RELATED NEWS
NEWS
ధర్మవరపు మృతికి నాట్స్ ప్రగాఢ సంతాపం

 

 

 

 

తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ధర్మవరపు సుబ్రమణ్యం మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతి గురైంది. ఇటీవల వరుసగా ముగ్గురు తెలుగు సినీ నటులు ఆకస్మిక మరణానికి గురి కావడం జీర్ణించుకోలేనిదని నాట్స్ పేర్కొంది. సినీ జగత్తుకు ధర్మవరపు మరణం తీరని లోటు అని నాట్స్ తన ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చింది. దూరదర్శన్‌లో ప్రసారమైన 'ఆనందో బ్రహ్మ' ద్వారా ధర్మవరపు మంచి గుర్తింపు పొందారు. టివి రంగం నుంచి సినీ రంగంలో ప్రవేశించిన ఆయన 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు...తనదైన ప్రత్యేక మాడ్యులేషన్‌ డైలాగులు, మేనరిజంలతో ప్రదర్శిస్తూ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. దాదాపు 300 సినిమాల్లో నటించిన ధర్మవరపు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.. ఆయన ఈ లోకం విడిచివెళ్లారనే విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నామని నాట్స్ పేర్కొంది. ఆయన కుటుంబసభ్యులకు నాట్స్ తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది..

TeluguOne For Your Business
About TeluguOne
;