RELATED NEWS
NEWS
నాట్స్ లో సాయి భక్తుల సందడి

లాస్ ఆంజెల్స్ లో జరుగుతున్న నాట్స్ నాల్గవ సంబరాలు రెండవ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రారంభం అయ్యాయి. న్యూ జెర్సీ సాయి దత్తపీఠం కు చెందిన ప్రధాన నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యం లో సాయి భక్తులు మహా సభలు జరుగుతున్న సమావేశ మందిరం ముందు సాయి పల్లకి తో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సభా వేదిక పై సాయి బాబా వెండి పాదుకలు వున్న పల్లకి ని ఉంచి ప్రత్యెక పూజలు నిర్వహించారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ., జస్టిస్ నూతి రామ మోహన్ రావు, అంబికాకృష్ణ , ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు, ఈ పల్లకి సేవ లో పాల్గొన్నారు. సినీ నటులు అలీ, సాయి కుమార్, కోట శంకరరావు తదితరులు సాయి పల్లకి సేవ లో పాల్గొన్నారు. అనంతరం స్వామి చిన్మయానంద నాట్స్ కు హాజరైన సభికుల నుద్దేశించి ఆద్యాత్మిక ప్రసంగం చేసారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి కూడా తన ప్రసంగంతో భక్తులను ఆకట్టు కున్నారు.

 

పసందైన విందు భోజనం
 
నాట్స్ సంబరాలలో భాగంగా అమెరికా నలు మూలల నుండి విచ్చేసిన ప్రవాసాంధ్రులను నాట్స్ నిర్వాహకులు తొలి రోజున, రెండవ రోజున పసందైన విందు భోజనాన్ని అందించారు. మామిడికాయ పప్పు, ఆవకాయ, గోంగూర పచ్చళ్ళు, దొండకాయ, బెండ కాయ వేపుళ్ళు,కారప్పొడులు  , సున్ని ఉండలు, బొబ్బట్లు, పూతరేకులు వంటి సంప్రదాయ వంటకాలను వడ్డించారు. మాంసాహార ప్రియులకోసం దాదాపు 6 రకాల వంటకాలను ఏర్పాటు చేసారు. 

TeluguOne For Your Business
About TeluguOne
;