RELATED NEWS
NEWS
ఏఎన్నార్ మృతికి నాట్స్ సంతాపం

 

 

 

నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు మృతికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు మరణం.. అమెరికాలో ఉండే తెలుగువారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నాట్స్ అధ్యక్షుడు గంగాధర్ దేసు అన్నారు. ఇప్పటికీ ఆయన ఇహలోకంలోలేరనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. అక్కినేని కుటుంబానికి నాట్స్ ప్రగాఢ సానుభూతిని తెలుపుతోందన్నారు.


ఇటీవల అమెరికా లోని పలు తెలుగు సంఘాలు ఆయనను ఘనంగా సత్కరించాయి . న్యూ జెర్సీ లో ఆయన తన జ్ఞాపకాలను, మధుర స్మృతులను యావత్తు ఉత్తర అమెరికా తెలుగు అభిమానులతో పంచుకుంటూ. తన విజయాల వెనుక ఉన్నది అభిమాన దేవుళ్ళేనని , వాళ్ళంటే తన గుండెల్లో ఎప్పటికీ ప్రత్యెక స్థానం ఉంటుందని వివరించారు.


తెలుగు సినీ పరిశ్రమ ఓ మహానటుడిని కోల్పోయిందని... తెలుగుజాతికి ఇది తీరని లోటని గంగాధర్ దేసు అభివర్ణించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;