రాయలసీమకి తీరని నష్టం

 

కేంద్రమంత్రివర్గంలో రాష్ట్రానికి పది అంకెలు దక్కాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శుభపరిణామమే ఇది. అందరికీ సంతోషంగానే ఉంది. ఒక్క రాయలసీమ వాసులకు తప్ప. ఎందుకంటే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ, తెలంగాణ జిల్లాలనుంచి ప్రాతినిధ్యాన్ని లెక్కలోకి తీసుకుంటే అటు కోస్తాకీ, ఇటు తెలంగాణకీ గట్టి న్యాయమే జరిగినట్టు లెక్క. రాయలసీమకి మాత్రం నామమాత్రపు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది.

 

కోస్తా ప్రాంతంనుంచి పురంధేశ్వరి, కిషోర్ చంద్రదేవ్, కిల్లి కృపారాణి అవకాశం దక్కించుకున్నారు. ఉత్తరాంధ్రలో చిరంజీవికి, పనబాకలక్ష్మికి, పళ్లంరాజుకీ బెర్తులు దక్కాయి. తెలంగాణ ప్రాంతంనుంచి జైపాల్ రెడ్డి, సర్వేసత్యనారాయణ, బలరాం నాయక్.. కాంగ్రెస్ కంచుకోటలో పాగావేశారు. రాయలసీమనుంచి మాత్రం ఒక్క కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి మాత్రమే ఛాన్స్ దక్కింది. అదికూడా యాంటీ జగన్ వర్గం కాబట్టి.

 

భవిష్యత్తులో జగన్ కి చెక్ పెట్టాల్సొస్తే ముందునుంచీ వై.ఎస్ వర్గానికి వ్యతిరేకంగా ఉన్న కోట్ల వర్గమే కరెక్టని అధిష్ఠానం లెక్కలేసుకునిమరీ కోట్లకి సీటిచ్చారుతప్ప ప్రాంతాలవారీ న్యాయప్రాతిపదిక కన్నుపొడుచుకున్నా కనిపించని పరిస్థితి. అయినా దీనిగురించి మాట్లాడడానికి ఎవరూ సాహసించడంలేదు.. ఎందుకంటే వీర విధేయులకు మాత్రమే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించిన అధిష్ఠానం.. కామ్ గా ఉండే వాళ్లకే ప్రాథాన్యమిస్తామన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది కనక పల్లెత్తు మాట అనడానిక్కూడా ఎవరూ సాహసించరన్న విషయం అందరికీ తెలిసిందే..

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.