తెలంగాణలో హల్ చల్ చేస్తున్న కీలక నేతలు

 

 

రాష్ట్రానికి చెందిన ముగ్గురు కీలక నేతలు తెలంగాణాలో హల్ చల్ చేయబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ మాత్రం వీరిని ఎలా అడ్డుకోవాలో తెలియక సతమతమవుతోంది. టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డినీ అడ్డుకోనే౦దుకు గతంలో టీఆర్ఎస్ పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది.

 


ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో వస్తున్నా మీ కోసం యాత్ర చేస్తున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ తెలంగాణలో నల్గొండ జిల్లా భువనగిరిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ సభలో యువ తెలంగాణ జేఎసీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సంధర్బంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి తన బాల ప్రదర్శన కోసం భారీగా జనాల్ని సమీకరిస్తుండడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

 


మెదక్ జిల్లాలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట కూడా ఈ రోజు నుంచే ప్రారంభ౦ కానున్న నేపధ్యంలో టీఆర్ఎస్ నేతలు బాటను అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో పోలీసులు ముందస్తు అరెస్ట్ లు ప్రారంభించారు. మొత్తానికి రాష్ట్రానికి చెందిన ముగ్గురు కీలక నేతలు రాష్ట్రంలో హల్ చల్ చేస్తుంటే, టీఆర్ఎస్ నేతలు మాత్రం తమ భవిష్యత్ కార్యాచరణ ఏమిటో తెలియక గందరగోళంలో పడిపోతున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.