RELATED NEWS
NEWS
నాట్స్ లాస్ ఏంజెల్స్ లో సంబరాల ఫండ్ రైజింగ్ ఈవెంట్ కు న్యూజెర్సీలో అద్భుత స్పందన

లాస్ ఏంజెల్స్ లో జూలై 2 నుండి 4 వరకు జరగనున్న అమెరికా తెలుగు సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సంబరాలకు నిధుల సేకరణ కు న్యూజెర్సీ లోని ఎడిసన్ నగరం లో మోహన కృష్ణ మన్నవ నిర్వహించిన నిధుల సమీకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. స్థానిక కోరియాండర్ రెస్టారెంట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 300 మందికి పైగా తెలుగు వారు విచ్చేశారు.. సంబరాల్లో పాలు పంచుకునేందుకు మేము సైతమంటూ ముందుకొచ్చారు. అప్పటికప్పుడు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

 

మోహన కృష్ణ, గంగాధర్ దేసు, మధు కొర్రపాటి లు లాస్ ఏంజెల్స్ కు రాన్నున్న రాజకీయ, సాంస్కృతిక, సినీ రంగాల ప్రముఖుల వివరాలతో పాటు, జరగబోయే కార్యక్రమాల వివరాలను సభికులందరికీ వివరించారు. ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ లో దాదాపు 360,000 డాలర్ల నిధులను నాట్స్ సేకరించింది. న్యూజెర్సీ,న్యూయార్క్, కనెక్ట్ కిట్, ఫిలడెల్పియా రాష్ట్రాల నుంచి తెలుగువారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. నాట్స్ సంబరాలకు తమ హార్దిక, ఆర్థిక మద్దతు అందిస్తామని ప్రకటించారు. అతి తక్కువ సమయంలో ఇంతటి అద్భుత కార్యక్రంమాన్ని అన్నీ తానై నిర్వహించిన మోహన కృష్ణ మన్నవ ను పలువురు అభినందనలతో ముంచెత్తారు.


ప్రసాద్ సింహాద్రి, హరిణి శేష భట్టర్, శ్రీకాంత్ సండుగు ల గానామృతం ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ లో జోష్ నింపాయి. నాట్స్ సంబరాల ఘనంగా నిర్వహించడం వెనుక ఉన్న లక్ష్యాన్ని గురించి నాట్స్ బోర్డు ఆఫ్ ఛైర్మన్ మధు కొర్రపాటి వివరించారు..నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ గంగాధర్ దేసు, విమల్ కావూరు, శ్రీనివాస్ మద్దాలి, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ, నాట్స్ బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ అరుణ గంటి, శ్రీధర్ అప్పసాని, రాజేంద్ర అప్పలనేని మరియు నాట్స్ న్యూ జెర్సీ చాప్టర్ ప్రతినిధులు రంజిత్ చాగంటి, రమేష్ నూతలపాటి, విష్ణు ఆలూరు, మురళీ కృష్ణ మేడిచెర్ల  న్యూ యార్క్ ప్రతినిధులు రాజ్ అల్లాడ,...స్థానిక తెలుగు సంస్థ తెలుగు కళా సమితి (TFAS) ప్రతినిధులతో పాటు, అనేక మంది నాట్స్ అభిమానులు ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేశారు.  శ్రీహరి మందాడి వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది.

TeluguOne For Your Business
About TeluguOne
;