English | Telugu

ప‌ల్ల‌కిలో జ‌బ‌ర్ద‌స్త్ కొత్త యాంక‌ర్ కు గ్రాండ్‌ వెల్క‌మ్‌!

ఖ‌త‌ర్నాక్ కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. గ‌త కొంత కాలంగా కంటెస్టెంట్ లు, టీమ్ లీడ‌ర్ల స్కిట్ ల‌తో న‌వ్వులు పూయిస్తోంది. తాజాగా ఈ షో నుంచి యాంక‌ర్ అనసూయ త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. జూలై నెల‌లో చివ‌రి ఎపిసోడ్ తో జ‌బ‌ర్దస్త్ జ‌ర్నీకి వీడుకోలు ప‌లికింది అన‌సూయ‌. త‌న‌తో పాటు మనో కూడా ఈ షో నుంచి త‌ప్పుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. గ‌త కొన్ని వారాలుగా స్టార్ మా లో ప్ర‌సారం అవుతున్న స్టార్ సింగ‌ర్ జూనియ‌ర్ లో కనిపిస్తున్నారు. దీంతో ఆయ‌న స్థానంలో కొత్త‌గా హీరోయిన్ సంగీత ఎంట్రీ ఇచ్చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

అమ్మ బొమ్మాళి అంటూ శృతిక వెంటపడిన అనంత శ్రీరామ్

జీ తెలుగు ఛానెల్ లో సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్  షో ఫుల్ ఫేమస్. ఇక ఈ వారం ఈ షో సెమి ఫినాలే రౌండ్ ఫుల్ ఎంటర్టైన్ చేసేసింది. ఫస్ట్ కంటెస్టెంట్ గా శృతిక ఎంట్రీ ఇచ్చేసింది. అరుంధతి మూవీలోంచి "భూ భూ భుజంగం" అనే పాట పాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ పాటను పడడానికి ఎవరూ సాహసించరు. ధైర్యం, స్తైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లే ఈ పాటను ఎంచుకుంటారు అంటూ అనంత శ్రీరామ్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చేసారు. ఇక ఈ పాటను కోటి గారు స్వరపరిచారు. ఈ పాట వినేసరికి కోటి గారు లేచి వచ్చి శృతికను ఆత్మీయంగా ముద్దు పెట్టుకుని ఆశీర్వాదం అందించారు. శైలజ గారు, స్మిత ఇద్దరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు. స్టేజి మీదకు శృతిక పేరెంట్స్ వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటారు.