కిరణ్ కి కళ్లు తిరిగాయ్..

 

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మార్క్ మచ్చుకైనా కనిపించలేదు. అసలు ఆయన అభిప్రాయాన్ని అడగడంకానీ, కనీసం పట్టించుకోవడంగానీ కూడా అధిష్ఠానం చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. కారణం.. కిరణ్ మీద అధిష్ఠానానికి అంతగా నమ్మకం లేకపోవడమేనని సీనియర్ల ఉవాచ. ఏరికోరి కిరణ్ కి ముఖ్యమంత్రి కుర్చీ అప్పజెప్పినప్పుడు డైనమిక్ గా వ్యవహరించాలన్న , వ్యవహరిస్తారన్న నమ్మకం ఎక్కడో ఓ మూలన్నా అధిష్ఠానానికి ఉండుంటుంది. కానీ.. కిరణ్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారన్న భావన కాంగ్రెస్ అధినేత్ర దృష్టిలో బలంగా పడిపోయిందని చాలామంది నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.

 

కేంద్రమంత్రివర్గ విస్తరణ విషయంలో పిసిసి చీఫ్ బొత్సని, చిరంజీవిని సంప్రదించి జాబితాని రూపొందించుకున్న అధిష్ఠానం కేవలం మొక్కుబడిగానే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చెవిన వేసింది తప్ప, ఆయనకు ఎలాంటి ప్రాథాన్యతా ఇవ్వలేదుగాక ఇవ్వలేదన్న విషయం ఏపీలో కిందిస్థాయి కార్యకర్తలకు కూడా తేటతెల్లమయ్యిందంటూ కిరణ్ వ్యతిరేకవర్గాలు పండగ చేసుకుంటున్నట్టు సమాచారం. అధిష్ఠానం అండ తనకుందన్న మితిమీరిన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డికి అదనుచూసి సరైన సమయంలో సోనియా ఝలక్ ఇచ్చారంటూ పార్టీలోని కొందరు నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారటకూడా.. మొత్తానికి అన్ని రోజులూ ఒకేలా ఉండవన్న విషయం.

కిరణ్ కుమార్ రెడ్డికి ఈ పాటికే అర్ధమయ్యుంటుందేమో..

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.