English | Telugu

పల్లకీలో వచ్చింది రష్మీనా ..ఇంకెవరన్నానా ..?

జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తొమ్మిదేళ్ల నుంచి ఈ కార్యక్రమం ప్రతి తెలుగింటినీ పలకరిస్తూ అలరిస్తూనే ఉంది. చాలా నార్మల్ గా స్టార్ట్ ఐన ఈ షో ఊహించని రీతిలో చరిత్ర సృష్టించింది కూడా. మొదలైన కొన్నాళ్లకే టాప్ షోగా మంచి రేటింగ్స్ ని సంపాదించుకుంది. ఈ షోలో ఉన్న ఎంతో మంది కమెడియన్స్ కూడా ఇప్పుడు మంచి పొజిషన్స్ లో ఉన్నారు. కానీ ఇటీవల జబర్దస్త్ లో చోటు చేసుకున్న అనూహ్య సంఘటనలు చూస్తుంటే ఈ షో ఉంటుందా లేదా అనే డౌట్ ని చాల మంది ఎక్స్ప్రెస్ చేసేసరికి ఫైనల్ గా వెళ్ళిపోయిన వారందరినీ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ కి తీసుకొస్తామని మల్లెమాల యాజమాన్యం చెప్పింది. అన్నట్టుగా గెటప్ శీను ఎంట్రీ ఇచ్చాడు. అలాగే మిగతా వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. ఐతే ఇప్పుడు ఈ షో హోస్ట్ గా చేస్తున్న అనసూయ కూడా తనకు వస్తున్న ఆఫర్స్ తో టైం సెట్ అవక జబర్దస్త్ షో నుంచి తప్పుకుంది. ఐతే ఇప్పుడు కొత్త యాంకర్ ఎవరు అనే ప్రశ్న ఎదురయ్యింది. వచ్చే వారం కొత్త యాంకర్ గా ఎవరు ? జబర్దస్త్ స్టేజి మీదకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ? అనే విషయం పై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. అనసూయ వెళ్ళిపోతోంది అన్న న్యూస్ వైరల్ ఐన దగ్గర నుంచి చూస్తే ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మినే వస్తుంది అని.. కాదు కాదు మంజూష వస్తుందని, మరో కొత్త యాంకర్ వస్తుందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. కానీ ఇప్పుడు జబర్దస్త్ న్యూ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ప్రోమోలో కొత్త యాంకర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా చేతులకు గాజులు వేసుకుని షో కోసం రెడీ అవుతున్నట్టు, పల్లకీలోంచి కాళ్ళు కింద పెట్టి దిగుతున్నట్టు చూపించారు. జబర్దస్త్ కమెడియన్స్ అంతా పోటీ పడి మేమంటే మేము చూస్తాం కొత్త యాంకర్ ని అంటూ చాటు నుంచి ఎగబడి చూస్తూ ఉన్నట్టుగా ఒక ప్రోమో కట్ చేసి వెనక బీజీఎమ్ గా గీత గోవిందం సాంగ్ పెట్టేసారు. ఐతే నెటిజన్స్ మాత్రం సైడ్ యాంగిల్ నుంచి రష్మీ లానే ఉంది అంటున్నారు. రష్మీ మాత్రమే హెవీ జ్యువెలరీ వేసుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.