా యువ తెలంగాణ జేఎసీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నది ఈరోజే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఒక్కరోజే అరడజను మంది ఇతర పార్టీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం గమనార్హం.   

జగన్ పార్టీలోకి క్యూకట్టిన నేతలు

  రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు జగన్ పార్టీలోకి క్యూకట్టారు. చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ (కాంగ్రెస్) వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. పార్టీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయనీ ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ కు, పార్టీకి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.   విశాఖ జిల్లా పాయకరావుపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. చెంగల వెంకట్రావుకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చెంగల వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతానని రెండు నెలల క్రితమే ప్రకటించారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత కృష్ణ బాబు, టీడీపీని వీడతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. నల్గొండ జిల్లా భువనగిరిలో భారీ బహిరంగ సభ ద్వారా యువ తెలంగాణ జేఎసీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నది ఈరోజే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఒక్కరోజే అరడజను మంది ఇతర పార్టీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం గమనార్హం.   

పేదలకు ఉచితంగా ఇళ్ళు : చంద్రబాబు

  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రూ.లక్ష ఖర్చుతో పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వస్తున్న మీకోసం యాత్రలో భాగంగా 27వ రోజు ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. చింతరేవుల పల్లిలో ఆయన ప్రసంగించారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి అండగా ఉండేందుకే వచ్చినట్లు ఆయన తెలిపారు. గ్రామస్థులు తాగునీటి సమస్య గురించి ప్రస్తావించగా ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తెదేపా అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి మంజూరు చేస్తామన్నారు. బెల్టు షాపులు పూర్తిగా రద్దు చేస్తామని, ఆదరణ పథకాన్ని మళ్లీ అమలు చేస్తామని వెల్లడించారు. ఈ పథకం ద్వారా వృత్తిదారులకు పరికరాలు అందిస్తామన్నారు.

నా వల్లే నా భార్యకు కేంద్రమంత్రి రాలేదు: బొత్స

  తన భార్య బొత్స ఝాన్సీ కి తన వల్లే కేంద్ర మంత్రి పదవి రాలేదని బొత్స సత్యనారాయణ అన్నారు. తాను పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా పదవిలో ఉండడం వల్లే తన భార్యకి కేంద్ర మంత్రి ఇవ్వలేదని చెప్పారు. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినందుకు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కి కృతజ్ఞతలు చెప్పారు. మంత్రి వర్గ మార్పుల్లో చిన్నపాటి సమస్యలున్నా సర్దుకుంటాయని, జైపాల్ రెడ్డి శాఖ మార్పు ప్రమోషనో, డిమోషనో తనకు తెలియదని, ఏ శాఖ అప్పగించినా జైపాల్ రెడ్డి సమర్థంగా నిర్వహిస్తారని అన్నారు.   అవకాశం వస్తే చిరంజీవి పార్టీకి నాయకత్వం వహిస్తారని ఆయన అన్నారు. పార్టీలో పనిచేసే వారికే పదవులు లభిస్తాయన్నారు. కేంద్ర మంత్రివర్గంలో మరి కొంత మంది బిసీలకు స్థానం కల్పించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర మంత్రులు పనిచేయాలన్నారు. మంత్రులుగా అందరికీ అవకాశం రాదని, చిన్నపాటి అసంతృప్తులు సహజమేనని అన్నారు.   

