వైకాపాలోకి క్యూకట్టిన నేతలు

 

రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు జగన్ పార్టీలోకి క్యూకట్టారు. చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ (కాంగ్రెస్) వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. పార్టీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయనీ ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ కు, పార్టీకి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

 

విశాఖ జిల్లా పాయకరావుపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. చెంగల వెంకట్రావుకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చెంగల వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతానని రెండు నెలల క్రితమే ప్రకటించారు.



టిడిపి మాజీ ఎమ్మెల్యే, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత కృష్ణ బాబు, టీడీపీని వీడతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. నల్గొండ జిల్లా భువనగిరిలో భారీ బహిరంగ సభ ద్వారా యువ తెలంగాణ జేఎసీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నది ఈరోజే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఒక్కరోజే అరడజను మంది ఇతర పార్టీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం గమనార్హం.   

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.