వీరవిధేయులకే వరాలిచ్చిన సోనియామాత!

 

ఈసారి మంత్రివర్గ విస్తరణలో సోనియా ఆచితూచి అడుగేశారు. రాహుల్ వర్గానికి పెద్దపీట వేస్తూనే ఉద్యమాలబాటలో ఉలికిపడ్డ నేతల్ని దూరంగా ఉంచారు. మధుయాష్కీ.. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా పేరుపడ్డ ఎంపీ.. కానీ తెలంగాణ ఉద్యమంలో అధిష్ఠానాన్ని రూల్ చేసే రీతిలో మాట్లాడిన పాపానికి ఆయనకు ఛాన్స్ దక్కలేదు. నోరెత్తినవాళ్లకి పదవులు దక్కవన్న విషయాన్ని చెప్పకనే చెప్పేందుకు అధిష్ఠానం ఈ స్థాయిలో కసరత్తు చేసిందని వినికిడి.

 

కాంగ్రెస్ అధిష్ఠానాన్ని పల్లెత్తు మాట అనకుండా ఉద్యమం చేశామంటే చేశామని.. హడావుడి చేసి కామ్ గా ఊరుకున్నవాళ్లని మాత్రం నెత్తినపెట్టుకున్నారు. తెలంగాణ ప్రాంతంనుంచి సర్వేకి, బలరాం నాయక్ కి రెండు విధాలుగానూ లాభం జరిగింది. అటు తెలంగాణ ప్రజలు.. వీళ్లు మాకోసం తెగపాకులాడుతున్నారన్న అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. ఇటు.. అధిష్ఠానంకూడా తమని ధిక్కరించే సాహసం చేయలేదన్న ఆలోచనకు వచ్చింది కాబట్టే ఛాన్స్ కొట్టగలిగారు.

 

వ్యాపారవర్గాలకు కూడా ఈ విస్తరణలో తీవ్రస్థాయి నిరాశే దక్కింది. రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి దీనికి మంచి ఉదాహరణ. రాయపాటికీ, కావూరికీ సమైక్యవాదాన్ని నెత్తినేసుకోవడంవల్లే మంత్రిపదవి దక్కలేదన్న ప్రచారం జోరుగా సాగుతోందికానీ.. బిజినెస్ పీపుల్ ని దూరంగా పెట్టాలన్న నియమం ప్రకారమే వాళ్లకి ఛాన్స్ దక్కలేదని విశ్వసనీయవర్గాల సమాచారం.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.