తెలంగాణలో హల్ చల్ చేస్తున్న కీలక నేతలు

    రాష్ట్రానికి చెందిన ముగ్గురు కీలక నేతలు తెలంగాణాలో హల్ చల్ చేయబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ మాత్రం వీరిని ఎలా అడ్డుకోవాలో తెలియక సతమతమవుతోంది. టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డినీ అడ్డుకోనే౦దుకు గతంలో టీఆర్ఎస్ పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది.   ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో వస్తున్నా మీ కోసం యాత్ర చేస్తున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ తెలంగాణలో నల్గొండ జిల్లా భువనగిరిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ సభలో యువ తెలంగాణ జేఎసీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సంధర్బంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి తన బాల ప్రదర్శన కోసం భారీగా జనాల్ని సమీకరిస్తుండడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.   మెదక్ జిల్లాలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట కూడా ఈ రోజు నుంచే ప్రారంభ౦ కానున్న నేపధ్యంలో టీఆర్ఎస్ నేతలు బాటను అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో పోలీసులు ముందస్తు అరెస్ట్ లు ప్రారంభించారు. మొత్తానికి రాష్ట్రానికి చెందిన ముగ్గురు కీలక నేతలు రాష్ట్రంలో హల్ చల్ చేస్తుంటే, టీఆర్ఎస్ నేతలు మాత్రం తమ భవిష్యత్ కార్యాచరణ ఏమిటో తెలియక గందరగోళంలో పడిపోతున్నారు.

కేంద్రమంత్రి పురందేశ్వరికి షాక్

ఈ సారి క్యాబినెట్ హోదా ఖాయమని అనుకున్న కేంద్రమంత్రి పురందేశ్వరికి షాక్ తగిలింది. ఆమెకు శాఖ మార్పు తప్ప, ప్రమోషన్ లభించలేదు. కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో మానవ వనరురుల శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న పురందేశ్వరికి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పదవి మార్పు మాత్రమే లభించింది.     మరోవైపు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేస్తున్న జైపాల్ రెడ్డిని ఆ పదవి నుండి తప్పించి ఏ మాత్రం ప్రాధాన్యత లేని శాస్త్ర, సాంకేతిక శాఖను కేటాయించడం చర్చకు తెర లేపుతోంది. రిలయన్స్ సంస్థతో జైపాల్ రెడ్డికి వున్న విబేధాల కారణంగానే ఆయనకు డిమోషన్ లభించిందని అంటున్నారు.   చిరంజీవికి స్వతంత్ర హోదాలో పర్యాటక శాఖ, కిల్లి కృపరాణికి ఐటీ శాఖ సహాయ మంత్రి పదవి, బలరాం నాయక్ కి సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి పదవి, సర్వే సత్యనారాయణకు ఉపరితల రవాణా శాఖ సహయ మంత్రి పదవి, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి రైల్వే  శాఖ సహాయ మంత్రి పదవి దక్కాయి. కేంద్ర మంత్రి పల్లం రాజుకి ప్రమోషన్ లభించింది. మానవ వనరుల అభివృద్ది శాఖ దక్కింది.  

రాష్ట్రంలోని పలు జిల్లాలో భూప్రకంపనలు

రాష్ట్రంలోని పలు జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో నాలుగు సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. భూమి కంపించటంతో ప్రజలు భయాందోళనకు గురై రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప తీవ్రంగా రిక్టర్ స్కేల్‌పై 1.8 నుంచి 2.3 గా నమోదైంది. విజయవాడ భూకంప అధ్యయన కేంద్రం అధికారులు మాట్లాడుతూ ఇవి స్వల్ప భూ ప్రకంపనలు మాత్రమే అని, భూ పొరల్లో సర్దు బాట్ల కారణంగా ప్రకంపనలు జరిగినట్లు తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళ చెందాల్సి అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆరు నెలల కాలంలో ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇది రెండోసారి. ఈసారి గతంలో కన్నా ఎక్కువ తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమిత్రా దీవిలో చోటు చేసుకున్న ప్రకంపనలు కూడా రాష్ట్రంలోని ప్రకంపనలకు కారణం కావచ్చునని భావిస్తున్నారు.     భూమి కంపించిన ప్రాంతాలు # గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల, అచ్చంపేట, మాచర్ల ప్రాంతం # కృష్ణా జిల్లాలోని నందిగామ, చందర్తి పాడు, జగ్గయ్యపేట # ఖమ్మం జిల్లాలోని చింతకాని, సత్తిపల్లి, మధిర # నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, దామచర్ల, తిప్పర్తి, హాలియా, సూర్యాపేట, మేళ్లచెర్వు # రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్ # ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, దర్శి, అద్దంకి, సంతనూతలపాడు, కందుకూరు ప్రాంతాల్లో భూమి కంపించింది.