English | Telugu

ప‌ల్ల‌కిలో జ‌బ‌ర్ద‌స్త్ కొత్త యాంక‌ర్ కు గ్రాండ్‌ వెల్క‌మ్‌!

ఖ‌త‌ర్నాక్ కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. గ‌త కొంత కాలంగా కంటెస్టెంట్ లు, టీమ్ లీడ‌ర్ల స్కిట్ ల‌తో న‌వ్వులు పూయిస్తోంది. తాజాగా ఈ షో నుంచి యాంక‌ర్ అనసూయ త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. జూలై నెల‌లో చివ‌రి ఎపిసోడ్ తో జ‌బ‌ర్దస్త్ జ‌ర్నీకి వీడుకోలు ప‌లికింది అన‌సూయ‌. త‌న‌తో పాటు మనో కూడా ఈ షో నుంచి త‌ప్పుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. గ‌త కొన్ని వారాలుగా స్టార్ మా లో ప్ర‌సారం అవుతున్న స్టార్ సింగ‌ర్ జూనియ‌ర్ లో కనిపిస్తున్నారు. దీంతో ఆయ‌న స్థానంలో కొత్త‌గా హీరోయిన్ సంగీత ఎంట్రీ ఇచ్చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

ఇక ఈ షో నుంచి అన‌సూయ కూడా వెళ్లిపోవ‌డంతో ఆ స్థాయిలో గ్లామ‌ర్ ని ఒలికించేది ఎవ‌రు? .. త‌న స్థానంలో కొత్త యాంక‌ర్ గా మ‌ల్లెమాల టీమ్ ఎవ‌రిని దించ‌బోతున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా ఆగ‌స్టు 4న గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు. ఇందులో కొత్తగా జ‌బ‌ర్ద‌స్త్ లోకి ఎంట్రీ ఇచ్చే యాంక‌ర్ ని టీమ్ మెంబ‌ర్స్ అంతా తీన్మార్ డాన్సులు చేస్తూ ప‌ల్ల‌కీలో ఊరేగింపుగా తీసుకురావ‌డం క‌నిపిస్తోంది.

అయితే ప‌ల్ల‌కిలో భారీ బ‌ల్డ‌ప్ తో వ‌స్తున్న యాంక‌ర్ ర‌ష్మీనే అని కొంత మంది అంటుంటే కాదు యాంక‌ర్ మంజుషా అని మ‌రి కొంత మంది అంటున్నారు. అయితే ఫైన‌ల్ గా మాత్రం ఈ షోలోకి ఎంట్రీ ఇస్తోంది మంజుష‌నే అని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ తాజా ఎపిసోడ్ లో `కార్తికేయ 2` టీమ్ సంద‌డి చేసింది. ఆగ‌స్టు 5న విడుద‌ల కానున్న ఈ మూవీకి చందూ మొండేటి ద‌ర్శ‌కుడు. శ్రీ‌నివాస‌రెడ్డి స‌పోర్టింగ్ పాత్ర‌లో న‌టించాడు. నిఖిల్ తో క‌లిసి ఈ ఇద్ద‌రు కూడా జ‌బ‌ర్ద‌స్త్ లో సంద‌డి చేయ‌డం విశేషం.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.