నిమ్మగడ్డని పరామర్శించిన జగపతిబాబు

 

వాన్ పిక్ కుంభకోణంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటూ చంచల్ గూడ జైల్లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ ని హీరో జగపతి బాబు పరామర్శించారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, తప్పకుండా న్యాయం జరుగుతుందని.. జగపతి.. నిమ్మగడ్డ ప్రసాద్ కి ధైర్యం చెప్పినట్టు సమాచారం.

 

నిమ్మగడ్డకి అత్యంత ఆప్తుడైన హీరో నాగార్జునకూడా చాలాసార్లు చంచల్ గూడ జైలుకొచ్చిన తనతో మాట్లాడివెళ్లారు. ప్రసాద్ తనకి చాలా ఆప్తుడని, ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని ఊహించలేదని నాగార్జున బాధపడ్డారుకూడా. సినీ పరిశ్రమలో చాలామందితో నిమ్మగడ్డ ప్రసాద్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయ్.

 

బ్యాట్మిండన్ కోచ్ పుల్లెల గోపీచంద్, చాముండేశ్వరీ నాథ్ కూడా గతంలో నిమ్మగడ్డని చంచల్ గూడ జైల్లో కలిశారు. సినీ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు నిమ్మగడ్డని పరామర్శించేందుకు చంచల్ గూడ జైలు దగ్గరికి వస్తుండడంతో వాళ్లని చూసేందుకు సామాన్య జనం ఎగబడుతున్నారు. విఐపిల రాక కారణంగా జైలుపరిసరాల్లో జనం బాగా పెరిగిపోతున్నారని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.